గ్రామీణ ప్రాంత ప్రజలకు" ఉచితంగా అత్యవసర వైద్య సేవలు" అందించడమే ప్రధాన లక్ష్యంగా" శ్రీ సత్య సాయి సుజల స్రవంతి ట్రస్ట్" ఆధ్వర్యంలో జగిత్యాల గ్రామీణ టీ ఆర్ నగర్, రాజారాం గ్రామం వద్ద ఏర్పాటుచేసిన" సాయి స్వస్థ షా హ్యాపీనెస్ అర్జెంట్ కేర్ సెంటర్" ను ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, సంజయ్ కుమార్, మునిసిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగిత్యాల, మల్యాల నియోజకవర్గాల పరిధిలోని గ్రామీణ ప్రజలకు ఈ కేంద్రం ద్వారా" ఉచితంగా అత్యవసర వైద్య సేవలు" అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో పేద మధ్యతరగతి కుటుంబాలకు సకాలంలో వైద్యం అందించడం ద్వారా అమూల్యమైన ప్రాణాలను కాపాడవచ్చు అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలకు తోడుగా ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థల భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలను విరివిగా విస్తరింప చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దినేష్, డిసిసి అధ్యక్షుడు గాజంగి నందయ్య తదితరులు పాల్గొన్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి