Showing posts with label ఫ్రీ జాబ్ మేళా. Show all posts
Showing posts with label ఫ్రీ జాబ్ మేళా. Show all posts

Wednesday, 22 April 2026

ఏప్రిల్ 25న ఉచిత జాబ్ మేళా

 పెద్దపల్లి జిల్లాలోని నిరుద్యోగ యువకులకు మేడ్ప్లస్ కంపెనీలో ఉద్యోగాలు కల్పించుటకు ఏప్రిల్ 25న శనివారం రూమ్ నెంబర్ 233 నూతన కలెక్టర్ భవన సముదాయంలో గల జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై తిరుపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు.

 మెడిప్లస్ కంపెనీలో 45 ఫార్మసిస్ట్ జాబ్స్, 50 ఆడిట్ అసిస్టెంట్ ,201 సెక్యూరిటీ గార్డ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఆసక్తి గలవారు ఏప్రిల్ 25న ఉదయం 11 గంటలకు సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో రూమ్ నెంబర్ 233లో నూతన కలెక్టర్ భవన సముదాయంలో పెద్దపల్లి మొదటి అంతస్తులో వచ్చి తమ పేరు నమోదు చేసుకోవాలని మరిన్ని వివరాలకు 8985 336947 మరియు 8121262441 నెంబర్లలో సంప్రదించాలని తెలిపారు.

Friday, 17 April 2026

18 న ఉచిత జాబ్ మేళా @ రామాయంపేట

 మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 18 తేదీ న ఉచిత జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ హిమజ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు. MSN కెమికల్ కంపెనీ ప్రతినిధుల ఆధ్వర్యంలో జాబ్ మేళా కొనసాగుతుందని ఆమె చెప్పారు.

ఇంటర్ MPC,ఇంటర్ BI PC,ఒకేషనల్ MLT కోర్సులు చదివిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

కళాశాల లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉచిత జాబ్ మేళా కొనసాగుతుందని ఆమె చెప్పారు.విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని కోరారు.

17 నుండి 21 ఏళ్ల వయసు గల యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంపెనీ ఆకర్షణీయమైన వేతనం చెల్లిస్తుందని ఆమె తెలిపారు.

18 న ఉచిత జాబ్ మేళా @ కామారెడ్డి కలెక్టరేట్

 కామారెడ్డి జిల్లా లోని నిరుద్యోగ యువతి యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ నెల 18 తేదీన ఉచిత జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కామారెడ్డి జిల్లా ఉపాధి కల్పనాధికారి రజనీ కిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు.

కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని ప్రముఖ కంపెనీ అయిన గూగుల్ పే  లో ఉద్యోగాలు ఉన్నాయన్నారు.18-35 ఏళ్ల వయసు ఉన్న యువతీ యువకులు కామారెడ్డి కలెక్టరేట్ లోని రూమ్ నంబర్ 121 లో ఉదయం 10.30 నిమిషాల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే మౌఖిక పరీక్షలకు హాజరు కావాలని కోరారు.

అభ్యర్థులు ఫొటోలు, సర్టిఫికెట్ ల నకలు తీసుకొని రావాలని సూచించారు.

Friday, 10 April 2026

15 న ఉచిత జాబ్ మేళా @ బాన్సువాడ

 ఏప్రిల్ 15 తేదీన ఉచిత మెగా జాబ్ మేళా బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించనున్నట్లు కామారెడ్డి జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం ఒక ప్రకటనలో తెలిపారు.

ఎటువంటి కన్సల్టెన్సీ ఫీజులు లేకుండా ఉచితంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ వారి సహకారంతో నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడమే లక్ష్యంగా ఈ జాబ్ మేళా ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

పదవ తరగతి,ఇంటర్,డిగ్రీ, ఎంబీఏ, బీఎస్సీ అగ్రికల్చర్, హోటల్ మేనేజ్ మెంట్ చదివిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

18 నుండి 30 ఏళ్ల లోపు వయసు గల వారు అర్హులనీ ,బ్యాంకింగ్, హోటల్ మేనేజ్ మెంట్, ఐటిఐ సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఫార్మా తదితర రంగాలలో ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు.

ఇతర వివరాలకు 94933 10781,98484 30111 ఫోన్ నంబర్ లలో సంప్రదించాలని సూచించారు.

Wednesday, 8 April 2026

9 న ఉచిత జాబ్ మేళా @ బిచ్కుంద డిగ్రీ కళాశాల లో

 బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్లేస్మెంట్ సెల్ ఐక్యూసీ మరియు టాస్క్ ల ఆధ్వర్యంలో యువతీ యువకులకు ఉచిత జాబ్ మేళా ఈ నెల 9వ తేదీన నిర్వహిస్తున్నట్లు డిగ్రీ కళాశాల వర్గాలు తెలిపాయి.

శ్రీ విజయ బయో ఫెర్టలైజర్స్ కంపెనీ తరఫున సేల్స్ ఎగ్జిక్యూటివ్, గ్రూప్ లీడర్, టీమ్ మేనేజర్ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ అశోక్ తెలిపారు.

దీనితోపాటు ముత్తూట్ ఫైనాన్స్ ఇంటర్ షిప్ ఇంటర్వ్యూలు కూడా ఉంటాయని తెలిపారు. సెలెక్ట్ అయిన వారికి ఆరు నెలల అనంతరం జూనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయికి ప్రమోట్ చేస్తారని తెలిపారు. ఇంటర్ డిగ్రీ పాసైన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.

ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 9908785718, 970 11 555 12, 970 40 44 029 మరియు 9492 7955 24 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Saturday, 4 April 2026

6 న ఉచిత ఉద్యోగ మేళా

 కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నల ఆరవ తేదీన ఇటువంటి కన్సల్టెన్సీ ఫీజులు లేకుండా ఉచితంగా ఉద్యోగమేళా ఏర్పాటు చేశామని ప్రిన్సిపల్ జయకుమారి తెలిపారు హైదరాబాద్ కు చెందిన వివిధ రకాల సంస్థల ఆధ్వర్యంలో కార్యక్రమం జరగనుంది అన్నారు కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి మేళా ప్రారంభం అవుతుందని ఆసక్తి గల యువతీ యువకులు తగిన ధ్రువపత్రాలతో జాబ్ మేళా కు  రావాలని సూచించారు.

Wednesday, 1 April 2026

ఉచిత మెగా జాబ్ మేళా @ మెదక్

 మెదక్ జిల్లాలో ని యువతీ యువకులకు ప్రైవేట్  రంగంలో ఉపాధి కల్పించడం కోసం ఉచిత మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఏప్రిల్ 2 వ తేదీన మెదక్ ప్రైవేట్ ఐటిఐ ప్రాంగణంలో సబ్ స్టేషన్ ఎదురుగా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1-30 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. హైద్రాబాద్ అపోలో ఫార్మసీ లో పని చేయుటకు డి. ఫార్మసీ, బి ఫార్మసీ , ఎం ఫార్మసీ అర్హత ఉన్న వారు అర్హులని అన్నారు.వయసు 18 నుండి 35 మధ్య ఉండాలని ,జీతం 20 వేలవరకు లభిస్తుందని తెలిపారు.25 ఫార్మాసిస్ట్ ఉద్యోగాలు కలవన్నారు.17 వేల వరకు జీతంతో 20 ట్రైనీ ఫార్మాసిస్ట్ ఉద్యోగాలు ఉన్నాయన్నారు.

టెన్త్,ఇంటర్,డిగ్రీ అర్హతలతో 25 ఫార్మసీ అసిస్టెంట్ ఉద్యోగాలు..17 వేల వరకు జీతంతో..

బీబీఏ, బీఎస్సీ కెమిస్ట్రీ,న్యూట్రిషన్, ఫుడ్ సైన్స్, అర్హతలతో 5 ప్రొడక్ట్ అడ్వైజర్ ఉద్యోగాలు..17 వేల వరకు జీతంతో..

టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతలతో రిటైల్ ట్రైనీ అసోసియేట్ ఉద్యోగాలు ఉన్నాయన్నారు ..12 వేల వరకు జీతంతో..

ఆసక్తి,అర్హతలు గల వారు,అనుభవం, ఫ్రెషర్స్ కూడా తగిన విద్యార్హతల సర్టిఫికెట్లు తీసుకొని జాబ్ మేళా కు రావాలని సూచించారు.

మిగతా వివరాలకు 8247656356 నంబర్లో సంప్రదించాలని సూచించారు.



Sunday, 15 March 2026

మార్చి 22న కామారెడ్డి లో ఉచిత మెగా జాబ్ మేళా

 కామారెడ్డి లోని పార్శి రాములు కళ్యాణమండపంలో మార్చి 22వ తేదీన జిసిఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు టిపిసిసి రాష్ట్ర జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి శనివారం విలేకరుల సమావేశంలో తెలిపారు .ఆయన మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలో గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్, ఐటి, ఇన్ఫర్మేషన్ ,బ్యాంకింగ్ ,ఫార్మసీ ,సర్వీస్ సెక్టార్  మార్కెటింగ్ తదితర రంగాలలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు .50 కి పైగా ప్రముఖ కంపెనీలు, కామారెడ్డి ప్రాంతంలోని వివిధ సంస్థల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూ నిర్వహిస్తారని ,200 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అని తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

ఉచిత జాబ్ మేళా..16-3-2026

 నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో టాస్క్ మరియు కెరియర్ గైడెన్స్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 9:30 గంటలకు మెగా ఉద్యోగమేల నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ రామ్మోహన్ రెడ్డి గారు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఐటి ఎనేబుల్ సర్వీసెస్, బ్యాంకింగ్, బిపిఓ తదితర ఉద్యోగాలకు అర్హులను ఎంపిక చేస్తారని అన్నారు. 2022 నుంచి 2026 వరకు డిగ్రీ ఉత్తీర్ణులైన ,ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అర్హులు అని అన్నారు. పూర్తి వివరాలకు 9059344379 మరియు 9191559027 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.

నృత్యంలో ఉచిత శిక్షణ

 నిజామాబాద్ నగరానికి చెందిన సాయి రవళి ఉచితంగా నాట్య శిక్షణ ఇస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. మలేషియా, సింగపూర్, దుబాయ్, శ్రీలంక తదితర దేశ...