దాతృత్వంతోన ఆదర్శ సమాజ నిర్మాణం .. ఆర్బీ వి ఆర్ ఆర్ ఈ ఎస్ ఎస్ ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి, జె ఎస్ ఎస్ఎన్ రెడ్డి.
అచ్యుత సమంత ప్రారంభించిన ఆర్ట్ ఆఫ్ గివింగ్ ఉద్యమం 13వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది పంచుకోవడంలోనే ఆనందం అనే సందేశంతో మే 11 నుండి 17 వరకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు తెలంగాణ కోఆర్డినేటర్ పి రాజా రమేష్ ఆధ్వర్యంలో ఆదివారం అబిడ్స్ లోని రాజా బహదూర్ వెంకట రామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ హాస్టల్లో ఏర్పాటు చేసిన వాలీబాల్ టోర్నీని సొసైటీ సెక్రటరీ ప్రొఫెసర్ జి గోపాల్ జాయింట్ సెక్రటరీ ఎస్ఎన్ రెడ్డి హాజరై ప్రారంభించారు ఈ వారోత్సవాలలో భాగంగా వాలీబాల్ కిట్ల పంపిణీ రక్తదాన శిబిరాలు పేద విద్యార్థులకు బోధనా సామాగ్రి అందజేత ఆహార పంపిణీ మొక్కలు నాటడం ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు చేపట్టారు యువతలో సేవాభావం నాయకత్వ లక్షణాలు క్రీడా స్ఫూర్తి పెంపొందించడమే ముఖ్య ఉద్దేశంగా నిర్వాహకులు తెలిపారు ప్రస్తుతం 200 కు పైగా దేశాలకు విస్తరించిన ఆర్ట్ ఆఫ్ గివింగ్ ఉద్యమం దాతృత్వాన్ని జీవన విధానంగా మార్చే లక్ష్యంతో ముందుకు సాగుతోంది గిరిజన విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తూ సమాజంలో సమానత్వం మానవత్వం పెంపొందించడంలో ఈ ఉద్యమం కీలక పాత్ర పోషిస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ హాస్టల్ వార్డెన్ శ్రీనివాస్ రెడ్డి జానకి రడ్డి తో పాటు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు

No comments:
Post a Comment