Pages

15, ఆగస్టు 2026, శనివారం

తెలుగు రాష్ట్రాల రైతులకు.. 3 రోజుల ఉచిత శిక్షణ

 జాతీయ స్థాయి సంస్థ అయిన ఎన్ ఐ పి హెచ్ ఎం పర్యావరణహితమైన సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై శాస్త్రవేత్తలతో పాటు రైతులకు కూడా శిక్షణ ఇస్తోంది. వర్మీ కంపోస్టులో ట్రైకోడెర్మా విరిడి శిలీంద్రం సూడో మోనాస్ బ్యాక్టీరియా కలిపి సేంద్రీయ ఎరువు తయారు చేసుకోవడం.. పొటాష్, ఫాస్ఫేటులను మొక్కలకు అందుబాటులోకి తెచ్చే జీవన ఎరువులను , జీవ రసాయనాలను రైతు స్థాయిలో అభివృద్ధి చేసుకోవడం, మిత్ర పురుగుల సంతతిని పెంపొందించే చర్యలపై శిక్షణ ఇస్తారు. 

కనీసం 20 మంది రైతులు బృందంగా ఏర్పడి తమను 040-24015932 నంబరులో సంప్రదిస్తే " 3 రోజుల పాటు శిక్షణ ఉచితంగా " ఇస్తామని ఎన్ఐపిహెచ్ఎం మొక్కల ఆరోగ్య నిర్వహణ విభాగం సంచాలకులు తెలిపారు. ఐతే భోజన ఖర్చులు రైతులే భరించాల్సి ఉంటుందని తెలిపారు. ఇటీవల గుంటూరు ప్రాంత రైతులకు మిరప, పొగాకు సాగు లో శిక్షణ ఇచ్చామన్నారు. 

కేరళ, తమిళ నాడు ల నుండి శాస్త్ర వేత్తలు, రైతులు అధిక సంఖ్యలో శిక్షణ పొందుతున్నారని అధికారి తెలిపారు.తెలుగు రాష్ట్రాల రైతులు ఇట్టి ఉచిత శిక్షణ అవకాశాన్ని అధిక సంఖ్యలో ఉపయోగించుకుని లాభం పొందాలని కోరారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి