Tuesday, 28 April 2026

ఉచిత వీసాలకు ఇంటర్వ్యూ మేళ

 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో క్లీనింగ్ విభాగంలో విస్తృతమైన ఉపాధి కల్పిస్తున్న ఏడీఎన్ హెచ, మరియు జిటిఎం సంస్థలు మరొకసారి ఉచిత వీసాలు జారీ చేయడానికి విస్తృతమైన ఏర్పాటు చేస్తున్నాయి. ఇంటర్వ్యూలు నిర్వహించి ఉపాధికి అవసరమైన మీసాలను ఉచితంగా జారీ చేస్తారు.

ఇప్పటివరకు తెలంగాణ జిల్లాల వలస కార్మికుల వారికి అవకాశం కల్పించిన ఈ సంస్థలు ఇప్పుడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ యువత కూడా అవకాశం కల్పించడానికి నిర్వహించాయి.

ఏప్రిల్ 30 , మే ఒకటవ తేదీన ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఐదు చోట్ల ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి. మన భారతీయ కరెన్సీలో నెలకు 24 వేల రూపాయల జీతంతో పాటు ఉచిత భోజనం, ఉచిత వసతి కల్పిస్తాయి.

ఉచిత వేశారు కల్పి జారీ చేయడంతో పాటు ఎంపికైన వారిని యూఏఈ తరలించడానికి విమాన చార్జీలను కూడా ఈ సంస్థలే భరించనున్నాయి.

ఈ నెల 30న సిరిసిల్ల జగిత్యాల సికింద్రాబాద్ లలో, మే 1 న నిజామాబాద్ ఆర్మూర్లతో పాటు సికింద్రాబాద్లోని జిటిఏ సంస్థ కార్యాలయంలో ఇంటర్వ్యూలో నిర్వహించనున్నట్లు ఆ సంస్థ చైర్మన్ సతీష్ వెల్లడించారు. ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ కలిగిన అభ్యర్థులు బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చి ఉండాలి అన్నారు. 

ఇతర వివరాల కోసం జిటిఎం సంస్థ బ్రాంచీలైన 

సిరిసిల్ల..83320 17122 ,జగిత్యాల..83320 42299, ఆర్మూర్..83320 13999, నిజామాబాద్ .. 86868 60999, సికింద్రాబాద్..83320 52299 నంబర్ల లో సంప్రదించాలని సూచించారు.


విద్యార్థులకు పోలీసుల ఉచిత వేసవి శిక్షణ శిబిరం..

 నార్నూర్ మండలంలోని విద్యార్థుల కోసం పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా మే నాలుగవ తేదీ నుండి 30వ తేదీ వరకు వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు నార్నూర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఈ శిబిరం ఏర్పాటు చేశారు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు రెండు నుండి పదవ తరగతి విద్యార్థులకు యోగ కరాటే కబడ్డీ వాలీబాల్ అంశాలలో "  ఉచిత శిక్షణ " ఇస్తారు. 

ఆసక్తి గలవారు ఈనెల 30వ తేదీ లోపు నార్నూర్ పోలీస్ స్టేషన్లో పేర్లు నమోదు చేసుకోవాలి వివరాల కోసం 8712659942 లేదా 8712659961 నెంబర్లను సంప్రదించాలని ఎస్సై కోరారు.

ఉచిత మజ్జిగ కేంద్రం ప్రారంభం

 బోధన్ కోర్టు ప్రాంగణంలో సోమవారం న్యాయ సేవా సంస్థ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రము మరియు మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి కాంచన రెడ్డి ప్రథమ శ్రేణి జూనియర్ సివిల్ జడ్జి మార్కెల్ పూజిత అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి శివ సాయి బార్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.

కడుపారా పులిహోర ఉపశమనం ఇచ్చే అంబలి

 నిజామాబాద్ కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే వారికి దాతలు ఉచితంగా పులిహోర తాగునీరు అందజేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు అధికారులకు సమస్యలను చెప్పుకోవాలని వచ్చే వారికి సీనియర్ సిటిజన్స్ ఫోరం సభ్యులు గత పది సంవత్సరాలుగా పులిహోర అందిస్తూ ఆకలి తీర్చుతు న్నారు .తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ సభ్యులు 15 ఏళ్లుగా చల్లని నీరు అంబలి పంపిణీ చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. 

