ఫ్రీ బుక్స్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఫ్రీ బుక్స్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, ఆగస్టు 2026, గురువారం

ఫ్లైబ్రరీ.. ఉచిత గ్రంథాలయం @ ఎయిర్ పోర్ట్

 విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత విమానం కోసం ఎదురు చూడడం కొందరికి బోర్ గ అనిపిస్తుంది. ఫోన్లో స్క్రోల్ చేస్తూ సమయం గడిపిన కొద్దిసేపటికి విసుగు వస్తుంది. అదే మంచి పుస్తకం చేతిలో ఉంటే.. చదవాలని ఉండి రోజువారి జీవితంలో సమయం దొరకని పుస్తకాన్ని ప్రశాంతంగా చదివే అవకాశం వస్తే, అంతకంటే ఆనందం మరొకటి ఉండదు అని చెప్పవచ్చు.

 ఈ ఆలోచనతోనే కొన్ని విమానాశ్రయాలలో ఫ్లైబ్రరీలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. ఫ్లైబ్రరీ అంటే" విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ఉచిత గ్రంథాలయం". విమానం కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు తమకు నచ్చిన పుస్తకాన్ని తీసుకొని చదవవచ్చు. విమానం వచ్చేసినా చదవడం పూర్తి కాకపోతే ఆ పుస్తకాన్ని వెంట తీసుకెళ్లి ప్రయాణంలో కూడా చదువుకోవచ్చు. అనంతరం వారు దిగిన విమానాశ్రయంలోని ఫ్లైబ్రరీలో దానిని ఇచ్చి వెళ్లిపోవచ్చు .

భువనేశ్వర్ లో మొదలైంది..

 ఈ తరహా ప్రయోగానికి భువనేశ్వర్ లోని బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం వేదిక అయింది. 2025 లో "టేక్ ఏ బుక్ " అనే నినాదంతో లైబ్రరీని ప్రారంభించారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో ఏర్పాటు చేసిన ఈ గ్రంథాలయంలో ఇంగ్లీష్, హిందీ, ఒడియా భాషలలో సుమారు 600 పుస్తకాలు అందుబాటులో ఉంచారు. బాలల పుస్తకాలు, నవలలు, మేగజైన్లు  తదితర విభాగాలకు చెందిన పుస్తకాలు కూడా ఇందులో ఉన్నాయి. డిపార్చర్ ,అరైవల్ ప్రాంతాలలో పుస్తకాల అరలని ఏర్పాటు చేశారు. ఇందులో పుస్తకాల నిర్వహణ ,అరలని సర్దడం వంటి పనులలో వాలంటీర్లు సహకరిస్తున్నారు. ఇక ఈ ఆలోచనకు ఇతర విమానాశ్రయాలలోనూ ఆదరణ లభిస్తోంది. తాజాగా ప్రయాగరాజ్ విమానాశ్రయంలోను ఫ్లైబ్రరీ అందుబాటులోకి వచ్చింది. పుస్తకాలను విరాళంగాను ఇవ్వవచ్చు .. ఈ ఫ్లైబ్రరీల ఏర్పాటు కేవలం సమయాన్ని సద్వినియోగం చేయాలని ఆలోచనతో రూపుదిద్దుకున్న కార్యక్రమం. ప్రయాణికుల మీద నమ్మకం, సమాజ భాగస్వామ్యం పై ఆధారపడి పని చేస్తుంది. పుస్తకాలను తీసుకున్న వారు తిరిగి ఇచ్చే విషయంలో స్వీయ బాధ్యతతో వ్యవహరించాలి. ఈ ఫ్లైబ్రరీల కోసం పుస్తకాలను విరాళంగా కూడా ఇవ్వవచ్చు అని నిర్వాహకులు కోరుతున్నారు. 



5, జూన్ 2026, శుక్రవారం

కీళ్ల ఆరోగ్యంపై ఉచిత పుస్తకం

 


మారిన జీవనశైలి శారీరక శ్రమ లేకపోవడం వల్ల యువతలో కూడా కీళ్ల సమస్యలు పెరుగుతున్నాయి వీటి పట్ల ఒక మంచి అవగాహన అందించే ఉద్దేశంతో స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒక కీలకమైన ప్రజారోగ్య పుస్తకాన్ని ఆవిష్కరించారు.

"ది హ్యూమన్ బోన్ జాయింట్స్ ఎక్స్ ప్లెయిన్డ్ "అనే పేరుతో రూపొందించిన ఈ ఉచిత పుస్తకాన్ని బంజారాహిల్స్ లోని స్టార్ హాస్పిటల్స్ లో గురు వారం విడుదల చేశారు. స్టార్ హాస్పిటల్స్ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డా. నీలం వి రమణారెడ్డి 25 సంవత్సరాల సుదీర్ఘ క్లినికల్ , రోబోటిక్ అనుభవంతో ఈ పుస్తకం రూపుదిద్దుకుంది. ఆయన చికిత్స ద్వారా నొప్పుల నుండి విముక్తి పొంది తిరిగి సాధారణ జీవితం గడుపుతున్న ముగ్గురు లబ్ధిదారులు అయిన రోగులే ముఖ్య అతిథులుగా విచ్చేసి ఉచిత పుస్తకాన్ని ఆవిష్కరించడం విశేషం..

కీళ్ల కండరాల పని తీరును , కీళ్లు ఎందుకు శబ్దాలు చేస్తాయనే విషయాలను సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా ఈ పుస్తకంలో వివరించడం జరిగింది.

బరువు నియంత్రణ,ఒమేగా 3 , ఆహార నియమాలు, కూర్చునే పద్ధతులు, మరియు ఈత,సైక్లింగ్ వంటి వ్యాయామాల గురించి నిపుణులు సలహాలు అందించారు. వేళ్ళు తిరగడం వల్ల ఆర్థరైటిస్ రాదనే నిజాలను స్పష్టం చేస్తూ మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సల మన్నిక పై ఉన్న భయాలను తొలగించారు..

రోబోటిక్ శస్త్ర చికిత్సలు, వేగంగా కోలుకోవడంలో కృత్రిమ మేధ పాత్రను వివరించారు.జీవించడం అంటే కదలడం..మీరు ఎప్పటికీ చేయించుకోవాల్సిన అవసరం రాని శస్త్ర చికిత్స యే ఎల్లప్పుడూ అత్యుత్తమమైనది అని డా రమణా రెడ్డి పేర్కొన్నారు.

వదిరాజా భట్ @ ఓ శాట్..

 వదిరాజా భట్ కర్ణాటక కు చెందిన ఐటీ నిపుణుడు . పాతికేళ్ల కిందటే అక్కడో కంపెనీ స్థాపించాడు. అమెరికాలో స్థిరపడిన వాళ్లందరిలాగే సొంతూరికీ అయిన వ...