మృగశిర కార్తి సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా హైదరాబాదులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆస్తమా రోగులకు ఉచితంగా చేప మందు పంపిణీ చేయడానికి బత్తిని కుటుంబ సభ్యులు అంతా సిద్ధం చేశారు. సాధారణంగా ప్రతి ఏటా మృగశిర కార్తి ఉదయం పూట ప్రవేశిస్తుంది. అయితే ఈసారి ఈనెల 8వ తేదీ రాత్రి మృగశిర కార్తె వస్తుండడంతో సోమవారం రాత్రి తొమ్మిది గంటల నుంచి మరుసటి రోజు రాత్రి వరకు చేప ప్రసాదం ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని బత్తిని గౌరీ శంకర్ గౌడ్ తెలిపారు. చేప ప్రసాదం తయారీలో భాగంగా ఆదివారం ఉదయం 11 గంటలకు దూద్బౌలి లోని బత్తిన గౌరీ శంకర్ గౌడ్ నివాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం, బావి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం దూద్బౌలిలోని స్వగృహంలో బత్తిని కుటుంబ సభ్యులంతా దాన్ని తీసుకున్నాక ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పంపిణీ ప్రారంభమవుతుంది. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం కోసం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ఉబ్బస రోగులకు వారి సహాయకులకు మూడు రోజుల పాటు వసతి, భోజనం, మంచినీళ్లు ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
No comments:
Post a Comment