Monday, 8 June 2026

తాళ్ల రాంపూర్ లో ఉచిత చేప మందు పంపిణీ

 నిజామాబాద్ జిల్లా ఎరుగట్ల మండలంలోని తాళ్ళ  రాంపూర్ గ్రామంలో మృగశిర కార్తె సందర్భంగా సోమవారం చేపమందు పంపిణీ చేస్తున్నట్లు బెజ్జారపు లింబాద్రి తెలిపారు .గత 60 ఏళ్లుగా ఈ చేప మందు కోసం జిల్లాతో పాటు దూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారని ఆయన తెలిపారు. ఆస్తమా, దగ్గు ,దమ్ము వంటి శ్వాస కోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు ఈ చేప ముందు తీసుకోవడం వల్ల ఉపశమనం పొందుతున్నారని తెలిపారు. చేప మందు పంపిణీ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామని లింబాద్రి పేర్కొన్నారు.

No comments:

Post a Comment