Pages

6, సెప్టెంబర్ 2026, ఆదివారం

డా రమేశ్ టెండూల్కర్ మెమోరియల్ ఫెలోషిప్

 యువర్ డాక్టర్లకు అండగా నిలవాలని క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నిర్ణయించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా యువ డాక్టర్లకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు .తన తండ్రి దివంగత ప్రొఫెసర్ రమేష్ టెండూల్కర్ జ్ఞాపకార్థము" ప్రొఫెసర్ రమేష్ టెండూల్కర్ మెమోరియల్ ఫెలోషిప్"  ను ప్రారంభించారు. దీని ద్వారా వైద్య రంగంలో పై చదువులు చదవాలనుకునే యువ వైద్యులకు సచిన్ టెండూల్కర్ ఆర్థిక సహాయం అందించనున్నారు. సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ మరియు హెల్త్ కేర్ సంస్థ అయిన ఇంగా హెల్త్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో దీనిని నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఒక ఎండి చేసిన యువ డాక్టర్కు ఈ ఫెలోషిప్ కింద ఆర్థిక సహాయం లభిస్తుంది.

 ఎంపికైన వైద్యుడికి శ్రీనగర్లో క్లెఫ్ట్ అండ్ క్రానియోఫేషియల్ విభాగంలో ఏడాది పాటు ప్రత్యేక శిక్షణ పొందే అవకాశం కల్పిస్తారు. ఈ ప్రోగ్రాం విజయవంతంగా పూర్తి చేసిన వారికి సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ నుంచి సర్టిఫికెట్ అందజేస్తారు. ఇది కేవలం ఒక ఫెలోషిప్ మాత్రమే కాదని, విద్యా అవకాశాలను సృష్టిస్తుందని ఆ అవకాశం ఇతరులకు సేవ చేయడానికి ఉపయోగపడినప్పుడే దానికి నిజమైన అర్థం ఉంటుందని నాన్న బలంగా నమ్మేవారని సచిన్ చెప్పుకొచ్చారు. ఆయన ఆలోచనలను ముందుకు తీసుకెళ్లేందుకే ఈ ప్రయత్నం అని తెలిపారు .ఈ సదుపాయం ద్వారా క్లిష్టమైన వైద్య విభాగాలలో యువ డాక్టర్లను ప్రోత్సహించడంతోపాటు, గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాలలోని పిల్లలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి అని సచిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి