ప్రజా పలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నిర్వహించనున్న జాబ్ మేళా పోస్టర్ను కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారు శుక్రవారం మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఆవిష్కరించారు. ఇంటర్మీడియట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు విద్యార్హత కలిగిన యువతకు మార్కెటింగ్ ఫైనాన్స్ బ్యాంకింగ్ హెల్త్ కేర్ ఐటి బిజినెస్ సర్వీసెస్ కస్టమర్ సర్వీసెస్ హాస్పిటల్ డిజిటల్ మీడియా లాజిస్టిక్స్ తదితర రంగాలలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా యువజన క్రీడల శాఖ ఇండస్ట్రీస్ కామర్స్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖల ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహించబడుతుంది. ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలకు చెందిన యువత కోసం ఏడవ తేదీన నిజామాబాద్ పట్టణంలోని శ్రీరామ గార్డెన్స్ ఆర్మూర్ రోడ్ ల జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. 50 కి పైగా కంపెనీలు ఈ మేళాలో పాల్గొని వివిధ ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి ఈ సందర్భంగా జిల్లాలో నిరుద్యోగ యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు ఆసక్తిగల అభ్యర్థులు వెబ్సైట్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని తెలిపారు స్థల వివరాలకు జిల్లా యువజన క్రీడల అధికారి కామారెడ్డి జిల్లా కార్యాలయాన్ని లేదా 9440846682 మరియు 9618126053 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. అనంతరం జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, ఆర్డిఓ గిరి, జిల్లా అధికారులు, జిల్లా యువజన క్రీడల అధికారి రంగ వెంకటేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment