లింగంపేట మండలంలోని శెట్టిపల్లి గ్రామంలో సర్పంచ్ అట్టెం శ్రీనివాస్ ప్లాస్టిక్ నిషేధానికి గ్రామస్తుల సహకారంతో ప్లాస్టిక్ బాక్సులు గ్లాసులకు బదులుగా స్టీల్ గ్లాసులు ,స్టీల్ బాక్సులు వాడాలని గ్రామస్తులకు స్టీల్ బాక్సులు, స్టీల్ గ్లాసులు, జ్యూట్ బ్యాగులు పంపిణీ చేశారు. హోటల్స్ నిర్వాహకులకు గాజు గ్లాసులు వాడాలని వారికి గ్లాసులను పంపిణీ చేశారు ప్లాస్టిక్ నిషేధిత గ్రామంగా ప్రకటించేందుకు గ్రామస్తులు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నరేష్, ఉప సర్పంచ్ బాలయ్య, పంచాయతీ కార్యదర్శి రవి తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment