Showing posts with label ఫ్రీ హాస్పిటల్ సేవలు. Show all posts
Showing posts with label ఫ్రీ హాస్పిటల్ సేవలు. Show all posts

Saturday, 11 April 2026

ఉచిత కంటి వైద్య శిబిరం@మాక్లూర్

 మాకూర్ మండల పరిధిలోని ఆర్టీసీ కాలనీలోని మాక్లూర్ పోలీస్ ఆధ్వర్యంలో, లయన్స్ క్లబ్ వారి సహకారంతో ఆటో డ్రైవర్లు మరియు పదవి విరమణ పొందిన ఉద్యోగుల కోసం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్ల కంటి చూపు అత్యంత కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు. డ్రైవర్లు తమ ఆరోగ్యం పై ముఖ్యంగా కంటిచూపుపై దృష్టి పెట్టడం ద్వారా తమ ప్రాణాలతో పాటు ఇతరుల భద్రతను కాపాడవచ్చును సూచించారు. ఈ శిబిరంలో ఆటో డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి ఐ డ్రాప్స్ అందించినట్లు పేర్కొన్నారు .

ఇందులో నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ మాక్లోర్ ఎస్సై 2 మొగులయ్య నవీపేట్ ఎస్సై టు యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Thursday, 9 April 2026

10 న ఉచిత ఆయుష్ వైద్య శిబిరం

 కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎన్జీవోఎస్ కాలనీలో ఈ నెల 10వ తేదీన ఉచిత మెగా ఆయుష్ ఆరోగ్య వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు 14వ వార్డు కౌన్సిలర్ రామ్ శెట్టి హర్షిత తెలిపారు .ప్రజా పాలనా, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆయుష్ దినోత్సవం వేడుకలు ఎన్జీవోఎస్ కాలనీలో ఆయుష్ కార్యాలయం ఆవరణలో ఉచిత మెగా ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు .

ఈ సందర్భంగా హోమియోపతి ,ఆయుర్వేదం ,యునాని పరీక్షలు ఉచితంగా జరపనున్నట్లు తెలిపారు. ఉదయం 6:30 నుండి 7 గంటల 30 నిమిషాల వరకు యోగా నిర్వహణ తరగతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

 కామారెడ్డి పట్టణ ప్రజలు ,పరిసర ప్రాంతాల ప్రజలు, 14వ వార్డు ప్రజలు హోమియోపతి ,యునాని, ఆయుర్వేద పరీక్షలకు హాజరై సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్  మరియు జిల్లా వైద్య అధికారులు హాజరవుతారని తెలిపారు .

ఈ కార్యక్రమంలో హోమియోపతి, ఆయుర్వేద, యునాని యోగ డాక్టర్స్ డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్  జునైద్ బేగం, డాక్టర్ విజయ, డాక్టర్ దేవయ్య, ఫార్మసిస్ట్ కిషోర్ ,యోగ మాస్టర్ బాల్ లింగం తదితరులు పాల్గొన్నారు.

Wednesday, 8 April 2026

నేడు పెద్ద మల్లారెడ్డి లో వైద్య శిబిరం

 భిక్కనూరు మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో బుధవారం ఉదయం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఆర్వీఎం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు సర్పంచ్ సాయ గౌడ్ ,ఉప సర్పంచ్ చైతన్య మంగళవారం తెలిపారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిబిరంలో ఆర్విఎం ఆసుపత్రి వైద్యులు వివిధ రకాల రోగాలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేస్తారని అన్నారు. 

ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. శాస్త్ర చికిత్సలు ,ఇతర మెరుగైన వైద్యం కావాల్సిన వారిని గురువారం ప్రత్యేక వాహనంలో ఆర్విఎం ఆసుపత్రికి తీసుకెళ్లి ఉచిత వైద్యం అందిస్తారని తెలిపారు.


ఆసుపత్రికి ఉచితంగా సి ప్యాప్ యంత్రం అందజేత

 ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో సీప్యాప్ యంత్రాన్ని కొందరి వైద్యులు ఉచితంగా అందజేశారు. ఆసుపత్రిలో విజయవంతంగా ఇన్స్టాలేషన్ పూర్తయింది.

 ఈ యంత్రాన్ని హైదరాబాదులోని అంకుర ఆసుపత్రికి చెందిన డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అందించారు. బయో మెడికల్ ఇంజనీర్ ఇస్లావత్ రెడ్డి ఇన్స్టాలేషన్ చేయగా, ఖమ్మం జిల్లాకు చెందిన ఎం సి హెచ్ పీడియాట్రిక్ హెచ్ ఓ డి డాక్టర్ బాబు రత్నాకర్ మరియు డాక్టర్ రాంబాబు ఆధ్వర్యంలో పరీక్షించారు. 

యంత్రం సక్రమంగా పనిచేస్తూ ,రోగులకు ఉపయోగించేందుకు సిద్ధంగా ఉందని వారు తెలిపారు. ఈ యంత్రం ద్వారా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని వైద్యుల తెలిపారు.

ఈ సందర్భంగా ఈ యంత్రాన్ని ఉచితంగా అందజేసిన వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Saturday, 4 April 2026

ఉచిత వైద్య శిబిరం @ రెంజల్

 ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెంజల్ జిల్లాపరిషత్ పాఠశాల లో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ నాయకుడు నల్ల నవీన్ కుమార్ తెలిపారు.

 రెంజల్ మండలం, పరిసర ప్రాంతాల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇట్టి వైద్య శిబిరంలో పాల్గొని విజయవంతం చేయాలని ,ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు.

 ఇట్టి మెగా వైద్య శిబిరంలో అన్ని రకాల వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి ,మందులు పంపిణీ చేస్తారని తెలిపారు. శుక్రవారం నాడు ఈ మెగా ఉచిత వైద్య శిబిరానికి సంబంధించిన కరపత్రాలను వారు ఆవిష్కరించారు .

ఈ కార్యక్రమంలో కాలేవార్ సంజీవ్, సాయి ప్రకాష్, సాయి కమార్ ,సంజయ్, గంగరాజు, ప్రకాశ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Wednesday, 1 April 2026

ఉచిత మెగా జాబ్ మేళా @ మెదక్

 మెదక్ జిల్లాలో ని యువతీ యువకులకు ప్రైవేట్  రంగంలో ఉపాధి కల్పించడం కోసం ఉచిత మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఏప్రిల్ 2 వ తేదీన మెదక్ ప్రైవేట్ ఐటిఐ ప్రాంగణంలో సబ్ స్టేషన్ ఎదురుగా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1-30 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. హైద్రాబాద్ అపోలో ఫార్మసీ లో పని చేయుటకు డి. ఫార్మసీ, బి ఫార్మసీ , ఎం ఫార్మసీ అర్హత ఉన్న వారు అర్హులని అన్నారు.వయసు 18 నుండి 35 మధ్య ఉండాలని ,జీతం 20 వేలవరకు లభిస్తుందని తెలిపారు.25 ఫార్మాసిస్ట్ ఉద్యోగాలు కలవన్నారు.17 వేల వరకు జీతంతో 20 ట్రైనీ ఫార్మాసిస్ట్ ఉద్యోగాలు ఉన్నాయన్నారు.

టెన్త్,ఇంటర్,డిగ్రీ అర్హతలతో 25 ఫార్మసీ అసిస్టెంట్ ఉద్యోగాలు..17 వేల వరకు జీతంతో..

బీబీఏ, బీఎస్సీ కెమిస్ట్రీ,న్యూట్రిషన్, ఫుడ్ సైన్స్, అర్హతలతో 5 ప్రొడక్ట్ అడ్వైజర్ ఉద్యోగాలు..17 వేల వరకు జీతంతో..

టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతలతో రిటైల్ ట్రైనీ అసోసియేట్ ఉద్యోగాలు ఉన్నాయన్నారు ..12 వేల వరకు జీతంతో..

ఆసక్తి,అర్హతలు గల వారు,అనుభవం, ఫ్రెషర్స్ కూడా తగిన విద్యార్హతల సర్టిఫికెట్లు తీసుకొని జాబ్ మేళా కు రావాలని సూచించారు.

మిగతా వివరాలకు 8247656356 నంబర్లో సంప్రదించాలని సూచించారు.



ఉచిత మెగా ఆర్థోపెడిక్ వైద్య శిబిరం

 మన కామారెడ్డి లోని వివేకానంద కాలనీ ఆర్యవైశ్య సంఘం రిజిస్టర్ నెంబర్ 565 కామారెడ్డి వారి ఆధ్వర్యంలో శ్రీకర హాస్పటల్ వారిచే శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి దేవాలయం ,వివేకానంద కాలనీ, మునిసిపల్ ఆఫీస్ ప్రక్క వీధిలో, కామారెడ్డిలో ఏప్రిల్ 5వ తేదీ 2026న ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉచిత మెగా ఆర్థోపెడిక్ వైద్య శిబిరం నిర్వహించబడుతుంది 

ఉచిత కన్సల్టేషన్ మరియు చెకప్, ఉచిత మందులు, ఉచిత ఎక్స్ రే చేయబడును. డాక్టర్స్ సలహా మేరకు .

3000 విలువ గల బోన్ మినరల్ డెన్సిటీ పరీక్ష కూడా చేయబడును.

ఒక్క రోజులోనే 38 మోకీలు మార్పిడి చేసిన అనుభవం కలిగిన శ్రీకర హాస్పిటల్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రాకేష్ కొమురవెల్లి ఎమ్మెస్ తో రోబోటిక్ మోకీలు మార్పిడి ఆర్థోస్కోపీ మరియు ప్రామాణిక నిపుణులు .

వివరాలకు 9000992998 మరియు 9866113630 లలో సంప్రదించండి.

నిర్వాహకులు ..

వలిపీశెట్టి లక్ష్మీరాజం ..అధ్యక్షులు 

తాటిపాముల వెంకటకృష్ణ ..ప్రధాన కార్యదర్శి

 కంకణాల శేఖర్ ..కోశాధికారి

 పాత సత్యం.. గౌరవ అధ్యక్షులు





Monday, 30 March 2026

ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం

 10-3-2026 నుండి 9-4-2026 వరకు

పశువులలో సంభవించే గాలికుంటు వ్యాధిని నివారించడానికి ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉచితంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహిస్తోంది.

గాలికుంటు వ్యాధి ద్వారా పశువులు అనారోగ్యానికి గురై పాలు సరిగా ఇవ్వకపోవడం ,ఇంకా పలు రకాల సమస్యలు వస్తాయి.నోట్లో పుండ్లు పడతాయి. తీవ్ర జ్వరం వస్తుంది.

వీటిని నివారించి ఆవులు, గేదెల ఆరోగ్యాన్ని కాపాడడానికి 

ఉచితంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నారు..



ప్రభుత్వ  వెటర్నరీ,   పశుసంవర్ధక శాఖ వారు గ్రామానికి వచ్చినప్పుడు ఆవులు, గేదెల కు టీకాలు వేయించి ఈ " జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం" ను విజయ వంతం చేయాలని కోరుతున్నారు...



వయో వృద్ధులకు ఉచిత వైద్య శిబిరం

 హైదరాబాదులోని పంజాగుట్ట లో గల నిమ్స్ ఆసుపత్రిలో మార్చి 31వ తేదీన వయోవృద్ధులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహించనున్నట్లు నిమ్స్ వైద్య సిబ్బంది తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వ హెల్త్ మిషన్ 100 కార్యక్రమంలో భాగంగా నిమ్స్ వైద్యశాల యొక్క జీర్యాట్రిక్ మెడిసిన్ మరియు అడ్మినిస్ట్రేటివ్ విభాగాల ఆధ్వర్యంలో ఈ ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు సంస్థ డైరెక్టర్ నగరి బీరప్ప తెలిపారు.

వృద్ధుల్లో తలెత్తే శారీరక మానసిక సమస్యలను ముందుగానే గుర్తించి తగు చికిత్స అందించడం ఈ శిబిరం యొక్క ప్రధాన ఉద్దేశం అని బీరప్ప తెలిపారు.

వృద్ధులకు అవసరమైన కీలక  పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నట్లు డైరెక్టర్ తెలిపారు.ఇందులో కంప్లీట్ బ్లడ్ పిక్చర్, రాండమ్ బ్లడ్ షుగర్,సీరం క్రియాటినిన్ వంటి పరీక్షలుంటాయన్నారు.. ఫిజియోథెరపీ అవసరం ఉన్నవారికి సేవలు అందిస్తారని,మానసిక ప్రశాంతత కోసం ఉచిత ప్రొఫెషనల్ కౌన్సెలింగ్ ఉంటుందని తెలిపారు.

వృద్ధాప్యంలో వచ్చే సాధారణ సమస్యల గురించి అవగాహన కల్పించడమే ఈ శిబిరం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.60 ఏళ్లు పైబడిన వృద్ధులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

ఆసక్తి గల వారు నిమ్స్ ఆసుపత్రిలో పాత బ్లాక్ లో గల నెఫ్రాలజీ సెమినార్ హాల్ ( గ్రౌండ్ ఫ్లోర్ )లో మార్చి 31వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తమ పేర్లను నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.

శిబిరానికి వచ్చే వారు తప్పకుండా తమ ఆధార్ కార్డును తీసుకుని రావాలని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.


Sunday, 29 March 2026

జూన్ 12 వరకు ఉచిత వైద్య శిబిరం.. ఎడపల్లి

 ఎడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జూన్ 12 వరకు ఉచిత వైద్య శిబిరం కొనసాగుతుందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 99 రోజుల ఆరోగ్య కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

మార్చ్ 6 న ప్రారంభమైన కార్యక్రమం జూన్ 12 వరకు కొనసాగుతుందని తెలిపారు.6 గురు స్పెషలిస్ట్ వైద్యులు సేవలందించారని తెలిపారు..కార్యక్రమాన్ని వినియోగించుకుని ఆరోగ్యం కాపాడుకోవాలని పిలుపునిచ్చారు..

ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ @ భిక్ నూర్,31-3-26

మార్చి 31 న భిక్ నూర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. భిక్నూర్ పరిసర ప్రాంతాల ప్రజలు ఈ క్యాంప్ ను వినియోగించుకుని తమ ఆరోగ్య సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. వివిధ రకాల స్పెషలిస్ట్ వైద్యులు అందుబాటులో ఉంటారని, వారి సేవలను వినియోగించుకోవాలని కోరారు. అందరూ కలిసి మెగా హెల్త్ క్యాంప్ ను విజయవంతం చేయాలని కోరారు.

Friday, 27 March 2026

3 రోజులు ఉచిత కన్సల్టేషన్ @ కీర్తి హాస్పిటల్

 కామారెడ్డి పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగ పరచుకోగలరు..

మార్చి నెల 28,29,30 తేదీలలో 3 రోజులు ఉచిత కన్సల్టేషన్.. కీర్తి హాస్పిటల్, కామారెడ్డి లో..

ఆపోజిట్ BSNL ఆఫీసు ,

నిజాం సాగర్ చౌరస్తా,

కామారెడ్డి..

ఫోన్..08462-469989,93922 42750

3 రోజుల పాటు రోగులకు ఉచితంగా చూడబడును.. 

రక్త పరీక్షలు,ecg టెస్టులపై 50 శాతం తగ్గింపు ..



Thursday, 26 March 2026

ఎస్ఎస్సి విద్యార్థులకు ఉచిత కౌన్సిలింగ్

 రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పదవ తరగతి పరీక్షల విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి అడ్వాన్స్డ్ సైకలాజికల్  సర్వీసెస్ అసోసియేషన్ నిర్ణయించిందని అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ భరత్ తెలిపారు.

పరీక్షా సమయంలో విద్యార్థులకు ఎదురయ్యే స్ట్రెస్,యాంగ్జైటీ తదితర సమస్యలకు ఉచితంగా పరిష్కారం చూపి ,వారు విజయవంతంగా పరీక్షలు రాసేలా చూడాలని తమ అసోసియేషన్ పూనుకుందని తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా 105 మంది సైకాలజిస్టులు , అసోసియేషన్ పిలుపు మేరకు ఉచిత టెలి కౌన్సెలింగ్ ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు తెలిపారు..

జిల్లాల వారీగా వారు అందుబాటులో ఉండే సమయాలు, పేర్లతో పోస్టర్ లు రూపొందించామని ,ఫోన్ నెంబర్లు కూడా పొందుపరచామని ,పరీక్షా సమయంలో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే ఆ ఫోన్ నెంబర్లకు కాల్ చేసి సలహాలు పొందవచ్చని తెలిపారు.

ఈ క్రమంలో విద్యార్థులకు మరియు సైకాలజిస్టులకు ఏవైనా సమస్యలు ఎదురైతే ఈ కింది నెంబర్లకు కాల్ చేయాలని సూచించారు 

800855 3069,  మరియు 99633 38639, 8686 4442 00 .

Wednesday, 25 March 2026

ఉచిత యోగా శిక్షణ @కామారెడ్డి

 కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎన్జీవోస్ కాలనీలో గల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా ప్రతిరోజు ఉదయం పూట యోగా శిక్షణ ఇస్తున్నారు. గతంలో పదుల సంఖ్యలో వచ్చే వారు  ప్రస్తుతం 50 కి పైగా వచ్చి యోగ నేర్చుకుంటున్నారు. వారి వారి వ్యక్తిగత అనారోగ్యాలకు అనుగుణంగా యోగాసనాలు శిక్షకుడు లింగం నేర్పిస్తున్నారు.

ప్రస్తుతం సమాజంలో నెలకొన్న పరిస్థితులలో అనేకమంది ప్రజలు చర్మవ్యాధులు ,వెన్ను నొప్పి సంబంధిత వ్యాధులు స, డిస్క్ లోపాలు తదితర సమస్యలతో దీర్ఘకాలంగా బాధపడుతూ ప్రైవేటులో లక్షల రూపాయలు  ఖర్చుపెట్టినా తగిన ఫలితం పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో సంప్రదాయ వైద్యం వైపు మొగ్గు చూపుతున్నారు.

ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతో , సంప్రదాయ వైద్యానికి పెద్ద పీట వేస్తూ కేంద్రం నేషనల్ ఆయుష్ మిషన్ పేరుతో వెల్నెస్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో ఇద్దరు యోగ శిక్షకులు ఒక వైద్యుడు ఒక అటెండర్ ను నియమించారు. ఎంతోమంది ప్రజలు వీటిని వినియోగించుకుంటూ సత్ఫలితాలను పొందుతున్నారు. ఉచితంగా సేవలు అందడంతో ప్రజలు ఆర్థిక భారం తగ్గించుకుంటూ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు.

Sunday, 22 March 2026

ప్రతి శని, ఆది వారాల్లో ఉచిత టెలి మెడిసిన్ సేవలు

 శ్రీ సత్యసాయి ప్రాణమిత్ర ఉచిత టెలి మెడిసిన్ సేవ కోసం ప్రతి శని ,ఆదివారాలలో ఫోన్ ద్వారా అన్ని వ్యాధులకు వైద్యుల సలహాలు ,వైద్యము పొందవచ్చును అని శ్రీ సత్య సాయి సేవ సమితి ,కామారెడ్డి కేంద్రం నిర్వాహకులు తెలిపారు .

శని , ఆదివారాలలో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. 080-4717 9797 నంబర్కు ఫోన్ చేస్తే 24 మంది వైద్యులు అదుబాటులో ఉంటారని ,ప్రజలు వినియోగించుకోవాలని కోరారు..

Friday, 13 March 2026

ఉచిత శిక్షణ @ నిజామాబాద్

 నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని తెలంగాణ రూరల్ డెవలప్ మెంట్ ఆధ్వర్యంలో ఎంప్లాయ్ మెంట్ జెనరేషన్,మార్కెటింగ్ మిషన్ egmm, నిపుణ్ ఎడ్యుకేషనల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత కోసం హెల్త్ కేర్ సెక్టార్,కంప్యూటర్స్ విభాగాల్లో శిక్షణ అందించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

18 నుండి 35 ఏళ్ల వయసు గల, పదవ తరగతి,ఆ పైన ఉత్తీర్ణత కలిగిన ఆసక్తి కలిగిన అభ్యర్థులు యెండల టవర్స్ ఎదురుగా గల నిపుణ్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యాలయంలో సంప్రదించాలని డైరెక్టర్ మంజుల ఆకాశ పేర్కొన్నారు.ఆసక్తి గల అభ్యర్థులు ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ ఫోటో ,కుల ధృవీకరణ పత్రంతో ఆఫీసులో సంప్రదించాలని తెలిపారు

నృత్యంలో ఉచిత శిక్షణ

 నిజామాబాద్ నగరానికి చెందిన సాయి రవళి ఉచితంగా నాట్య శిక్షణ ఇస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. మలేషియా, సింగపూర్, దుబాయ్, శ్రీలంక తదితర దేశ...