ఉచిత చేపలు రొయ్య పిల్లల పంపిణీ పథకానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 116 కోట్ల రూపాయల అదనపు నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో రాష్ట్రంలోని చెరువులు రిజర్వాయర్లు ఇతర జల వనరులలో భారీ ఎత్తున చేపలను రొయ్య పిల్లలను ఉచితంగా వదిలి ఎందుకు మత్స్యశాఖ అధికారులు ఏర్పాట్ల చేస్తున్నారు. అతి త్వరగా టెండర్లు పిలిచి కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయనున్నారు .అనంతరం జిల్లాల వారీగా చేపలు రొయ్య పిల్లలను సరఫరా చేసి చెరువులలో విడుదల చేయనున్నారు .ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో వేలాది చెరువులు జలాశయాలు పూర్తిస్థాయిలో నీటితో నిండాయి. చేపల పెంపకానికి ఇదే సరైన సమయం అని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం వేగవంతం కానున్నది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి