సంస్కృత భాష పై ప్రాథమిక పరిజ్ఞానం కల్పించడానికి తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూరు వారి ఆధ్వర్యంలో ఈ నెల 9 10 మరియు 11 తేదీలలో సరళ సంస్కృత భాష అవగాహన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు సంఘం అధ్యక్షులు శశికాంత్ పులకరిని కార్యదర్శి రమేష్ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు సంస్కృత భాష నేర్చుకోవడానికి అవసరమైన పుస్తకాలు నోట్ బుక్స్ పెన్నులు ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు శిక్షణ శిబిరం బోర్గాలోని లక్ష్మీ గణపతి ఆలయంలో ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు ఉంటుందని విద్యార్థులు మహిళలు భాషాభిమానులు ఉచిత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9494 392393 ఫోన్ నెంబర్లో సంప్రదించాల్సిన సూచించారు.
Saturday, 6 June 2026
Friday, 5 June 2026
కీళ్ల ఆరోగ్యంపై ఉచిత పుస్తకం
మారిన జీవనశైలి శారీరక శ్రమ లేకపోవడం వల్ల యువతలో కూడా కీళ్ల సమస్యలు పెరుగుతున్నాయి వీటి పట్ల ఒక మంచి అవగాహన అందించే ఉద్దేశంతో స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒక కీలకమైన ప్రజారోగ్య పుస్తకాన్ని ఆవిష్కరించారు.
"ది హ్యూమన్ బోన్ జాయింట్స్ ఎక్స్ ప్లెయిన్డ్ "అనే పేరుతో రూపొందించిన ఈ ఉచిత పుస్తకాన్ని బంజారాహిల్స్ లోని స్టార్ హాస్పిటల్స్ లో గురు వారం విడుదల చేశారు. స్టార్ హాస్పిటల్స్ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డా. నీలం వి రమణారెడ్డి 25 సంవత్సరాల సుదీర్ఘ క్లినికల్ , రోబోటిక్ అనుభవంతో ఈ పుస్తకం రూపుదిద్దుకుంది. ఆయన చికిత్స ద్వారా నొప్పుల నుండి విముక్తి పొంది తిరిగి సాధారణ జీవితం గడుపుతున్న ముగ్గురు లబ్ధిదారులు అయిన రోగులే ముఖ్య అతిథులుగా విచ్చేసి ఉచిత పుస్తకాన్ని ఆవిష్కరించడం విశేషం..
కీళ్ల కండరాల పని తీరును , కీళ్లు ఎందుకు శబ్దాలు చేస్తాయనే విషయాలను సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా ఈ పుస్తకంలో వివరించడం జరిగింది.
బరువు నియంత్రణ,ఒమేగా 3 , ఆహార నియమాలు, కూర్చునే పద్ధతులు, మరియు ఈత,సైక్లింగ్ వంటి వ్యాయామాల గురించి నిపుణులు సలహాలు అందించారు. వేళ్ళు తిరగడం వల్ల ఆర్థరైటిస్ రాదనే నిజాలను స్పష్టం చేస్తూ మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సల మన్నిక పై ఉన్న భయాలను తొలగించారు..
రోబోటిక్ శస్త్ర చికిత్సలు, వేగంగా కోలుకోవడంలో కృత్రిమ మేధ పాత్రను వివరించారు.జీవించడం అంటే కదలడం..మీరు ఎప్పటికీ చేయించుకోవాల్సిన అవసరం రాని శస్త్ర చికిత్స యే ఎల్లప్పుడూ అత్యుత్తమమైనది అని డా రమణా రెడ్డి పేర్కొన్నారు.
మైనారిటీలకు సివిల్స్ ఉచిత శిక్షణ
సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెస్ అకాడమీ హైదరాబాద్ వారు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు యాకూబ్ ...
-
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో గల రాజారాం స్టేడియం లో రేపటి నుండి ఖేలో ఇండియా ఉచిత విలువిద్య శిక్షణా శిబిరం ప్రారంభం కానున్...
-
కామారెడ్డి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మే 2, 3, 4 తేదీలలో శనివారం ఆదివారం సోమవారం రోజున కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో కల ...
-
చిన్న చిన్న ఒళ్ళు నొప్పుల నుండి కీళ్ల సమస్యలు, దీర్ఘ కాలం బాధించే పక్షవాతం వంటి అనారోగ్యాలతో బాధ పడే వారికి , పెద్ద పెద్ద ఆపరేషన్ ల తర్వా...