అక్షర కోచింగ్ విద్యార్థులకు ఉచితంగా పాలిటెక్నిక్ మెటీరియల్ పంపిణీ చేయడం జరిగింది.
మద్నూర్ మండల కేంద్రంలో విజన్ జూనియర్ కళాశాలలో ఇటీవలే పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థుల కోసం అక్షర పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు పరీక్షకు అవసరమైన మెటీరియల్ను సంస్థ డైరెక్టర్ డాక్టర్ బాలు ఉచితంగా అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు ఉచితంగా పాలిటెక్నిక్ స్టడీ మెటీరియల్ను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
విద్యార్థులు సరైన ప్రణాళికా పరమైన అభ్యసనతోనే పాలిటెక్నిక్ లో సీటు సాధించడం జరుగుతుందని, దానికి కావాల్సన శిక్షణను అక్షర పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ లో అందజస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొన్నారు