Wednesday, 10 June 2026

జర్మన్ భాషా శిక్షణ ద్వారా విదేశీ ఉపాధి అవకాశాలు

 నిరుద్యోగ యువతీ యువకులకు జర్మన్ భాష లో శిక్షణ ఇప్పించడం ద్వారా విదేశీ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి జి వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం టాస్క్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలోని మందమర్రి పట్టణంలోని ఇల్లందు క్లబ్లో ఏర్పాటు చేసిన జర్మన్ భాషా శిక్షణ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి చంద్రయ్య, మండల తహసిల్దార్ సతీష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రాజలింగు, టాస్క్ జనరల్ మేనేజర్ రాధాకృష్ణ,  టామ్ కామ్ మేనేజర్ నాగభారతిలతో కలిసి ఆయన మాట్లాడారు.  అవకాశాలను పొందడంలో, ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలని పట్టుదల ఉన్న వారిని ప్రోత్సహిస్తామని అన్నారు . ప్రపంచవ్యాప్తంగా అనేక ఉపాధి అవకాశాలు ఉన్నా యని ముఖ్యంగా జర్మనీలో నైపుణ్యం కలిగిన యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్న జర్మనీలో నర్సింగ్, సాంకేతిక, పారిశ్రామిక రంగాలలో లక్షలాది ఉద్యోగాలలో ఖాళీలు ఉన్నాయని ,తెలంగాణ యువత అవకాశాలను అందిపుచ్చుకునేలా రాష్ట్ర ప్రభుత్వం టాస్క్ ద్వారా జర్మన్ భాషా శిక్షణ అందిస్తుందని తెలిపారు. ఉద్యోగం ఎక్కడ లభిస్తే అక్కడికి వెళ్లి పని చేసే దృక్పథం యువత అలవర్చుకోవాలని అన్నారు. పారిశ్రామికవేత్తగా పనిచేసిన అనుభవాన్ని ప్రస్తావిస్తూ మార్కెట్ ఉన్న ప్రాంతాలలో పరిశ్రమలు స్థాపించడం వలన వేలాది మందికి ఉపాధి కల్పించగలిగామని అన్నారు. స్థానికతకే పరిమితం కాకుండా అవకాశాలను వెతుక్కుంటూ ముందుకు వెళ్లాలని యువతకు సూచించారు. జర్మనీలో వారానికి కేవలం 32 నుంచి 35 గంటల పని సమయం మాత్రమే ఉంటుందని మిగతా సమయంలో ఇతర నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని, జర్మనీలో నెలకు రెండు లక్షల 50 వేల రూపాయలు ఆపైన ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రైవేటు ఏజెన్సీల మోసాలకు గురి కాకుండా ప్రభుత్వ సంస్థ అయిన టాస్క్ ద్వారా శిక్షణ పొంది విదేశీ ఉద్యోగాలను పొందాలని తెలిపారు .ఇప్పటికే ఈ కార్యక్రమానికి 112 మంది యువత నమోదు చేసుకున్నారని, వారందరికీ నైపుణ్యాభివృద్ధి శిక్షణ  అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించడం బాధ్యతగా తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం టామ్ కామ్ సంస్థకు 90 కోట్ల రూపాయలు అందించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు నెలకు రెండువేల రూపాయల స్టయిఫండ్ అందిస్తుందని, అదేవిధంగా జర్మన్ భాష శిక్షణ పొందుతున్న అభ్యర్థులలో 80 శాతం హాజర నమోదు చేసుకున్న వారికి కాకా వెంకటస్వామి ట్రస్ట్ తరఫున అదనంగా నెలకు ₹1000  స్టైపండ్ అందజేస్తామని తెలిపారు .యువతలో క్రమశిక్షణ, పట్టుదల , లక్ష్య సాధన పై దృష్టి ఉండాలని, జర్మన్ భాష నేర్చుకోవడానికి  ప్రతిరోజు సాధన చేయాలని సూచించారు. మందమర్రిలో ప్రారంభమైన ఈ శిక్షణ కేంద్రాన్ని రాష్ట్రానికి ఆదర్శంగా నిలిపేందుకు ప్రతివారం తాను స్వయంగా శిక్షణ కేంద్రాన్ని సందర్శించి అభ్యర్థులతో కలిసి జర్మనీ భాష నేర్చుకుంటానని తెలిపారు. యువత ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని కోరారు. అంతకుముందు క్లబ్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం జర్మన్ భాషా శిక్షణలో బి2 సర్టిఫికేషన్ పూర్తి చేసిన మరియన్ పాసల్, హుబా ఫాతిమా లకు ఆఫర్ లెటర్లు అందజేశారు.

మన దేశానికి ఏడాదికి 90 వేల వీసాలు ఇచ్చేందుకు జర్మనీ సిద్ధంగా ఉందనీ, జర్మనీ వీసా లో 50% సబ్సిడీ లభిస్తుందని తెలిపారు. శిక్షణ కేంద్రంలో 4 నెలల్లో జర్మనీ భాష నేర్పిస్తారని చెప్పారు. ఇంజనీరింగ్, టెక్నాలజీ, హెల్త్ కేర్ రంగాలలో అవకాశాలకు భాషా పరిజ్ఞానం తప్పనిసరి అని ,జర్మనీలో పనిచేయాలనుకునే వారికి ఆ భాష ఒక శక్తివంతమైన సాధనం అని తెలిపారు..



No comments:

Post a Comment