ఈవీ టూ వీలర్ సర్వీస్ టెక్నీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ..
యాదాద్రి భువనగిరి జిల్లా ,భూదాన్ పోచంపల్లి మండలం, జలాల్పురంలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభవృద్ధి శాఖ ఆధ్వర్యంలో, రెండు నెలల కాలవ్యవధి గల ఆటోమొబైల్ ఈవీ టూ వీలర్ సర్వీస్ టెక్నీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ చైర్మన్ ఎన్ కిషోర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు .
ఎస్ఎస్సి విద్యార్హత కలిగి ఉండాలని, ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హతల ఒరిజినల్ జిరాక్స్ కాపీలతో పాటు ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఫోటోలతో ఈ నెల 15వ తేదీ లోపు సంస్థలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
ఎంపికైన అభ్యర్థులకు శిక్షణకాలంలో ఉచిత భోజనం, హాస్టల్ వసతి కల్పించబడుతుందని, శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఉద్యోగం కూడా కల్పిస్తామని చెప్పారు.
ఇతర వివరాలకు 80 19626324 మరియు 9032399 530 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని సూచించారు.