ఫ్రీ అంబులెన్స్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఫ్రీ అంబులెన్స్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, సెప్టెంబర్ 2026, శుక్రవారం

ఉచిత వైద్యం@ అరుంధతి హాస్పిటల్.

 గండి మైసమ్మ , దుండిగల్ దారిలో ఉన్న అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ హాస్పిటల్ లో కేవలం టెస్టులే కాదు, రూపాయి ఖర్చు లేకుండా పెద్ద పెద్ద ఆపరేషన్లు చేస్తారు. 25 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 2023 లో ఈ హాస్పిటల్ ఏర్పాటైంది. ఖరీదైన సర్జరీలు ఉచితంగా చేస్తూ , రోగులకు రాయితీపై మందులు ఇస్తున్నారు. 

మల్కాజ్ గిరి MLA డా. మర్రి రాజశేఖర్ రెడ్డి తన తల్లి అరుంధతి పేరు మీద మర్రి రాజశేఖర్ ఫౌండేషన్ ద్వారా ఈ ఆసుపత్రి ని స్థాపించారు. NABH గుర్తింపు 350 కి పైగా బెడ్ లు సామర్థ్యం ఉన్న ఈ ఆసుపత్రిలో ఉచిత OPD తో పాటు రోగులకు ఉచితంగా బెడ్ లు మూడు పూటలా ఉచిత పోషకాహార భోజనం అందిస్తున్నారు. 

వీటితో పాటు ఎక్స్ రే, 24/7 సీటీ స్కాన్, ECG, అల్ట్రా సౌండ్ , రక్తం, మూత్ర పరీక్షలు వంటివన్నీ పూర్తిగా ఉచితంగా చేస్తారు. మేజర్ సర్జరీలు కూడా ఉచితంగా చేస్తారు. చుట్టు పక్కల ప్రాంతాల ప్రజల కోసం ఉచిత బస్సులు కూడా నడుపుతున్నారు. ఈ ప్రాంగణంలోనే మెడికల్ కాలేజీ కూడా నడుస్తుంది. 

మరిన్ని సమగ్ర వివరాలకు 8055667888 హెల్ప్ లైన్ లో సంప్రదించ వచ్చు. 

8, జూన్ 2026, సోమవారం

సోను సూద్ ఉచితం అంబులెన్స్ సేవలు

 సోనూ సూద్ ఉచిత అంబులెన్స్ ల పంపిణీ, ఉచిత ఆటోల పంపిణీ, గాంధీ, నిలోఫర్ ఆసుపత్రులలో ఉచిత నిత్యాన్నదానం.


అంబులెన్స్ ని స్వచ్ఛందంగా ప్రధానం చేయడం అంటే ప్రాణాలను రక్షించడం లాంటిదేనని నటుడు సోనుసూదన్నారు. ఆదివారం హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని ఐటీసీ కోహినూర్ హోటల్ వద్ద సోను సూద్ మరియు మాల్యవీ కరణోదయ సొసైటీ ఆధ్వర్యంలో నిరుపేదలకు" ఉచితంగా ఆటోలను "పంపిణీ చేశారు. వనపర్తి జిల్లా సంకిరెడ్డిపల్లి ,అమ్మడవాకుల గ్రామాలకు ఉచితంగా అంబులెన్స్ ,నగరంలోని దమ్మాయిగూడ, చిలుకానగర్ ప్రాంతాల నిరుపేద ఆటో కార్మికులకు ఆటోలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన అంబులెన్స్ను స్వయంగా నడిపి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ సంకిరెడ్డిపల్లి, మరియు అమ్మడవాకుల గ్రామ ప్రజలు సోనుసూద్" ఉచిత అంబులెన్స్ ను "వినియోగించుకొని సురక్షితంగా ఉండాలని కోరారు .జీవనోపాధి కోసం కష్టపడుతున్న ఆటో కార్మికులకు "ఉచితంగా ఆటోలను" అందించడం అంటే కుటుంబాలను నిలబెట్టడం వంటిదని సొసైటీ వ్యవస్థాపకులు కొండ కృష్ణమ్మను  అభినందించారు సోనూ సూద్. కొండ కృష్ణమ్మ మాట్లాడుతూ 2004లో ప్రారంభించిన ఈ సొసైటీ ఆధ్వర్యంలో అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికీ గాంధీ, నిలోఫర్ ఆసుపత్రి లలో నిత్యాన్నదానం చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో సొసైటీ ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

వదిరాజా భట్ @ ఓ శాట్..

 వదిరాజా భట్ కర్ణాటక కు చెందిన ఐటీ నిపుణుడు . పాతికేళ్ల కిందటే అక్కడో కంపెనీ స్థాపించాడు. అమెరికాలో స్థిరపడిన వాళ్లందరిలాగే సొంతూరికీ అయిన వ...