Saturday, 2 May 2026

నెల రోజుల పాటు అన్నదానం

 ఎడపల్లి మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో వేసవికాలం దృష్ట్యా ఈ నెల రోజులు అన్నదాన కార్యక్రమాన్ని ప్రతిరోజు జరపాలని నిర్ణయించారు. అన్నదాన కార్యక్రమాన్ని ఎడపల్లి గ్రామ సర్పంచ్ కందగట్ల రామచందర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు వీరమని భక్తులు తదితరులు ఉన్నారు.

ఎడపల్లి పరిసర ప్రాంత ప్రజలు భక్తులు ఈ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకోగలరని కోరారు.

ఫ్రీ కన్సల్టేషన్ @ కామారెడ్డి

 


కామారెడ్డి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మే 2, 3, 4 తేదీలలో శనివారం ఆదివారం సోమవారం రోజున కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో కల కీర్తి హాస్పిటల్ నందు రోగులకు ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా చూడబడును.

 మూడు రోజుల పాటు ఫ్రీ కన్సల్టేషన్ కలదు.కావున రోగులు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎదురుగా నిజాంసాగర్ చౌరస్తానందుకల కీర్తి హాస్పిటల్ ,జనరల్, సర్జికల్ ,డెంటల్, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ హాస్పిటల్ లో సంప్రదించి ఉచితంగా సేవలు పొందవచ్చు. ఫోన్ నెంబర్ 08468469989 , సెల్ నెంబర్ 9392242750 నందు పూర్తి వివరాలకు సంప్రదించవచ్చు.


రక్త పరీక్షలు మరియు ఈసీజీ టెస్ట్ ల పై 50% తగ్గింపు కలదు.


Friday, 1 May 2026

ఉచిత ఆర్చరీ శిక్షణ @9848919480

 నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో గల రాజారాం స్టేడియం లో రేపటి నుండి ఖేలో ఇండియా ఉచిత విలువిద్య శిక్షణా శిబిరం ప్రారంభం కానున్నదని విలువిద్య శిక్షకుడు మద్దుల మురళి తెలిపారు.

మే 2 వ తేదీ నుండి " ఉచిత వేసవి విలువిద్య శిక్షణా శిబిరం  "ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు ఖేలో ఇండియా ఆర్చరీ ట్రైనింగ్ సెంటర్ లో ఉచితంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని , వేసవిలో విద్యార్థులకు ఒక మంచి సువర్ణ అవకాశమని ,చదువులో ఆటలు కూడా భాగమేనని , శారీరక, మానసిక ఉల్లాసానికి ఒక మంచి వ్యాయామమని అన్నారు.

విద్యార్థుల తల్లి దండ్రులు పిల్లలకు దీనిపైన అవగాహన కల్పించి , పిల్లలను క్రీడలలో పాల్గొనే అవకాశం కల్పించి వారి ఉన్నతికి బాటలు వేయాలని కోరారు. ఈ స్టేడియంలో విద్యార్థులు అందరూ ముందు వరుసలో ఉండి ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, విలువిద్య క్రీడాకారులు https://satgasc.telangana.gov.in లింక్ ద్వారా ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అంతర్జాతీయ విలు విద్య క్రీడాకారుడు మద్దుల మురళి ఒక ప్రకటన లో తెలిపారు.

మరిన్ని వివరాలకు మద్దుల మురళి 98489 19480 ఫోన్ నంబర్ లో సంప్రదించాలని సూచించారు.

ఆటోలో ఉచిత ప్రయాణం..

 మండే ఎండలలో ఆటో ఎక్కే ప్రయాణికులను ఎండ నుండి రక్షించేందుకు ఒక డ్రైవర్ వినూత్నంగా ఆలోచించాడు. మహబూబాబాద్ జిల్లా ఈదుల పూసల పల్లికి చెందిన భూక్య హంజ్యా /ఆటో అంజి తన ఆటో చుట్టూ గ్రీన్ మ్యాట్, పైన వివిధ రకాల మొక్కలు ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా ఆటో లోపల రెండు చిన్న ఫ్యాన్లు అమర్చడంతో పాటు ప్రయాణికుల కోసం కూల్ వాటర్ సౌకర్యాన్ని సైతం కల్పించాడు .

అలాగే దివ్యాంగులు, గర్భిణులకు తన ఆటోలో " ఉచిత ప్రయాణం " కల్పిస్తున్నాడు. దీనితో ఆటో అంజిని పలువురు అభినందిస్తున్నారు.




నెల రోజుల పాటు అన్నదానం

 ఎడపల్లి మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో వేసవికాలం దృష్ట్యా ఈ నెల రోజులు అన్నదాన కార్యక్రమాన్ని ప్రతిరోజు జరపాలని నిర్ణయించారు. అన్నదాన కార...