నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిపుణ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచితంగా వివిధ కోర్సులలో శిక్షణ అందించి ఉపాధి కల్పించనున్నట్లు సంస్థ డైరెక్టర్ ఆకుల మంజుల ఆకాష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు . దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన పథకం కింద ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
శిక్షణ అందించే రంగాలు..
హెల్త్ కేర్ సెక్టార్, కంప్యూటర్ కోర్సులు, కమ్యూనికేషన్స్ స్కిల్స్.
వయస్సు.. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు గల యువతి యువకులు ఈ ఉచిత శిక్షణకు అర్హులు.
విద్యార్హత.. పదవ తరగతి లేదా ఆ పైన ఉత్తీర్ణత సాధించి ఉండాలి .
కావలసిన పత్రాలు..
ఆధార్ కార్డు, పదవ తరగతి మెమో, రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, నాలుగు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో రావాలని తెలిపారు.
ఆసక్తి గల అభ్యర్థులు తమ ధ్రువీకరణ పత్రాలతో
నిపుణ్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యాలయం,
ఎండల టవర్స్ ఎదురుగా ,
వినాయక్ నగర్ ,నిజామాబాద్
నందు సంప్రదించాలని సూచించారు.
మరిన్ని సమగ్ర వివరాల కోసం 63039 93849 ,95024 25603 మొబైల్ నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి