Pages

12, సెప్టెంబర్ 2026, శనివారం

తెలుగు రాష్ట్రాల్లో సీ ఆర్ ఫౌండేషన్ సేవలు

 కొండాపూర్ సిఆర్ ఫౌండేషన్ లో నూతన కార్యవర్గం సభ్యులతో శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షుడు కే నారాయణ మాట్లాడుతూ చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వృద్ధాశ్రమాలు విస్తరిస్తామని తెలిపారు. కడప ,గుంటూరు ప్రాంతాల్లో భవనాలు, భూములు, విరాళంగా లభించాయని అక్కడ వృద్ధాశ్రమాలు నిర్మించే ప్రణాళికలు ఉన్నాయని అన్నారు. కడపలోని వృద్ధాశ్రమం ఇప్పటికే ప్రారంభమైందని అలాగే అమరావతిలో ఏపీ ప్రభుత్వం మూడు ఎకరాల భూమిని కేటాయించడానికి అంగీకరించిందని స్థలం ఖరారు కావాల్సిందని వెల్లడించారు. 

సి ఆర్ పాలి క్లినిక్ గ్రామీణ ప్రజలకు కూడా ప్రయోజనం చేకూరేలా టెలి మెడిసిన్ ద్వారా సేవలను విస్తరించాలని, పేదలు, అవసరమైన వారి కోసం డయాలసస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని  యోచిస్తోందన్నారు. ఎన్ ఆర్ ఆర్ రీసెర్చ్ సెంటర్ ద్వారా పాఠశాల పిల్లల కోసం నెలవారీ కార్యకలాపాలు నిర్వహించడంతోపాటు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ప్రత్యేక కోచింగ్ సెంటర్లు ప్రారంభించాలని నిర్ణయించినట్లు నారాయణ వివరించారు. సిఆర్ ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో 22 ఏళ్లుగా ఉంటున్న సుబ్బలక్ష్మి తన మరణానంతరం ఫౌండేషన్కు 25 లక్షల రూపాయల విరాలం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సిఆర్ ఫౌండేషన్ నూతన అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, కే రజని ,పిడికిటి సంధ్య కుమారి, ప్రధాన కార్యదర్శిగా ముప్పాళ్ళ నాగేశ్వరరావు, కార్యదర్శులుగా కంభంపాటి అజయ్ కుమార్, మహమ్మద్ యూసఫ్, ఏ రామానాయుడు, బి చెన్నకేశవరావు ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా 25 మందిని నియమించారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి