Showing posts with label ఫ్రీ ఆర్చరీ ట్రైనింగ్. Show all posts
Showing posts with label ఫ్రీ ఆర్చరీ ట్రైనింగ్. Show all posts

Friday, 1 May 2026

ఉచిత ఆర్చరీ శిక్షణ @9848919480

 నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో గల రాజారాం స్టేడియం లో రేపటి నుండి ఖేలో ఇండియా ఉచిత విలువిద్య శిక్షణా శిబిరం ప్రారంభం కానున్నదని విలువిద్య శిక్షకుడు మద్దుల మురళి తెలిపారు.

మే 2 వ తేదీ నుండి " ఉచిత వేసవి విలువిద్య శిక్షణా శిబిరం  "ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు ఖేలో ఇండియా ఆర్చరీ ట్రైనింగ్ సెంటర్ లో ఉచితంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని , వేసవిలో విద్యార్థులకు ఒక మంచి సువర్ణ అవకాశమని ,చదువులో ఆటలు కూడా భాగమేనని , శారీరక, మానసిక ఉల్లాసానికి ఒక మంచి వ్యాయామమని అన్నారు.

విద్యార్థుల తల్లి దండ్రులు పిల్లలకు దీనిపైన అవగాహన కల్పించి , పిల్లలను క్రీడలలో పాల్గొనే అవకాశం కల్పించి వారి ఉన్నతికి బాటలు వేయాలని కోరారు. ఈ స్టేడియంలో విద్యార్థులు అందరూ ముందు వరుసలో ఉండి ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, విలువిద్య క్రీడాకారులు https://satgasc.telangana.gov.in లింక్ ద్వారా ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అంతర్జాతీయ విలు విద్య క్రీడాకారుడు మద్దుల మురళి ఒక ప్రకటన లో తెలిపారు.

మరిన్ని వివరాలకు మద్దుల మురళి 98489 19480 ఫోన్ నంబర్ లో సంప్రదించాలని సూచించారు.

నెల రోజుల పాటు అన్నదానం

 ఎడపల్లి మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో వేసవికాలం దృష్ట్యా ఈ నెల రోజులు అన్నదాన కార్యక్రమాన్ని ప్రతిరోజు జరపాలని నిర్ణయించారు. అన్నదాన కార...