Sunday, 31 May 2026

హైదరాబాద్ లో ఉచిత ఫిజియోథెరపీ చికిత్స

 


చిన్న చిన్న ఒళ్ళు నొప్పుల  నుండి కీళ్ల సమస్యలు, దీర్ఘ కాలం బాధించే పక్షవాతం వంటి అనారోగ్యాలతో బాధ పడే వారికి , పెద్ద పెద్ద ఆపరేషన్ ల తర్వాత కదల్లేని వారికి సంజీవనిలాంటిది ఫిజియోథెరపీ చికిత్స. చాలా వ్యాధులలో అవసరమయ్యే ఫిజియోథెరపీ ని క్రమం తప్పకుండా రోగులకు అందజేస్తే రోగాలు పెరగకుండా వేగంగా తగ్గిపోయే అవకాశం ఉంది.ఐతే చాలా మందికి ఈ విషయంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల,చికిత్స అందుబాటులో లేకపోవడం వల్ల,ఖర్చు ఎక్కువగా ఉండడం లాంటి కారణాలతో ఫిజియోథెరపీ కి దూరంగా ఉంటుంటారు.అలా రోగాలు తగ్గకపోవడం ,సమస్యలు పెరగడం జరుగుతుంటాయి.

అందుబాటులో ఆధునిక మందులు ఎన్ని ఉన్నా,కొన్నింటికి ఫిజియోథెరపీ చికిత్స తప్పనిసరి.కానీ ఇది కాస్త ఖర్చుతో కూడుకున్న పని.ఐతే పేదలకు ఉపయోగపడే ఉద్దేశం తో ఈ ఖరీదైన సేవలను ఉచితంగా అందిస్తోంది ఒక స్వచ్ఛంద సంస్థ.

కూకట్ పల్లిలోని వివేకానంద నగర్ కు చెందిన కొలసాని హరీష్ అనే వ్యక్తి చికాగోలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా స్థిర పడ్డారు. మంచి జీతంతో జీవితం విలాస వంతంగా గడుస్తున్నప్పటికీ సంతృప్తి చెందలేదు. తను పుట్టిన మాతృ భూమికి ఏదైనా చేయాలని తపించాడు. ఆ తపన లో నుండి పుట్టినదే ఈ ఉచిత ఫిజియోథెరపీ అందించాలనే ఆలోచన.అలా 2012 లో " ఎన్ ఆర్ ఐ సేవా ఫౌండేషన్ "అనే ఎన్జీవో ను స్థాపించారు ఆయన.

మొదట మురికి వాడల్లో వైద్య శిబిరాలు నిర్వహించాడు.మంచానికి పరిమితమైన వారికి" మొబైల్ అంబులెన్స్ " ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో పేదల దీన స్థితిని, ఆర్థిక ఇబ్బందులను గమనించాడు.వారికి ఫిజియోథెరపీ చికిత్స ను పెద్ద ఎత్తున అందించాలని సంకల్పించాడు. ఈ విషయంలో తన సన్నిహితులతో సంప్రదిస్తే ..ఇప్పటికే చాలా చేస్తున్నావు, ఇది అవసరమా అని నిరాశకు గురి చేశారు వారు.

కానీ ప్రసాద్ గారు వెనుకడుగు వేయకుండా 2013లో వివేకానంద నగర్ లో ఒక ఫిజియోథెరపీ కేంద్రాన్ని ప్రారంభించారు. డ్రైనీ డీలింగ్, అల్ట్రా సౌండ్,టెన్స్, ఇంటరా వెర్షన్ ఫెరెన్షియల్ థెరపీ, మజిల్ స్టిమ్యులేటర్,ట్రాక్షన్ పారాఫిన్ వ్యాక్స్, ఐ ఆర్ ఆర్ ల్యాంప్, ఫిజియో బాల్, ల్యాడర్ వంటి అత్యాధునిక పరికరాలను అందుబాటులో ఉంచాడు. కార్పొరేట్ కు ధీటుగా సేవలు అందిస్తుండడంతో సమాజం నుంచి మంచి స్పందన లభించింది.2017 లో మోతీ నగర్ లో మరో కేంద్రాన్ని స్థాపించాడు. కాళ్ళ నొప్పులు, వేళ్ళ నొప్పులు అంటూ వచ్చిన వారిని ఎవరినీ ఊరికే వెనక్కి పంపించరు.రోగులు ఎక్కడి వారైనా, ప్రిస్క్రిషన్ రాసింది ప్రభుత్వ వైద్యుడా, ప్రైవేట్ వైద్యుడా అని చూడకుండా.. ప్రిస్క్రిప్షన్ ఉంటే చాలు , కేంద్రంలో చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు.సమస్యను బట్టి ఎన్ని రోజులైన ఫిజియోథెరపీ చేయించుకోవచ్చు. ఈ రెండు కేంద్రాలకు కలిపి ప్రతి రోజూ దాదాపు 250 నుండి 300 వరకు రోగులు వస్తుంటారు. హైద్రాబాద్ నుండే కాకుండా , రెండు తెలుగు రాష్ట్రాల జిల్లాల నుంచి రోగులు వరుస కడుతున్నారు.

తన తల్లికి అనారోగ్యంతో ఫిజియోథెరపీ చికిత్స అందించడంలో ఎదురైన ఇబ్బందులను గమనించి, ఫిజియోథెరపీ చికిత్స ప్రాధాన్యత గుర్తించి ఈ ఎన్జీవో స్థాపించినట్లు హరీష్ తెలిపారు.ఇప్పటివరకు 14 లక్షలకు పైగా రోగులకు చికిత్స అందించినట్లు ఆయన తెలిపారు.ఇందుకోసం నెలకు దాదాపు 2 లక్షల రూపాయలు వెచ్చిస్తున్నట్లు ఆయన తెలిపారు.

No comments:

Post a Comment