Wednesday, 29 April 2026

నృత్యంలో ఉచిత శిక్షణ

 నిజామాబాద్ నగరానికి చెందిన సాయి రవళి ఉచితంగా నాట్య శిక్షణ ఇస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. మలేషియా, సింగపూర్, దుబాయ్, శ్రీలంక తదితర దేశాలలో నాట్య ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు సొంతంగా నాట్య శిక్షణ సంస్థను స్థాపించారు .ఆ సంస్థ ద్వారా వందలాది మంది చిన్నారులను ఉత్తమ కళాకారులుగా తీర్చి దిద్దు తున్నారు. 

వేసవి   సెలవులను వృధా చేయకుండా పేద విద్యార్థినలకు నాట్యంలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు .

 నాట్య శిక్షణ ద్వారా పేరు తెచ్చుకున్న రవళి స్నాతకోత్ర స్థాయిలో గణితంలో బంగారు పతకం సాధించారు. తెలుగు విశ్వవిద్యాలయ  లలిత కళా పీఠంలో ఎంపీ ఎ పూర్తి చేశారు. ఇలా ఉన్నత విద్య అభ్యసించిన రవళి తాను చిన్నప్పటి నుంచి ఇష్టంగా నేర్చుకున్న శాస్త్రీయ నృత్య రంగంలో ప్రత్యేకతను చాటుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నేలకల్ రోడ్డులో సాయి రవళి సొంతంగా ..అందెల రవళి ..పేరిట నాట్య శిక్షణాలయాన్ని స్థాపించారు. ఆ సంస్థ ద్వారా అమ్మానాన్నలు, అమ్మమ్మ ప్రోత్సాహంతో చిన్నారులకు భరతనాట్యం, కూచిపూడి, శాస్త్రీయ నృత్యాన్ని నేర్పిస్తున్నారు .

శిష్యులతో ప్రదర్శనలు..

 రాష్ట్ర జాతీయ స్థాయి వేదికలపై రవళి తన శిష్యులతో ప్రత్యేక ప్రదర్శనలు ఇప్పించారు .ఇప్పటివరకు 300కు పైగా పిల్లలను ఉత్తమ నృత్య కారుణులుగా తీర్చిదిద్దారు. నాట్య మయూరి ,నాట్య విశారద.. కేంద్ర ప్రభుత్వం ద్వారా వారు ఉపకార వేతనాలు, బహుమతులు, ప్రశంసా పత్రాలు అందుకునేలా చేశారు .ఇటీవల దుబాయిలో జరిగిన నాట్య సమ్మేళనం కార్య శాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై అక్కడి భారతీయ పిల్లలకు నృత్యం పై ప్రత్యేక కార్యాశాల నిర్వహించారు. వచ్చే నెల 1 వ తేదీన కేరళలో జరిగే నాట్య సదస్సులో తన శిష్యులతో ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారు. తనకు నాట్యం ప్రాణమని ఆసక్తి ఉన్న పేద విద్యార్థులకు ఉచితంగా నృత్య శిక్షణ ఇస్తున్నానని సాయిరవళి  తెలిపారు.

Tuesday, 28 April 2026

పాలిటెక్నిక్ ఉచిత మెటీరియల్ పంపిణీ

 అక్షర కోచింగ్ విద్యార్థులకు ఉచితంగా పాలిటెక్నిక్ మెటీరియల్ పంపిణీ చేయడం జరిగింది. 

మద్నూర్ మండల కేంద్రంలో విజన్ జూనియర్ కళాశాలలో ఇటీవలే పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థుల కోసం అక్షర పాలిటెక్నిక్  కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు పరీక్షకు అవసరమైన మెటీరియల్ను సంస్థ డైరెక్టర్ డాక్టర్ బాలు ఉచితంగా అందజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు ఉచితంగా పాలిటెక్నిక్ స్టడీ మెటీరియల్ను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

విద్యార్థులు సరైన ప్రణాళికా పరమైన అభ్యసనతోనే పాలిటెక్నిక్ లో సీటు సాధించడం జరుగుతుందని, దానికి కావాల్సన శిక్షణను అక్షర పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ లో అందజస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొన్నారు

ఉచిత వీసాలకు ఇంటర్వ్యూ మేళ

 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో క్లీనింగ్ విభాగంలో విస్తృతమైన ఉపాధి కల్పిస్తున్న ఏడీఎన్ హెచ, మరియు జిటిఎం సంస్థలు మరొకసారి ఉచిత వీసాలు జారీ చేయడానికి విస్తృతమైన ఏర్పాటు చేస్తున్నాయి. ఇంటర్వ్యూలు నిర్వహించి ఉపాధికి అవసరమైన మీసాలను ఉచితంగా జారీ చేస్తారు.

ఇప్పటివరకు తెలంగాణ జిల్లాల వలస కార్మికుల వారికి అవకాశం కల్పించిన ఈ సంస్థలు ఇప్పుడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ యువత కూడా అవకాశం కల్పించడానికి నిర్వహించాయి.

ఏప్రిల్ 30 , మే ఒకటవ తేదీన ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఐదు చోట్ల ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి. మన భారతీయ కరెన్సీలో నెలకు 24 వేల రూపాయల జీతంతో పాటు ఉచిత భోజనం, ఉచిత వసతి కల్పిస్తాయి.

ఉచిత వేశారు కల్పి జారీ చేయడంతో పాటు ఎంపికైన వారిని యూఏఈ తరలించడానికి విమాన చార్జీలను కూడా ఈ సంస్థలే భరించనున్నాయి.

ఈ నెల 30న సిరిసిల్ల జగిత్యాల సికింద్రాబాద్ లలో, మే 1 న నిజామాబాద్ ఆర్మూర్లతో పాటు సికింద్రాబాద్లోని జిటిఏ సంస్థ కార్యాలయంలో ఇంటర్వ్యూలో నిర్వహించనున్నట్లు ఆ సంస్థ చైర్మన్ సతీష్ వెల్లడించారు. ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ కలిగిన అభ్యర్థులు బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చి ఉండాలి అన్నారు. 

ఇతర వివరాల కోసం జిటిఎం సంస్థ బ్రాంచీలైన 

సిరిసిల్ల..83320 17122 ,జగిత్యాల..83320 42299, ఆర్మూర్..83320 13999, నిజామాబాద్ .. 86868 60999, సికింద్రాబాద్..83320 52299 నంబర్ల లో సంప్రదించాలని సూచించారు.


విద్యార్థులకు పోలీసుల ఉచిత సమాఖ్య

 నార్నూర్ మండలంలోని విద్యార్థుల కోసం పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా మే నాలుగవ తేదీ నుండి 30వ తేదీ వరకు వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు నార్నూర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఈ శిబిరం ఏర్పాటు చేశారు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు రెండు నుండి పదవ తరగతి విద్యార్థులకు యోగ కరాటే కబడ్డీ వాలీబాల్ అంశాలలో "  ఉచిత శిక్షణ " ఇస్తారు. 

ఆసక్తి గలవారు ఈనెల 30వ తేదీ లోపు నార్నూర్ పోలీస్ స్టేషన్లో పేర్లు నమోదు చేసుకోవాలి వివరాల కోసం 8712659942 లేదా 8712659961 నెంబర్లను సంప్రదించాలని ఎస్సై కోరారు.

ఉచిత మజ్జిగ కేంద్రం ప్రారంభం

 బోధన్ కోర్టు ప్రాంగణంలో సోమవారం న్యాయ సేవా సంస్థ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రము మరియు మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి కాంచన రెడ్డి ప్రథమ శ్రేణి జూనియర్ సివిల్ జడ్జి మార్కెల్ పూజిత అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి శివ సాయి బార్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.

కడుపారా పులిహోర ఉపశమనం ఇచ్చే అంబలి

 నిజామాబాద్ కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే వారికి దాతలు ఉచితంగా పులిహోర తాగునీరు అందజేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు అధికారులకు సమస్యలను చెప్పుకోవాలని వచ్చే వారికి సీనియర్ సిటిజన్స్ ఫోరం సభ్యులు గత పది సంవత్సరాలుగా పులిహోర అందిస్తూ ఆకలి తీర్చుతు న్నారు .తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ సభ్యులు 15 ఏళ్లుగా చల్లని నీరు అంబలి పంపిణీ చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. 

ప్రజావాణి కార్యక్రమానికి అర్జీలు సమర్పించేందుకు వచ్చే ప్రజల కోసం సీనియర్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ప్రారంభించి స్వయంగా ఉచిత పులిహోర పంపిణీ చేశారు. వేసవి ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రతి సోమవారం సుదూర ప్రాంతాల నుంచి ప్రజావాణికి వచ్చేవారికి సహాయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఇకపై నిరంతరంగా కొనసాగిస్తామని ఫోరం ప్రతినిధులు తెలిపారు. 

ఇక రాజస్థానీ వాకర్స్ గ్రూప్ సౌజన్యంతో చల్లటి తాగునీటిని కూడా అందజేశారు ఈ సేవా కార్యక్రమాన్ని అభినందించిన అదనపు కలెక్టర్ ఫోరం ప్రతినిధులు మరియు వాకర్స్ గ్రూపు సభ్యులను ప్రశంసించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ రెడ్డి ఏవో ప్రశాంత్ సీనియర్ సిటిజన్స్ ఫోరం వాకర్స్ గ్రూప్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



సహారా హెల్త్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

 మారుమూల తండాలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ముకుంద తాండా సర్పంచ్ ప్రకాష్ అన్నారు. 

సోమవారం ఆ తండాలో సహారా హెల్త్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం ప్రారంభించి మాట్లాడారు వైద్యం పట్టణ ప్రజలకు కాకుండా మారుమూల ప్రాంతంలోని తండాలలో నివసించే గిరిజనుల ఇంటింటికి వచ్చి వైద్యం అందించడం అభినందనీయం అన్నారు. 

గిరిజన ప్రాంతాలలో సిఎస్ఆర బాధ్యతతో ఆరోగ్యం పై అవగాహన కలిగించడం గొప్ప విషయం అన్నారు ఈ ప్రాజెక్టు ద్వారా 100 గిరిజన తండాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో సహారా హెల్త్ డెవలప్మెంట్ సొసైటీ ప్రతినిధులు సర్పంచ్ ప్రకాష్ లక్ష్మణ్ నాయక్ మహిపతి సర్దార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

శిక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోండి

 ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు టాస్క్సుం సి ఓ ఓ S .రాఘవేందర్ రెడ్డి మంగళవారం కల్వకుర్తి నియోజకవర్గం లో పలు కార్యక్రమాలలో హాజరు కానున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా ఉదయం 10 గంటల 30 నిమిషాలకు కల్వకుర్తి పట్టణంలోని గవర్నమెంట్ హై స్కూల్ బస్టాండ్ సమీపంలో నిరుద్యోగ యువత కోసం ఏర్పాటు చేసిన నాలుగవ సంకిరెడ్డి ఉచిత ఎస్సై కానిస్టేబుల్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించనున్నార.


Monday, 27 April 2026

బ్యాంకింగ్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

 బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే ఎస్సీ ఎస్టీ యువతకు ఐబీపీఎస్ పరీక్షలకు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు.

డిగ్రీలో మెరిట్ ఆధారంగా ఎస్టిలకు 75 , ఎస్ సీ లకు 15, బీసీ లకు 10 మంది చొప్పున మొత్తం 100 మంది ని ఎంపిక చేసి " ఉచిత శిక్షణ" ఇవ్వనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ తెలిపింది .

ఆసక్తి గల అభ్యర్థులు 28 వ తేదీ లోపు https:://study circle.cgg.gov.in 

వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని కోరారు.

Wednesday, 22 April 2026

ఏప్రిల్ 25న ఉచిత జాబ్ మేళా

 పెద్దపల్లి జిల్లాలోని నిరుద్యోగ యువకులకు మేడ్ప్లస్ కంపెనీలో ఉద్యోగాలు కల్పించుటకు ఏప్రిల్ 25న శనివారం రూమ్ నెంబర్ 233 నూతన కలెక్టర్ భవన సముదాయంలో గల జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై తిరుపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు.

 మెడిప్లస్ కంపెనీలో 45 ఫార్మసిస్ట్ జాబ్స్, 50 ఆడిట్ అసిస్టెంట్ ,201 సెక్యూరిటీ గార్డ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఆసక్తి గలవారు ఏప్రిల్ 25న ఉదయం 11 గంటలకు సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో రూమ్ నెంబర్ 233లో నూతన కలెక్టర్ భవన సముదాయంలో పెద్దపల్లి మొదటి అంతస్తులో వచ్చి తమ పేరు నమోదు చేసుకోవాలని మరిన్ని వివరాలకు 8985 336947 మరియు 8121262441 నెంబర్లలో సంప్రదించాలని తెలిపారు.

అన్నపూర్ణ స్వచ్ఛంద సేవా సంస్థ

 వేములవాడ నాలుగవ వార్డు మహాలక్ష్మి వీధికి చెందిన పెంట మల్లేశం మరణించగా అంత్యక్రియల అనంతరం వారి కుటుంబానికి అన్నపూర్ణా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్ పర్సన్ తోటలహరి ద్వారా ఉచితంగా భోజనం అందించారు.

 పెంట స్వరూప్ ,రవి ప్రిన్స్ అందించిన సమాచారం మేరకు సకాలంలో భోజనం పంపించినట్లు చైర్పర్సన్ తోటలహరి తెలిపారు. వేములవాడ పట్టణంలో ఎవరైనా మరణించిన సందర్భంలో ట్రస్ట్ నంబర్ 8919376459 కు సమాచారం ఇస్తే బాధిత కుటుంబాలకు ఉచితంగా భోజనం అందిస్తామని అని తెలిపారు.

Saturday, 18 April 2026

100%ఉచిత సీట్ గెల్చుకోండి

 ఐఐటియన్స్ హౌస్..శ్రీ అభిద IIT-JEE / neet / foundations 

జూనియర్ కళాశాల..ఒలింపియాడ్ స్కూల్

రెసిడెన్షియల్ మరియు డే స్కాలర్


స్కాలర్ షిప్ టెస్ట్ 2026..


10 వ తరగతి పాసైన విద్యార్థులకు..100% ఉచిత సీట్ గెలుచుకునే అవకాశం..

5 మంది విద్యార్థులకు ..100% స్కాలర్ షిప్ 

10 మంది విద్యార్థులకు..50% స్కాలర్ షిప్ 

25 మంది విద్యార్థులకు..25% స్కాలర్ షిప్ 

పరీక్ష జరిగే స్థలం..

భవిత హై స్కూల్,

ఈస్ట్ హౌసింగ్ బోర్డ్ కాలనీ,

నియర్ సత్య గార్డెన్,

IMA బిల్డింగ్ పక్కన,

కామారెడ్డి.503111

పరీక్ష తేదీ..19 -4-2026 ,ఉదయం 10 గంటల నుంచి 11-30 గంటల వరకు 

పరీక్షా విధానం.. గణితం మరియు IQ నుండి 30 ప్రశ్నలు, ఫిజిక్స్ నుండి 15,కెమిస్ట్రీ నుండి 15,బయాలజీ నుండి 15 ప్రశ్నలు ఉంటాయి.

సరైన జవాబు కీ 4 మార్కులు, రాంగ్ ఆన్సర్ కు ..మైనస్ 1 మార్క్ ఉంటుంది.

మరిన్ని వివరాలు..96666 09858,94931 77772 నంబర్లలో సంప్రదించండి.

Mr. భూపతి రాజ్, కో ఆర్డినేటర్, కామారెడ్డి.

Mr.A.Srinivas Rao,IIT Bombay..founder and chairman.

Register now  www.sriabhida.com 





Friday, 17 April 2026

రేపు ఉచిత సందర్శన@తెలంగాణ మ్యూజియంలు

 ప్రపంచ వారసత్వ దినోత్సవ సందర్భంగా తెలంగాణ హెరిటేజ్ శాఖ ఆధ్వర్యంలోని అన్ని మ్యూజియం లలో,మరియు చారిత్రక కట్టడాలను సందర్శించడానికి ఈ నెల 18 వ తేదీన "ఉచితంగా "ప్రవేశం కల్పిస్తున్నట్లు సంబంధిత వర్గాలు/ సాంస్కృతిక శాఖ వర్గాలు తెలిపాయి.

నాంపల్లి పబ్లిక్ గార్డెన్లోని "స్టేట్ మ్యూజియం " లో ప్రపంచ వారసత్వ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు సాంస్కృతిక శాఖ వర్గాలు తెలిపాయి 

18 న ఉచిత జాబ్ మేళా @ రామాయంపేట

 మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 18 తేదీ న ఉచిత జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ హిమజ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు. MSN కెమికల్ కంపెనీ ప్రతినిధుల ఆధ్వర్యంలో జాబ్ మేళా కొనసాగుతుందని ఆమె చెప్పారు.

ఇంటర్ MPC,ఇంటర్ BI PC,ఒకేషనల్ MLT కోర్సులు చదివిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

కళాశాల లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉచిత జాబ్ మేళా కొనసాగుతుందని ఆమె చెప్పారు.విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని కోరారు.

17 నుండి 21 ఏళ్ల వయసు గల యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంపెనీ ఆకర్షణీయమైన వేతనం చెల్లిస్తుందని ఆమె తెలిపారు.

18 న ఉచిత జాబ్ మేళా @ కామారెడ్డి కలెక్టరేట్

 కామారెడ్డి జిల్లా లోని నిరుద్యోగ యువతి యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ నెల 18 తేదీన ఉచిత జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కామారెడ్డి జిల్లా ఉపాధి కల్పనాధికారి రజనీ కిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు.

కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని ప్రముఖ కంపెనీ అయిన గూగుల్ పే  లో ఉద్యోగాలు ఉన్నాయన్నారు.18-35 ఏళ్ల వయసు ఉన్న యువతీ యువకులు కామారెడ్డి కలెక్టరేట్ లోని రూమ్ నంబర్ 121 లో ఉదయం 10.30 నిమిషాల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే మౌఖిక పరీక్షలకు హాజరు కావాలని కోరారు.

అభ్యర్థులు ఫొటోలు, సర్టిఫికెట్ ల నకలు తీసుకొని రావాలని సూచించారు.

Tuesday, 14 April 2026

ప్రకృతి సేద్యం పై 3 రోజుల ఉచిత శిక్షణ

 సేంద్రీయ/ ప్రకృతి సేద్యం పై ఎన్టీర్ జిల్లా లోని నూజివీడు వద్ద గల కొండపర్వలోని కృష్ణ సుధ అకాడమీ ఆఫ్ ఆగ్రో ఎకాలజి సంస్థ లో ఈ నెల 28 నుండి 30 తేదీ వరకు 3 రోజులపాటు రెసిడెన్షియల్ ఫౌండేషన్ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

రైతులతో కలిసి పని చేసే క్షేత్రస్థాయి విస్తరణ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు ,రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ప్రభుత్వ శాఖల సిబ్బంది, రైతు సంక్షేమ సంఘాలు, సహకార సంఘాలు ,బ్యాంకులు, ఉద్యాన, వ్యవసాయ, పశు విశ్వవిద్యాలయాల సిబ్బంది ఈ శిక్షణకు అర్హులని తెలిపారు .

పూర్తి వివరాలకు 8500283300 నంబర్ లో సంప్రదించాలని సూచించారు.

పుట్టగొడుగుల పెంపకం పై ఉచిత శిక్షణ

 నసురుల్లాబాద్ కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ లో ఏప్రిల్ 27 నుంచి మే 7 వరకు పుట్ట గొడుగుల పెంపకం పై ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

పుట్టగొడుగుల పెంపకం పై ఆసక్తి ఉన్న 18 నుండి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న వ్యక్తులు జిల్లా కలెక్టరేట్ లోని DRDO ఆఫీస్ లో లేదా నసురుల్లాబాద్ లోని సంస్థ కార్యాలయంలో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ అమర్ సింగ్ తెలిపారు.

శిక్షణ సమయంలో ఉచిత వసతి, ఉచిత భోజనం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.

పూర్తి వివరాలకు..

92475 40478 నంబర్ లో సంప్రదించాలని సూచించారు.

Monday, 13 April 2026

వేస్ట్ ఆప్టిమైజేషన్ ప్రొఫెషనల్ కోర్స్.. ఉచిత శిక్షణ

 పర్యావరణ హిత కార్య క్రమాల్లో నైపుణ్యం పెంపొందించడమే లక్ష్యంగా చేపట్టిన గ్రీన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో గచ్చిబౌలి లోని EPTRI సర్టిఫికెట్ కోర్సులను ప్రవేశ పెట్టింది.

ఇందులో ఒకటి 90 రోజుల ఉచిత శిక్షణ.. వేస్ట్ ఆప్టిమైజేషన్ ప్రొఫెషనల్ కోర్స్ అని నిర్వహిస్తున్నారు.

అర్హులైన వారికి ఉచిత బస, క్షేత్ర స్థాయి పర్యటనల అనంతరం సర్టిఫికెట్ ఇస్తున్నారు.దీంతో రీసైక్లింగ్ కేంద్రాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు తెలిపారు.

స్కిల్ ఇండియా మిషన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ స్కిల్ ఇండియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. పర్యావరణ హిత కార్య క్రమాల్లో శ్రామిక శక్తిని పెంపొందించడమే ఈ ప్రోగ్రామ్ లక్ష్యం.ఇందులో భాగంగా పలు ఉచిత కోర్సులు నిర్వహిస్తున్నారు.

ఇందులొ భాగంగా థియరీ,ప్రాక్టికల్ తరగతులతో ప్రాథమిక భావనలపై పరిజ్ఞానం అందించడం తో పాటు క్షేత్ర స్థాయి పర్యటనల కు భాగస్వామ్యం కల్పిస్తున్నారు.

ఇందులో పొందిన నైపుణ్యాలతో పరిశ్రమలు , రీసైక్లింగ్ కేంద్రాలు,మున్సిపల్ కార్పొరేషన్ లలో ఉద్యోగాలు పొందవచ్చునని ప్రతినిధులు తెలిపారు.

ఇంటర్, డిగ్రీ,బీటెక్ లతోపాటు సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారు అర్హులు.



Saturday, 11 April 2026

ఉచిత కంటి వైద్య శిబిరం@మాక్లూర్

 మాకూర్ మండల పరిధిలోని ఆర్టీసీ కాలనీలోని మాక్లూర్ పోలీస్ ఆధ్వర్యంలో, లయన్స్ క్లబ్ వారి సహకారంతో ఆటో డ్రైవర్లు మరియు పదవి విరమణ పొందిన ఉద్యోగుల కోసం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్ల కంటి చూపు అత్యంత కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు. డ్రైవర్లు తమ ఆరోగ్యం పై ముఖ్యంగా కంటిచూపుపై దృష్టి పెట్టడం ద్వారా తమ ప్రాణాలతో పాటు ఇతరుల భద్రతను కాపాడవచ్చును సూచించారు. ఈ శిబిరంలో ఆటో డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి ఐ డ్రాప్స్ అందించినట్లు పేర్కొన్నారు .

ఇందులో నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ మాక్లోర్ ఎస్సై 2 మొగులయ్య నవీపేట్ ఎస్సై టు యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Friday, 10 April 2026

15 న ఉచిత జాబ్ మేళా @ బాన్సువాడ

 ఏప్రిల్ 15 తేదీన ఉచిత మెగా జాబ్ మేళా బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించనున్నట్లు కామారెడ్డి జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం ఒక ప్రకటనలో తెలిపారు.

ఎటువంటి కన్సల్టెన్సీ ఫీజులు లేకుండా ఉచితంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ వారి సహకారంతో నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడమే లక్ష్యంగా ఈ జాబ్ మేళా ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

పదవ తరగతి,ఇంటర్,డిగ్రీ, ఎంబీఏ, బీఎస్సీ అగ్రికల్చర్, హోటల్ మేనేజ్ మెంట్ చదివిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

18 నుండి 30 ఏళ్ల లోపు వయసు గల వారు అర్హులనీ ,బ్యాంకింగ్, హోటల్ మేనేజ్ మెంట్, ఐటిఐ సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఫార్మా తదితర రంగాలలో ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు.

ఇతర వివరాలకు 94933 10781,98484 30111 ఫోన్ నంబర్ లలో సంప్రదించాలని సూచించారు.

Thursday, 9 April 2026

10 న ఉచిత ఆయుష్ వైద్య శిబిరం

 కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎన్జీవోఎస్ కాలనీలో ఈ నెల 10వ తేదీన ఉచిత మెగా ఆయుష్ ఆరోగ్య వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు 14వ వార్డు కౌన్సిలర్ రామ్ శెట్టి హర్షిత తెలిపారు .ప్రజా పాలనా, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆయుష్ దినోత్సవం వేడుకలు ఎన్జీవోఎస్ కాలనీలో ఆయుష్ కార్యాలయం ఆవరణలో ఉచిత మెగా ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు .

ఈ సందర్భంగా హోమియోపతి ,ఆయుర్వేదం ,యునాని పరీక్షలు ఉచితంగా జరపనున్నట్లు తెలిపారు. ఉదయం 6:30 నుండి 7 గంటల 30 నిమిషాల వరకు యోగా నిర్వహణ తరగతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

 కామారెడ్డి పట్టణ ప్రజలు ,పరిసర ప్రాంతాల ప్రజలు, 14వ వార్డు ప్రజలు హోమియోపతి ,యునాని, ఆయుర్వేద పరీక్షలకు హాజరై సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్  మరియు జిల్లా వైద్య అధికారులు హాజరవుతారని తెలిపారు .

ఈ కార్యక్రమంలో హోమియోపతి, ఆయుర్వేద, యునాని యోగ డాక్టర్స్ డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్  జునైద్ బేగం, డాక్టర్ విజయ, డాక్టర్ దేవయ్య, ఫార్మసిస్ట్ కిషోర్ ,యోగ మాస్టర్ బాల్ లింగం తదితరులు పాల్గొన్నారు.

Wednesday, 8 April 2026

నేడు పెద్ద మల్లారెడ్డి లో వైద్య శిబిరం

 భిక్కనూరు మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో బుధవారం ఉదయం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఆర్వీఎం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు సర్పంచ్ సాయ గౌడ్ ,ఉప సర్పంచ్ చైతన్య మంగళవారం తెలిపారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిబిరంలో ఆర్విఎం ఆసుపత్రి వైద్యులు వివిధ రకాల రోగాలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేస్తారని అన్నారు. 

ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. శాస్త్ర చికిత్సలు ,ఇతర మెరుగైన వైద్యం కావాల్సిన వారిని గురువారం ప్రత్యేక వాహనంలో ఆర్విఎం ఆసుపత్రికి తీసుకెళ్లి ఉచిత వైద్యం అందిస్తారని తెలిపారు.


ఆసుపత్రికి ఉచితంగా సి ప్యాప్ యంత్రం అందజేత

 ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో సీప్యాప్ యంత్రాన్ని కొందరి వైద్యులు ఉచితంగా అందజేశారు. ఆసుపత్రిలో విజయవంతంగా ఇన్స్టాలేషన్ పూర్తయింది.

 ఈ యంత్రాన్ని హైదరాబాదులోని అంకుర ఆసుపత్రికి చెందిన డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అందించారు. బయో మెడికల్ ఇంజనీర్ ఇస్లావత్ రెడ్డి ఇన్స్టాలేషన్ చేయగా, ఖమ్మం జిల్లాకు చెందిన ఎం సి హెచ్ పీడియాట్రిక్ హెచ్ ఓ డి డాక్టర్ బాబు రత్నాకర్ మరియు డాక్టర్ రాంబాబు ఆధ్వర్యంలో పరీక్షించారు. 

యంత్రం సక్రమంగా పనిచేస్తూ ,రోగులకు ఉపయోగించేందుకు సిద్ధంగా ఉందని వారు తెలిపారు. ఈ యంత్రం ద్వారా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని వైద్యుల తెలిపారు.

ఈ సందర్భంగా ఈ యంత్రాన్ని ఉచితంగా అందజేసిన వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఉచితంగా వాటర్ ఫిల్టర్ అందజేత

 బిచ్కుంద మాజీ సర్పంచ్ మైపతి సిద్ధిరాం గారి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు మహిపతి శ్రీనివాస్ గణేష్ మందిరం ప్రభుత్వ పాఠశాలకు వాటర్ ఫిల్టర్ ఉచితంగా అందజేశారు. 

సుమారు 41 రూపాయల వేల విలువ చేసే వాటర్ ఫిల్టర్ ను మంగళవారం బిగించి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు

ఆటోమొబైల్ కోర్సులో ఉచిత శిక్షణ

 ఈవీ టూ వీలర్ సర్వీస్ టెక్నీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ..


యాదాద్రి భువనగిరి జిల్లా ,భూదాన్ పోచంపల్లి మండలం, జలాల్పురంలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభవృద్ధి శాఖ ఆధ్వర్యంలో, రెండు నెలల కాలవ్యవధి గల ఆటోమొబైల్ ఈవీ టూ వీలర్ సర్వీస్ టెక్నీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ చైర్మన్ ఎన్ కిషోర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు .

 ఎస్ఎస్సి విద్యార్హత కలిగి ఉండాలని, ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హతల ఒరిజినల్ జిరాక్స్ కాపీలతో పాటు ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఫోటోలతో ఈ నెల 15వ తేదీ లోపు సంస్థలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

 ఎంపికైన అభ్యర్థులకు శిక్షణకాలంలో ఉచిత భోజనం, హాస్టల్ వసతి కల్పించబడుతుందని, శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఉద్యోగం కూడా కల్పిస్తామని చెప్పారు.

 ఇతర వివరాలకు 80 19626324 మరియు 9032399 530 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని సూచించారు.

నిరుపేద ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం

 నిరుపేద ఖైదీలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా న్యాయ సహాయం అందించే అవకాశం ఉన్నట్లు డి ఎల్ ఎస్ ఏ కార్యదర్శి  టి.నాగరాణి గారు పేర్కొన్నారు.

కామారెడ్డి కరగారాన్ని తనిఖీ చేసి ఖైదీలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఖైదీల మానవ హక్కుల పరిరక్షణ ,న్యాయ సహాయం పొందే హక్కు, కేసుల పురోగతి తదితర అంశాలపై ఆమె మాట్లాడారు. అనంతరం కారాగారా వంటగది, కార్యాలయము, ఖైదీల గదులను తనిఖీ చేశారు.

9 న ఉచిత జాబ్ మేళా @ బిచ్కుంద డిగ్రీ కళాశాల లో

 బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్లేస్మెంట్ సెల్ ఐక్యూసీ మరియు టాస్క్ ల ఆధ్వర్యంలో యువతీ యువకులకు ఉచిత జాబ్ మేళా ఈ నెల 9వ తేదీన నిర్వహిస్తున్నట్లు డిగ్రీ కళాశాల వర్గాలు తెలిపాయి.

శ్రీ విజయ బయో ఫెర్టలైజర్స్ కంపెనీ తరఫున సేల్స్ ఎగ్జిక్యూటివ్, గ్రూప్ లీడర్, టీమ్ మేనేజర్ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ అశోక్ తెలిపారు.

దీనితోపాటు ముత్తూట్ ఫైనాన్స్ ఇంటర్ షిప్ ఇంటర్వ్యూలు కూడా ఉంటాయని తెలిపారు. సెలెక్ట్ అయిన వారికి ఆరు నెలల అనంతరం జూనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయికి ప్రమోట్ చేస్తారని తెలిపారు. ఇంటర్ డిగ్రీ పాసైన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.

ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 9908785718, 970 11 555 12, 970 40 44 029 మరియు 9492 7955 24 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.

మహిళలకు ఉచిత ప్రదర్శన

 పార్థ గోపాల్ హీరో గా నటిస్తున్న, సూర్య జీ యాదవ్ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం " డైమండ్ డెకాయిట్ "

ఈ నెల 10 తేదీన విడుదలవుతోంది.. మేఘన కథా నాయిక గా నటించింది.తాజాగా ట్రైలర్ ను వీక్షించి దర్శకుడు కే.రాఘవేంద్ర రావు చిత్ర బృందం ను అభినందించారు.

ఈ ప్రత్యేక సందర్భంలో చిత్ర బృందం మహిళా ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.

తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానున్న థియేటర్లలో మొదటి రోజు 4 షో లు మహిళలకు ఉచితంగా ప్రదర్శించనున్నట్లు ప్రకటించారు. పూర్తిగా కడప జిల్లాలోనే చిత్రీకరించిన తొలి చిత్రం మాదే కావడం మాకు గర్వ కారణం అన్నారు సూర్య.

