10, జూన్ 2026, బుధవారం

జర్మన్ భాషా శిక్షణ ద్వారా విదేశీ ఉపాధి అవకాశాలు

 నిరుద్యోగ యువతీ యువకులకు జర్మన్ భాష లో శిక్షణ ఇప్పించడం ద్వారా విదేశీ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి జి వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం టాస్క్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలోని మందమర్రి పట్టణంలోని ఇల్లందు క్లబ్లో ఏర్పాటు చేసిన జర్మన్ భాషా శిక్షణ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి చంద్రయ్య, మండల తహసిల్దార్ సతీష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రాజలింగు, టాస్క్ జనరల్ మేనేజర్ రాధాకృష్ణ,  టామ్ కామ్ మేనేజర్ నాగభారతిలతో కలిసి ఆయన మాట్లాడారు.  అవకాశాలను పొందడంలో, ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలని పట్టుదల ఉన్న వారిని ప్రోత్సహిస్తామని అన్నారు . ప్రపంచవ్యాప్తంగా అనేక ఉపాధి అవకాశాలు ఉన్నా యని ముఖ్యంగా జర్మనీలో నైపుణ్యం కలిగిన యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్న జర్మనీలో నర్సింగ్, సాంకేతిక, పారిశ్రామిక రంగాలలో లక్షలాది ఉద్యోగాలలో ఖాళీలు ఉన్నాయని ,తెలంగాణ యువత అవకాశాలను అందిపుచ్చుకునేలా రాష్ట్ర ప్రభుత్వం టాస్క్ ద్వారా జర్మన్ భాషా శిక్షణ అందిస్తుందని తెలిపారు. ఉద్యోగం ఎక్కడ లభిస్తే అక్కడికి వెళ్లి పని చేసే దృక్పథం యువత అలవర్చుకోవాలని అన్నారు. పారిశ్రామికవేత్తగా పనిచేసిన అనుభవాన్ని ప్రస్తావిస్తూ మార్కెట్ ఉన్న ప్రాంతాలలో పరిశ్రమలు స్థాపించడం వలన వేలాది మందికి ఉపాధి కల్పించగలిగామని అన్నారు. స్థానికతకే పరిమితం కాకుండా అవకాశాలను వెతుక్కుంటూ ముందుకు వెళ్లాలని యువతకు సూచించారు. జర్మనీలో వారానికి కేవలం 32 నుంచి 35 గంటల పని సమయం మాత్రమే ఉంటుందని మిగతా సమయంలో ఇతర నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని, జర్మనీలో నెలకు రెండు లక్షల 50 వేల రూపాయలు ఆపైన ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రైవేటు ఏజెన్సీల మోసాలకు గురి కాకుండా ప్రభుత్వ సంస్థ అయిన టాస్క్ ద్వారా శిక్షణ పొంది విదేశీ ఉద్యోగాలను పొందాలని తెలిపారు .ఇప్పటికే ఈ కార్యక్రమానికి 112 మంది యువత నమోదు చేసుకున్నారని, వారందరికీ నైపుణ్యాభివృద్ధి శిక్షణ  అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించడం బాధ్యతగా తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం టామ్ కామ్ సంస్థకు 90 కోట్ల రూపాయలు అందించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు నెలకు రెండువేల రూపాయల స్టయిఫండ్ అందిస్తుందని, అదేవిధంగా జర్మన్ భాష శిక్షణ పొందుతున్న అభ్యర్థులలో 80 శాతం హాజర నమోదు చేసుకున్న వారికి కాకా వెంకటస్వామి ట్రస్ట్ తరఫున అదనంగా నెలకు ₹1000  స్టైపండ్ అందజేస్తామని తెలిపారు .యువతలో క్రమశిక్షణ, పట్టుదల , లక్ష్య సాధన పై దృష్టి ఉండాలని, జర్మన్ భాష నేర్చుకోవడానికి  ప్రతిరోజు సాధన చేయాలని సూచించారు. మందమర్రిలో ప్రారంభమైన ఈ శిక్షణ కేంద్రాన్ని రాష్ట్రానికి ఆదర్శంగా నిలిపేందుకు ప్రతివారం తాను స్వయంగా శిక్షణ కేంద్రాన్ని సందర్శించి అభ్యర్థులతో కలిసి జర్మనీ భాష నేర్చుకుంటానని తెలిపారు. యువత ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని కోరారు. అంతకుముందు క్లబ్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం జర్మన్ భాషా శిక్షణలో బి2 సర్టిఫికేషన్ పూర్తి చేసిన మరియన్ పాసల్, హుబా ఫాతిమా లకు ఆఫర్ లెటర్లు అందజేశారు.

మన దేశానికి ఏడాదికి 90 వేల వీసాలు ఇచ్చేందుకు జర్మనీ సిద్ధంగా ఉందనీ, జర్మనీ వీసా లో 50% సబ్సిడీ లభిస్తుందని తెలిపారు. శిక్షణ కేంద్రంలో 4 నెలల్లో జర్మనీ భాష నేర్పిస్తారని చెప్పారు. ఇంజనీరింగ్, టెక్నాలజీ, హెల్త్ కేర్ రంగాలలో అవకాశాలకు భాషా పరిజ్ఞానం తప్పనిసరి అని ,జర్మనీలో పనిచేయాలనుకునే వారికి ఆ భాష ఒక శక్తివంతమైన సాధనం అని తెలిపారు..



8, జూన్ 2026, సోమవారం

ఉచిత కాటన్ బ్యాగుల పంపిణీ

 రోటరీ క్లబ్ జేమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఉచిత కాటన్ బ్యాగుల పంపిణీ చేయడం జరిగిందని క్లబ్ అధ్యక్షులు పాకాల నరసింహారావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేడుకలలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించమని ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం వల్ల ప్లాస్టిక్ తో నిర్మితమైన వస్తువులు వాడడం వల్ల ఆరోగ్యం పాడవాడమే కాకుండా భయంకరమైన క్యాన్సర్ వ్యాధికి గురవుతున్నామని ఆయన తెలిపారు ఏ రూపంలో కూడా ప్లాస్టిక్  నిర్మితమైన వస్తువులు వాడకూడదని అలాగే మనకు రోజు వారి కార్యక్రమంలో ఉపయోగించే బస్తాలు వాడాలని ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ వాడకుండా కాటన్ తో తయారు చేసిన బ్యాగులు వాడడం వల్ల పర్యావరణాన్ని రక్షించడమే కాదు మనతోపాటు జీవిస్తున్న పశువుల ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతామని పేర్కొన్నారు మనం ఆరోగ్యంగా జీవించాలని అనుకుంటే ఇలాంటి కాటన్ బ్యాగులను ఉపయోగించి మనకు అవసరమైన కూరగాయలు ఇతర వస్తువులను గాని తీసుకెళ్లాలని ఆయన కోరారు ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలోని గంజిలో గల కూరగాయల సంతలో రోటరీ క్లబ్ జేమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఉచితంగా కాటన్ బ్యాగులు వినియోగదారులకు అందించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు తప్పకుండా అందరూ ఈ చిన్న మార్పుతో నిత్యజీవితంలో కాటన్ బ్యాగు ల వాడి భవిష్యత్ తరానికి ఆరోగ్యకరమైన పర్యావరణం అందించాలని కోరడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ గంజి రమేష్ గిరీష్ కుమార్  గంగుల విజయ్ రమేష్ సుధాకర్ సంపత్ రాజశేఖర్  శిరీష్ కుమార్ వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు

ఉచిత జర్మనీ శిక్షణ తరగతులు

 యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు విస్తరించేదుకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఉచిత జర్మనీ భాష శిక్షణ క్యాంపును నిర్వహించనున్నట్లు మంచిర్యాల జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికా రమేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈనెల 10న ఉదయం మందమర్రిలోని సింగరేణి ఇల్లందు క్లబ్లో శిక్షణ తరగతులను రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి తిధి వెంకటస్వామి ప్రారంభించనున్నట్లు చెప్పారు మంత్రి ఆదేశాలతో జర్మనీతో పాటు యూరోపియన్ దేశాల్లో ఉపాధి అవకాశాలు పొందేందుకు అవసరమైన భాషా నైపుణ్యాలపై ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు విదేశీ ఉపాధి అవకాశాలపై ఆసక్తి కలిగిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సేంద్రీయ సేద్యంపై తొమ్మిది నెలల ఉచిత శిక్షణ

 వ్యవసాయ భూమి గల లేదా వ్యవసాయ నేపథ్యం ఉన్న యువతను సేంద్రియ రైతు పారిశ్రామికవేత్తలుగా లేదా రైతు విస్తరణ నిపుణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అక్షయ కల్ప రైన్ మ్యాటర్ ఫెలోషిప్ కార్యక్రమం త్వరలో ప్రారంభం కానున్నది పాడి పశువుల పెంపకం బయోగ్యాస్ ఉత్పత్తి బయోడైజేష్టర్ ద్వారా తయారు చేసుకునే సేంద్రియ ఎరువులతో లాభదాయక వ్యవసాయ పద్ధతి ప పై పై 19 నుంచి 27 మధ్యన వయసుగల యువతకు 9 నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలోని ఈదులపల్లిలోని అక్షయకల్ప సేంద్రియ వ్యవసాయ పరిశోధన శిక్షణ కేంద్రంలో ఎంపికైన 30 మందికి మొదటి మూడు నెలలు రెసిడెన్షియల్ శిక్షణ తర్వాత ఆరు నెలలు ప్రాక్టికల్ శిక్షణ ఉంటుంది ఉచిత భోజనము వసతి తో పాటు ఉపకార వేతనం కూడా ఇస్తారు ఉమ్మడి మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లాలో అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది మరిన్ని వివరాలకు 70222 77155 నంబర్లో సంప్రదించవచ్చు

సోను సూద్ ఉచితం అంబులెన్స్ సేవలు

 సోనూ సూద్ ఉచిత అంబులెన్స్ ల పంపిణీ, ఉచిత ఆటోల పంపిణీ, గాంధీ, నిలోఫర్ ఆసుపత్రులలో ఉచిత నిత్యాన్నదానం.


అంబులెన్స్ ని స్వచ్ఛందంగా ప్రధానం చేయడం అంటే ప్రాణాలను రక్షించడం లాంటిదేనని నటుడు సోనుసూదన్నారు. ఆదివారం హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని ఐటీసీ కోహినూర్ హోటల్ వద్ద సోను సూద్ మరియు మాల్యవీ కరణోదయ సొసైటీ ఆధ్వర్యంలో నిరుపేదలకు" ఉచితంగా ఆటోలను "పంపిణీ చేశారు. వనపర్తి జిల్లా సంకిరెడ్డిపల్లి ,అమ్మడవాకుల గ్రామాలకు ఉచితంగా అంబులెన్స్ ,నగరంలోని దమ్మాయిగూడ, చిలుకానగర్ ప్రాంతాల నిరుపేద ఆటో కార్మికులకు ఆటోలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన అంబులెన్స్ను స్వయంగా నడిపి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ సంకిరెడ్డిపల్లి, మరియు అమ్మడవాకుల గ్రామ ప్రజలు సోనుసూద్" ఉచిత అంబులెన్స్ ను "వినియోగించుకొని సురక్షితంగా ఉండాలని కోరారు .జీవనోపాధి కోసం కష్టపడుతున్న ఆటో కార్మికులకు "ఉచితంగా ఆటోలను" అందించడం అంటే కుటుంబాలను నిలబెట్టడం వంటిదని సొసైటీ వ్యవస్థాపకులు కొండ కృష్ణమ్మను  అభినందించారు సోనూ సూద్. కొండ కృష్ణమ్మ మాట్లాడుతూ 2004లో ప్రారంభించిన ఈ సొసైటీ ఆధ్వర్యంలో అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికీ గాంధీ, నిలోఫర్ ఆసుపత్రి లలో నిత్యాన్నదానం చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో సొసైటీ ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

