Friday, 13 March 2026

ఉచిత క్యాన్సర్ చికిత్స @9394010215

 క్యాన్సర్ ముందస్తు గుర్తింపున కు నేషనల్ మాస్ క్యాన్సర్ స్క్రీనింగ్ మిషన్ ప్రారంభించాలని బిఆర్ఎస్ ఎంపీ బీ పార్థసారధి రెడ్డి గారు రాజ్యసభలో అన్నారు. గురువారం రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ నివారణకు కేంద్రం పకడ్బందీ చర్యలు చేపట్టాలని కోరారు. దేశం క్యాన్సర్ హెల్త్ ఎమర్జెన్సీ దిశగా సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు . క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు .గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో స్క్రీనింగ్ ప్రక్రియకు వసతులు లేకపోవడం ,ప్రజల్లో క్యాన్సర్ ముందస్తు లక్షణాలపై అవగాహన లేకపోవడం సమస్యగా మారిందని అన్నారు.

 మన దేశంలో క్యాన్సర్ చికిత్స, మందులు, ఖర్చుతో కూడుకోవడంతో పేదలు అంత డబ్బు వెచ్చించలేకపోతున్నారని వివరించారు. క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్న సమయాన మెడికల్ సర్జికల్ రేడియేషన్ పాంకాలజిస్టుల సంఖ్యను పెంచాలని కోరారు. 

ముందస్తు లక్షణాలు గుర్తించకపోవడంతోనే.. 

దేశంలో అడ్వాన్స్డ్ క్యాన్సర్ చికిత్స సెంటర్లు ఢిల్లీ ,ముంబై, హైదరాబాదులో ఉన్నాయని ఆయన తెలిపారు. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల నుంచి పేషెంట్లు దూర ప్రాంతాలకు వెళ్లి చికిత్స తీసుకోవడం కష్టంగా మారుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు . నాట్ ఫర్ ప్రాఫిట్ క్యాన్సర్ దవాఖానాలకు కేంద్రం కొంత వెసులుబాటు కల్పించాలని కోరారు.

క్యాన్సర్ చికిత్సకు 1500 బెడ్లతో సింధు హాస్పిటల్ 

సామాజిక బాధ్యతగా హైదరాబాదులో 1500 బిడ్డలతో సింధు హాస్పిటల్ నిర్మించినట్లు పార్థసారథి రెడ్డి తెలిపారు. రాజ్యసభ సభ్యులంతా ఒకసారి ఈ దవాఖానను సందర్శించాలని ఆహ్వానించారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లో క్యాన్సర్ బాధితులు ఉంటే సింధు దవాఖానకు రిఫర్ చేయాలని ఆయన కోరారు. వాళ్లందరికీ ఉచితంగా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు .ఈ మేరకు ఉచిత చికిత్స పొందాలనుకునేవారు 9394010215 నంబర్ ను సంప్రదించాలని ఆయన కోరారు.

No comments:

Post a Comment