ప్రజావాణి కార్యక్రమానికి అర్జీలు సమర్పించేందుకు వచ్చే ప్రజల కోసం సీనియర్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ప్రారంభించి స్వయంగా ఉచిత పులిహోర పంపిణీ చేశారు. వేసవి ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రతి సోమవారం సుదూర ప్రాంతాల నుంచి ప్రజావాణికి వచ్చేవారికి సహాయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఇకపై నిరంతరంగా కొనసాగిస్తామని ఫోరం ప్రతినిధులు తెలిపారు. 

ఇక రాజస్థానీ వాకర్స్ గ్రూప్ సౌజన్యంతో చల్లటి తాగునీటిని కూడా అందజేశారు ఈ సేవా కార్యక్రమాన్ని అభినందించిన అదనపు కలెక్టర్ ఫోరం ప్రతినిధులు మరియు వాకర్స్ గ్రూపు సభ్యులను ప్రశంసించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ రెడ్డి ఏవో ప్రశాంత్ సీనియర్ సిటిజన్స్ ఫోరం వాకర్స్ గ్రూప్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



సహారా హెల్త్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

 మారుమూల తండాలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ముకుంద తాండా సర్పంచ్ ప్రకాష్ అన్నారు. 

సోమవారం ఆ తండాలో సహారా హెల్త్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం ప్రారంభించి మాట్లాడారు వైద్యం పట్టణ ప్రజలకు కాకుండా మారుమూల ప్రాంతంలోని తండాలలో నివసించే గిరిజనుల ఇంటింటికి వచ్చి వైద్యం అందించడం అభినందనీయం అన్నారు. 

గిరిజన ప్రాంతాలలో సిఎస్ఆర బాధ్యతతో ఆరోగ్యం పై అవగాహన కలిగించడం గొప్ప విషయం అన్నారు ఈ ప్రాజెక్టు ద్వారా 100 గిరిజన తండాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో సహారా హెల్త్ డెవలప్మెంట్ సొసైటీ ప్రతినిధులు సర్పంచ్ ప్రకాష్ లక్ష్మణ్ నాయక్ మహిపతి సర్దార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

శిక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోండి

 ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు టాస్క్సుం సి ఓ ఓ S .రాఘవేందర్ రెడ్డి మంగళవారం కల్వకుర్తి నియోజకవర్గం లో పలు కార్యక్రమాలలో హాజరు కానున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా ఉదయం 10 గంటల 30 నిమిషాలకు కల్వకుర్తి పట్టణంలోని గవర్నమెంట్ హై స్కూల్ బస్టాండ్ సమీపంలో నిరుద్యోగ యువత కోసం ఏర్పాటు చేసిన నాలుగవ సంకిరెడ్డి ఉచిత ఎస్సై కానిస్టేబుల్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించనున్నార.


Monday, 27 April 2026

బ్యాంకింగ్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

 బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే ఎస్సీ ఎస్టీ యువతకు ఐబీపీఎస్ పరీక్షలకు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు.

డిగ్రీలో మెరిట్ ఆధారంగా ఎస్టిలకు 75 , ఎస్ సీ లకు 15, బీసీ లకు 10 మంది చొప్పున మొత్తం 100 మంది ని ఎంపిక చేసి " ఉచిత శిక్షణ" ఇవ్వనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ తెలిపింది .

ఆసక్తి గల అభ్యర్థులు 28 వ తేదీ లోపు https:://study circle.cgg.gov.in 

వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని కోరారు.

వాలీబాల్ శిక్షణ శిబిరం ప్రారంభం

 గాంధారి మండలంలోని పెట్ సంఘం ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వేసవి వాలీబాల్ క్రీడా శిక్షణ శిబిరం శుక్రవారం ప్రారంభించినట్ల...