పాలిథిన్ ప్లేట్ల వాడకంతో ఆరోగ్యం తో పాటు పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుంది. ఈ విషయాన్ని గుర్తించిన కొన్ని గ్రామాల పాలకవర్గాలు పాలిథిన్ ప్లేట్లపై యుద్ధం ప్రకటించాయి. కేవలం నిషేధం ఉత్తర్వులకే పరిమితం కాకుండా ఆచరణాత్మక దిశగా అడుగులు వే స్తున్నారు. గ్రామాలను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు నడుం బిగించాయి. ప్రత్యామ్నాయంగా స్టీల్ ప్లేట్లు వాడటానికి శ్రీకారం చుట్టాయి. ఆలయాలలో శుభకార్యాల లో సామూహిక భోజనాలకు స్టీల్ ప్లేట్లనే వాడుతున్నారు. వందల మంది జనం భోజనం చేసేలా ఈ ప్లేట్లను విరాళంగా అందిస్తూ దాతలు సైతం సహకరిస్తున్నారు. ఈ స్ఫూర్తి ఉద్యమంగా జిల్లాలోని అన్ని గ్రామాలలో విస్తరిస్తుంది.
కమ్మర్పల్లిలోని పాటి హనుమాన్ ఆలయం ఉంది. కొన్ని ఏళ్లుగా ఇక్కడ ప్రతి శనివారం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహిస్తున్నార . పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని భోజనం చేస్తారు. వీరంతా ఉపయోగించిన ప్లేట్లతో ఆలయ పరిసరాలు అపరిశుభ్రంగా మారడంతో పాటు ఆరోగ్యానికి ప్రమాదమని గ్రహించిన ఆలయ నిర్వాహకులు స్టీల్ ప్లేట్లను వినియోగించాలని నిర్ణయించారు. భక్తులు సైతం పెద్ద సంఖ్యలో స్టీల్ ప్లేట్లు, గ్లాసులు ఆలయానికి విరాళంగా అందించి సహకరించారు. ఈ స్ఫూర్తి గ్రామంలో జరిగే జాతరలు శ్రీరామ నవమి, వినాయక చవితి ఉత్సవాలలో కొనసాగింది .ప్రస్తుతం ఊరిలో ఉత్సవం ఏదైనా స్టీల్ ప్లేట్ల వాడకం పక్కాగా అమలు అవుతుంది. తాజాగా శుక్రవారం దేవి ఆలయం వద్ద సైతం స్టీల్ ప్లేట్లే వాడాలని గ్రామాభివృద్ధి కమిటీ తీర్మానించింది .భక్తులు పెద్ద ఎత్తున ప్లేట్లు ,గ్లాసులు విరాళంగా అందించారు. ఈ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని పక్క గ్రామాలు కమ్మర్పల్లి స్టీల్ ప్లేట్లను తీసుకెళ్లి తమ గ్రామాల ఉత్సవాలలో ఉపయోగించుకుని తిరిగి ఇచ్చేస్తున్నారు.


No comments:
Post a Comment