29, ఏప్రిల్ 2026, బుధవారం

నృత్యంలో ఉచిత శిక్షణ

 నిజామాబాద్ నగరానికి చెందిన సాయి రవళి ఉచితంగా నాట్య శిక్షణ ఇస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. మలేషియా, సింగపూర్, దుబాయ్, శ్రీలంక తదితర దేశాలలో నాట్య ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు సొంతంగా నాట్య శిక్షణ సంస్థను స్థాపించారు .ఆ సంస్థ ద్వారా వందలాది మంది చిన్నారులను ఉత్తమ కళాకారులుగా తీర్చి దిద్దు తున్నారు. 

వేసవి   సెలవులను వృధా చేయకుండా పేద విద్యార్థినలకు నాట్యంలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు .

 నాట్య శిక్షణ ద్వారా పేరు తెచ్చుకున్న రవళి స్నాతకోత్ర స్థాయిలో గణితంలో బంగారు పతకం సాధించారు. తెలుగు విశ్వవిద్యాలయ  లలిత కళా పీఠంలో ఎంపీ ఎ పూర్తి చేశారు. ఇలా ఉన్నత విద్య అభ్యసించిన రవళి తాను చిన్నప్పటి నుంచి ఇష్టంగా నేర్చుకున్న శాస్త్రీయ నృత్య రంగంలో ప్రత్యేకతను చాటుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నేలకల్ రోడ్డులో సాయి రవళి సొంతంగా ..అందెల రవళి ..పేరిట నాట్య శిక్షణాలయాన్ని స్థాపించారు. ఆ సంస్థ ద్వారా అమ్మానాన్నలు, అమ్మమ్మ ప్రోత్సాహంతో చిన్నారులకు భరతనాట్యం, కూచిపూడి, శాస్త్రీయ నృత్యాన్ని నేర్పిస్తున్నారు .

శిష్యులతో ప్రదర్శనలు..

 రాష్ట్ర జాతీయ స్థాయి వేదికలపై రవళి తన శిష్యులతో ప్రత్యేక ప్రదర్శనలు ఇప్పించారు .ఇప్పటివరకు 300కు పైగా పిల్లలను ఉత్తమ నృత్య కారుణులుగా తీర్చిదిద్దారు. నాట్య మయూరి ,నాట్య విశారద.. కేంద్ర ప్రభుత్వం ద్వారా వారు ఉపకార వేతనాలు, బహుమతులు, ప్రశంసా పత్రాలు అందుకునేలా చేశారు .ఇటీవల దుబాయిలో జరిగిన నాట్య సమ్మేళనం కార్య శాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై అక్కడి భారతీయ పిల్లలకు నృత్యం పై ప్రత్యేక కార్యాశాల నిర్వహించారు. వచ్చే నెల 1 వ తేదీన కేరళలో జరిగే నాట్య సదస్సులో తన శిష్యులతో ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారు. తనకు నాట్యం ప్రాణమని ఆసక్తి ఉన్న పేద విద్యార్థులకు ఉచితంగా నృత్య శిక్షణ ఇస్తున్నానని సాయిరవళి  తెలిపారు.

28, ఏప్రిల్ 2026, మంగళవారం

కడుపారా పులిహోర ఉపశమనం ఇచ్చే అంబలి

 నిజామాబాద్ కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే వారికి దాతలు ఉచితంగా పులిహోర తాగునీరు అందజేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు అధికారులకు సమస్యలను చెప్పుకోవాలని వచ్చే వారికి సీనియర్ సిటిజన్స్ ఫోరం సభ్యులు గత పది సంవత్సరాలుగా పులిహోర అందిస్తూ ఆకలి తీర్చుతు న్నారు .తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ సభ్యులు 15 ఏళ్లుగా చల్లని నీరు అంబలి పంపిణీ చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. 

ప్రజావాణి కార్యక్రమానికి అర్జీలు సమర్పించేందుకు వచ్చే ప్రజల కోసం సీనియర్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ప్రారంభించి స్వయంగా ఉచిత పులిహోర పంపిణీ చేశారు. వేసవి ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రతి సోమవారం సుదూర ప్రాంతాల నుంచి ప్రజావాణికి వచ్చేవారికి సహాయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఇకపై నిరంతరంగా కొనసాగిస్తామని ఫోరం ప్రతినిధులు తెలిపారు. 

ఇక రాజస్థానీ వాకర్స్ గ్రూప్ సౌజన్యంతో చల్లటి తాగునీటిని కూడా అందజేశారు ఈ సేవా కార్యక్రమాన్ని అభినందించిన అదనపు కలెక్టర్ ఫోరం ప్రతినిధులు మరియు వాకర్స్ గ్రూపు సభ్యులను ప్రశంసించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ రెడ్డి ఏవో ప్రశాంత్ సీనియర్ సిటిజన్స్ ఫోరం వాకర్స్ గ్రూప్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



సహారా హెల్త్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

 మారుమూల తండాలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ముకుంద తాండా సర్పంచ్ ప్రకాష్ అన్నారు. 

సోమవారం ఆ తండాలో సహారా హెల్త్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం ప్రారంభించి మాట్లాడారు వైద్యం పట్టణ ప్రజలకు కాకుండా మారుమూల ప్రాంతంలోని తండాలలో నివసించే గిరిజనుల ఇంటింటికి వచ్చి వైద్యం అందించడం అభినందనీయం అన్నారు. 

గిరిజన ప్రాంతాలలో సిఎస్ఆర్ బాధ్యతతో ఆరోగ్యం పై అవగాహన కలిగించడం గొప్ప విషయం అన్నారు ఈ ప్రాజెక్టు ద్వారా 100 గిరిజన తండాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో సహారా హెల్త్ డెవలప్మెంట్ సొసైటీ ప్రతినిధులు సర్పంచ్ ప్రకాష్ లక్ష్మణ్ నాయక్ మహిపతి సర్దార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

శిక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోండి

 ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు టాస్క్సుం సి ఓ ఓ S .రాఘవేందర్ రెడ్డి మంగళవారం కల్వకుర్తి నియోజకవర్గం లో పలు కార్యక్రమాలలో హాజరు కానున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా ఉదయం 10 గంటల 30 నిమిషాలకు కల్వకుర్తి పట్టణంలోని గవర్నమెంట్ హై స్కూల్ బస్టాండ్ సమీపంలో నిరుద్యోగ యువత కోసం ఏర్పాటు చేసిన నాలుగవ సంకిరెడ్డి ఉచిత ఎస్సై కానిస్టేబుల్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించనున్నార.


22, ఏప్రిల్ 2026, బుధవారం

అన్నపూర్ణ స్వచ్ఛంద సేవా సంస్థ

 వేములవాడ నాలుగవ వార్డు మహాలక్ష్మి వీధికి చెందిన పెంట మల్లేశం మరణించగా అంత్యక్రియల అనంతరం వారి కుటుంబానికి అన్నపూర్ణా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్ పర్సన్ తోటలహరి ద్వారా ఉచితంగా భోజనం అందించారు.

 పెంట స్వరూప్ ,రవి ప్రిన్స్ అందించిన సమాచారం మేరకు సకాలంలో భోజనం పంపించినట్లు చైర్పర్సన్ తోటలహరి తెలిపారు. 

వేములవాడ పట్టణంలో ఎవరైనా మరణించిన సందర్భంలో ట్రస్ట్ నంబర్ 8919376459 కు సమాచారం ఇస్తే బాధిత కుటుంబాలకు ఉచితంగా భోజనం అందిస్తామని అని తెలిపారు.

13, ఏప్రిల్ 2026, సోమవారం

వేస్ట్ ఆప్టిమైజేషన్ ప్రొఫెషనల్ కోర్స్.. ఉచిత శిక్షణ

 పర్యావరణ హిత కార్య క్రమాల్లో నైపుణ్యం పెంపొందించడమే లక్ష్యంగా చేపట్టిన గ్రీన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో గచ్చిబౌలి లోని EPTRI సర్టిఫికెట్ కోర్సులను ప్రవేశ పెట్టింది.

ఇందులో ఒకటి 90 రోజుల ఉచిత శిక్షణ.. వేస్ట్ ఆప్టిమైజేషన్ ప్రొఫెషనల్ కోర్స్ అని నిర్వహిస్తున్నారు.

అర్హులైన వారికి ఉచిత బస, క్షేత్ర స్థాయి పర్యటనల అనంతరం సర్టిఫికెట్ ఇస్తున్నారు.దీంతో రీసైక్లింగ్ కేంద్రాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు తెలిపారు.

స్కిల్ ఇండియా మిషన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ స్కిల్ ఇండియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. పర్యావరణ హిత కార్య క్రమాల్లో శ్రామిక శక్తిని పెంపొందించడమే ఈ ప్రోగ్రామ్ లక్ష్యం.ఇందులో భాగంగా పలు ఉచిత కోర్సులు నిర్వహిస్తున్నారు.

ఇందులొ భాగంగా థియరీ,ప్రాక్టికల్ తరగతులతో ప్రాథమిక భావనలపై పరిజ్ఞానం అందించడం తో పాటు క్షేత్ర స్థాయి పర్యటనల కు భాగస్వామ్యం కల్పిస్తున్నారు.

ఇందులో పొందిన నైపుణ్యాలతో పరిశ్రమలు , రీసైక్లింగ్ కేంద్రాలు,మున్సిపల్ కార్పొరేషన్ లలో ఉద్యోగాలు పొందవచ్చునని ప్రతినిధులు తెలిపారు.

ఇంటర్, డిగ్రీ,బీటెక్ లతోపాటు సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారు అర్హులు.



8, ఏప్రిల్ 2026, బుధవారం

ఆసుపత్రికి ఉచితంగా సి ప్యాప్ యంత్రం అందజేత

 ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో సీప్యాప్ యంత్రాన్ని కొందరి వైద్యులు ఉచితంగా అందజేశారు. ఆసుపత్రిలో విజయవంతంగా ఇన్స్టాలేషన్ పూర్తయింది.

 ఈ యంత్రాన్ని హైదరాబాదులోని అంకుర ఆసుపత్రికి చెందిన డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అందించారు. బయో మెడికల్ ఇంజనీర్ ఇస్లావత్ రెడ్డి ఇన్స్టాలేషన్ చేయగా, ఖమ్మం జిల్లాకు చెందిన ఎం సి హెచ్ పీడియాట్రిక్ హెచ్ ఓ డి డాక్టర్ బాబు రత్నాకర్ మరియు డాక్టర్ రాంబాబు ఆధ్వర్యంలో పరీక్షించారు. 

యంత్రం సక్రమంగా పనిచేస్తూ ,రోగులకు ఉపయోగించేందుకు సిద్ధంగా ఉందని వారు తెలిపారు. ఈ యంత్రం ద్వారా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని వైద్యుల తెలిపారు.

ఈ సందర్భంగా ఈ యంత్రాన్ని ఉచితంగా అందజేసిన వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఉచితంగా వాటర్ ఫిల్టర్ అందజేత

 బిచ్కుంద మాజీ సర్పంచ్ మైపతి సిద్ధిరాం గారి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు మహిపతి శ్రీనివాస్ గణేష్ మందిరం ప్రభుత్వ పాఠశాలకు వాటర్ ఫిల్టర్ ఉచితంగా అందజేశారు. 

సుమారు 41 రూపాయల వేల విలువ చేసే వాటర్ ఫిల్టర్ ను మంగళవారం బిగించి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు

నిరుపేద ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం

 నిరుపేద ఖైదీలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా న్యాయ సహాయం అందించే అవకాశం ఉన్నట్లు డి ఎల్ ఎస్ ఏ కార్యదర్శి  టి.నాగరాణి గారు పేర్కొన్నారు.

కామారెడ్డి కరగారాన్ని తనిఖీ చేసి ఖైదీలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఖైదీల మానవ హక్కుల పరిరక్షణ ,న్యాయ సహాయం పొందే హక్కు, కేసుల పురోగతి తదితర అంశాలపై ఆమె మాట్లాడారు. అనంతరం కారాగారా వంటగది, కార్యాలయము, ఖైదీల గదులను తనిఖీ చేశారు.

3, ఏప్రిల్ 2026, శుక్రవారం

స్వామి రామానంద తీర్థ సంస్థలో ఉచిత శిక్షణ


భూదాన్ పోచంపల్లి మండలంలోని జలాల్పురం లో గల స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మరియు మేధా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి ఆధారిత సాంకేతిక కోర్సులలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ చైర్మన్ ఎన్ కిషోర్ రెడ్డి తెలిపారు .

ఎలక్ట్రిషన్ అండ్ సోలార్ ఇన్స్టాలేషన్ కోర్సు కు ఐటిఐ..

 కంప్యూటర్ హార్డ్వేర్, సీసీటవీ ,సెల్ ఫోన్ రిపేరింగ్ కోర్సులకు పదవ తరగతి ..

టైలరింగ్, ఎంబ్రాయిడరీ, జర్దోజి క్విల్ట్ మేకింగ్ కోర్సులకు ఎనిమిదవ తరగతి కలిగి ఉండాలని తెలిపారు .

అభ్యర్థులు తమ విద్యార్హతల ఒరిజినల్ మరియు జిరాక్స్ కాపీలతో పాటు ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఫోటోలతో ఈ నెల ఆరవ తేదీ లోపు సంస్థలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

 ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో భోజనం, వసతి కల్పించనున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఉద్యోగం కూడా కల్పిస్తామని అన్నారు.

 పూర్తి వివరాలకు 9133 90 8,000 మరియు 9133 90 8 111 నంబర్లలో సంప్రదించాలని సూచించారు

వదిరాజా భట్ @ ఓ శాట్..

 వదిరాజా భట్ కర్ణాటక కు చెందిన ఐటీ నిపుణుడు . పాతికేళ్ల కిందటే అక్కడో కంపెనీ స్థాపించాడు. అమెరికాలో స్థిరపడిన వాళ్లందరిలాగే సొంతూరికీ అయిన వ...