Showing posts with label ఫ్రీ సోషల్ సర్వీస్. Show all posts
Showing posts with label ఫ్రీ సోషల్ సర్వీస్. Show all posts

Tuesday, 28 April 2026

ఉచిత మజ్జిగ కేంద్రం ప్రారంభం

 బోధన్ కోర్టు ప్రాంగణంలో సోమవారం న్యాయ సేవా సంస్థ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రము మరియు మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి కాంచన రెడ్డి ప్రథమ శ్రేణి జూనియర్ సివిల్ జడ్జి మార్కెల్ పూజిత అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి శివ సాయి బార్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.

కడుపారా పులిహోర ఉపశమనం ఇచ్చే అంబలి

 నిజామాబాద్ కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే వారికి దాతలు ఉచితంగా పులిహోర తాగునీరు అందజేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు అధికారులకు సమస్యలను చెప్పుకోవాలని వచ్చే వారికి సీనియర్ సిటిజన్స్ ఫోరం సభ్యులు గత పది సంవత్సరాలుగా పులిహోర అందిస్తూ ఆకలి తీర్చుతు న్నారు .తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ సభ్యులు 15 ఏళ్లుగా చల్లని నీరు అంబలి పంపిణీ చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. 

ప్రజావాణి కార్యక్రమానికి అర్జీలు సమర్పించేందుకు వచ్చే ప్రజల కోసం సీనియర్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ప్రారంభించి స్వయంగా ఉచిత పులిహోర పంపిణీ చేశారు. వేసవి ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రతి సోమవారం సుదూర ప్రాంతాల నుంచి ప్రజావాణికి వచ్చేవారికి సహాయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఇకపై నిరంతరంగా కొనసాగిస్తామని ఫోరం ప్రతినిధులు తెలిపారు. 

ఇక రాజస్థానీ వాకర్స్ గ్రూప్ సౌజన్యంతో చల్లటి తాగునీటిని కూడా అందజేశారు ఈ సేవా కార్యక్రమాన్ని అభినందించిన అదనపు కలెక్టర్ ఫోరం ప్రతినిధులు మరియు వాకర్స్ గ్రూపు సభ్యులను ప్రశంసించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ రెడ్డి ఏవో ప్రశాంత్ సీనియర్ సిటిజన్స్ ఫోరం వాకర్స్ గ్రూప్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



Wednesday, 1 April 2026

ఉచిత అంబలి@ నిజామాబాద్ కలెక్టరేట్

 తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఉచిత అంబలి పంపిణీ కేంద్రం కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించారు. వేసవి కాలం దృష్టిలో పెట్టుకుని ఉచిత తాగు నీటి తో పాటు అంబలి పంపిణీ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.కార్యాలయ ఉద్యోగుల ఆరోగ్యం కోసం, వివిధ పనుల నిమిత్తం కలెక్టరేట్ కు వచ్చే ప్రజలకు ఉపశమనంగా ఉంటుందని తెలిపారు. టీఎన్జీవో సంఘం చేస్తున్న ఈ సేవా కార్యక్రమాన్ని పలువురు అభినందించారు..

నృత్యంలో ఉచిత శిక్షణ

 నిజామాబాద్ నగరానికి చెందిన సాయి రవళి ఉచితంగా నాట్య శిక్షణ ఇస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. మలేషియా, సింగపూర్, దుబాయ్, శ్రీలంక తదితర దేశ...