ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు హైదరాబాదులోని సాలార్జంగ్ మ్యూజియంలో ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ . ఈ మేరకు అన్ని జిల్లాల డిఈఓ లకు ఆదేశాలు జారీ చేశారు .విద్యార్థులకు మన దేశ సంస్కృతి, వారసత్వ సంపదపై అవగాహన కల్పించేందుకు ఈ విహారయాత్రలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ యాత్ర డిసెంబర్లోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు .ప్రభుత్వ బడులతో పాటు ప్రైవేటు ,ఎయిడెడ్ స్కూల్ విద్యార్థులు కూడా ఈ ఉచిత సందర్శన కు అర్హులు అని ఆయన తెలిపారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి