Saturday, 6 June 2026

కరక్ వాడిలో మెడికవర్ హాస్పిటల్స్ ఉచిత మెగా వైద్య శిబిరం

 గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించాలని లక్ష్యంతో మెడికవర్ హాస్పిటల్ నిజామాబాద్ జిల్లా వారి ఆధ్వర్యంలో కరక్ వాడి అనే గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరంలో మెడికవర్ వైద్య బృందం గ్రామ ప్రజలకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మరియు ఆరోగ్య సమస్యలను పరిశీలించి తగిన వైద్య సలహాలు అందించింది. రక్తపోటు, మధుమేహం, ఊపిరితిత్తుల వ్యాధులు ,కీళ్ల నొప్పులు, నరాల సంబంధిత సమస్యలపై ప్రత్యేక అవగాహన కల్పించారు. అవసరమైన వారికి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు మెరుగైన చికిత్స అవసరమైన రోగులను మెడికవర్ హాస్పిటల్స్ లో అందుబాటులో ఉన్న ప్రత్యేక వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా అనారోగ్యాలను ముందుగానే గుర్తించి నివారించవచ్చని వైద్యులు వివరించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని పేద మరియు గ్రామీణ ప్రజలకు ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్డియాలజిస్ట్ డాక్టర్ జగదీష్ చంద్రబోస్, పలమనాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్, నర్సింగ్ సిబ్బంది, గ్రామపంచాయతీ ప్రతినిధులు, ఆరోగ్య కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ ఉచిత  వైద్య శిబిరంలో 300 మందికి పైగా గ్రామస్తులు వైద్య సేవలను వినియోగించుకుని లబ్ధి పొందారు.

No comments:

Post a Comment