Sunday, 31 May 2026

హైదరాబాద్ లో ఉచిత ఫిజియోథెరపీ చికిత్స

 


చిన్న చిన్న ఒళ్ళు నొప్పుల  నుండి కీళ్ల సమస్యలు, దీర్ఘ కాలం బాధించే పక్షవాతం వంటి అనారోగ్యాలతో బాధ పడే వారికి , పెద్ద పెద్ద ఆపరేషన్ ల తర్వాత కదల్లేని వారికి సంజీవనిలాంటిది ఫిజియోథెరపీ చికిత్స. చాలా వ్యాధులలో అవసరమయ్యే ఫిజియోథెరపీ ని క్రమం తప్పకుండా రోగులకు అందజేస్తే రోగాలు పెరగకుండా వేగంగా తగ్గిపోయే అవకాశం ఉంది.ఐతే చాలా మందికి ఈ విషయంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల,చికిత్స అందుబాటులో లేకపోవడం వల్ల,ఖర్చు ఎక్కువగా ఉండడం లాంటి కారణాలతో ఫిజియోథెరపీ కి దూరంగా ఉంటుంటారు.అలా రోగాలు తగ్గకపోవడం ,సమస్యలు పెరగడం జరుగుతుంటాయి.

అందుబాటులో ఆధునిక మందులు ఎన్ని ఉన్నా,కొన్నింటికి ఫిజియోథెరపీ చికిత్స తప్పనిసరి.కానీ ఇది కాస్త ఖర్చుతో కూడుకున్న పని.ఐతే పేదలకు ఉపయోగపడే ఉద్దేశం తో ఈ ఖరీదైన సేవలను ఉచితంగా అందిస్తోంది ఒక స్వచ్ఛంద సంస్థ.

కూకట్ పల్లిలోని వివేకానంద నగర్ కు చెందిన కొలసాని హరీష్ అనే వ్యక్తి చికాగోలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా స్థిర పడ్డారు. మంచి జీతంతో జీవితం విలాస వంతంగా గడుస్తున్నప్పటికీ సంతృప్తి చెందలేదు. తను పుట్టిన మాతృ భూమికి ఏదైనా చేయాలని తపించాడు. ఆ తపన లో నుండి పుట్టినదే ఈ ఉచిత ఫిజియోథెరపీ అందించాలనే ఆలోచన.అలా 2012 లో " ఎన్ ఆర్ ఐ సేవా ఫౌండేషన్ "అనే ఎన్జీవో ను స్థాపించారు ఆయన.

మొదట మురికి వాడల్లో వైద్య శిబిరాలు నిర్వహించాడు.మంచానికి పరిమితమైన వారికి" మొబైల్ అంబులెన్స్ " ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో పేదల దీన స్థితిని, ఆర్థిక ఇబ్బందులను గమనించాడు.వారికి ఫిజియోథెరపీ చికిత్స ను పెద్ద ఎత్తున అందించాలని సంకల్పించాడు. ఈ విషయంలో తన సన్నిహితులతో సంప్రదిస్తే ..ఇప్పటికే చాలా చేస్తున్నావు, ఇది అవసరమా అని నిరాశకు గురి చేశారు వారు.

కానీ ప్రసాద్ గారు వెనుకడుగు వేయకుండా 2013లో వివేకానంద నగర్ లో ఒక ఫిజియోథెరపీ కేంద్రాన్ని ప్రారంభించారు. డ్రైనీ డీలింగ్, అల్ట్రా సౌండ్,టెన్స్, ఇంటరా వెర్షన్ ఫెరెన్షియల్ థెరపీ, మజిల్ స్టిమ్యులేటర్,ట్రాక్షన్ పారాఫిన్ వ్యాక్స్, ఐ ఆర్ ఆర్ ల్యాంప్, ఫిజియో బాల్, ల్యాడర్ వంటి అత్యాధునిక పరికరాలను అందుబాటులో ఉంచాడు. కార్పొరేట్ కు ధీటుగా సేవలు అందిస్తుండడంతో సమాజం నుంచి మంచి స్పందన లభించింది.2017 లో మోతీ నగర్ లో మరో కేంద్రాన్ని స్థాపించాడు. కాళ్ళ నొప్పులు, వేళ్ళ నొప్పులు అంటూ వచ్చిన వారిని ఎవరినీ ఊరికే వెనక్కి పంపించరు.రోగులు ఎక్కడి వారైనా, ప్రిస్క్రిషన్ రాసింది ప్రభుత్వ వైద్యుడా, ప్రైవేట్ వైద్యుడా అని చూడకుండా.. ప్రిస్క్రిప్షన్ ఉంటే చాలు , కేంద్రంలో చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు.సమస్యను బట్టి ఎన్ని రోజులైన ఫిజియోథెరపీ చేయించుకోవచ్చు. ఈ రెండు కేంద్రాలకు కలిపి ప్రతి రోజూ దాదాపు 250 నుండి 300 వరకు రోగులు వస్తుంటారు. హైద్రాబాద్ నుండే కాకుండా , రెండు తెలుగు రాష్ట్రాల జిల్లాల నుంచి రోగులు వరుస కడుతున్నారు.

తన తల్లికి అనారోగ్యంతో ఫిజియోథెరపీ చికిత్స అందించడంలో ఎదురైన ఇబ్బందులను గమనించి, ఫిజియోథెరపీ చికిత్స ప్రాధాన్యత గుర్తించి ఈ ఎన్జీవో స్థాపించినట్లు హరీష్ తెలిపారు.ఇప్పటివరకు 14 లక్షలకు పైగా రోగులకు చికిత్స అందించినట్లు ఆయన తెలిపారు.ఇందుకోసం నెలకు దాదాపు 2 లక్షల రూపాయలు వెచ్చిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఉచిత కుట్టు మిషన్లు పంపిణి

 


నిజామాబాద్ నగరంలోని రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో వెనుకబడిన మహిళల సాధికారత కొరకు స్థానిక అభ్యాస పాఠశాలలో రోటరీ ఆసరా కార్యక్రమం ద్వారా ఉచితంగా 60 కుట్టుమిషన్లను అలాగే వీటితో పాటు 50 గ్యాస్ ఇస్త్రీ పెట్టెలు అందజేశారు. వికలాంగుల కోసం ఐదుగురికి ట్రై సైకిల్స్ పంపిణీ చేయడం జరిగిందని రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ అధ్యక్షుడు పాకాల నరసింహ రావు తెలిపారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనమందరం ఒక మహత్తర సేవ కార్యక్రమానికి సాక్షులుగా నిలుస్తున్నామని ,ఆసరా పేరుతో నిర్వహిస్తున్న ఈ మెగా సర్వీస్ ఈవెంట్ ద్వారా సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు 60 కుట్టు యంత్రాలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు .ఇది ఒక సహాయం మాత్రమే కాదు అనేక కుటుంబాలకు ఆత్మవిశ్వాసాన్ని ఉపాధిని మంచి భవిష్యత్తును అందించే ఒక గొప్ప ప్రయత్నం తెలిపారు. మహిళా సాధికారత అనేది సమాజాభివృద్ధికి మూల స్తంభం అని పేర్కొన్నారు. మహిళ ఆర్థికంగా బలపడితే వారి కుటుంబం బలపడుతుందని దానితో పాటు సమాజం అభివృద్ధి చెందు తుందని ,ఈ ఆలోచనలతో ముందుకు సాగుతున్న రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ సభ్యులందరూ అభినందనీయులు తెలిపారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎస్ వి రాంప్రసాద్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆర్ ఐ డి 3150, గౌరవ అతిథులుగా ఆర్టీవో కే రాజేంద్ర కుమార్ నిజామాబాద్ పి డి జి రమేష్ వంగాల ,రొటేరియన్ హరిప్రసాద్, రొటేరియన్ కె ఎస్ ఆర్  ప్రసాద్ ,రొటేరియన్ జైపాల్ రెడ్డి పాల్గొనగా ,ప్రాజెక్టు చైర్మన్గా రొటేరియన్ డాక్టర్ పి విష్ణు బాబు, ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ రొటీరియల్ రంజిత్ సింగ్ ఠాకూర్  పాల్గొన్నారు అని రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ అధ్యక్షుడు పాకాల నరసింహారావు మరియు రోటరీ క్లబ్ జూబ్లీహిల్స్ అధ్యక్షులు కళ్యాణ్ చక్రవర్తి సంగులూరు లు తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ సెక్రెటరీ లక్ష్మీ విసిరెడ్డి ,రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ సెక్రటరీ గంజి రమేష్, కోశాధికారి పాల్తి రచిత్ కుమార్ ,రొటరీ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

బీబీపేటలో ఉచిత వైద్య శిబిరం



 కామారెడ్డి జిల్లా బీబీపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మెడిసిటీ హాస్పిటల్ ఘనపూర్ మరియు మేడ్చల్ వారి సౌజన్యంతో శనివారం గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన మెగా ఆరోగ్య శిబిరం విజయవంతం అయ్యిందని సర్పంచ్ సాధ్విక, ఉప సర్పంచ్ చందుపట్ల ప్రశాంత్ ,పాలకవర్గ సభ్యులు తదితరులు తెలిపారు. ఈ సందర్భంగా మెడిసిటీ హాస్పిటల్ ఘనపూర్ మరియు మేడ్చల్  వైద్యులు వెంకటాద్రి ,రాకేష్ ,రాఘవేంద్ర ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరానికి హాజరైన రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ఉచిత మెగా వైద్య శిబిరంలో బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించడంతోపాటు కంటి పరీక్షలు , చెవి ముక్కు గొంతు, వరిబీజం ,బీజ కుట్టు, గడ్డలు , కంతులు థైరాయిడ్ గడ్డలు,  గర్భసంచికి సంబంధించిన సమస్యలు, కుటుంబాన్నియంత్రణ ఆపరేషన్లు, చర్మ సమస్యలు, మోకాళ్ళనొప్పులు, నడుము నొప్పులు, నరాల సమస్యలు,  కిడ్నీ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలతో పాటు ప్రమాదంలో వేసిన రాడ్స్ తీయడంతో పాటు అన్ని రకాల అనారోగ్య సమస్యలకు ఉచితంగా వైద్యం అందిస్తాం అని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో 104 మంది రోగులు వివిధ రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారని 60 మందికి వివిధ రకాల శాస్త్ర చికిత్సల అవసరమని గుర్తించామని తెలిపారు .ఆదివారం బీబీపేట పంచాయతీ ఆవరణలో మెడిసిటి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. శస్త్ర చికిత్స అవసరం ఉన్న రోగులు ఉదయం 8 గంటలకు ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తీసుకొని ఉచిత బస్సులో మెడిసిటి హాస్పిటల్ కు తీసుకు వెళ్లి శస్త్ర చికిత్సలతో పాటు " మందులను సైతం ఉచితంగా" అందజేస్తాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాధ్విక,  ఉప సర్పంచ్ ప్రశాంత్ తో పాటు పాలకవర్గ సభ్యులు ,పంచాయతీ కార్యదర్శి రమేష్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మెడిసిటి హాస్పిటల్ వైద్యులు వెంకటాద్రి ,రాకేష్ ,రాఘవేంద్ర తో పాటు సిబ్బంది, రోగులు, పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ముత్తూట్ ఫైనాన్స్ ఉచిత వైద్య శిబిరం

 


ముత్తూట్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని భీముగల్ మున్సిపల్ చైర్మన్ నాగమణి అన్నారు. శనివారం భీంగల్ కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని చైర్మన్ ప్రారంభించారు. శిబిరం రీజినల్ నిజామాబాద్ జిల్లా మేనేజర్ బొమ్మ మహేష్ బాబు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ముత్తూట్ ఫైనాన్స్ యాజమాన్యం ప్రజలకు ఉచిత సేవ చేయడం మంచి కార్యక్రమం అన్నారు. పట్టణ ప్రజలకు ఉచిత వైద్య శిబిరంతో పాటు 150 మందికి ఏడాదికి సరిపడా మందులను ఉచితంగా పంపిణీ చేశారు దళిత శిబిరం ఏర్పాటు చేసిన ఫైనాన్సువారికి పట్టణ ప్రజల తరఫున చైర్మన్ మరియు ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెతోటి ఫైనాన్స్ వారు ఆధ్వర్యంలో చైర్మన్ దంపతులకు శాలువా పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గణేష్, హరి నారాయణ, ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్ క్లస్టర్ మేనేజర్ శ్రీకాంత్, మార్కెటింగ్ మేనేజర్ రఘు, బ్రాంచ్ మేనేజర్ బండి మహేష్ సిబ్బంది వినయ్ ,విగ్నేష్ , వర్ష తదితరులు పాల్గొన్నారు.



సివిల్స్, గ్రూప్స్ అభ్యర్థులకు ఉచిత ఓరియంటేషన్

 డాక్టర్ మర్రి మానవ వనరుల అభివృద్ధి సంస్థ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా సుపరిపాలన ప్రజా సేవల మెరుగుదల లక్ష్యంగా సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల కోసం వారం రోజుల ఉచిత ఓరియంటషన్ కార్యక్రమాన్ని సంస్థ నిర్వహిస్తుంది .జూన్ రెండవ తేదీ నుంచి ప్రారంభమవుతున్న ఈ కార్యక్రమం సివిల్ సర్వీసెస్ మరియు గ్రూప్ వన్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు .ప్రతిరోజు మూడు గంటల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు, నిపుణులు, సీనియర్ అధికారులు పాల్గొని అభ్యర్థులకు మార్గదర్శకత్వం అందిస్తారు. పరీక్షా వ్యూహాలు, ప్రణాళిక ,వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ మరియు సాఫ్ట్ స్కిల్స్, నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు, ఇంటర్వ్యూ నైపుణ్యాలు,కెరీర్ మార్గదర్శకత్వం పై ప్రధానంగా శిక్షణ అందిస్తారు. "శిక్షణ మాత్రమే ఉచితంగా "ఉంటుంది. బస ,భోజన సదుపాయాలు అభ్యర్థులే  ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది .ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటాను ctsmcrhrdit24@gmail.com కు మెయిల్ చేయాలి.

Saturday, 30 May 2026

ఫ్రీ ఏ ఐ మాస్టర్ క్లాస్

 


ఫ్రీ ఏ ఐ మాస్టర్ క్లాస్,31-5-2026



https://avinashmada.com/master-ai-future-proof-your-career?gc_id=23099904886&h_ga_id=187190195992&h_ad_id=777968169499&h_keyword_id=&h_keyword=&h_placement=&utm_source=Google&utm_medium=Free+|+Image+|+Telangana+|+BT+|+Group3+|+25to40&utm_campaign=TF+|+AM+|+Free+|+Image+|+Telangana+|+camp3+|+8Oct25&utm_content=Img8+Still+don%E2%80%99t+know&gad_source=2&gad_campaignid=23099904886&gclid=Cj0KCQjwlerQBhDMARIsAB16H-UC9xKyeOYo-o9C2u720ghmpcvK-qLO-gauLrYqGuL58F6aYkKdbt4aAnDOEALw_wcB



14 రోజులు ఫ్రీ యోగా క్లాసులు

 



వచ్చే సోమవారం నుండి అంటే జూన్ 1వ తారీకు నుండి ఆన్లైన్లో ఉచితంగా యోగ క్లాసులు నిర్వహించబడుతున్నాయి. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు కలిగిన వారు ఈ యోగ క్లాసులో ఉచితంగా జాయిన్ అయి యోగ సాధన చేయవచ్చు. ఇప్పటికే ఎంతోమంది ఈ ఉచిత యోగా క్లాసులను వినియోగించుకుంటున్నారు ఈ యోగా క్లాసులో జాయిన్ కావాలంటే ఈ కింది లింక్ లో మీ వివరాలు నమోదు చేసుకుంటే వాట్సప్ కు ప్రతిరోజు యోగా షెడ్యూల్ వస్తుంది.


https://yoga.healthyday.co.in/telugu/?ref=GAds_SC1_LA1LA2_RmVlgReBa_ResrDSE7D_MntrHK2telTrmdV3_SplitViewtelV2_ResrTerPl_13APR26&gad_source=2&gad_campaignid=23282412477&gclid=Cj0KCQjwlerQBhDMARIsAB16H-W9s4ridJ_hHqntsoKy4WMpAD09h69hK5WApZW55gzSKauEI_DJPHwaAgb6EALw_wcB




https://yoga.healthyday.co.in/telugu/?ref=GAds_SC1_LA1LA2_RmVlgReBa_ResrDSE7D_MntrHK2telTrmdV3_SplitViewtelV2_ResrTerPl_13APR26&gad_source=2&gad_campaignid=23282412477&gclid=Cj0KCQjwlerQBhDMARIsAB16H-W9s4ridJ_hHqntsoKy4WMpAD09h69hK5WApZW55gzSKauEI_DJPHwaAgb6EALw_wcB





Wednesday, 27 May 2026

1.5 లక్షల ఉచిత చికిత్స..రోడ్డు ప్రమాద బాధితులకు

 ఆపదలో బాధితులకు భరోసా.. రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రహత్ పథకం కింద ఒకటిన్నర లక్షల రూపాయల ఉచిత చికిత్స.. కానీ సరైన ప్రచారం లేక బాధితులకు చేరువ కాని పథకం..

దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలలో గాయపడిన బాధితులకు ఎలాంటి డబ్బులు డిపాజిట్ చేయకుండా తక్షణ వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం రహత్ అంటే ప్రైమ్ మినిస్టర్ రోడ్ యాక్సిడెంట్ హాస్పిటలైజేషన్ అండ్ అశ్యురుడు ట్రీట్మెంట్ స్కీం.. పథకాన్ని అమలు చేస్తోంది. రోడ్డు ప్రమాద బాధితులను ఆసుపత్రులలో చేర్పిస్తే చికిత్స ఖర్చులకు  ఎవరు డిపాజిట్ డబ్బులు కట్టాలని చాలామంది క్షతగాత్రులకు సహాయం చేయడానికి వెనుకంజ వేస్తుంటారు. బాధితులను ప్రభుత్వాసుపత్రులకు తరలిస్తే బాధ లేదు ,కానీ ప్రైవేట్ ఆస్పత్రులలో చేర్చాల్సి వస్తే వారి చికిత్స కోసం డబ్బులు కట్టి సహాయం చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. ఈ విషయాన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాద బాధితులకు అండగా ఈ పథకాన్ని ప్రారంభించింది. 

ఈ పథకం కింద ప్రమాద బాధితులకు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒకటిన్నర లక్షల రూపాయల వరకు నగదు రహిత చికిత్స లభిస్తుంది. ప్రమాదం జరిగిన రోజు నుంచి ఏడు రోజులపాటు చికిత్సకు ఈ పథకం ద్వారా సహాయం లభిస్తుంది. ప్రమాద బాధితులకు ప్రభుత్వ ఎం ప్యానెల్డ్/ ఆరోగ్యశ్రీ పథకం అమలులో ఉన్న ఆసుపత్రులలో బాధితులు ముందుగా డబ్బులు చెల్లించకుండా చికిత్స పొందవచ్చు. ఈ ఆసుపత్రులలో బాధితుల చికిత్స కోసం అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ ద్వారా ప్రభుత్వం చెల్లిస్తుంది. జాతీయ రహదారుల పైనే కాకుండా పట్టణ గ్రామీణ రహదారులపై జరిగిన ప్రమాదాలకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. బాధితులకు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా లేకున్నా ఎంతటి కోటీశ్వరులైన ఈ పథకం ద్వారా ఒకటిన్నర లక్షల వరకు నగదు రహిత చికిత్సను పొందవచ్చు..

ఇలా దరఖాస్తు చేసుకోవాలి.. ప్రమాదం జరిగినప్పుడు ఎవరైనా 112 హెల్ప్ లైన్ కు కాల్ చేసి సమీప ఆస్పత్రి వివరాలు ,అంబులెన్స్ సహాయం పొందవచ్చు.

ప్రమాదం వివరాలు తెలియగానే వాటిని ఈ-దార్ హోటల్ ద్వారా నమోదు చేస్తారు.

ఈ - దార్ పోర్టల్ అంటే..

ఈ - దార్ ( ఎలక్ట్రానిక్ డీటెయిల్డ్ ఆక్సిడెంట్ రిపోర్ట్ ) పోర్టల్ ద్వారా పోలీస్ ,వైద్య,రోడ్డు రవాణా శాఖ , బీమా సంస్థ లు అనుసంధానమై ఉండి ప్రమాద వివరాలను పంచుకుంటాయి.రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే..

పోలీసులు ప్రమాద వివరాలు,డ్రైవర్,వాహనం వివరాలు నమోదు చేస్తారు.ప్రమాదం ఫోటోలు ,వీడియోలు పోర్టల్ లో అప్ లోడ్ చేస్తారు.

వైద్యులు దగ్గరిలోని ఆసుపత్రుల వివరాలు అందించి, ఆసుపత్రిలో బాధితులను చేర్పించాక , గాయాల సమాచారం నమోదు చేస్తారు.

రవాణా శాఖ ప్రమాదం వివరాలు తెలుపుతూ బీమా కంపెనీలకు సమాచారం ఇస్తారు. ఆసుపత్రులకు చికిత్స ఖర్చులు చెల్లించేలా చర్యలు చేపడతరు.

బీమా కంపెనీలు పరిహారం చెల్లించే ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తారు. 

సత్వర వైద్యం అందుబాటులోకి..

కేంద్ర ప్రభుత్వ పియం రహత్ పథకం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులు ప్రభుత్వ మరియు ఎంపానల్డ్ అంటే ఆరోగ్యశ్రీలో నమోదైన ప్రైవేట్ ఆసుపత్రులలో నగదు కట్టకుండా 1.5 లక్షల వరకు చికిత్స పొందవచ్చు. ప్రమాదం జరగగానే వివరాలను ఈదార్ పోర్టల్ లో నమోదు చేస్తారు

ఈ పోర్టల్ లో వైద్య రవాణా పోలీసు శాఖలు అనుసంధానంగా ఉండడంతో సత్వర వైద్యము చికిత్స ఖర్చుల చెల్లింపు ఆసుపత్రులకు త్వరితగతిన జరుగుతాయి. ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి..

శ్రీనివాస్, జిల్లా రవాణా శాఖ అధికారి, కామారెడ్డి జిల్లా.

ఈ పథకానికి సరైన ప్రచారం జరగడం లేదు..

ఈ పథకాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 13 న కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్ గా వైద్యుల పరిభాషలో పిలువబడే ప్రమాదం జరిగిన మొదటి గంట సమయం లోపు ఎలాంటి ఖర్చు లేని వైద్య సహాయం అందించడం. రోడ్డు ప్రమాద బాధితులకు ప్రాణాపాయం లేని స్థితిలో ఉంటే 24 గంటల వరకు, ప్రాణాపాయ స్థితిలో ఉంటే 48 గంటల వరకు ఈ పథకం ద్వారా " ఉచిత అత్యవసర వైద్యం " అందుతుంది.





ఉచితంగా స్టీల్ బాక్స్ ల పంపి

 లింగంపేట మండలంలోని శెట్టిపల్లి గ్రామంలో సర్పంచ్ అట్టెం శ్రీనివాస్ ప్లాస్టిక్ నిషేధానికి గ్రామస్తుల సహకారంతో ప్లాస్టిక్ బాక్సులు గ్లాసులకు బదులుగా స్టీల్ గ్లాసులు ,స్టీల్ బాక్సులు వాడాలని గ్రామస్తులకు స్టీల్ బాక్సులు, స్టీల్ గ్లాసులు, జ్యూట్ బ్యాగులు పంపిణీ చేశారు. హోటల్స్ నిర్వాహకులకు గాజు గ్లాసులు వాడాలని వారికి గ్లాసులను పంపిణీ చేశారు ప్లాస్టిక్ నిషేధిత గ్రామంగా ప్రకటించేందుకు గ్రామస్తులు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నరేష్, ఉప సర్పంచ్ బాలయ్య, పంచాయతీ కార్యదర్శి రవి తదితరులు ఉన్నారు.

ఉచిత ఫిజియోథెరపీ చికిత్స

 భిక్కనూరు మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో మంగళవారం మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన దివ్యాంగ విద్యార్థులకు వైద్యుడు నవీన్ సాయి ఫిజియోథెరపీ చికిత్సలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థులకు క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ చేయిస్తే మానసిక ఉపేశమానం కలుగుతుందన్నారు. ప్రతి మంగళ, గురువారం భవిత కేంద్రంలో ఈ ఉచిత ఫిజియోథెరపీ శిబిరం ఉంటుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఐఆర్పి మహేందర్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.



వివేక్ సంస్కార్ వేసవి శిక్షణ శిబిరం

 నిజామాబాద్ లోని గంగస్థాన్లోని వివేకానంద ఆడిటోరియంలో రామకృష్ణ సేవా సమితి వారు వివేక్ సంస్కార వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా న్యాయ విజ్ఞాన సదస్సును సంస్థ తరఫున మంగళవారం ఏర్పాటు చేశారు .వక్తలు మాట్లాడుతూ బాలల హక్కులు ,సంరక్షణ ,చట్టాలపై అవగాహన కల్పించారు . సెల్ఫోన్ వ్యసనం అనర్థాల గురించి  వివరించారు. చిన్నారులు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని న్యాయ సేవా సంస్థ చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ సీనియర్ న్యాయవాది రాజకుమార్ సుబేదార్ సూచించారు.

శుభకార్యాలకు ఉచిత స్టీల్ ప్లేట్లు గ్లాసులు

 పాలిథిన్ ప్లేట్ల వాడకంతో ఆరోగ్యం తో పాటు పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుంది. ఈ విషయాన్ని గుర్తించిన కొన్ని గ్రామాల పాలకవర్గాలు పాలిథిన్ ప్లేట్లపై యుద్ధం ప్రకటించాయి. కేవలం నిషేధం ఉత్తర్వులకే పరిమితం కాకుండా ఆచరణాత్మక దిశగా అడుగులు వే స్తున్నారు. గ్రామాలను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు నడుం బిగించాయి. ప్రత్యామ్నాయంగా స్టీల్ ప్లేట్లు వాడటానికి శ్రీకారం చుట్టాయి. ఆలయాలలో శుభకార్యాల లో సామూహిక భోజనాలకు స్టీల్ ప్లేట్లనే వాడుతున్నారు. వందల మంది జనం భోజనం చేసేలా ఈ ప్లేట్లను విరాళంగా అందిస్తూ దాతలు సైతం సహకరిస్తున్నారు. ఈ స్ఫూర్తి ఉద్యమంగా జిల్లాలోని అన్ని గ్రామాలలో విస్తరిస్తుంది. 

కమ్మర్పల్లిలోని పాటి హనుమాన్ ఆలయం  ఉంది. కొన్ని ఏళ్లుగా ఇక్కడ ప్రతి శనివారం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహిస్తున్నార . పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని భోజనం చేస్తారు. వీరంతా ఉపయోగించిన ప్లేట్లతో ఆలయ పరిసరాలు అపరిశుభ్రంగా మారడంతో పాటు ఆరోగ్యానికి ప్రమాదమని గ్రహించిన ఆలయ నిర్వాహకులు స్టీల్ ప్లేట్లను వినియోగించాలని నిర్ణయించారు. భక్తులు సైతం పెద్ద సంఖ్యలో స్టీల్ ప్లేట్లు, గ్లాసులు ఆలయానికి విరాళంగా అందించి సహకరించారు. ఈ స్ఫూర్తి గ్రామంలో జరిగే జాతరలు శ్రీరామ నవమి, వినాయక చవితి ఉత్సవాలలో కొనసాగింది .ప్రస్తుతం ఊరిలో ఉత్సవం ఏదైనా స్టీల్ ప్లేట్ల వాడకం పక్కాగా అమలు అవుతుంది. తాజాగా శుక్రవారం దేవి ఆలయం వద్ద సైతం స్టీల్ ప్లేట్లే వాడాలని గ్రామాభివృద్ధి కమిటీ తీర్మానించింది .భక్తులు పెద్ద ఎత్తున ప్లేట్లు ,గ్లాసులు విరాళంగా అందించారు. ఈ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని పక్క గ్రామాలు కమ్మర్పల్లి స్టీల్ ప్లేట్లను తీసుకెళ్లి తమ గ్రామాల ఉత్సవాలలో ఉపయోగించుకుని తిరిగి ఇచ్చేస్తున్నారు.


ఆలూరు మండలం మచ్చర్ల గ్రామంలో పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో 500 స్టీల్ ప్లేట్లు ,250 గ్లాసులు కొనుగోలు చేశారు .గ్రామంలో జరిగే వేడుకలు ఇతర కార్యక్రమాలలో ఉపయోగించుకోవాలని తీర్మానం చేశారు. గ్రామ మహిళా సమాఖ్యలకు అందజేసి అందుబాటులో ఉంచారు. ప్లాస్టిక్ వాడొద్దని ప్రజలకు అవగాహన కల్పించడంతో క్రమంగా వారిలో మార్పు మొదలైంది. ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో సైతం ప్లాస్టిక్ వాడొద్దని పాలకవర్గం తీర్మానించింది .వాడకం క్రమంగా తగ్గుముఖం పట్టింది.

ఉచితంగా అందించారు..

శుభకార్యాలు ఇతర కార్యక్రమాలలో ప్లాస్టిక్ వస్తువులు వాడకాన్ని తగ్గించాలని అనుకున్నారు నందిపేట సర్పంచి సిలిండర్ లింగం. వెంటనే సమస్య పరిష్కారానికి కార్యాచరణ మొదలుపెట్టారు. గ్రామంలో ఏ శుభకార్యం జరిగినా స్టీల్ వస్తువులు వాడాలని సూచించారు. ఇందుకు తన సొంత ఖర్చులతో ఐదువేల స్టీల్ ప్లేట్లు 5000 గ్లాసులు కొనుగోలు చేసి గ్రామానికి "ఉచితంగా "అందించారు. 

సొంత డబ్బుతో కొనుగోలు..ఉచితంగా పంపిణీ 

 నవీపేటకు చెందిన నాంపల్లి వసంత్ అతడు స్నేహితులు రమేష్, శిరినాగిరి కలిసి సొంత డబ్బుతో 500 స్టీల్ ప్లాన్యాలు 400 గ్లాసులు కొనుగోలు చేశారు. వీటిని ఇప్పటివరకు 13 వివాహాలు 30 శుభకార్యాలకు ఉచితంగా అందించారు. గత ఏడాది వసంత్ తన కూతురు వివాహ వేడుకను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించారు.




లింగేశ్వర ఆశ్రమంలో శిక్షణ

 నిజామాబాద్ మండలం మల్లారం శ్రీ లింగేశ్వర గుట్ట ఆశ్రమంలో ఉచిత  సంస్కృతి బోధన శిక్షణ శిబిరాన్ని ఆశ్రమ పీఠాధిపతి బాలయోగి కృష్ణ మహారాజ్ మంగళవారం ప్రారంభించారు .జిల్లాలోని నలుమూలల నుంచి విద్యార్థులు శిక్షణ శిబిరానికి హాజరయ్యారు. మొదటి రోజు పిల్లలు ధ్యానం, యోగ పై శిక్షణ పొందారు. వేదమంత్రాలు ,యజ్ఞ శ్లోకాలు ,సంస్కృతి విశిష్టతను వివరించారు .మన సంస్కృతి పై విద్యార్థి దశ నుంచి పిల్లల్లో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు ఈ శిబిరం కొనసాగుతున్నట్లు కృష్ణ మహారాజ్ పేర్కొన్నారు.



బీర్కూర్ లో ఉచిత కంటి వైద్య శిబిరం

 


కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు " ఉచిత కంటి పరీక్షలు " నిర్వహించారు. మోతి బిందు ఉన్న 11 మందిని బోధన్ లయన్స్ క్లబ్ దవాఖానకు తరలించినట్లు వైద్యుడు సతీష్ తెలిపారు. వీరికి అక్కడ " ఉచితంగా మోతి బిందు శస్త్ర చికిత్స "చేయించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రమేష్ సభ్యులు సాయి కృష్ణ, భరత్ తదితరులు పాల్గొన్నారు.



Tuesday, 26 May 2026

ఉచిత కుట్టు మగ్గం వర్క్ బ్యూటీషియన్ కోర్సులలో శిక్షణ

 కుట్టు ,మగ్గం వర్క్, బ్యూటిషన్ కోర్సులలో ఉచిత శిక్షణ పొందేందుకు నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతులు ,మహిళలకు ఎస్బిఐ గ్రామీణ ఉపాధి శిక్షణ సంస్థ అవకాశం కల్పిస్తోంది. ఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్బిఐ గ్రామీణ ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ రవికుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు .జూన్ 1 నుంచి కోర్సులు ప్రారంభమవుతాయని అన్నారు .ఎంపికైన వారికి 30 రోజుల పాటు" ఉచితంగా వసతి కల్పించి భోజనం " అందిస్తామన్నారు .ఆసక్తి కలిగిన అభ్యర్థులు వారి పూర్తి వివరాలతో నేరుగా కార్యాలయానికి వచ్చి దరఖాస్తులను సమర్పించాలని పేర్కొన్నారు .ఆధార్ కార్డు, నాలుగు ఫోటోలు, రేషన్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ ఖాతా పుస్త పుస్తకం తో పాటు రెండు సెట్ల జిరాక్స్ ప్రతులను తీసుకొని రావాలని తెలిపారు.

Monday, 25 May 2026

ఆర్మూర్ లో ఉచిత శిక్షణ

 


మామూలు రోజుల్లో సెల్ ఫోన్ దొరికితే చాలు పిల్లలు పట్టుకుంటారు ఇక వేసవి సెలవుల్లో అయితే సెల్ ఫోన్ టీవీ తదితర వాటికి అతుక్కుపోతారు. ఈ వేసవి సెలవులు మాత్రమే వినూత్నంగా సాగుతున్నాయి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేసవి ఉచిత శిక్షణ శిబిరాలతో పాటు ప్రైవేటు సమ్మర్ క్యాంపులు సైతం విద్యార్థులతో కిట కిట లాడుతున్నాయి. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో గల బియ్యం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రత్యేక ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. మోడల్ స్కూల్ కస్తూర్బా జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఆరు నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులు మొత్తం 90 మంది రోజు హాజరవుతున్నట్లు హెచ్ ఎం తెలిపారు డ్రాయింగ్ హార్ట్ అండ్ క్రాఫ్ట్ సంగీతం యోగ తదితర అంశాలపై ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు వేసవి సెలవులను పిల్లలు వృధా చేయకుండా శిక్షణ పొందడం ప తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

RIDO NGO ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం

 నిజామాబాద్ నగరంలోని గౌతమ్ నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఆర్ ఐ డి వో ఎన్ జి ఓ ఆధ్వర్యంలో శనివారం ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది .దంత సమస్యలతో బాధపడుతున్న పలువురికి  " ఉచితంగా వైద్య పరీక్షలు " నిర్వహించి అవసరమైన సూచనలు, సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు గడుగు గంగాధర్ ముఖ్య అతిథి గా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ ఫణీంద్ర ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించారు. గౌతమ్ నగర్ కార్పొరేటర్ శివ చరణ్, నరేందర్ ,సీనియర్ న్యాయవాది మురళీధర్ రావు తదితరులు పాల్గొని నిర్వహకులను అభినందించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఆర్ఐడిఓ ఎన్జీవో నిర్వహిస్తున్న ఆరోగ్య శిబిరాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి అని అన్నారు. ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి ప్రజలకు" ఉచిత వైద్య సేవలు " అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రతినిధులు మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా ప్రజలకు ఆరోగ్య అవగాహన కల్పించే కార్యక్రమాలు" ఉచిత వైద్య శిబిరాలు " మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమం విజయానికి సహకరిస్తున్న వైద్యులు, అతిథులు మరియు స్థానిక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఆర్మూర్ లో ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరం

 వేసవి సెలవులను కొందరు చాలా బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు. నచ్చిన ఆటలలో నైపుణ్యాలను పెంచుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సహకారంతో యువత కోసం ఆర్మూర్ లో" ఉచిత క్రికెట్ శిక్షణ" శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈనెల 13వ తారీఖున మామిడిపల్లి సెయింట్ పాల్ పాఠశాల గ్రౌండ్లో ప్రారంభమైన శిక్షణ జూన్ 1వ తేదీ వరకు కొనసాగుతుంది. చాలామంది ఒత్సాహికులు శిక్షణ పొందడానికి తరలివస్తున్నారు. బ్యాట్ పట్టి క్రికెట్ ఆట పై పట్టు సాధిస్తున్నారు. అవసరమైన మెలకువలను నేర్చుకుంటున్నారు.. తమ ఆటకు పదును పెట్టుకుంటున్నారు.

Sunday, 24 May 2026

ఆధార్ ఉచిత అప్ డేట్ గడువు పొడిగింపు

 భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI మై ఆధార్ పోర్టల్ లో ఉచిత ఆధార్ డాక్యుమెంట్ అప్ డేట్ గడువు ను పొడిగించింది. ఆధార్ కార్డు దారులు ఇప్పుడు తమ గుర్తింపు,చిరునామా ఆధార పత్రాలను ఎలాంటి ఫీజు లేకుండా 2027 జూన్ 14 వరకు అప్ డేట్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం ఆన్లైన్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్లో తమ సమాచారాన్ని అప్డేట్ చేసుకుంటున్న ఆధార్ కార్డు దరుల నుంచి వస్తున్న పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ను దృష్టిలో ఉంచుకొని ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది.

ఆధార్ కార్డుదారులు కొత్త ఆధార్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చని, ఈ కొత్త యాప్ లో సురక్షితమైన ఆధార్ క్యూఆర్ ఆధారిత   ఆధార్ షేరింగ్, మెరుగైన ప్రైవసీ నియంత్రణలు, ఆధార్ సేవలకు సులభమైన యాక్సెస్ వంటి ఫీచర్లు ఉన్నాయని UIDAI వివరించింది. 

5-17 ఏళ్ల వారికి ఆధార్ సవరణ ఉచితం

 ఐదు నుంచి 17 ఏళ్ల వయసు గల వారికి మొదటిసారి ఆధార్ కార్డులో వివరాలను ఆధార్ కేంద్రాలలో సవరణ చేసుకుంటే ఎటువంటి రుసుము చెల్లించే అవసరం లేదని UIDAI హైదరాబాద్ రీజినల్ అధికారులు తెలిపారు.

ఐదేళ్లు నిండిన తర్వాత చేసే సవరణలో పిల్లల బయోమెట్రిక్, ఐరిస్ తీసుకుంటారని తెలిపారు. సాధారణంగా ఐదు నుంచి ఏడు ఏళ్లు మరియు 15 నుంచి 17 ఏళ్లు మధ్య వయసు గల వారికి మాత్రమే నమోదు కేంద్రాలలో మొదటిసారి వివరాల సవరణలను ఉచితంగా చేస్తారు .కానీ ఈసారి ఐదు నుంచి 17 ఏళ్ల వయసు గల వారందరికీ సెప్టెంబర్  30 వరకు ఉచితంగా సవరణ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. ఆధార్ కార్డులో చిరునామా తదితర వివరాలను ఆన్లైన్లో ఉచితంగా సవరించుకునే అవకాశం ఈ ఏడాది జూన్ 14 వరకు ఉండగా దీనిని మరొక ఏడాది పొడిగించినట్లు తెలిపారు.

పాయల్ ఫౌండేషన్.. ఉచిత అన్న దానం

 పాయల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు ఉచిత అన్నదానం ..

బేల సబ్ మార్కెట్ యార్డులో పంటలను అమ్ముకోవడానికి వస్తున్న రైతులకు పాయల్ ఫౌండేషన్ ఉచితంగా అన్నదానం చేస్తూ ఆదుకుంటుంది. మార్కెట్ యార్డ్ కి వచ్చిన రైతులకు అన్నదానం చేయడం ఎంతో సంతోషకరమని పాయల్ శంకర్ ఫౌండేషన్ నిర్వాహకులు అన్నారు. ఈ అన్నదాన కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని వారు తెలిపారు. మార్కెట్ యార్డ్ అధికారులు రైతులకు గన్ని బ్యాగులు, చల్లటి మంచినీటి వసతి కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు  ఇంద్రశేఖర్, భూపతి రెడ్డి ,నవీన్ ,దత్త నిక్కం,పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

Tuesday, 19 May 2026

21 నుండి ఏఐపై ఉచిత శిక్షణ

 21 నుండి ఏఐపై ,ఎమర్జింగ్ టెక్నాలజీ పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. 

తెలంగాణ రాష్ట్రంలోని యువతకు ఏఐ ,ఎమర్జింగ్ టెక్నాలజీలు, స్కిల్ డెవలప్మెంట్ పై శిక్షణ ఇచ్చేందుకు జిల్లాలలో నాలుగు రోజుల పటు సదస్సులు నిర్వహించనున్నట్లు బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు.

ఈనెల 21 నుండి జూన్ 11 వరకు జిల్లాలలో కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. సైదాబాద్ లోని బీసీ స్టడీ సర్కిల్ ప్రధాన కార్యాలయంలో ఈనెల 21 నుంచి 26 వరకు సదస్సు ఉంటుందని ఆయన వివరించారు. జిల్లాల వారీగా షెడ్యూల్ను ప్రకటించామని 12 జిల్లాల్లోని స్టడీ సర్కిల్లోఇవి కొనసాగుతాయన్నారు.

ఉచితంగా మామిడి మొక్కల పంపిణీ

 వేసవి అనగానే మనకు టక్కున గుర్తు వచ్చేవి మామిడి పండ్లు. అందరూ పండ్లను తిన్న తర్వాత టెంకలను బయటపడేస్తుంటారు. అయితే బయటపడవేసే ఈ టెంకలను సేకరిస్తూ రైతులకు ఆదాయ మార్గాన్ని చూపుతున్నాడు కోల్ కతా కు చెందిన జస్మిత్ సింగ్. వైద్య శాస్త్రం చదివిన ఆయన , ఆంత్ర ప్రేన్యూర్ గా కూడా పని చేసిన ఆయనను నీరు లేక వరి పొలాలు ఎండిపోయి రైతులు కన్నీరు మున్నీరు అవుతున్న కొన్ని సంఘటనలు కలచి వేసాయి. అప్పుడే నీటి అవసరం ఎక్కువగా లేని ఎక్కువ కాలం ఆదాయం పొందే దిశగా రైతులను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు. అలా వచ్చింది మామిడి టెంక లను సేకరించాలనే ఒక ఆలోచన.



దాంతో ప్రతి ఏటా వేసవి ప్రారంభంలో  "మామిడి టెంకలను పారేయకండి, వాటిని శుభ్రంగా కడిగి ఎండబెట్టాక నాకు  పంపించండి "అని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఎక్కడెక్కడ నుండో పార్శిల్ల ద్వారా వచ్చిన టెంకలను దీని కోసమే సొంతంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నర్సరీలో మొక్కలుగా పెంచుతున్నాడు .ఆ తర్వాత వాటిని " రైతులకు ఉచితంగా "పంచుతున్నాడు. అవి పెరిగి పెద్దయ్యాక రైతులకు ఆదాయ వనరుగా మారడంతో పాటు పచ్చదనం పెంపొంది పర్యావరణానికి మేలు జరుగుతుందని అంటారు డాక్టర్ జస్మిత్ సింగ్.


నిరాశ్రయులకు ఉచిత వసతి

 వృద్ధాప్యంలో పిల్లలు చూడకపోవడం,అనారోగ్యం,పేదరికం తదితర కారణాలతో ఎంతోమంది నిరాదరణకు గురై వీధి పలు అవుతున్నారు. అలాంటి నిస్సహాయులను ఆదుకునేందుకు ప్రారంభించిన సంస్థ శ్రీ గౌతమీ జీవ కారుణ్య సంఘం.. అనాధల సేవనే భగవంతుడు సేవ అని భావించిన కారుణ్యానంద స్వామీజీ దాదాపు 86 ఏళ్ల క్రితం రాజమండ్రిలో ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. నాటి నుంచి నిరాదైనా నాకు గురైన వారికి కుష్టి రోగులకు ఆశ్రయం కల్పిస్తూ అన్ని రకాల సదుపాయాలను అందిస్తున్నారు.



పిల్లలను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివిపిస్తూ ఆటలు పాటలు నేర్పిస్తూ మెరికల్లా తీర్చిదిద్దుతున్నారు. కొన్నాళ్ల క్రితం ఈ సంస్థను పెట్టిన స్వామీజీ మరణించడంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ సంస్థ బాధ్యతలను తీసుకున్నది.

మా సంస్థలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులు ఎవరైనా చనిపోయి ,వారి సంబంధికులు రాకపోతే మేమే అంత్యక్రియలు నిర్వహిస్తాము అని అన్నారు సంస్థ కార్య నిర్వహణ అధికారి బాధ్యతలు చూస్తున్న పితాని తారకేశ్వర రావు.

బధిరులకు ఉచితంగా

 బదిరులకు చదువుతోపాటు అన్ని రకాల నైపుణ్యాలను ఉచితంగా నేర్పించి తీర్చిదిద్దే సరస్వతి నిలయం నాగుబడి రంగయ్య అచ్చమ్మ బదిరుల పాఠశాల. బాపట్ల జిల్లా పర్చూరు మండలంలోని నాగులపాలెం గ్రామంలో ఉన్న ఈ పాఠశాలను ప్రవాసాంధ్రుడైన డా.నాగుబడి సుబ్బారావు గారు నిర్మించారు. రైతు కుటుంబంలో పుట్టిన ఆయన వైద్య విద్య చదివి అమెరికాలో యూరాలజిస్ట్ గా స్థిరపడ్డారు. ఆయన సోదరి బధిరురాలు . ఆమెలాంటి వారికి ఉపయోగపడేలా ఏదైనా చేయమని తండ్రి కోరడంతో 18 కోట్ల రూపాయలు హెచ్చించి ఈ పాఠశాలను స్థాపించారు.



అన్ని రకాల సౌకర్యాలతో తీర్చిదిద్దారు. వాళ్లకు విద్యతోపాటు వసతి ,పుస్తకాలు ,దుస్తులు ఇలా అన్నింటినీ అందిస్తుంది ఈ స్కూలు ట్రస్ట్.చదువుతో పాటు కుట్టుపని , సబ్బులు, చాక్ పీస్ ల తయారీని నేర్పిస్తూ ఆటలలోనూ ప్రోత్సహిస్తున్నారు..

ప్రతి నెలా ఉచితంగా బియ్యం..

 ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్ లో ఉన్న విద్యా హై స్కూల్ లో సోమవారం "రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ" అవ్వకు బువ్వ కార్యక్రమంలో భాగంగా పేదలకు "ఉచితంగా బియ్యం పంపిణీ"చేశారు.

ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి నెలా నిరుపేద వృద్ధులకు 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.మొత్తం 65 మంది పేద వృద్ధులకు బియ్యం అంద చేశామన్నారు. రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్ ఖాన్దేష్, ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్,ఉపాధ్యక్షులు జిందం నరహరి , S g శ్రీకాంత్, గోనె శ్రీధర్,తులసి పట్వారీ, ఖాన్దేష్ సత్యం తదితరులు పాల్గొన్నారు.

Monday, 18 May 2026

అఖండ జ్యోతి కంటి ఆసుపత్రి బీహార్

 బీహార్ లోని సరాన్ జిల్లాలో ఆదివారం కంటి ఆసుపత్రి నిర్మాణ శంకుస్థాపనకు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం ఆదాని హాజరయ్యారు .సరౌన్ జిల్లా కేంద్రం శివారులలో 150 కోట్ల రూపాయల మేరకు ఆదాని ఫౌండేషన్ సహాయంతో భారీ స్థాయిలో ఇక్కడ అఖండ జ్యోతి కంటి ఆసుపత్రి నిర్మాణానికి తలపెట్టారు .ఇక్కడి మస్తీ చాకులో ఆసుపత్రి పూర్తి అయితే వార్షికంగా మూడు లక్షలకు పైగా  కంటి ఆపరేషన్లు జరుగుతాయి. వేయి మంది కంటి వైద్యులకు అవసరమైన అధునాతన శిక్షణ అందుతుంది .శంకుస్థాపన కార్యక్రమానికి  ఆదాని, ఆయన భార్య అదానీ ఫౌండేషన్ చైర్పర్సన్ ప్రీతి ఆదానీ హాజరయ్యారు. కార్యక్రమం నేపథ్యంలో ఆదాన్ని దంపతులు మాట్లాడారు తాము సేవనే ధర్మంగా పరిగణిస్తామని ప్రకటించారు .మొత్తం మీద ఇక్కడ ఆసుపత్రికి 500 కోట్ల రూపాయల మేర వ్యక్తిగత సహాయానికి కట్టుబడి ఉంటామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా తాము చేపట్టబోయే దీర్ఘకాలిక మానవీయ, సామాజిక ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల దిశలో ముందుకు సాగుతామని ఈ సందర్భంగా గౌతమ్ ఆదనీ తెలిపారు.

ఉచితంగా చల్లని మజ్జిగ@హైద్రాబాద్

 ఎండలు తీవ్రంగా ఉన్న ప్రస్తుత సమయంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు నమో వందే గోమాతరం మరియు వరల్డ్ హిందూ లయన్స్ ఫౌండర్ పెరిక సురేష్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలలో ఉచితంగా మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతిరోజు వేలాదిమందికి ఉచితంగా చల్లని మజ్జిగ అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. 



గిరిజన విద్యార్థులకు ఉచిత విద్య

 దాతృత్వంతోన ఆదర్శ సమాజ నిర్మాణం .. ఆర్బీ వి ఆర్ ఆర్ ఈ ఎస్ ఎస్ ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి, జె ఎస్ ఎస్ఎన్ రెడ్డి.



అచ్యుత సమంత ప్రారంభించిన ఆర్ట్ ఆఫ్ గివింగ్ ఉద్యమం 13వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది పంచుకోవడంలోనే ఆనందం అనే సందేశంతో మే 11 నుండి 17 వరకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు తెలంగాణ కోఆర్డినేటర్ పి రాజా రమేష్ ఆధ్వర్యంలో ఆదివారం అబిడ్స్ లోని రాజా బహదూర్ వెంకట రామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ హాస్టల్లో ఏర్పాటు చేసిన వాలీబాల్ టోర్నీని సొసైటీ సెక్రటరీ ప్రొఫెసర్ జి గోపాల్ జాయింట్ సెక్రటరీ ఎస్ఎన్ రెడ్డి హాజరై ప్రారంభించారు ఈ వారోత్సవాలలో భాగంగా వాలీబాల్ కిట్ల పంపిణీ రక్తదాన శిబిరాలు పేద విద్యార్థులకు బోధనా సామాగ్రి అందజేత ఆహార పంపిణీ మొక్కలు నాటడం ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు చేపట్టారు యువతలో సేవాభావం నాయకత్వ లక్షణాలు క్రీడా స్ఫూర్తి పెంపొందించడమే ముఖ్య ఉద్దేశంగా నిర్వాహకులు తెలిపారు ప్రస్తుతం 200 కు పైగా దేశాలకు విస్తరించిన ఆర్ట్ ఆఫ్ గివింగ్ ఉద్యమం దాతృత్వాన్ని జీవన విధానంగా మార్చే లక్ష్యంతో ముందుకు సాగుతోంది గిరిజన విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తూ సమాజంలో సమానత్వం మానవత్వం పెంపొందించడంలో ఈ ఉద్యమం కీలక పాత్ర పోషిస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ హాస్టల్ వార్డెన్ శ్రీనివాస్ రెడ్డి జానకి రడ్డి తో పాటు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు 


జన్నేపల్లిలో ఉచిత వైద్య శిబిరం

 నవీపేట మండలంలోని చన్నేపల్లిలో ఆదివారం ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. కోశాలేంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురికి దంత పరీక్షలు నిర్వహించడంతోపాటు ఉచితంగా మందులు అందజేశారు కార్యక్రమంలో సర్పంచ్ మూడుసు గంగాధర్ ఉపసర్పంచ్ వీరేందర్రావు ఐద్య సిబ్బంది ప్రసూన మనీత్ రావు, అనిల్, అజయ్ కార్తికేయ భరత్ పాల్గొన్నారు. 



ఉచితంగా సైనిక్,నవోదయ శిక్షణ

 బాన్స్వాడ పట్టణంలోని ద్రోణ నవోదయ సైనిక్ కోచింగ్ సెంటర్లో ఆదివారం నిర్వహించిన టాలెంట్ టెస్ట్ కు సుమారు రెండు వందలకు పైగా విద్యార్థులు హాజరైనట్లు నిర్వాహకులు ప్రవీణ్ కుమార్ తెలిపారు విద్యార్థులను దాగి ఉన్న ప్రతిభను గుర్తించి సబ్జెక్టు వారీగా వారి నైపుణ్యాలను గెలికి తీయడమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురికి ఉచితంగా సైనిక్ నవోదయ శిక్షణ అందించనున్నట్లు తెలిపారు 80 శాతానికి పైగా మార్కులు సాధించిన వారికి ఫీజులు 30 శాతం రాయితీ ఉంటుందని ఆయన వివరించారు.

Saturday, 16 May 2026

యూఏఈ లో ఉద్యోగాలకు ఉచిత వీసాలు

 అబుదాబి కేంద్రంగా పనిచేస్తున్న ఏడిఎన్హెచ్ కంపెనీ మన రాష్ట్రంలోని జిటిఎం సంస్థలు సంయుక్తంగా యూఏఈ లో ఆఫీస్ బాయ్ వెయిటర్ డ్రైవర్ పోస్టులకు ఉచితంగా వీసాలు జారీ చేయనున్నాయి ఈనెల 19న జీటీఎం సంస్థ బ్రాంచీలు ఉన్న సికింద్రాబాద్ నిజామాబాద్ ఆర్మూర్ జగిత్యాల సిరిసిల్లలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. 23 నుంచి 40 ఏళ్ల లోపు వారు ఉద్యోగాలకు అర్హులని జీత సంస్థ చైర్మన్ సతీష్ రావు ప్రతినిధులు తెలిపారు ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ కలిగి ఉండడంతో పాటు బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చి ఉండాలని ఒంటిపై పచ్చబొట్లు టాటూస్ లాంటివి ఉండకూడదని పేర్కొన్నారు ఆఫీస్ బాయ్ లకు నెలకు 26 వేల రూపాయలు వెయిటర్ లకు 30 వేల రూపాయలు హెవీ డ్రైవర్ కు 62000 లైట్ డ్రైవర్లకు 45 వేల వేతనం ఉంటుందని తెలిపారు అయ్యా ఉద్యోగాలకు ఉచిత వసతి భోజన సదుపాయాలు ఉంటాయని వివరించారు ఉచితంగా వీసాలు జారీ చేయడంతో పాటు యూఏఈ కి వెళ్లడానికి విమాన చార్జీలను సైతం కంపెనీ భరించనున్నదని పేర్కొన్నారు పూర్తి వివరాల కోసం సికింద్రాబాద్ 8332052299 నిజామాబాద్ 86868 60999 ఆర్మూర్ 83320 1399 9, జగిత్యాల 8332042299 సిరిసిల్ల 93916 61522 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Friday, 15 May 2026

ప్రవేశం లభిస్తే ఉచిత కార్పొరేట్ విద్యా

 ఆదర్శలో ప్రవేశాలకు 20వ తేదీ వరకు గడువు..

గ్రామీణ ప్రాంతాలలోని పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో కార్పొరేట్ స్థాయి విద్యను" ఉచితంగా" అందించేందుకు ప్రభుత్వం ఆదర్శ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేసింది. ఇక్కడ చదివిన విద్యార్థులు వివిధ రంగాలలో ప్రతిభ కనబరుస్తుండడంతో ఏటా వీటిలో ప్రవేశాలకు పోటీ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం 2026 -27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 

16 జూనియర్ కళాశాలలు.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 16 ఆదర్శ పాఠశాలలు, కళాశాలలు కొనసాగుతున్నాయి. ఒక్కో కళాశాలలో 160 సీట్లు ఉన్నాయి. పదవ తరగతిలో వచ్చిన మార్పుల ఆధారంగా ఇంటర్మీడియట్ విద్యలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇందులో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ బైపీసీ సీఈసీ ఏఈసి గ్రూపులలో ఒక్కో విభాగంలో 40 సీట్లలో విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు .ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2560 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈసారి mec స్థానంలో విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే ఏఈసి( అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్ గ్రూప్) ను ప్రవేశపెట్టారు. ప్రథమ సంవత్సరంలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు ఆన్లైన్ లేదా మీసేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి ,అర్హత ఉన్న విద్యార్థులు ఈనెల 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. 

ఆదర్శ జూనియర్ కళాశాలలో అందజేస్తున్న "ఉచిత కార్పొరేట్ స్థాయి విద్య "ను అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. అనుభవం ఉన్న అధ్యాపకులు బోధించడం వలన ఏటా ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతున్నాయని, బాలికలకు వసతి సౌకర్యం కూడా ఉందని ఎల్లారెడ్డి ఆదర్శ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ తోట గాంధీ తెలిపారు.

Thursday, 14 May 2026

ఉచిత త్రో బాల్ శిక్షణ శిబిరం

ఈషా గ్రామోత్సవం..ఆటలు,వేడుకలు,పురోగతి



14 ఏళ్ళు మరియు ఆ పైబడిన గ్రామీణ మహిళల కోసం ఉచిత త్రోబాల్ శిక్షణ శిబిరం. సులువైన మరియు ఆసక్తికరమైన పద్ధతిలో ఈ ఆటను నేర్చుకోండి. అనుభవజ్ఞులైన కోతుల వద్ద శిక్షణ పొందవచ్చు. అలాగే ఈశా గ్రామోత్సవం కోసం మీ సొంత  జట్టును ఏర్పాటు చేసుకోండి. పాల్గొని ఐదు లక్షల వరకు బహుమతులు గెలుచుకునే అవకాశం పొందండి. 

కొత్త వాళ్లు కూడా సులభమైన పద్ధతిలో త్రో బాల్ నేర్చుకునే అవకాశం ఇది. సరదా ఆటలు వినోద కార్యక్రమాలలో పాల్గొనండి. నిపుణులైన కోచ్ల నుండి ప్రత్యేక శిక్షణ పొందండి. ప్రతిరోజు అల్పాహారం అందించబడుతుంది. ఈషా గ్రామోత్సవం కోసం మీ సొంత జట్టును ఏర్పాటు చేసుకొని పాల్గొని ఐదు లక్షల రూపాయలు బహుమతి పొందే అవకాశం పొందండి.

పరిమిత సీట్లు ..ఇప్పుడే చేరండి..


వేదిక ..సిరిసిల్ల ..రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ రాష్ట్రం

తేదీ ..మే 13 నుండి 17 వరకు 

ఈరోజే రిజిస్టర్ చేసుకోండి..

Isha.co/grm-camp 

మరిన్ని వివరాలకు..8300030999


తేదీ ..మే 20 నుండి 24 వరకు 

వేదిక.. కరీం నగర్, తెలంగాణ.


తేదీ ..మే 27 నుండి 31 వరకు 

వేదిక.. వరంగల్, తెలంగాణ 


తేదీ.. మే 27 నుంచి 31 వరకు 

వేదిక..చిత్తూరు, ఆంధ్రప్రదేశ్ 


తేదీ ..మే 27 నుంచి 31 వరకు 

వేదిక.. విశాఖ పట్నం , ఆంధ్రప్రదేశ్ 


తేదీ ..మే 18 నుంచి 22 వరకు 

వేదిక .. పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్ 


తేదీ మే 20 నుంచి 24 వరకు 

వేదిక.. నెల్లూరు, ఆంధ్రప్రదేశ్..


ఉచిత ఆన్లైన్ కోచింగ్.. అక్షరధాన్ చారిటబుల్ ట్రస్ట్

 అక్షరధాన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించనున్న ఉచిత ఆన్లైన్ కోచింగ్ కోసం నాగిరెడ్డిపేట మండలంలోని గోపాల్పేట మోడల్ స్కూల్ ఎంపికైనట్లు స్కూల్ ప్రిన్సిపాల్ రాంప్రసాద్ తెలిపారు .రానున్న మూడేళ్ల పాటు పదవ తరగతి విద్యార్థులను వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయడానికి అక్షరధాన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తామని తెలిపారు. దీనితో 8 వ తరగతి విద్యార్థులకు ఎస్ఎంఎస్ పరీక్షల క్లాసులు నిర్వహిస్తామని తెలిపారు.

స్వయం ఉపాధి సాంకేతిక కోర్సులలో ఉచిత శిక్షణ

 యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పురం లోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభవృద్ధి శాఖ ఆధ్వర్యంలో పలు స్వయం ఉపాధి సాంకేతిక కోర్సులలో ఉచిత శిక్షణ ఇస్తున్నామని సంస్థ చైర్మన్ ఎన్ కిషోర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలు తెలిపారు రెండు నెలల కాల పరిమితి గల అకౌంట్స్ అసిస్టెంట్ టాలీ ప్రైమ్ కోర్సు కు బీకాం విద్యార్హత మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ డిజిటల్ మిత్ర కోర్సు కు ఇంటర్మీడియట్ పాస్ అయ ఉండి అభ్యర్థులు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయ ఉండాలన్నారు ఆరు నెలల కాలపరిమితి కలిగిన ఎలక్ట్రిషన్ అండ్ సోలార్ ఇన్స్టాలేషన్ కోర్స్ కు ఐటిఐ విద్యార్హత కంప్యూటర్ హార్డ్వేర్ సిసిటీవీ సెల్ ఫన్ రిపేరింగ్ కోర్సుకు ఎస్ఎస్సి పాస్ టైలరింగ్ ఎంబ్రాయిడరీ జర్దోజి కువైట కువైట్ బ్యాగులు తయారీ కోరుసుక ఎనిమిదవ తరగతి పాస్ అయి ఉండాలని పేర్కొన్నారు పై కోర్సులకు అభ్యర్థులు 18 నుండి 25 మధ్య వయసు ఉండాలంటే తెలిపారు ఆసక్తి కలిగిన యువతీ యువకులు తమ విద్యార్హతల సర్టిఫికెట్లు ఆధార్ కుల పత్రం ఫోటోలతో ఈ నెల 18 లోపు సంస్థలు హాజరు కావాలని తెలిపారు.

పుస్తకం చదివితే నగదు బహుమతి

 వేసవి సెలవులు లో విద్యార్థులు మంచి మంచి పుస్తకాలు చదివేలా ప్రోత్సహించడానికి యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పురపాలికలోని శాఖ గ్రంథాలయం వినూత్నంగా ఆలోచించింది గ్రంథాలయంలో ఒకరోజు పేరుతో నెలరోజుల ప్రత్యేక కార్యక్రమానికి మంగళవారం శ్రీకారం చుట్టింది జూన్ 12 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతోంది క్రమం తప్పకుండా హాజరై ఎక్కువ గంటలకు పుస్తక పఠనం చేసిన విద్యార్థులలో పది మందిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి 2500 రూపాయల చొప్పున నగదు బహుమతితో పాటు సన్మానం చేస్తామని గ్రంథాలయ చైర్మన్ కోమటి మత్స్యగిరి ప్రకటించారు ఇక్కడ ఒకేసారి 50 మంది వరకు కూర్చుని చదువుకునే అవకాశం 60 వేలకు పైగా పుస్తకాలు అందుబాటులో ఉండడం విశేషం.

ఉచిత క్రికెట్ శిక్షణ @ కామారెడ్డి

 కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి ఉచిత వేసవి క్రికెట్ కోచింగ్ క్యాంప్ బుధవారం ప్రారంభమైంది.. కౌన్సిలర్ అర్కల ప్రభాకర్ యాదవ్ జిల్లా క్రీడా అధికారి రంగ వెంకటేశ్వర్ గౌడ్ శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రికెట్ ఎంతో ఖర్చుతో కూడుకున్న క్రీడా అని గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడానికి హెచ్సీఏ ఉచిత శిక్షణను అందిస్తోందని తెలిపారు . అండర్ 15 అండర్ 19 ఓపెన్ కేట ఏరియాలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు జిల్లా రాష్ట్ర సయి సెలక్షన్లలో ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు క్రీడలు యువతను చెడు వ్యసనాలకు దూరంగా ఉంచి మానసిక ధైర్యాన్ని , ఉజ్వల భవిష్యత్తును అంతిస్తాయని తెలిపారు కామారెడ్డి క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మోజం అలీ ఖాన్ కోచులు రామకృష్ణ రియాజ్ క్రీడాకారులు పాల్గొన్నారు.

Tuesday, 12 May 2026

ఉచిత మగ్గం వర్క్ శిక్షణ

 నసురుల్లాబాద్ ఎస్టీ యువత శిక్షణ కేంద్రంలో కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం ఆధ్వర్యంలో మహిళలకు " ఉచిత మగ్గం వర్క్ శిక్షణ" కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు RSETI సంస్థ డైరెక్టర్ అమర్ సింగ్ సోమ వారం రోజున ఒక ప్రకటన లో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన 19 నుండి 50 ఏళ్ల లోపు మహిళలకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. రేషన్ కార్డు ఉండాలని తెలిపారు. మగ్గం వర్క్ శిక్షణ కోసం శిక్షణా కేంద్రం లోని వసతి గృహంలో ఉండి శిక్షణ పొందాలని ఆయన వివరించారు.

Saturday, 9 May 2026

యుద్ధ కళల్లో ఉచిత శిక్షణ..

 



బాన్సువాడ పట్టణంలోని బేతాళస్వామి ఆలయం ప్రాంగణంలో చిన్నారులు కరాటేలో శిక్షణ పొందుతున్నారు.మండలంలోని సంగోజీపేట కు చెందిన మాగి నవీన్ అనే యువకుడు హైందవ వీరుల యుద్ధ కళల గురుకులం / అకాడమీ ది రైట్ వే కరాటే క్యాంపస్ అనే శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో వేసవి సెలవుల్లో తల్లి దండ్రులు తమ చిన్నారులను బేతాళస్వామి వద్ద ఏర్పాటు చేసిన కరాటే శిక్షణా తరగతులకు పంపిస్తున్నారు. ప్రతీ రోజూ ఉదయం 8 గంటల నుంచి 10 వరకు,సాయంత్రం 5 గంటల నుంచి చిన్నారులకు కరాటే పై శిక్షణ ఇస్తున్నారు.



కరాటే శిక్షణ శిబిరం సద్వినియోగం చేసుకోండి

 


కరాటే నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న ఐదు నుండి 14 ఏళ్లలోపు విద్యార్థులు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మునిసిపల్ కార్యాలయం వెనుక నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో పాల్గొని కరాటే నేర్చుకొని సద్వినియోగం చేసుకోవాలని కరాటే మాస్టర్ దీకొండ సాత్విక్ తెలిపారు యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిబిరం జూన్ 7 వరకు ఉదయం ఆరు గంటల నుంచి 9 గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుండి 7 గంటల వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు పూర్తి వివరాలకు 88858 28460 ఫోన్ నెంబర్ ల సంప్రదించాలని కోరారు.




అంబలి కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

 



అంబలి కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి.. బాన్స్వాడ మండలంలోని ఇబ్రహీంపేట్ లో ఏర్పాటు చసిన అంబలి కేంద్రము మరియు చలివేంద్రమును గ్రామస్తులు బాటసారిలు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ పార్టీ నాయకుడు ఉద్దర రాజ్ కుమార్ అన్నారు శుక్రవారం ఆయన గ్రామంలో పంచాయతీ కార్యదర్శి నాగరాజు తో కలిసి అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించడానికి ఉచిత అంబలి కేంద్రం మరియు చలివేంద్రమును ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోండి

 వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోండి..సిరికొండలోని పీఎం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల కళాశాలలో విద్యార్థులకు నిర్వహించనున్న వేసవి శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ జి రాజేష్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు ఈనెల 11 నుంచి 25 వరకు నిర్వహించనున్న వేసవి ఉచిత శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు. ప్రభుత్వం వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. మండలంలోని పి ఎం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల కళాశాలలో ఏర్పాటు చేసిన వేసవి ఉచిత శిక్షణ శిబిరాలను 15 రోజులపాటు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు అయిన వెల్లడించారు. విద్యార్థులకు క్రాఫ్ట్ ,కరాటే ,స్పోర్ట్స్, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ డ్రాయింగ్, డాన్స్, సంగీతం, యోగ ,ఆటలు, నృత్యం, చిత్రలేఖనం, సృజనాత్మక అభివృద్ధి తదితర అంశాలలో శిక్షణ కొరకు శిక్షణ శిబిరాల నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు వేసవి శిక్షణ తరగతులకు హాజరు కావాలనుకునే విద్యార్థులు క్రింది ఫోన్ నెంబర్లను సంప్రదించాలని ప్రిన్సిపల సూచించారు. 9290559309 మరియు 9490771237 నెంబర్లకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా ప్రిన్సిపాల్ స్పష్టం చేశారు.

ఏర్కెట్ల మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉచిత సమ్మర్ క్యాంప్ ఫోన్ నెంబర్..9848512511

బాల్కొండ లో ఉచిత మగ్గం వర్క్ పై శిక్షణ

 బాల్కొండ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఉచిత మగ్గం వర్క్ పై మహిళలకు శిక్షణ ఇస్తున్నట్లు ఏపిఎం గగారం తెలిపారు. శుక్రవారం ప్రారంభమైన శిక్షణ కార్యక్రమంలో స్థానిక ఉపసర్పంచ్ గాండ్ల రాజేందర్ మాట్లాడుతూ ఉచిత శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకొని నేర్చుకున్న నైపుణ్యంతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నెలకొల్పి ఆర్థిక స్వావలంబన సాధించాలని పిలుపునిచ్చారు. వ్యాపారానికి అవసరమైన రుణ సదుపాయాలు అందిస్తామని ఏపీఎం గంగారం చెప్పారు. పరిశ్రమలను ప్రోత్సహించి నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉపాధి కల్పించడం ప్రభుత్వ ధ్యేయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భరత్ రెడ్డి మండల సమాఖ్య అధ్యక్షురాలు స్వరూప శిక్షకురాలు కీర్తన సంతోషి సీసీల వివోఏలు తదితరులు పాల్గొన్నారు.

Friday, 8 May 2026

రెడ్డీస్ ఫౌండేషన్ వారి ఉచిత మట్టి పరీక్షలు

 వ్యవసాయంలో శాస్త్రీయ పద్ధతులను ప్రోత్సహిస్తూ రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి పరీక్షల కార్యక్రమం కొనసాగుతోంది. 

ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లోని భీమ్గల్ మండలంలో కారేపల్లి గ్రామంలో స్థానిక రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా నిపుణులు మాట్లాడుతూ రైతులు తమ పొలాల నుంచి మట్టి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం సమర్పించాలని సూచించారు.

ఈ పరీక్షల ద్వారా మట్టిలోని ముఖ్య పోషకాలైన నత్రజని పొటాషియం ఫాస్ఫరస్ లతోపాటు సూక్ష్మ పోషకాల స్థాయిని శాస్త్రీయంగా విశ్లేషించి, పంటలకు తగిన ఎరువుల వినియోగంపై మార్గదర్శకాలు అందిస్తారని తెలిపారు. అధిక ఎరువుల వినియోగం వల్ల మట్టి సారం తగ్గుతున్న నేపథ్యంలో సరైన మట్టి పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఖర్చులు తగ్గించుకోవడంతోపాటు దిగుబడులు పెంచుకోవచ్చని నిపుణులు వివరించారు.

అలాగే భూమికి అనుకూలమైన పంటల ఎంపిక, భూమి సంరక్షణకు అవసరమైన సూచనలు కూడా రైతులకు అందించబడతాయని చెప్పారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ పొలాల భూసారాన్ని పెంచుకోవాలని కోరారు.

మరిన్ని వివరాల కోసం కమ్యూనిటీ ఫెసిలిటేటర్ నక్క హరీష్ ను 8008768238 నంబర్ లో సంప్రదించాలని సూచించారు.

వైదిక గణితంలో ఉచిత శిక్షణ

 వైదిక గణితంలో ఉచిత శిక్షణ.. మరియు ఫ్రీ సమ్మర్ క్యాంప్..



కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ లో గల శ్లోక పాఠశాల బ్రాంచి 2 లో ఉచిత వైదిక గణిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పాఠశాల సీఈఓ జాలిగామ శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఉదయం 10 గంటలనుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కార్యక్రమం జరగనుంది అన్నారు. 9 నుండి 16 ఏళ్లలోపు పిల్లలకు మాత్రమే అవకాశం ఉందని తెలిపారు .శిబిరాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.



సంస్థాన్ నారాయణపూర్ లో ఉచిత శిక్షణ

 సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు యోగ, టైక్వాండో ,వాలీబాల్ వంటి క్రీడలలో ఉచిత శిక్షణ అందిస్తున్నారు. విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవడానికి చక్కని అవకాశం లభిస్తుంది. యోగ వలన విద్యార్థులకు ఆరోగ్యం ఏకాగ్రత పెరుగుతాయని ,టైక్వాండో శిక్షణ ద్వారా తమ ఆత్మ రక్షణ లభిస్తుందని నిర్వాహకులు తెలుపుతున్నారు. 

శిక్షణ సమయం.. 

ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు.. మరల సాయంత్రం 5:00 నుండి 6 గంటల వరకు శిక్షణ ఇస్తున్నారు. ఉదయం 6 గంటలకు వ్యాయామంలో మెలకువలు నేర్పి యోగాలో శిక్షణ ఇస్తున్నారు. అనంతరం వాలీబాల్ శిక్షణ ఇస్తున్నారు .సాయంత్రం అరగంట పాటు టైక్వాండో ద్వారా ఆత్మ రక్షణలో మెలకువలు నేర్పి, అరగంట పాటు పెద్దలపట్ల నడుచుకోవాల్సిన పద్ధతులను, స్ఫూర్తి దాతల జీవిత విశేషాలను బోధిస్తున్నారు..

పౌష్టికాహారం.. 

శిక్షణ సమయంలో ప్రతిరోజు ఒక కోడిగుడ్డు, ఒక అరటి పండును అందజేస్తున్నారు. ప్రతిరోజు తీసుకోవలసిన ఆహారం గురించి చక్కని అవగాహన కల్పిస్తున్నారు. 

నాలుగు సంవత్సరాలుగా శిక్షణ..

 జిల్లా యువజన క్రీడా శాఖ, సంస్థాన్ నారాయణపూర్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ తరగతులను నాలుగు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. బాలగోని యాదయ్య సలహాతో స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు చిలువేరు సైదులు ఉచిత  శిక్షణ మొదలుపెట్టారు. గ్రామానికి చెందిన శికిల మెట్ల ప్రభాకర్, శ్రవణ్ ,బత్తుల మురళి, ధనుష్, యశ్వంత్ రవి ,సురేష్ సహకారంతో శిక్షణ కొనసాగుతుంది. విద్యార్థులకు గుర్రం కృష్ణ ,మల్లేష్ ,భరత్ అనే మాస్టర్లు టైక్వాండోలో శిక్షణ ఇస్తున్నారు. 

గత నాలుగు సంవత్సరాలుగా విద్యార్థులకు వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నాము వేసవి సెలవులలో విద్యార్థులు సెల్ఫోన్లకు బానిసలు కాకుండా ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఆలోచనతో యోగా వాలీబాల్ ఆత్మ రక్షణ కోసం టైక్వాండోస్ శిక్షణ ఇస్తున్నాము పెద్దల పట్ల సమాజం పట్ల నడుచుకోవాల్సిన పద్ధతులను తెలియజేస్తున్నాము భవిష్యత్తులో గొప్ప క్రీడాకారులు నారాయణపురం నుండి తయారు కావాలన్నదే లక్ష్యం అని స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు శ్రీ చిలువేరు సైదులు అన్నారు.

Wednesday, 6 May 2026

వేసవిలో క్రీడా శిబిరాలు

 వేసవి సెలవులలో విద్యార్థులు సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రభుత్వం ఏటా వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా మే నుంచి వివిధ క్రీడలలో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు జిల్లా యువజన క్రీడల శాఖ సిద్ధమైంది. ఇందుకోసం ఆయా మండలాలలో క్రీడలలో నైపుణ్యం కలిగిన వారిని శిక్షకులుగా నియమించింది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 10 క్యాంపులు రూరల్ ప్రాంతాలలో, 10 క్యాంపులు అర్బన్ ప్రాంతాలలో నిర్వహిస్తున్నారు. ఇందులో సుమా రు 20 రకాల క్రీడలు నిర్వహించుకునే వీలు ఉండగా ఒక్కో క్రీడా నిర్వహణ కోసం ప్రభుత్వం రూరల్ ప్రాంతాలలో 5000 అర్బన్ ప్రాంతాలలో 7500 చొప్పున శిక్షకులకు ఇవ్వనున్నది. మే ఒకటి నుంచి జూన్ 7 వరకు ఈ శిబిరాలను వహించండి నిర్వహించనున్నారు. 

అర్బన్ లో నిర్వహించే క్రీడలకు మాత్రమే ఫీజు.. రూరల్ ప్రాంతంలో ఉచితం..

 అర్బన్ ప్రాంతాలలో క్రీడాకారుల నుంచి ఒక్కో క్రీడకు ఒక్కో రకమైన ఫీజు  చెల్లించాల్సి ఉంది. అదే రూరల్ ప్రాంతంలో క్రీడలకు ఎలాంటి ఫీజు లేకుండానే ఉచితంగా పాల్గొనే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. పని క్రీడలలో అతనిటిక్స్ క్రీడాకారుడు 400 రూపాయలు చొప్పున బాస్కెట్బాల్కు 400 రూపాయలు బ్యాడ్మింటన్ కు వెయ్యి రూపాయలు క్రికెట్ 700 టేబుల్ టెన్నిస్ 700, స్కేటింగ్ స్విమ్మింగ్ టెన్నిస్ కు ఎనిమిది వందల రూపాయల చొప్పున ఫీజు నిర్ణయించారు..

రూరల్ ప్రాంతాలలోని శిబిరాలకు వారికి ఉచితంగా శిక్షణ ఇస్తారు.

Monday, 4 May 2026

ఉచిత డిజిటల్ సహకార కోర్సులు

 తెలుగు తో సహా 8 భాషలలో సహకార డిజిటల్ వీడియో కోర్సులు.160 కి పైగా కోర్సులను అందుబాటులోకి తెచ్చిన కేంద్ర సహకార శాఖ..

సహకార రంగానికి సంబంధించి 160 కి పైగా ఆన్లైన్ డిజిటల్ కోర్సులను తెలుగు సహా 8భాషలలో ఉచితంగా కేంద్ర సహకార శాఖ ఆఫర్ చేస్తోంది. రైతులు, ఎగుమతి దారులు,విద్యార్థులకు ఉపయోగపడేలా ఏ ఐ తోడ్పాటుతో ఈ కోర్సులను రూపొందించారు.ఇందుకోసం ప్రత్యేకంగా  savidya.coop పేరిట ఒక వెబ్ సైట్ అందుబాటులోకి వచ్చింది.

సవిద్య అంటే సహకార విద్యాలయం .ఇది దేశంలోనే మొట్ట మొదటి డిజిటల్ సహకార విద్యా వేదిక. రైతులు,విద్యార్థులు, ఎగుమతి దారుల్లో సహకార విజ్ఞానాన్ని పెంపొందించడానికి ఉద్దేశించిన వేదిక ఇది. సహకార మంత్రిత్వ శాఖ  ' సహకార్ సే సమృద్ధి ' చొరవలో భాగంగా ప్రారంభించిన ఈ వేదిక సహకార రంగంలో నిపుణుల నేతృత్వంలో ఉచిత శిక్షణ ను అందిస్తుంది.

వ్యవసాయ పద్ధతులు ,ఎగుమతి వ్యూహాలు వంటి ముఖ్యమైన అంశాలను కవర్ చేసే 160 కి పైగా  ఉచిత వీడియో కోర్సులు . తెలుగు సహా ఎనిమిది భారతీయ భాషలలో గ్రామీణులకు కూడా అందుబాటులో ఉండేలా ఈ కోర్సులను రూపొందించారు. కృత్రిమ మేధ ఆధారిత  ఫీచర్లను  ఉపయోగించి కంటెంట్ ను వ్యక్తిగతికరిస్తుంది. లక్షలాది వినియోగదారులకు మరింత సమర్థవంతంగా ఙ్ఞానాన్ని అందించేందుకు ఏ ఐ వాడినట్లు కేంద్ర సహకార శాఖ తెలిపింది. వినియోగదారులు తమ మొబైల్ పరికరాల ద్వారా ఎప్పుడైనా ఎక్కడైనా ఈ వీడియో కోర్సులు చదువుకోవడానికి వీలుంది. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను నేర్చుకోవడానికి ,పంట దిగుబడిని మెరుగుపరచు కోవడానికి ఇందులో కోర్సులు ఉన్నాయి.  విద్యార్థులు సహకార రంగంలో వృత్తి, పరిశోధనా అవకాశాలను అన్వేషించడానికి ఉపయోగపడే కోర్సులు ఉన్నాయి. అంతేకాదు ఎగుమతి దారులు ప్రపంచ మార్కెట్ అవసరాలు , అంతర్జాతీయ వాణిజంపై అవగాహన పొందడానికి అవసరమైన  కోర్సులను సైతం ఇందులో పొందుపరచడం విశేషం.

నేషనల్ కో-ఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ , క్రిబ్కో వంటి సహకార సంస్థలు సహకార విద్య ప్లాట్ ఫామ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా దాదాపు 17 వేల సహకార సంఘాలను రెండు కోట్ల మందికి పైగా రైతులకు అనుసంధానం చేయడమే దీని లక్ష్యం.

మీరు savidya.coop లో నేరుగా కోర్సులను ఎంపిక చేసుకుని , సులువుగా, ఉచితంగా నేర్చుకోవడం ప్రారంభించవచ్చు.

ఉచిత అంబలి పంపిణీ @కోనాపూర్, బాన్సువాడ

 బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత అంబలి కేంద్రం, చలివేంద్రాన్ని గ్రామస్తులు,బాటసారులు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజేశ్వర్ గౌడ్ తెలిపారు.సోమవారం ఆయన గ్రామంలో ఉప సర్పంచ్ బంజ భూషణం, పంచాయతీ కార్యదర్శి భరత్ లతో కలిసి అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు. మాజీ ఎంపీటీసీ జెట్టి హన్మండ్లు , గ్రామ యువకులు పాల్గొన్నారు..

ఉచిత న్యాయము.. భారత దేశంలో ఇలా

 భారతదేశంలో ఉచిత న్యాయ సహాయము ఇలా పొందవచ్చు..

ఉచిత న్యాయము.. ఉచిత న్యాయం అనేది ప్రజల హక్కు. దీనికొరకై లీగల్ సర్వీసెస్ అథారిటీ సేవలు వినియోగించుకోవాలి .బాధితులు న్యాయస్థానాలను ఇప్పుడు ఆశ్రయించడం చాలా సులభతరం .న్యాయ సహాయమే కాదు ,పరిహారం పంపిణీ సేవలు కూడా పొందవచ్చు. లోక్ అదాలతల నిర్వహణలో నంబర్ వన్ గా టి ఎస్ ఎల్ ఎస్ ఏ. బంధాలు తెగిపోకుండా మధ్యవర్తిత్వంతో సమస్య పరిష్కారము. 

ఉచితంగా న్యాయ సహాయం పొందడం అనేది ప్రజల రాజ్యాంగబద్ధమైన హక్కు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఇదే చెబుతోంది .కోర్టు పేరు చెబితే చదువుకున్న వారు, ఆర్థికంగా కొద్దో గొప్ప ఉన్నవారు కూడా హడలిపోతారు. కోర్టుల పోరాటం అంటే ఖరీదైన వ్యవహారమే. మరి నిరుపేదలు నిస్సహాయులు అభాగ్యులు అనాధలు ఏం చేయాలి? ఎలా న్యాయం పొందాలి దీనికోసం ఉద్భవించినవి లీగల్ సర్వీసెస్ అథారిటీలు వివక్ష లేకుండా న్యాయం అందరికీ సమానంగా అందాలనేది దీని మూల సూత్రము న్యాయవ్యవస్థను ఉపయోగించుకోవడానికి ఆర్థిక స్తోమత లేని వారికి అథారిటీ సహాయం అందిస్తుంది. పేదలకు ఉచిత న్యాయ సలహానే కాదు న్యాయవాదిని అందిస్తుంది అంతేకాదు పలు పథకాలు అందజేస్తుంది నవంబర్ 9వ తేదీన లీగల్ సర్వీసెస్ అథారిటీ డే గా జరుపుకుంటారు 

నేషనల్ అథారిటీ.. 

చట్టాల పైన అవగాహన లేమి తో అనగారిన, బలహీన వర్గాలకు సరైన న్యాయం అందడం లేదని సుప్రీంకోర్టు భావించింది. ఉచిత న్యాయ సేవలను అందించడానికి, వివాదాల సామరస్య పూర్వక పరిష్కారానికి లోక్ అదాలత్ ల నిర్వహణ కోసం 1987లో లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టం ప్రకారం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ /నల్సా ఏర్పాటు చేసింది నల్సా పాట్రన్ ఇన్ చీఫ్ గా భారత ప్రధాన న్యాయమూర్తి, ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా సుప్రీంకోర్టులో రెండో సీనియర్ న్యాయమూర్తి వ్యవహరిస్తారు.

రాష్ట్ర అథారిటీ ..

ప్రతి రాష్ట్రంలో నల్సా విధానాలు, ఆదేశాలను అమలు చేయడానికి, ప్రజలకు ఉచిత న్యాయ సేవలు అందించడానికి ,లోక్ అదాలతులను నిర్వహించడానికి రాష్ట్ర న్యాయ సేవల అథారిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీకి పాట్రన్ ఇన్ చీఫ్ గా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా, హైకోర్టులో రెండో సీనియర్ న్యాయమూర్తి వ్యవహరిస్తారు. జిల్లా న్యాయ సేవల అథారిటీకి జిల్లా న్యాయమూర్తి అధ్యక్షత వహిస్తారు.

ఉచిత సేవలు ఎవరికి అంటే..

ఎస్సీ, ఎస్టీలు, మానవ అక్రమ రవాణా బాధితులు, మహిళా లేదా చిన్నారులు, మానసిక రోగులు ,దివ్యాంగులు ,ప్రకృతి విపత్తులు, జాతి హింస, కుల హింస, వరదలు, కరువు ,భూకంపాలు, పారిశ్రామిక విపత్తులు లాంటి వాటిలో అనుకోని పరిస్థితుల్లో బాధితులు, పరిశ్రమలలో కార్మికులు, బాల నేరస్తులు ,మానవ అక్రమ రవాణా బాధితులుగా పోలీసు కస్టడీలో ఉన్నవారు.. వీరందరూ ఉచిత న్యాయ సేవలు పొందడానికి అర్హులు.

అథారిటీ ఏం చేస్తుంది అంటే..

ఉచిత న్యాయ సహాయం ,లోక్ అదాలత్ నిర్వహణ, నల్సా పథకాల అమలు, బాధితులకు పరిహారం అందజేత, మీడియేషన్, ఉచితంగా న్యాయవాది ఏర్పాటు .


నల్సా కార్యాలయ అడ్రస్..


నల్సా ,భారత సుప్రీంకోర్టు, తిలక్ మార్క్,

 న్యూఢిల్లీ 1100 01 ,

హెల్ప్ లైన్ నెంబర్ 15100.


సిటిజన్ల కోసం..  

నల్సా కేంద్రం.. జై సల్మేర్ హౌస్, 26 మాన్సింగ్  రోడ్, న్యూఢిల్లీ 1100 11.

రాష్ట్ర అథారిటీ పరిధిలోని మొత్తం ప్యానెల్ లాయర్లు.. 252 ,

వీరిలో పురుషులు ..157 ,మహిళలు.. 75

 వీరి కాల పరిమితి మూడేళ్లు.

ప్రజాసేవకే అథారిటీ.. కక్షిదారులకు ఉచిత న్యాయ సహాయం, న్యాయ సలహాలతో పాటు మధ్యవర్తిత్వం ద్వారా అథారిటీ పరిష్కారం చూపిస్తుంది. నల్సా ద్వారా టీజీఎల్ఎస్ ఏ  అందించే ఈ సేవలు, పథకాలను అర్హులైన ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. ప్రజల చెంతకే పలు పథకాలు చేరేలా వలంటీర్లు మీ వద్దకే వస్తున్నారు. మధ్యవర్తిత్వంతో న్యాయం సత్వరం దక్కుతుంది. ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ సేవలను తెలుసుకొని సహాయం పొందవచ్చు .మీకోసమే అథారిటీ అన్నది గుర్తుంచుకోండి.

మరిన్ని వివరాలకు tslsa.telangana.gov.in  వెబ్ సైట్  సందర్శించవచ్చు.

Sunday, 3 May 2026

ఉచితంగా తిరుపతి లడ్డూలు @ హైద్రాబాద్ లో

 


హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉచితంగా తిరుపతి లడ్డూల పంపిణీ..


హైద్రాబాద్ లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో గల టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 6 వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి.



 ఈ సందర్భంగా భక్తులకు ప్రతి ఒక్కరికి ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉచితంగా 2 తిరుపతి లడ్డూలు ఇస్తున్నారు.


ఉచిత కంప్యూటర్ శిక్షణ @బోర్లం

 కామారెడ్డి జిల్లా, బాన్సువాడ మండలం లోని బోర్లం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మన్నె అనిల్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ శిక్షణ తరగతులను శని వారం బాన్సువాడ సీఐ శ్రీధర్ ప్రారంభించారు.40 రోజుల పాటు ఉచిత శిక్షణ అందించడం అభినందనీయమన్నారు. 

గ్రామంలోని గ్రంథాలయంలో సుమారు 80 నుండి 100 మంది వరకు ఉచితంగా కంప్యూటర్ ట్రైనింగ్ మన్నె అనిల్ ఆధ్వర్యంలో పొందుతున్నారు. ఉదయం సాయంత్రం బ్యాచుల వారీగా ఉచిత శిక్షణ పొందుతున్నారు. పట్టణాలలో వేలాది రూపాయలు వెచ్చించి పొందే శిక్షణను ఇచ్చట పేదలకు ,వేసవి సెలవుల నేపథ్యంలో ఉచితంగా ఇవ్వడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

ఈ ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో మన్నే అనిల్ ట్రైనర్ గా కంప్యూటర్ బేసిక్స్ ఎమ్మెస్ ఆఫీస్ ఇంటర్నెట్ బ్రౌజింగ్ ఫోటోషాప్ టైపు రైటింగ్ తదితర కంప్యూటర్ స్కిల్స్ 

 ట్రైనింగ్ ఇస్తున్నారు.


ఈ కార్యక్రమంలో సర్పంచ్ మన్నె రమేశ్,నాయకులు శ్రీనివాస్ రెడ్డి,నర్సింలు,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Saturday, 2 May 2026

వాలీబాల్ శిక్షణ శిబిరం ప్రారంభం

 గాంధారి మండలంలోని పెట్ సంఘం ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వేసవి వాలీబాల్ క్రీడా శిక్షణ శిబిరం శుక్రవారం ప్రారంభించినట్లు వాలీబాల్ కోచ్, వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు. సీనియర్ వాలీబాల్ క్రీడాకారిణ, ఎన్ ఎస్ ఎన్ ఐ ఎస్ వాలీబాల్ కోచ్ సోనియా సమక్షంలో శిబిరం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులతో పాటు, ఆసక్తి గలవారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు అంతర్జాలంలో 100 రూపాయలతో దరఖాస్తు చేసుకొని శిక్షణ పొందవచ్చని ఆమె తెలిపారు .శిబిరానికి బామన్ నాయక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ తరఫున నెదర్లాండ్ కు చెందిన" లెట్స్ కీప్ ది బాల్ ప్లేయింగ్ ఫౌండేషన్ "వారు చేయూతనిస్తున్నారని పేర్కొన్నారు.



ఉచిత ఫౌండేషన్ కోర్సును సద్వినియోగం చేసుకోండి

 తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచితంగా అందిస్తున్న ఫౌండేషన్ కోర్సును సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాందేడ్ వాడలో గల షెడ్యూల్డ్ కులాల వసతి గృహంలో ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత ఫౌండేషన్ కోర్సును కలెక్టర్ ఇలా త్రిపాటి శుక్రవారం ప్రారంభించారు ఇప్పటివరకు పది బ్యాచ్లలో 800 మందికి శిక్షణ అందించగా వారిలో 199 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని , ఎస్సీ స్టడీ సర్కిల్ నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఎస్సీ ఎస్టీలు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని గుర్తు చేశారు వారి విద్యాభివృద్ధికి కూడా ఎనలేని ప్రాధాన్యతనస్తూ పోటీ పరీక్షలలో ప్రతిభను కనబరిచి ఉద్యోగ అవకాశాలు పొందేలా స్టడీ సర్కిల్స్ ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు సమకూరుస్తూ ఉచితంగా శిక్షణ అందిస్తుందని తెలిపారు. అంతకుముందు కలెక్టర్ వసతి గృహంలోని గదులు కిచెన్ తదితర వాటిని సందర్శించి భోజన వసతి సదుపాయాలు పరిశీలించారు ఏవైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తేవాలని సూచించారు శిక్షణ పొందుతున్న అభ్యర్థుల కోసం పోటీ పరీక్షలకు ఉపయోగపడే అన్ని రకాల బుక్స్ అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రజిత సహాయ అధికారి రాజా గంగారాం స్టడీ సర్కిల్ డైరెక్టర్ దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు. 



జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

 ప్రజా పలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నిర్వహించనున్న జాబ్ మేళా పోస్టర్ను కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారు శుక్రవారం మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఆవిష్కరించారు. ఇంటర్మీడియట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు విద్యార్హత కలిగిన యువతకు మార్కెటింగ్ ఫైనాన్స్ బ్యాంకింగ్ హెల్త్ కేర్ ఐటి బిజినెస్ సర్వీసెస్ కస్టమర్ సర్వీసెస్ హాస్పిటల్ డిజిటల్ మీడియా లాజిస్టిక్స్ తదితర రంగాలలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా యువజన క్రీడల శాఖ ఇండస్ట్రీస్ కామర్స్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖల ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహించబడుతుంది. ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలకు చెందిన యువత కోసం ఏడవ తేదీన నిజామాబాద్ పట్టణంలోని శ్రీరామ గార్డెన్స్ ఆర్మూర్ రోడ్ ల జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. 50 కి పైగా కంపెనీలు ఈ మేళాలో పాల్గొని వివిధ ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి ఈ సందర్భంగా జిల్లాలో నిరుద్యోగ యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు ఆసక్తిగల అభ్యర్థులు వెబ్సైట్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని తెలిపారు స్థల వివరాలకు జిల్లా యువజన క్రీడల అధికారి కామారెడ్డి జిల్లా కార్యాలయాన్ని లేదా 9440846682 మరియు 9618126053  నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. అనంతరం జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, ఆర్డిఓ గిరి, జిల్లా అధికారులు, జిల్లా యువజన క్రీడల అధికారి రంగ వెంకటేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.

ఉచిత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి

 ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లు భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విభాగాలలో ప్రత్యేక కార్యాచరణ తీసుకొని ముందుకు పోతుంది .అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ ఆరు రోజుల పాటు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. మే 18 వ తేదీ నుండి 23వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నది. 18న మారథాన్ ఫిజికల్ లిటరసీ, 19న కెరీర్ స్కిల్ డే ,20న యూత్ లీడర్ షిప్ సబ్మిట్, 21న స్పోర్ట్స్ డే, 22న యూత్ ఫర్ క్లీన్ తెలంగాణ సర్వ్ అండ్ సపోర్ట్ , 23న ఉద్యోగ సాధన కార్యక్రమాలను చేయాలని నిర్ణయించింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిట శ్రీహరి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుదెల శ్రీధర్ బాబుల పర్యవేక్షణ లోనిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాలలో క్రీడలు యువజన శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళాలు నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలు మే ఒకటి నుంచి మీ 12 వరకు జరగనున్నాయి. 

20వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యము..

మే ఒకటి న మహబూబ్నగర్, 2న నల్గొండ, 4న ఖమ్మం, ఐదున కరీంనగర్ ,ఆరు న పెద్దపల్లి ,ఆదిలాబాద్, 7న నిజామాబాద్ ,ఎనిమిదిన సంగారెడ్డి, వరంగల్, 11న రంగారెడ్డి ,12న హైదరాబాద్ జిల్లాలలో జాబ్ మేళాలు నిర్వహిస్తారు.

తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాలలో నిర్వహించబోయే ఈ జాబ్ మేళాలు 250 క పైగా కంపెనీలు 20వేల మందికి పైగా యువతకు ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా నిర్వహించబోతున్నారు. జాబ్ మేళాకు వచ్చేవారు ఇంటర్ డిప్లమా గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత ఉండి అనుభవం ఉన్నవారు అదే వధంగా కొత్తవారు కూడా తమ ప్రతిభకు అనుగుణంగా ఉద్యోగాలను ఎంచుకోవచ్చు. జాబ్ మేళాకు వచ్చేవారు రిజిస్టర్ చేసుకునేందుకు ప్రత్యేక మొబైల్ యాప్ను ప్రత్యేక వెబ పోర్టల్ ను క్రీడలు యువజన సర్వీసుల శాఖ రూపొందించింది. ఈ జాబ్ మేళాకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు జిల్లాల క్రీడా శాఖ అధికారులు యువజన శాఖ అధికారులను సంప్రదించవచ్చు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99వ యాక్షన్ ప్లాన్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది ఈ కార్యక్రమం విజయవంతం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు శ్రీ బండారు జితేందర్, పిఆర్వో  రాష్ట్ర క్రీడలు మరియు యువజన సర్వీసుల మంత్రిత్వ శాఖ.

నెల రోజుల పాటు అన్నదానం

 ఎడపల్లి మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో వేసవికాలం దృష్ట్యా ఈ నెల రోజులు అన్నదాన కార్యక్రమాన్ని ప్రతిరోజు జరపాలని నిర్ణయించారు. అన్నదాన కార్యక్రమాన్ని ఎడపల్లి గ్రామ సర్పంచ్ కందగట్ల రామచందర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు వీరమని భక్తులు తదితరులు ఉన్నారు.

ఎడపల్లి పరిసర ప్రాంత ప్రజలు భక్తులు ఈ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకోగలరని కోరారు.

ఫ్రీ కన్సల్టేషన్ @ కామారెడ్డి

 


కామారెడ్డి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మే 2, 3, 4 తేదీలలో శనివారం ఆదివారం సోమవారం రోజున కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో కల కీర్తి హాస్పిటల్ నందు రోగులకు ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా చూడబడును.

 మూడు రోజుల పాటు ఫ్రీ కన్సల్టేషన్ కలదు.కావున రోగులు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎదురుగా నిజాంసాగర్ చౌరస్తానందుకల కీర్తి హాస్పిటల్ ,జనరల్, సర్జికల్ ,డెంటల్, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ హాస్పిటల్ లో సంప్రదించి ఉచితంగా సేవలు పొందవచ్చు. ఫోన్ నెంబర్ 08468469989 , సెల్ నెంబర్ 9392242750 నందు పూర్తి వివరాలకు సంప్రదించవచ్చు.


రక్త పరీక్షలు మరియు ఈసీజీ టెస్ట్ ల పై 50% తగ్గింపు కలదు.


Friday, 1 May 2026

ఉచిత ఆర్చరీ శిక్షణ @9848919480

 నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో గల రాజారాం స్టేడియం లో రేపటి నుండి ఖేలో ఇండియా ఉచిత విలువిద్య శిక్షణా శిబిరం ప్రారంభం కానున్నదని విలువిద్య శిక్షకుడు మద్దుల మురళి తెలిపారు.

మే 2 వ తేదీ నుండి " ఉచిత వేసవి విలువిద్య శిక్షణా శిబిరం  "ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు ఖేలో ఇండియా ఆర్చరీ ట్రైనింగ్ సెంటర్ లో ఉచితంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని , వేసవిలో విద్యార్థులకు ఒక మంచి సువర్ణ అవకాశమని ,చదువులో ఆటలు కూడా భాగమేనని , శారీరక, మానసిక ఉల్లాసానికి ఒక మంచి వ్యాయామమని అన్నారు.

విద్యార్థుల తల్లి దండ్రులు పిల్లలకు దీనిపైన అవగాహన కల్పించి , పిల్లలను క్రీడలలో పాల్గొనే అవకాశం కల్పించి వారి ఉన్నతికి బాటలు వేయాలని కోరారు. ఈ స్టేడియంలో విద్యార్థులు అందరూ ముందు వరుసలో ఉండి ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, విలువిద్య క్రీడాకారులు https://satgasc.telangana.gov.in లింక్ ద్వారా ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అంతర్జాతీయ విలు విద్య క్రీడాకారుడు మద్దుల మురళి ఒక ప్రకటన లో తెలిపారు.

మరిన్ని వివరాలకు మద్దుల మురళి 98489 19480 ఫోన్ నంబర్ లో సంప్రదించాలని సూచించారు.

ఆటోలో ఉచిత ప్రయాణం..

 మండే ఎండలలో ఆటో ఎక్కే ప్రయాణికులను ఎండ నుండి రక్షించేందుకు ఒక డ్రైవర్ వినూత్నంగా ఆలోచించాడు. మహబూబాబాద్ జిల్లా ఈదుల పూసల పల్లికి చెందిన భూక్య హంజ్యా /ఆటో అంజి తన ఆటో చుట్టూ గ్రీన్ మ్యాట్, పైన వివిధ రకాల మొక్కలు ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా ఆటో లోపల రెండు చిన్న ఫ్యాన్లు అమర్చడంతో పాటు ప్రయాణికుల కోసం కూల్ వాటర్ సౌకర్యాన్ని సైతం కల్పించాడు .

అలాగే దివ్యాంగులు, గర్భిణులకు తన ఆటోలో " ఉచిత ప్రయాణం " కల్పిస్తున్నాడు. దీనితో ఆటో అంజిని పలువురు అభినందిస్తున్నారు.