Showing posts with label ఫ్రీ కోచింగ్. Show all posts
Showing posts with label ఫ్రీ కోచింగ్. Show all posts

Saturday, 18 July 2026

150 మందికి ఉచిత శిక్షణ

 యూపీఎస్సీ పరీక్షలు 2027 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణ అందించనున్నది. ఈ కార్యక్రమం ద్వారా ఎంపికైన 150 మందికి నిపుణులతో కోచింగ్, స్టడీ మెటీరియల్, మాక్ టెస్ట్ లతో పాటు నెలకు 5000 రూపాయల స్టయిఫండ్ ,5 వేల రూపాయలు పుస్తక భృతిని ప్రభుత్వం అందించనుంది.

డిగ్రీ ఉత్తీర్ణులై నిర్దేశిత ఆదాయ పరిమితిలో ఉన్న తెలంగాణ అభ్యర్థులు జూలై నెల 17వ తేదీ నుంచి ఆగస్టు నెల ఏడవ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్ట్  16వ తేదీన జరిగే స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసి అదే నెల 24 నుండి తరగతులు ప్రారంభించనున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు.

Sunday, 28 June 2026

ఇన్ఫోసిస్ సహకారంతో ఉచిత శిక్షణ

 ఇన్ఫోసిస్ సహకారంతో లెర్నెట్ స్కిల్స్ వారి ఆధ్వర్యంలో ఖమ్మం లోని వైరా రోడ్ లో గల స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్లో యువతకు ఉచితంగా శిక్షణ అందజేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు లార్నెట్ స్కిల్స్ ఖమ్మం కోఆర్డినేటర్ బి నరసింహరావు తెలిపారు. 18 సంవత్సరాల నుండి 26 సంవత్సరాల వయసు లోపు గల యువత ఇంటర్ ఆపై చదివిన వారు అర్హులని తెలిపారు. శిక్షణ రోజుకు నాలుగు గంటల పాటు 25 రోజులు ఇవ్వబడును ని శిక్షణ అనంతరం ప్రైవేట్ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబడతాయని తెలిపారు. ఈ నెల 30వ తేదీ నుండి శిక్షణ ప్రారంభమవుతుందని వివరాలకు 9652711 341 ఫోన్ నెంబర్ కు కాల్ చేయాలని సూచించారు.

Saturday, 27 June 2026

ఉచిత రెసిడెన్షియల్ నీట్ కోచింగ్

 క్వాలిటీ థాట్, అన్ అకాడమీ సెంటర్ ల సంయుక్త నిర్వహణలో..

 క్వాలిటీ థాట్ , అన్ అకాడమీ సెంటర్ మాదాపూర్ సంయుక్తంగా నిర్వహిస్తున్న" క్యూటీ యూ ఎన్ ఏ నీట్ మిషన్ 100 ఉచిత రెసిడెన్షియల్ నీట్ కోచింగ్ " కార్యక్రమాన్ని శుక్రవారం మాదాపూర్ లోని అన్నకాడమీ  సెంటర్లో ప్రారంభించారు . క్వాలిటీ థాట్ ఫౌండర్, అన్ అకాడమీ సెంటర్ ఫ్రాంచైజీ భాగస్వామి రమణ భూపతి కార్యక్రమాన్ని ప్రారంభించగా ,ఫౌండేషన్ వ్యవస్థాపకుడు క్రిష్ చింతలూరు ,జనరల్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ వెంకట్ పవన్ ,అనస్తీసియ విభాగాధిపతి డాక్టర్ వేణుగోపాల్, సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ మడాల ,ఎయిమ్స్ ట్రామా సర్జన్ డాక్టర్ దామోదర్ కాకుమాను పాల్గొన్నారు. జులై 1 నుండి 14వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో 150 మంది రెసిడెన్షియల్ విద్యార్థులకు ఉచిత కోచింగ్ ,వసతి, భోజనం అలాగే 500 మంది డే స్కాలర్ లకు ఉచిత తరగతులు అందిస్తామని రమణ భూపతి తెలిపారు .ఆసక్తిగల విద్యార్థులు 9160 9341 49 నెంబర్ లో సంప్రదించాలని సూచించారు.

Friday, 26 June 2026

సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఉచిత శి

 జగిత్యాల జిల్లాలో డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువతీ యువకులకు కేంద్ర ప్రభుత్వ అత్యున్నత  సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సంబంధించి ఉచిత శిక్షణ అందించేందుకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఎస్సీ స్టడీ సర్కిల్ నిర్వహించనున్న పది నెలల ఉచిత రెసిడెన్షియల్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ శిక్షణకు సంబంధించిన కరపత్రాన్ని కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉచిత భోజన మరియు వసతి సదుపాయాలతో పాటు స్టడీ మెటీరియల్ ,ప్యాకెట్ మనీ, డిజిటల్ లైబ్రరీ తదితర సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. జిల్లాలోని డిగ్రీ పూర్తి చేసిన యువతీ యువకులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అర్హులైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు వికలాంగ అభ్యర్థులు ఆన్లైన్ వెబ్సైట్ https://tsstudycircle.co.in ద్వారా జూలై 12 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కే రాజకుమార్, స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Monday, 15 June 2026

పోటీ పరీక్షలకు ఫ్రీ కోచింగ్

 పోటీ పరీక్షలకు ఫ్రీ కోచింగ్.. గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ ఐ కానిస్టేబుల్ ఆర్ ఆర్ బి.ఎస్ ఎస్.సి డిఎస్సి వంటి ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రామగుండం మేయర్ మహంకాళి స్వామి హైదరాబాద్ క చెందిన పి జె ఆర్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. గోదావరిఖనిలోని సింగరేణి హై స్కూల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు, అర్హులైన అభ్యర్థులకు శుక్రవారం నుండి ఈ నెల 25వ తారీకు వరకు రామగుండం మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు ఫారాలను అందజేస్తామని చెప్పారు. జులై మొదటి వారంలో ప్రారంభమయ్యే ఈ శిక్షణను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Saturday, 13 June 2026

మైనారిటీలకు సివిల్స్ ఉచిత శిక్షణ

 సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెస్ అకాడమీ హైదరాబాద్ వారు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు యాకూబ్ పాషా  తెలిపారు. పదేళ్లుగా అకాడమీలో ఉచిత శిక్షణ పొందిన అభ్యర్థులు వివిధ సర్వీసులలో ఉద్యోగాలు సాధించాలని ఆయన పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ వివరాలను ఈనెల 20వ తేదీలోగా www.mseducationacademy.in  వెబ్సైట్ లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు.

హైద్రాబాద్, నిజామాబాద్,నిర్మల్, మహబూబ్ నగర్, హన్మకొండ, సదా శివ పేట, ఆదిలాబాద్, బోధన్ ప్రాంతాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి స్క్రీనింగ్ చేస్తామని , టెస్ట్ లో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ సెలెక్ట్ చేస్తామని తెలిపారు.

మరిన్ని వివరాలకు 85208 60785 ,90300 45422 ఫోన్ నెంబర్ లలో సంప్రదించాలని సూచించారు.

Monday, 8 June 2026

ఉచిత జర్మనీ శిక్షణ తరగతులు

 యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు విస్తరించేదుకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఉచిత జర్మనీ భాష శిక్షణ క్యాంపును నిర్వహించనున్నట్లు మంచిర్యాల జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికా రమేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈనెల 10న ఉదయం మందమర్రిలోని సింగరేణి ఇల్లందు క్లబ్లో శిక్షణ తరగతులను రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి తిధి వెంకటస్వామి ప్రారంభించనున్నట్లు చెప్పారు మంత్రి ఆదేశాలతో జర్మనీతో పాటు యూరోపియన్ దేశాల్లో ఉపాధి అవకాశాలు పొందేందుకు అవసరమైన భాషా నైపుణ్యాలపై ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు విదేశీ ఉపాధి అవకాశాలపై ఆసక్తి కలిగిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Sunday, 7 June 2026

స్పోకెన్ ఇంగ్లీష్ 7 రోజుల ఫ్రీ ట్రయల్

 స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి 7 రోజులు ఉచితంగా క్లాసులు వినే అవకాశం .7 రోజులు ఉచితంగా విన్న తర్వాత నచ్చితేనే కోర్స్ లో చేరవచ్చు.

స్పోకెన్ ఇంగ్లీష్ నిపుణురాలు ఐన భూక్యా గౌతమి గారు " జీరో టు హీరో " అనే స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ను రూపొందించారు.దీనిని gyan tv యాప్ లో అందుబాటులో ఉంచారు. కోర్స్ లో జాయిన్ అవ్వాలనుకునే వారికి 7 రోజులు ఉచితంగా క్లాసులు వినే అవకాశం కల్పించారు. కోర్స్ నచ్చినట్లయితే జాయిన్ అవ్వచ్చు.లేకపోతే మానేయవచ్చు.

Saturday, 6 June 2026

సంస్కృత భాష పై ఉచిత అవగాహన శిబిరం

 సంస్కృత భాష పై ప్రాథమిక పరిజ్ఞానం కల్పించడానికి తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూరు వారి ఆధ్వర్యంలో ఈ నెల 9 10 మరియు 11 తేదీలలో సరళ సంస్కృత భాష అవగాహన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు సంఘం అధ్యక్షులు శశికాంత్ పులకరిని కార్యదర్శి రమేష్ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు సంస్కృత భాష నేర్చుకోవడానికి అవసరమైన పుస్తకాలు నోట్ బుక్స్ పెన్నులు ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు శిక్షణ శిబిరం బోర్గాలోని లక్ష్మీ గణపతి ఆలయంలో ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు ఉంటుందని విద్యార్థులు మహిళలు భాషాభిమానులు ఉచిత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9494 392393 ఫోన్ నెంబర్లో సంప్రదించాల్సిన సూచించారు.

Sunday, 31 May 2026

సివిల్స్, గ్రూప్స్ అభ్యర్థులకు ఉచిత ఓరియంటేషన్

 డాక్టర్ మర్రి మానవ వనరుల అభివృద్ధి సంస్థ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా సుపరిపాలన ప్రజా సేవల మెరుగుదల లక్ష్యంగా సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల కోసం వారం రోజుల ఉచిత ఓరియంటషన్ కార్యక్రమాన్ని సంస్థ నిర్వహిస్తుంది .జూన్ రెండవ తేదీ నుంచి ప్రారంభమవుతున్న ఈ కార్యక్రమం సివిల్ సర్వీసెస్ మరియు గ్రూప్ వన్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు .ప్రతిరోజు మూడు గంటల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు, నిపుణులు, సీనియర్ అధికారులు పాల్గొని అభ్యర్థులకు మార్గదర్శకత్వం అందిస్తారు. పరీక్షా వ్యూహాలు, ప్రణాళిక ,వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ మరియు సాఫ్ట్ స్కిల్స్, నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు, ఇంటర్వ్యూ నైపుణ్యాలు,కెరీర్ మార్గదర్శకత్వం పై ప్రధానంగా శిక్షణ అందిస్తారు. "శిక్షణ మాత్రమే ఉచితంగా "ఉంటుంది. బస ,భోజన సదుపాయాలు అభ్యర్థులే  ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది .ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటాను ctsmcrhrdit24@gmail.com కు మెయిల్ చేయాలి.

Monday, 25 May 2026

ఆర్మూర్ లో ఉచిత శిక్షణ

 


మామూలు రోజుల్లో సెల్ ఫోన్ దొరికితే చాలు పిల్లలు పట్టుకుంటారు ఇక వేసవి సెలవుల్లో అయితే సెల్ ఫోన్ టీవీ తదితర వాటికి అతుక్కుపోతారు. ఈ వేసవి సెలవులు మాత్రమే వినూత్నంగా సాగుతున్నాయి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేసవి ఉచిత శిక్షణ శిబిరాలతో పాటు ప్రైవేటు సమ్మర్ క్యాంపులు సైతం విద్యార్థులతో కిట కిట లాడుతున్నాయి. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో గల బియ్యం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రత్యేక ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. మోడల్ స్కూల్ కస్తూర్బా జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఆరు నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులు మొత్తం 90 మంది రోజు హాజరవుతున్నట్లు హెచ్ ఎం తెలిపారు డ్రాయింగ్ హార్ట్ అండ్ క్రాఫ్ట్ సంగీతం యోగ తదితర అంశాలపై ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు వేసవి సెలవులను పిల్లలు వృధా చేయకుండా శిక్షణ పొందడం ప తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tuesday, 19 May 2026

21 నుండి ఏఐపై ఉచిత శిక్షణ

 21 నుండి ఏఐపై ,ఎమర్జింగ్ టెక్నాలజీ పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. 

తెలంగాణ రాష్ట్రంలోని యువతకు ఏఐ ,ఎమర్జింగ్ టెక్నాలజీలు, స్కిల్ డెవలప్మెంట్ పై శిక్షణ ఇచ్చేందుకు జిల్లాలలో నాలుగు రోజుల పటు సదస్సులు నిర్వహించనున్నట్లు బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు.

ఈనెల 21 నుండి జూన్ 11 వరకు జిల్లాలలో కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. సైదాబాద్ లోని బీసీ స్టడీ సర్కిల్ ప్రధాన కార్యాలయంలో ఈనెల 21 నుంచి 26 వరకు సదస్సు ఉంటుందని ఆయన వివరించారు. జిల్లాల వారీగా షెడ్యూల్ను ప్రకటించామని 12 జిల్లాల్లోని స్టడీ సర్కిల్లోఇవి కొనసాగుతాయన్నారు.

Monday, 18 May 2026

ఉచితంగా సైనిక్,నవోదయ శిక్షణ

 బాన్స్వాడ పట్టణంలోని ద్రోణ నవోదయ సైనిక్ కోచింగ్ సెంటర్లో ఆదివారం నిర్వహించిన టాలెంట్ టెస్ట్ కు సుమారు రెండు వందలకు పైగా విద్యార్థులు హాజరైనట్లు నిర్వాహకులు ప్రవీణ్ కుమార్ తెలిపారు విద్యార్థులను దాగి ఉన్న ప్రతిభను గుర్తించి సబ్జెక్టు వారీగా వారి నైపుణ్యాలను గెలికి తీయడమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురికి ఉచితంగా సైనిక్ నవోదయ శిక్షణ అందించనున్నట్లు తెలిపారు 80 శాతానికి పైగా మార్కులు సాధించిన వారికి ఫీజులు 30 శాతం రాయితీ ఉంటుందని ఆయన వివరించారు.

Thursday, 14 May 2026

ఉచిత ఆన్లైన్ కోచింగ్.. అక్షరధాన్ చారిటబుల్ ట్రస్ట్

 అక్షరధాన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించనున్న ఉచిత ఆన్లైన్ కోచింగ్ కోసం నాగిరెడ్డిపేట మండలంలోని గోపాల్పేట మోడల్ స్కూల్ ఎంపికైనట్లు స్కూల్ ప్రిన్సిపాల్ రాంప్రసాద్ తెలిపారు .రానున్న మూడేళ్ల పాటు పదవ తరగతి విద్యార్థులను వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయడానికి అక్షరధాన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తామని తెలిపారు. దీనితో 8 వ తరగతి విద్యార్థులకు ఎస్ఎంఎస్ పరీక్షల క్లాసులు నిర్వహిస్తామని తెలిపారు.

Friday, 8 May 2026

వైదిక గణితంలో ఉచిత శిక్షణ

 వైదిక గణితంలో ఉచిత శిక్షణ.. మరియు ఫ్రీ సమ్మర్ క్యాంప్..



కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ లో గల శ్లోక పాఠశాల బ్రాంచి 2 లో ఉచిత వైదిక గణిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పాఠశాల సీఈఓ జాలిగామ శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఉదయం 10 గంటలనుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కార్యక్రమం జరగనుంది అన్నారు. 9 నుండి 16 ఏళ్లలోపు పిల్లలకు మాత్రమే అవకాశం ఉందని తెలిపారు .శిబిరాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.



Saturday, 2 May 2026

వాలీబాల్ శిక్షణ శిబిరం ప్రారంభం

 గాంధారి మండలంలోని పెట్ సంఘం ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వేసవి వాలీబాల్ క్రీడా శిక్షణ శిబిరం శుక్రవారం ప్రారంభించినట్లు వాలీబాల్ కోచ్, వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు. సీనియర్ వాలీబాల్ క్రీడాకారిణ, ఎన్ ఎస్ ఎన్ ఐ ఎస్ వాలీబాల్ కోచ్ సోనియా సమక్షంలో శిబిరం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులతో పాటు, ఆసక్తి గలవారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు అంతర్జాలంలో 100 రూపాయలతో దరఖాస్తు చేసుకొని శిక్షణ పొందవచ్చని ఆమె తెలిపారు .శిబిరానికి బామన్ నాయక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ తరఫున నెదర్లాండ్ కు చెందిన" లెట్స్ కీప్ ది బాల్ ప్లేయింగ్ ఫౌండేషన్ "వారు చేయూతనిస్తున్నారని పేర్కొన్నారు.



ఉచిత ఫౌండేషన్ కోర్సును సద్వినియోగం చేసుకోండి

 తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచితంగా అందిస్తున్న ఫౌండేషన్ కోర్సును సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాందేడ్ వాడలో గల షెడ్యూల్డ్ కులాల వసతి గృహంలో ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత ఫౌండేషన్ కోర్సును కలెక్టర్ ఇలా త్రిపాటి శుక్రవారం ప్రారంభించారు ఇప్పటివరకు పది బ్యాచ్లలో 800 మందికి శిక్షణ అందించగా వారిలో 199 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని , ఎస్సీ స్టడీ సర్కిల్ నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఎస్సీ ఎస్టీలు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని గుర్తు చేశారు వారి విద్యాభివృద్ధికి కూడా ఎనలేని ప్రాధాన్యతనస్తూ పోటీ పరీక్షలలో ప్రతిభను కనబరిచి ఉద్యోగ అవకాశాలు పొందేలా స్టడీ సర్కిల్స్ ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు సమకూరుస్తూ ఉచితంగా శిక్షణ అందిస్తుందని తెలిపారు. అంతకుముందు కలెక్టర్ వసతి గృహంలోని గదులు కిచెన్ తదితర వాటిని సందర్శించి భోజన వసతి సదుపాయాలు పరిశీలించారు ఏవైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తేవాలని సూచించారు శిక్షణ పొందుతున్న అభ్యర్థుల కోసం పోటీ పరీక్షలకు ఉపయోగపడే అన్ని రకాల బుక్స్ అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రజిత సహాయ అధికారి రాజా గంగారాం స్టడీ సర్కిల్ డైరెక్టర్ దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు. 



Friday, 1 May 2026

ఉచిత ఆర్చరీ శిక్షణ @9848919480

 నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో గల రాజారాం స్టేడియం లో రేపటి నుండి ఖేలో ఇండియా ఉచిత విలువిద్య శిక్షణా శిబిరం ప్రారంభం కానున్నదని విలువిద్య శిక్షకుడు మద్దుల మురళి తెలిపారు.

మే 2 వ తేదీ నుండి " ఉచిత వేసవి విలువిద్య శిక్షణా శిబిరం  "ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు ఖేలో ఇండియా ఆర్చరీ ట్రైనింగ్ సెంటర్ లో ఉచితంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని , వేసవిలో విద్యార్థులకు ఒక మంచి సువర్ణ అవకాశమని ,చదువులో ఆటలు కూడా భాగమేనని , శారీరక, మానసిక ఉల్లాసానికి ఒక మంచి వ్యాయామమని అన్నారు.

విద్యార్థుల తల్లి దండ్రులు పిల్లలకు దీనిపైన అవగాహన కల్పించి , పిల్లలను క్రీడలలో పాల్గొనే అవకాశం కల్పించి వారి ఉన్నతికి బాటలు వేయాలని కోరారు. ఈ స్టేడియంలో విద్యార్థులు అందరూ ముందు వరుసలో ఉండి ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, విలువిద్య క్రీడాకారులు https://satgasc.telangana.gov.in లింక్ ద్వారా ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అంతర్జాతీయ విలు విద్య క్రీడాకారుడు మద్దుల మురళి ఒక ప్రకటన లో తెలిపారు.

మరిన్ని వివరాలకు మద్దుల మురళి 98489 19480 ఫోన్ నంబర్ లో సంప్రదించాలని సూచించారు.

Wednesday, 29 April 2026

నృత్యంలో ఉచిత శిక్షణ

 నిజామాబాద్ నగరానికి చెందిన సాయి రవళి ఉచితంగా నాట్య శిక్షణ ఇస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. మలేషియా, సింగపూర్, దుబాయ్, శ్రీలంక తదితర దేశాలలో నాట్య ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు సొంతంగా నాట్య శిక్షణ సంస్థను స్థాపించారు .ఆ సంస్థ ద్వారా వందలాది మంది చిన్నారులను ఉత్తమ కళాకారులుగా తీర్చి దిద్దు తున్నారు. 

వేసవి   సెలవులను వృధా చేయకుండా పేద విద్యార్థినలకు నాట్యంలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు .

 నాట్య శిక్షణ ద్వారా పేరు తెచ్చుకున్న రవళి స్నాతకోత్ర స్థాయిలో గణితంలో బంగారు పతకం సాధించారు. తెలుగు విశ్వవిద్యాలయ  లలిత కళా పీఠంలో ఎంపీ ఎ పూర్తి చేశారు. ఇలా ఉన్నత విద్య అభ్యసించిన రవళి తాను చిన్నప్పటి నుంచి ఇష్టంగా నేర్చుకున్న శాస్త్రీయ నృత్య రంగంలో ప్రత్యేకతను చాటుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నేలకల్ రోడ్డులో సాయి రవళి సొంతంగా ..అందెల రవళి ..పేరిట నాట్య శిక్షణాలయాన్ని స్థాపించారు. ఆ సంస్థ ద్వారా అమ్మానాన్నలు, అమ్మమ్మ ప్రోత్సాహంతో చిన్నారులకు భరతనాట్యం, కూచిపూడి, శాస్త్రీయ నృత్యాన్ని నేర్పిస్తున్నారు .

శిష్యులతో ప్రదర్శనలు..

 రాష్ట్ర జాతీయ స్థాయి వేదికలపై రవళి తన శిష్యులతో ప్రత్యేక ప్రదర్శనలు ఇప్పించారు .ఇప్పటివరకు 300కు పైగా పిల్లలను ఉత్తమ నృత్య కారుణులుగా తీర్చిదిద్దారు. నాట్య మయూరి ,నాట్య విశారద.. కేంద్ర ప్రభుత్వం ద్వారా వారు ఉపకార వేతనాలు, బహుమతులు, ప్రశంసా పత్రాలు అందుకునేలా చేశారు .ఇటీవల దుబాయిలో జరిగిన నాట్య సమ్మేళనం కార్య శాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై అక్కడి భారతీయ పిల్లలకు నృత్యం పై ప్రత్యేక కార్యాశాల నిర్వహించారు. వచ్చే నెల 1 వ తేదీన కేరళలో జరిగే నాట్య సదస్సులో తన శిష్యులతో ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారు. తనకు నాట్యం ప్రాణమని ఆసక్తి ఉన్న పేద విద్యార్థులకు ఉచితంగా నృత్య శిక్షణ ఇస్తున్నానని సాయిరవళి  తెలిపారు.

Tuesday, 28 April 2026

పాలిటెక్నిక్ ఉచిత మెటీరియల్ పంపిణీ

 అక్షర కోచింగ్ విద్యార్థులకు ఉచితంగా పాలిటెక్నిక్ మెటీరియల్ పంపిణీ చేయడం జరిగింది. 

మద్నూర్ మండల కేంద్రంలో విజన్ జూనియర్ కళాశాలలో ఇటీవలే పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థుల కోసం అక్షర పాలిటెక్నిక్  కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు పరీక్షకు అవసరమైన మెటీరియల్ను సంస్థ డైరెక్టర్ డాక్టర్ బాలు ఉచితంగా అందజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు ఉచితంగా పాలిటెక్నిక్ స్టడీ మెటీరియల్ను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

విద్యార్థులు సరైన ప్రణాళికా పరమైన అభ్యసనతోనే పాలిటెక్నిక్ లో సీటు సాధించడం జరుగుతుందని, దానికి కావాల్సన శిక్షణను అక్షర పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ లో అందజస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొన్నారు

ప్రతి ఇంటికి ఐదు మొక్కలు ఉచితం

 44 నర్సరీల నుండి ఉచితంగా మొక్కలు తీసుకెళ్లవచ్చు హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ రోహిత్ వెల్లడి.. ప్రతి ఇంటిలో మొక్కలు పెంచడం, పచ్చదనాన్...