Thursday, 14 May 2026

పుస్తకం చదివితే నగదు బహుమతి

 వేసవి సెలవులు లో విద్యార్థులు మంచి మంచి పుస్తకాలు చదివేలా ప్రోత్సహించడానికి యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పురపాలికలోని శాఖ గ్రంథాలయం వినూత్నంగా ఆలోచించింది గ్రంథాలయంలో ఒకరోజు పేరుతో నెలరోజుల ప్రత్యేక కార్యక్రమానికి మంగళవారం శ్రీకారం చుట్టింది జూన్ 12 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతోంది క్రమం తప్పకుండా హాజరై ఎక్కువ గంటలకు పుస్తక పఠనం చేసిన విద్యార్థులలో పది మందిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి 2500 రూపాయల చొప్పున నగదు బహుమతితో పాటు సన్మానం చేస్తామని గ్రంథాలయ చైర్మన్ కోమటి మత్స్యగిరి ప్రకటించారు ఇక్కడ ఒకేసారి 50 మంది వరకు కూర్చుని చదువుకునే అవకాశం 60 వేలకు పైగా పుస్తకాలు అందుబాటులో ఉండడం విశేషం.

No comments:

Post a Comment