కామారెడ్డి లోని పార్శి రాములు కళ్యాణమండపంలో మార్చి 22వ తేదీన జిసిఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు టిపిసిసి రాష్ట్ర జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి శనివారం విలేకరుల సమావేశంలో తెలిపారు .ఆయన మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలో గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్, ఐటి, ఇన్ఫర్మేషన్ ,బ్యాంకింగ్ ,ఫార్మసీ ,సర్వీస్ సెక్టార్ మార్కెటింగ్ తదితర రంగాలలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు .50 కి పైగా ప్రముఖ కంపెనీలు, కామారెడ్డి ప్రాంతంలోని వివిధ సంస్థల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూ నిర్వహిస్తారని ,200 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అని తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
No comments:
Post a Comment