మహిళలు అధిక సంఖ్యలో వచ్చి చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరారు..


Saturday, 4 April 2026

ఉచిత వైద్య శిబిరం @ రెంజల్

 ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెంజల్ జిల్లాపరిషత్ పాఠశాల లో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ నాయకుడు నల్ల నవీన్ కుమార్ తెలిపారు.

 రెంజల్ మండలం, పరిసర ప్రాంతాల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇట్టి వైద్య శిబిరంలో పాల్గొని విజయవంతం చేయాలని ,ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు.

 ఇట్టి మెగా వైద్య శిబిరంలో అన్ని రకాల వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి ,మందులు పంపిణీ చేస్తారని తెలిపారు. శుక్రవారం నాడు ఈ మెగా ఉచిత వైద్య శిబిరానికి సంబంధించిన కరపత్రాలను వారు ఆవిష్కరించారు .

ఈ కార్యక్రమంలో కాలేవార్ సంజీవ్, సాయి ప్రకాష్, సాయి కమార్ ,సంజయ్, గంగరాజు, ప్రకాశ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

14 న ఉచిత మెగా రక్త దాన శిబిరం..

 కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీన మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంగల వెంకట తెలిపారు. కామారెడ్డిలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విషయం గురించి మాట్లాడారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు .శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరారు.

కామారెడ్డి లోని కర్షక్ బీఈడీ కళాశాల లో కామారెడ్డి రక్త దాతల సమూహం,ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వారి సహకారంతో  తలస్సేమియ  వ్యాధి గ్రస్తులను ఆదుకునేందుకు ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

 కార్యక్రమ సమన్వయకర్త బాలు, ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ నాయక్, ప్రతినిధులు సంఘయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

6 న ఉచిత ఉద్యోగ మేళా

 కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నల ఆరవ తేదీన ఇటువంటి కన్సల్టెన్సీ ఫీజులు లేకుండా ఉచితంగా ఉద్యోగమేళా ఏర్పాటు చేశామని ప్రిన్సిపల్ జయకుమారి తెలిపారు హైదరాబాద్ కు చెందిన వివిధ రకాల సంస్థల ఆధ్వర్యంలో కార్యక్రమం జరగనుంది అన్నారు కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి మేళా ప్రారంభం అవుతుందని ఆసక్తి గల యువతీ యువకులు తగిన ధ్రువపత్రాలతో జాబ్ మేళా కు  రావాలని సూచించారు.

Friday, 3 April 2026

టెక్నికల్ కోర్సుల్లో ఉచిత శిక్షణ

 ఈనెల 6 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి 

భూదాన్ పోచంపల్లి మండలంలోని జలాల్పురం లో గల స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మరియు మేధా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి ఆధారిత సాంకేతిక కోర్సులలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ చైర్మన్ ఎన్ కిషోర్ రెడ్డి తెలిపారు .

ఎలక్ట్రిషన్ అండ్ సోలార్ ఇన్స్టాలేషన్ కోర్సు కు ఐటిఐ..

 కంప్యూటర్ హార్డ్వేర్, సీసీటవీ ,సెల్ ఫోన్ రిపేరింగ్ కోర్సులకు పదవ తరగతి ..

టైలరింగ్, ఎంబ్రాయిడరీ, జర్దోజి క్విల్ట్ మేకింగ్ కోర్సులకు ఎనిమిదవ తరగతి కలిగి ఉండాలని తెలిపారు .

అభ్యర్థులు తమ విద్యార్హతల ఒరిజినల్ మరియు జిరాక్స్ కాపీలతో పాటు ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఫోటోలతో ఈ నెల ఆరవ తేదీ లోపు సంస్థలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

 ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో భోజనం, వసతి కల్పించనున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఉద్యోగం కూడా కల్పిస్తామని అన్నారు.

 పూర్తి వివరాలకు 9133 90 8,000 మరియు 9133 90 8 111 నంబర్లలో సంప్రదించాలని సూచించారు

జామియా మిలియా లో సివిల్స్ కు ఉచిత శిక్షణ

 జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో నిరుపేద ,మధ్యతరగతి విద్యార్థులకు సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణ ఇవ్వనున్నది.

 2027 లో యుపిఎస్సి నిర్వహించే సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు హాజరుకానున్న మైనారిటీ, ఎస్సీ, ఎస్ టీ , మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండి యాకూబ్ పాషా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

 ఈ ఉచిత శిక్షణ పొందేందుకు విశ్వవిద్యాలయం జూన్ 6న హైదరాబాద్లో అర్హత పరీక్ష నిర్వహిస్తుందని, దీంట్లో మెరిట్ సాధించిన వారికి ఒక ఏడాది పాటు ఉచిత శిక్షణ, భోజన వసతితో పాటు పూర్తిస్థాయిలో లైబ్రరీ సౌకర్యం కూడా కల్పిస్తారని వెల్లడించారు .

అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ వివరాలను https ://admission.jmi.ac.in  వెబ్సైట్లో మే 26 లోపు ఒక వెయ్యి 325 రూపాయల ప్రవేశ పరీక్ష రుసుము చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు.

గిరిజన యువతకు.. ఉచిత శిక్షణ

 భారత దేశ కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నట్లు ట్రైకార్ ఎండి సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు.

 కేరళలోని కొచ్చిలో మే నెలలో శిక్షణ ప్రారంభం అవుతుంది అని వెల్లడించారు. రాష్ట్రం యువతకు 25 సీట్లు కేటాయించారని తెలిపారు. శిక్షణ తర్వాత సర్టిఫికెట్ తో పాటు ప్లేస్ మెంట్ కల్పిస్తారని వెల్లడించారు.

 ఈనెల 10వ తేదీ లోగా దరఖాస్తుల సమర్పించాలని కోరారు. వివరాలకు Https://dsapponline.com/sds/form/register.php   వెబ్సైట్ సందర్శించాలని సూచించారు

Wednesday, 1 April 2026

ఉచిత అంబలి@ నిజామాబాద్ కలెక్టరేట్

 తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఉచిత అంబలి పంపిణీ కేంద్రం కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించారు. వేసవి కాలం దృష్టిలో పెట్టుకుని ఉచిత తాగు నీటి తో పాటు అంబలి పంపిణీ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.కార్యాలయ ఉద్యోగుల ఆరోగ్యం కోసం, వివిధ పనుల నిమిత్తం కలెక్టరేట్ కు వచ్చే ప్రజలకు ఉపశమనంగా ఉంటుందని తెలిపారు. టీఎన్జీవో సంఘం చేస్తున్న ఈ సేవా కార్యక్రమాన్ని పలువురు అభినందించారు..

ఉచిత మెగా జాబ్ మేళా @ మెదక్

 మెదక్ జిల్లాలో ని యువతీ యువకులకు ప్రైవేట్  రంగంలో ఉపాధి కల్పించడం కోసం ఉచిత మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఏప్రిల్ 2 వ తేదీన మెదక్ ప్రైవేట్ ఐటిఐ ప్రాంగణంలో సబ్ స్టేషన్ ఎదురుగా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1-30 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. హైద్రాబాద్ అపోలో ఫార్మసీ లో పని చేయుటకు డి. ఫార్మసీ, బి ఫార్మసీ , ఎం ఫార్మసీ అర్హత ఉన్న వారు అర్హులని అన్నారు.వయసు 18 నుండి 35 మధ్య ఉండాలని ,జీతం 20 వేలవరకు లభిస్తుందని తెలిపారు.25 ఫార్మాసిస్ట్ ఉద్యోగాలు కలవన్నారు.17 వేల వరకు జీతంతో 20 ట్రైనీ ఫార్మాసిస్ట్ ఉద్యోగాలు ఉన్నాయన్నారు.

టెన్త్,ఇంటర్,డిగ్రీ అర్హతలతో 25 ఫార్మసీ అసిస్టెంట్ ఉద్యోగాలు..17 వేల వరకు జీతంతో..

బీబీఏ, బీఎస్సీ కెమిస్ట్రీ,న్యూట్రిషన్, ఫుడ్ సైన్స్, అర్హతలతో 5 ప్రొడక్ట్ అడ్వైజర్ ఉద్యోగాలు..17 వేల వరకు జీతంతో..

టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతలతో రిటైల్ ట్రైనీ అసోసియేట్ ఉద్యోగాలు ఉన్నాయన్నారు ..12 వేల వరకు జీతంతో..

ఆసక్తి,అర్హతలు గల వారు,అనుభవం, ఫ్రెషర్స్ కూడా తగిన విద్యార్హతల సర్టిఫికెట్లు తీసుకొని జాబ్ మేళా కు రావాలని సూచించారు.

మిగతా వివరాలకు 8247656356 నంబర్లో సంప్రదించాలని సూచించారు.



ఉచిత మెగా ఆర్థోపెడిక్ వైద్య శిబిరం

 మన కామారెడ్డి లోని వివేకానంద కాలనీ ఆర్యవైశ్య సంఘం రిజిస్టర్ నెంబర్ 565 కామారెడ్డి వారి ఆధ్వర్యంలో శ్రీకర హాస్పటల్ వారిచే శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి దేవాలయం ,వివేకానంద కాలనీ, మునిసిపల్ ఆఫీస్ ప్రక్క వీధిలో, కామారెడ్డిలో ఏప్రిల్ 5వ తేదీ 2026న ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉచిత మెగా ఆర్థోపెడిక్ వైద్య శిబిరం నిర్వహించబడుతుంది 

ఉచిత కన్సల్టేషన్ మరియు చెకప్, ఉచిత మందులు, ఉచిత ఎక్స్ రే చేయబడును. డాక్టర్స్ సలహా మేరకు .

3000 విలువ గల బోన్ మినరల్ డెన్సిటీ పరీక్ష కూడా చేయబడును.

ఒక్క రోజులోనే 38 మోకీలు మార్పిడి చేసిన అనుభవం కలిగిన శ్రీకర హాస్పిటల్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రాకేష్ కొమురవెల్లి ఎమ్మెస్ తో రోబోటిక్ మోకీలు మార్పిడి ఆర్థోస్కోపీ మరియు ప్రామాణిక నిపుణులు .

వివరాలకు 9000992998 మరియు 9866113630 లలో సంప్రదించండి.

నిర్వాహకులు ..

వలిపీశెట్టి లక్ష్మీరాజం ..అధ్యక్షులు 

తాటిపాముల వెంకటకృష్ణ ..ప్రధాన కార్యదర్శి

 కంకణాల శేఖర్ ..కోశాధికారి

 పాత సత్యం.. గౌరవ అధ్యక్షులు





నృత్యంలో ఉచిత శిక్షణ

 నిజామాబాద్ నగరానికి చెందిన సాయి రవళి ఉచితంగా నాట్య శిక్షణ ఇస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. మలేషియా, సింగపూర్, దుబాయ్, శ్రీలంక తదితర దేశ...