Wednesday, 27 May 2026

లింగేశ్వర ఆశ్రమంలో శిక్షణ

 నిజామాబాద్ మండలం మల్లారం శ్రీ లింగేశ్వర గుట్ట ఆశ్రమంలో ఉచిత  సంస్కృతి బోధన శిక్షణ శిబిరాన్ని ఆశ్రమ పీఠాధిపతి బాలయోగి కృష్ణ మహారాజ్ మంగళవారం ప్రారంభించారు .జిల్లాలోని నలుమూలల నుంచి విద్యార్థులు శిక్షణ శిబిరానికి హాజరయ్యారు. మొదటి రోజు పిల్లలు ధ్యానం, యోగ పై శిక్షణ పొందారు. వేదమంత్రాలు ,యజ్ఞ శ్లోకాలు ,సంస్కృతి విశిష్టతను వివరించారు .మన సంస్కృతి పై విద్యార్థి దశ నుంచి పిల్లల్లో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు ఈ శిబిరం కొనసాగుతున్నట్లు కృష్ణ మహారాజ్ పేర్కొన్నారు.



No comments:

Post a Comment