Showing posts with label ఫ్రీ కోచింగ్. Show all posts
Showing posts with label ఫ్రీ కోచింగ్. Show all posts

Wednesday, 29 April 2026

నృత్యంలో ఉచిత శిక్షణ

 నిజామాబాద్ నగరానికి చెందిన సాయి రవళి ఉచితంగా నాట్య శిక్షణ ఇస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. మలేషియా, సింగపూర్, దుబాయ్, శ్రీలంక తదితర దేశాలలో నాట్య ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు సొంతంగా నాట్య శిక్షణ సంస్థను స్థాపించారు .ఆ సంస్థ ద్వారా వందలాది మంది చిన్నారులను ఉత్తమ కళాకారులుగా తీర్చి దిద్దు తున్నారు. 

వేసవి   సెలవులను వృధా చేయకుండా పేద విద్యార్థినలకు నాట్యంలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు .

 నాట్య శిక్షణ ద్వారా పేరు తెచ్చుకున్న రవళి స్నాతకోత్ర స్థాయిలో గణితంలో బంగారు పతకం సాధించారు. తెలుగు విశ్వవిద్యాలయ  లలిత కళా పీఠంలో ఎంపీ ఎ పూర్తి చేశారు. ఇలా ఉన్నత విద్య అభ్యసించిన రవళి తాను చిన్నప్పటి నుంచి ఇష్టంగా నేర్చుకున్న శాస్త్రీయ నృత్య రంగంలో ప్రత్యేకతను చాటుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నేలకల్ రోడ్డులో సాయి రవళి సొంతంగా ..అందెల రవళి ..పేరిట నాట్య శిక్షణాలయాన్ని స్థాపించారు. ఆ సంస్థ ద్వారా అమ్మానాన్నలు, అమ్మమ్మ ప్రోత్సాహంతో చిన్నారులకు భరతనాట్యం, కూచిపూడి, శాస్త్రీయ నృత్యాన్ని నేర్పిస్తున్నారు .

శిష్యులతో ప్రదర్శనలు..

 రాష్ట్ర జాతీయ స్థాయి వేదికలపై రవళి తన శిష్యులతో ప్రత్యేక ప్రదర్శనలు ఇప్పించారు .ఇప్పటివరకు 300కు పైగా పిల్లలను ఉత్తమ నృత్య కారుణులుగా తీర్చిదిద్దారు. నాట్య మయూరి ,నాట్య విశారద.. కేంద్ర ప్రభుత్వం ద్వారా వారు ఉపకార వేతనాలు, బహుమతులు, ప్రశంసా పత్రాలు అందుకునేలా చేశారు .ఇటీవల దుబాయిలో జరిగిన నాట్య సమ్మేళనం కార్య శాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై అక్కడి భారతీయ పిల్లలకు నృత్యం పై ప్రత్యేక కార్యాశాల నిర్వహించారు. వచ్చే నెల 1 వ తేదీన కేరళలో జరిగే నాట్య సదస్సులో తన శిష్యులతో ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారు. తనకు నాట్యం ప్రాణమని ఆసక్తి ఉన్న పేద విద్యార్థులకు ఉచితంగా నృత్య శిక్షణ ఇస్తున్నానని సాయిరవళి  తెలిపారు.

Tuesday, 28 April 2026

పాలిటెక్నిక్ ఉచిత మెటీరియల్ పంపిణీ

 అక్షర కోచింగ్ విద్యార్థులకు ఉచితంగా పాలిటెక్నిక్ మెటీరియల్ పంపిణీ చేయడం జరిగింది. 

మద్నూర్ మండల కేంద్రంలో విజన్ జూనియర్ కళాశాలలో ఇటీవలే పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థుల కోసం అక్షర పాలిటెక్నిక్  కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు పరీక్షకు అవసరమైన మెటీరియల్ను సంస్థ డైరెక్టర్ డాక్టర్ బాలు ఉచితంగా అందజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు ఉచితంగా పాలిటెక్నిక్ స్టడీ మెటీరియల్ను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

విద్యార్థులు సరైన ప్రణాళికా పరమైన అభ్యసనతోనే పాలిటెక్నిక్ లో సీటు సాధించడం జరుగుతుందని, దానికి కావాల్సన శిక్షణను అక్షర పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ లో అందజస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొన్నారు

విద్యార్థులకు పోలీసుల ఉచిత సమాఖ్య

 నార్నూర్ మండలంలోని విద్యార్థుల కోసం పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా మే నాలుగవ తేదీ నుండి 30వ తేదీ వరకు వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు నార్నూర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఈ శిబిరం ఏర్పాటు చేశారు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు రెండు నుండి పదవ తరగతి విద్యార్థులకు యోగ కరాటే కబడ్డీ వాలీబాల్ అంశాలలో "  ఉచిత శిక్షణ " ఇస్తారు. 

ఆసక్తి గలవారు ఈనెల 30వ తేదీ లోపు నార్నూర్ పోలీస్ స్టేషన్లో పేర్లు నమోదు చేసుకోవాలి వివరాల కోసం 8712659942 లేదా 8712659961 నెంబర్లను సంప్రదించాలని ఎస్సై కోరారు.

శిక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోండి

 ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు టాస్క్సుం సి ఓ ఓ S .రాఘవేందర్ రెడ్డి మంగళవారం కల్వకుర్తి నియోజకవర్గం లో పలు కార్యక్రమాలలో హాజరు కానున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా ఉదయం 10 గంటల 30 నిమిషాలకు కల్వకుర్తి పట్టణంలోని గవర్నమెంట్ హై స్కూల్ బస్టాండ్ సమీపంలో నిరుద్యోగ యువత కోసం ఏర్పాటు చేసిన నాలుగవ సంకిరెడ్డి ఉచిత ఎస్సై కానిస్టేబుల్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించనున్నార.


Monday, 27 April 2026

బ్యాంకింగ్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

 బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే ఎస్సీ ఎస్టీ యువతకు ఐబీపీఎస్ పరీక్షలకు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు.

డిగ్రీలో మెరిట్ ఆధారంగా ఎస్టిలకు 75 , ఎస్ సీ లకు 15, బీసీ లకు 10 మంది చొప్పున మొత్తం 100 మంది ని ఎంపిక చేసి " ఉచిత శిక్షణ" ఇవ్వనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ తెలిపింది .

ఆసక్తి గల అభ్యర్థులు 28 వ తేదీ లోపు https:://study circle.cgg.gov.in 

వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని కోరారు.

Friday, 3 April 2026

జామియా మిలియా లో సివిల్స్ కు ఉచిత శిక్షణ

 జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో నిరుపేద ,మధ్యతరగతి విద్యార్థులకు సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణ ఇవ్వనున్నది.

 2027 లో యుపిఎస్సి నిర్వహించే సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు హాజరుకానున్న మైనారిటీ, ఎస్సీ, ఎస్ టీ , మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండి యాకూబ్ పాషా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

 ఈ ఉచిత శిక్షణ పొందేందుకు విశ్వవిద్యాలయం జూన్ 6న హైదరాబాద్లో అర్హత పరీక్ష నిర్వహిస్తుందని, దీంట్లో మెరిట్ సాధించిన వారికి ఒక ఏడాది పాటు ఉచిత శిక్షణ, భోజన వసతితో పాటు పూర్తిస్థాయిలో లైబ్రరీ సౌకర్యం కూడా కల్పిస్తారని వెల్లడించారు .

అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ వివరాలను https ://admission.jmi.ac.in  వెబ్సైట్లో మే 26 లోపు ఒక వెయ్యి 325 రూపాయల ప్రవేశ పరీక్ష రుసుము చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు.

Tuesday, 31 March 2026

75% ఫీజు మాఫీ@ ఎక్సెల్ సివిల్స్ అకాడమీ.

 ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సివిల్స్ కోచింగ్ కేంద్రంలో 75% ఫీజు ఉచితం /మాఫీ


ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎక్సెల్ సివిల్స్ అకాడమీ యుపిఎస్సి మెరిట్ స్కాలర్షిప్ టెస్టును ఏప్రిల్ 26న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు సంస్థ డైరెక్టర్ రాజేంద్ర కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు .ఈ పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులకు కోచింగ్ ఫీజులో 75 శాతం వరకు రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు .తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారి రిటైర్డ్ ఐఏఎస్ ,ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో ఈ అకాడమీ ని నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు .

పూర్తి వివరాలకు 91004 33442 మరియు 91004 33445,www.Excel academy.com వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు.

నృత్యంలో ఉచిత శిక్షణ

 నిజామాబాద్ నగరానికి చెందిన సాయి రవళి ఉచితంగా నాట్య శిక్షణ ఇస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. మలేషియా, సింగపూర్, దుబాయ్, శ్రీలంక తదితర దేశ...