బాల్కొండ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఉచిత మగ్గం వర్క్ పై మహిళలకు శిక్షణ ఇస్తున్నట్లు ఏపిఎం గగారం తెలిపారు. శుక్రవారం ప్రారంభమైన శిక్షణ కార్యక్రమంలో స్థానిక ఉపసర్పంచ్ గాండ్ల రాజేందర్ మాట్లాడుతూ ఉచిత శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకొని నేర్చుకున్న నైపుణ్యంతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నెలకొల్పి ఆర్థిక స్వావలంబన సాధించాలని పిలుపునిచ్చారు. వ్యాపారానికి అవసరమైన రుణ సదుపాయాలు అందిస్తామని ఏపీఎం గంగారం చెప్పారు. పరిశ్రమలను ప్రోత్సహించి నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉపాధి కల్పించడం ప్రభుత్వ ధ్యేయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భరత్ రెడ్డి మండల సమాఖ్య అధ్యక్షురాలు స్వరూప శిక్షకురాలు కీర్తన సంతోషి సీసీల వివోఏలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment