తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ అసెంబ్లీ వేదికగా సోమవారం నాడు పలు కీలక సంక్షేమ పథకాలను ప్రకటించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి" ఏడాదికి మూడు ఉచిత ఎల్పిజి సిలిండర్లు " అందించనున్నట్లు తెలిపారు. అన్నపూర్ణ సూపర్ సిక్స్ పథకం కింద దీనిని అమలు చేస్తామని చెప్పారు .లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నగదు నేరుగా జమ అయ్యేలా పథకాన్ని అమలు చేస్తామని ,వచ్చే ఏడాది పొంగల్ నుంచి ఈ పథకం అమలు ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ పథకం కింద ఒక కోటి 30 లక్షల కుటుంబాలకు లాభం చేకూరనున్నది.
మహిళలు, ట్రాన్స్ జెండర్ ల కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని మరింత విస్తరిస్తూ " వెట్రి పయన తిట్టం" పథకాన్ని కూడా ఆయన ప్రకటించారు. ఈ పథకం ద్వారా ట్రాన్స్ జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రకటించడంతో పాటు మహిళల కోసం దీని పరిధిని విస్తరించారు. ఇకపై ఎక్స్ప్రెస్ ,లిమిటెడ్ స్టాప్ సర్వీస్, డీలక్స్ బస్సులు, సబర్బన్, కొండ ప్రాంతాలలో నడిచే సాధారణ చార్జీల బస్సులోను మహిళలు, ట్రాన్స్ జెండర్లు ఉచితంగా ప్రయాణం సాగించవచ్చు. ఈ పథకానికి ఎలాంటి ఆదాయ పరిమితి ,ప్రయాణాల సంఖ్య పై నిబంధనలు ఏమీ ఉండవని సీఎం స్పష్టం చేశారు. గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2 నుంచి ఈ పథకం అమల్లోకి రానున్నదని తెలిపారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి