Sunday, 3 May 2026

ఉచిత కంప్యూటర్ శిక్షణ

 కామారెడ్డి జిల్లా, బాన్సువాడ మండలం లోని బోర్లం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మన్నె అనిల్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ శిక్షణ తరగతులను శని వారం బాన్సువాడ సీఐ శ్రీధర్ ప్రారంభించారు.40 రోజుల పాటు ఉచిత శిక్షణ అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మన్నె రమేశ్,నాయకులు శ్రీనివాస్ రెడ్డి,నర్సింలు,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Saturday, 2 May 2026

వాలీబాల్ శిక్షణ శిబిరం ప్రారంభం

 గాంధారి మండలంలోని పెట్ సంఘం ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వేసవి వాలీబాల్ క్రీడా శిక్షణ శిబిరం శుక్రవారం ప్రారంభించినట్లు వాలీబాల్ కోచ్, వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు. సీనియర్ వాలీబాల్ క్రీడాకారిణ, ఎన్ ఎస్ ఎన్ ఐ ఎస్ వాలీబాల్ కోచ్ సోనియా సమక్షంలో శిబిరం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులతో పాటు, ఆసక్తి గలవారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు అంతర్జాలంలో 100 రూపాయలతో దరఖాస్తు చేసుకొని శిక్షణ పొందవచ్చని ఆమె తెలిపారు .శిబిరానికి బామన్ నాయక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ తరఫున నెదర్లాండ్ కు చెందిన" లెట్స్ కీప్ ది బాల్ ప్లేయింగ్ ఫౌండేషన్ "వారు చేయూతనిస్తున్నారని పేర్కొన్నారు.



ఉచిత ఫౌండేషన్ కోర్సును సద్వినియోగం చేసుకోండి

 తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచితంగా అందిస్తున్న ఫౌండేషన్ కోర్సును సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాందేడ్ వాడలో గల షెడ్యూల్డ్ కులాల వసతి గృహంలో ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత ఫౌండేషన్ కోర్సును కలెక్టర్ ఇలా త్రిపాటి శుక్రవారం ప్రారంభించారు ఇప్పటివరకు పది బ్యాచ్లలో 800 మందికి శిక్షణ అందించగా వారిలో 199 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని , ఎస్సీ స్టడీ సర్కిల్ నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఎస్సీ ఎస్టీలు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని గుర్తు చేశారు వారి విద్యాభివృద్ధికి కూడా ఎనలేని ప్రాధాన్యతనస్తూ పోటీ పరీక్షలలో ప్రతిభను కనబరిచి ఉద్యోగ అవకాశాలు పొందేలా స్టడీ సర్కిల్స్ ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు సమకూరుస్తూ ఉచితంగా శిక్షణ అందిస్తుందని తెలిపారు. అంతకుముందు కలెక్టర్ వసతి గృహంలోని గదులు కిచెన్ తదితర వాటిని సందర్శించి భోజన వసతి సదుపాయాలు పరిశీలించారు ఏవైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తేవాలని సూచించారు శిక్షణ పొందుతున్న అభ్యర్థుల కోసం పోటీ పరీక్షలకు ఉపయోగపడే అన్ని రకాల బుక్స్ అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రజిత సహాయ అధికారి రాజా గంగారాం స్టడీ సర్కిల్ డైరెక్టర్ దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు. 



జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

 ప్రజా పలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నిర్వహించనున్న జాబ్ మేళా పోస్టర్ను కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారు శుక్రవారం మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఆవిష్కరించారు. ఇంటర్మీడియట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు విద్యార్హత కలిగిన యువతకు మార్కెటింగ్ ఫైనాన్స్ బ్యాంకింగ్ హెల్త్ కేర్ ఐటి బిజినెస్ సర్వీసెస్ కస్టమర్ సర్వీసెస్ హాస్పిటల్ డిజిటల్ మీడియా లాజిస్టిక్స్ తదితర రంగాలలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా యువజన క్రీడల శాఖ ఇండస్ట్రీస్ కామర్స్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖల ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహించబడుతుంది. ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలకు చెందిన యువత కోసం ఏడవ తేదీన నిజామాబాద్ పట్టణంలోని శ్రీరామ గార్డెన్స్ ఆర్మూర్ రోడ్ ల జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. 50 కి పైగా కంపెనీలు ఈ మేళాలో పాల్గొని వివిధ ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి ఈ సందర్భంగా జిల్లాలో నిరుద్యోగ యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు ఆసక్తిగల అభ్యర్థులు వెబ్సైట్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని తెలిపారు స్థల వివరాలకు జిల్లా యువజన క్రీడల అధికారి కామారెడ్డి జిల్లా కార్యాలయాన్ని లేదా 9440846682 మరియు 9618126053  నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. అనంతరం జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, ఆర్డిఓ గిరి, జిల్లా అధికారులు, జిల్లా యువజన క్రీడల అధికారి రంగ వెంకటేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.

ఉచిత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి

 ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లు భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విభాగాలలో ప్రత్యేక కార్యాచరణ తీసుకొని ముందుకు పోతుంది .అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ ఆరు రోజుల పాటు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. మే 18 వ తేదీ నుండి 23వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నది. 18న మారథాన్ ఫిజికల్ లిటరసీ, 19న కెరీర్ స్కిల్ డే ,20న యూత్ లీడర్ షిప్ సబ్మిట్, 21న స్పోర్ట్స్ డే, 22న యూత్ ఫర్ క్లీన్ తెలంగాణ సర్వ్ అండ్ సపోర్ట్ , 23న ఉద్యోగ సాధన కార్యక్రమాలను చేయాలని నిర్ణయించింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిట శ్రీహరి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుదెల శ్రీధర్ బాబుల పర్యవేక్షణ లోనిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాలలో క్రీడలు యువజన శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళాలు నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలు మే ఒకటి నుంచి మీ 12 వరకు జరగనున్నాయి. 

20వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యము..

మే ఒకటి న మహబూబ్నగర్, 2న నల్గొండ, 4న ఖమ్మం, ఐదున కరీంనగర్ ,ఆరు న పెద్దపల్లి ,ఆదిలాబాద్, 7న నిజామాబాద్ ,ఎనిమిదిన సంగారెడ్డి, వరంగల్, 11న రంగారెడ్డి ,12న హైదరాబాద్ జిల్లాలలో జాబ్ మేళాలు నిర్వహిస్తారు.

తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాలలో నిర్వహించబోయే ఈ జాబ్ మేళాలు 250 క పైగా కంపెనీలు 20వేల మందికి పైగా యువతకు ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా నిర్వహించబోతున్నారు. జాబ్ మేళాకు వచ్చేవారు ఇంటర్ డిప్లమా గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత ఉండి అనుభవం ఉన్నవారు అదే వధంగా కొత్తవారు కూడా తమ ప్రతిభకు అనుగుణంగా ఉద్యోగాలను ఎంచుకోవచ్చు. జాబ్ మేళాకు వచ్చేవారు రిజిస్టర్ చేసుకునేందుకు ప్రత్యేక మొబైల్ యాప్ను ప్రత్యేక వెబ పోర్టల్ ను క్రీడలు యువజన సర్వీసుల శాఖ రూపొందించింది. ఈ జాబ్ మేళాకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు జిల్లాల క్రీడా శాఖ అధికారులు యువజన శాఖ అధికారులను సంప్రదించవచ్చు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99వ యాక్షన్ ప్లాన్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది ఈ కార్యక్రమం విజయవంతం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు శ్రీ బండారు జితేందర్, పిఆర్వో  రాష్ట్ర క్రీడలు మరియు యువజన సర్వీసుల మంత్రిత్వ శాఖ.

నెల రోజుల పాటు అన్నదానం

 ఎడపల్లి మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో వేసవికాలం దృష్ట్యా ఈ నెల రోజులు అన్నదాన కార్యక్రమాన్ని ప్రతిరోజు జరపాలని నిర్ణయించారు. అన్నదాన కార్యక్రమాన్ని ఎడపల్లి గ్రామ సర్పంచ్ కందగట్ల రామచందర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు వీరమని భక్తులు తదితరులు ఉన్నారు.

ఎడపల్లి పరిసర ప్రాంత ప్రజలు భక్తులు ఈ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకోగలరని కోరారు.

ఫ్రీ కన్సల్టేషన్ @ కామారెడ్డి

 


కామారెడ్డి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మే 2, 3, 4 తేదీలలో శనివారం ఆదివారం సోమవారం రోజున కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో కల కీర్తి హాస్పిటల్ నందు రోగులకు ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా చూడబడును.

 మూడు రోజుల పాటు ఫ్రీ కన్సల్టేషన్ కలదు.కావున రోగులు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎదురుగా నిజాంసాగర్ చౌరస్తానందుకల కీర్తి హాస్పిటల్ ,జనరల్, సర్జికల్ ,డెంటల్, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ హాస్పిటల్ లో సంప్రదించి ఉచితంగా సేవలు పొందవచ్చు. ఫోన్ నెంబర్ 08468469989 , సెల్ నెంబర్ 9392242750 నందు పూర్తి వివరాలకు సంప్రదించవచ్చు.


రక్త పరీక్షలు మరియు ఈసీజీ టెస్ట్ ల పై 50% తగ్గింపు కలదు.


Friday, 1 May 2026

ఉచిత ఆర్చరీ శిక్షణ @9848919480

 నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో గల రాజారాం స్టేడియం లో రేపటి నుండి ఖేలో ఇండియా ఉచిత విలువిద్య శిక్షణా శిబిరం ప్రారంభం కానున్నదని విలువిద్య శిక్షకుడు మద్దుల మురళి తెలిపారు.

మే 2 వ తేదీ నుండి " ఉచిత వేసవి విలువిద్య శిక్షణా శిబిరం  "ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు ఖేలో ఇండియా ఆర్చరీ ట్రైనింగ్ సెంటర్ లో ఉచితంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని , వేసవిలో విద్యార్థులకు ఒక మంచి సువర్ణ అవకాశమని ,చదువులో ఆటలు కూడా భాగమేనని , శారీరక, మానసిక ఉల్లాసానికి ఒక మంచి వ్యాయామమని అన్నారు.

విద్యార్థుల తల్లి దండ్రులు పిల్లలకు దీనిపైన అవగాహన కల్పించి , పిల్లలను క్రీడలలో పాల్గొనే అవకాశం కల్పించి వారి ఉన్నతికి బాటలు వేయాలని కోరారు. ఈ స్టేడియంలో విద్యార్థులు అందరూ ముందు వరుసలో ఉండి ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, విలువిద్య క్రీడాకారులు https://satgasc.telangana.gov.in లింక్ ద్వారా ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అంతర్జాతీయ విలు విద్య క్రీడాకారుడు మద్దుల మురళి ఒక ప్రకటన లో తెలిపారు.

మరిన్ని వివరాలకు మద్దుల మురళి 98489 19480 ఫోన్ నంబర్ లో సంప్రదించాలని సూచించారు.

ఆటోలో ఉచిత ప్రయాణం..

 మండే ఎండలలో ఆటో ఎక్కే ప్రయాణికులను ఎండ నుండి రక్షించేందుకు ఒక డ్రైవర్ వినూత్నంగా ఆలోచించాడు. మహబూబాబాద్ జిల్లా ఈదుల పూసల పల్లికి చెందిన భూక్య హంజ్యా /ఆటో అంజి తన ఆటో చుట్టూ గ్రీన్ మ్యాట్, పైన వివిధ రకాల మొక్కలు ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా ఆటో లోపల రెండు చిన్న ఫ్యాన్లు అమర్చడంతో పాటు ప్రయాణికుల కోసం కూల్ వాటర్ సౌకర్యాన్ని సైతం కల్పించాడు .

అలాగే దివ్యాంగులు, గర్భిణులకు తన ఆటోలో " ఉచిత ప్రయాణం " కల్పిస్తున్నాడు. దీనితో ఆటో అంజిని పలువురు అభినందిస్తున్నారు.