వన్ హెల్త్ ఫార్మసీ వారి ఉచిత ఆరోగ్య పరీక్షలు

 వన్ హెల్త్ ఫార్మసీ మల్లారెడ్డి హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ వారి అనుబంధ సంస్థ ప్రారంభోత్సవ ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది హెల్త్ ఎసెన్షియల్స్ మరియు ఔషధాలపై 20 శాతం నుండి 70 శాతం వరకు డిస్కౌంట్. 

వెయ్యి రూపాయల కంటే ఎక్కువ కొనుగోళ్లపై 10000 రూపాయల విలువైన" ఆరోగ్య పరీక్షలు ఉచితంగా" నిర్వహిస్తారు లేదా" ఉచిత పిల్ బాక్స్" అందజేస్తారు 



హౌస్ నెంబర్ 5-3-113 

నిజాంసాగర్ చౌరస్తా

Nh 44 రోడ్డు

 కామారెడ్డి జిల్లా

 తెలంగాణ 

9121812181 ,8309867689



పార్థ డెంటల్ వారి ఫ్రీ ఆఫర్

 డెంటల్ హాస్పిటల్స్ లో ప్రముఖ సంస్థ అయిన పార్థ డెంటల్స్ వారు ఈ నెల అంటే జూన్ 2026 మొత్తం ఒక ఉచిత చికిత్స ఆఫర్ ప్రకటించింది.

అది invisalign open day  ఆఫర్. ఈ ఆఫర్ లో ఫ్రీ కన్సల్టేషన్ ,ఫుల్ మౌత్ ఎక్స్ రే, రూ.15000 విలువైన డిజిటల్ స్కాన్ ను ఫ్రీ గా ఇస్తున్నారు.

పార్థ డెంటల్ లో aligners మీద 50000 నుండి 90000 డిస్కౌంట్స్ ఉన్నాయి. ఈ ఉచిత అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చక్కని దంత ఆరోగ్యాన్ని పొందండి.

అపాయింట్మెంట్ కొరకు..040-41420000 ఫోన్ నెంబర్ లో సంప్రదించాలని సూచించారు.

పార్థ డెంటల్.. స్కిన్..హెయిర్....

4 రాష్ట్రాలలో.. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక / బెంగళూరు, తమిళనాడు /చెన్నై ..

గో వైర్లెస్ , గో ఫర్ అలైనార్స్ ..పెద్దలకు,యువకులకు,పిల్లలకు .. మెటల్ బ్రెసెస్ లేకుండా అలైనార్స్ తో మీ చిరునవ్వును తీర్చిదిద్దుకోండి.

వాట్సప్ 85007 79000 .. 

7, జూన్ 2026, ఆదివారం

స్పోకెన్ ఇంగ్లీష్ 7 రోజుల ఫ్రీ ట్రయల్

 స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి 7 రోజులు ఉచితంగా క్లాసులు వినే అవకాశం .7 రోజులు ఉచితంగా విన్న తర్వాత నచ్చితేనే కోర్స్ లో చేరవచ్చు.

స్పోకెన్ ఇంగ్లీష్ నిపుణురాలు ఐన భూక్యా గౌతమి గారు " జీరో టు హీరో " అనే స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ను రూపొందించారు.దీనిని gyan tv యాప్ లో అందుబాటులో ఉంచారు. కోర్స్ లో జాయిన్ అవ్వాలనుకునే వారికి 7 రోజులు ఉచితంగా క్లాసులు వినే అవకాశం కల్పించారు. కోర్స్ నచ్చినట్లయితే జాయిన్ అవ్వచ్చు.లేకపోతే మానేయవచ్చు.

6, జూన్ 2026, శనివారం

ఉచిత కేన్సర్ పరీక్షలు@ కదిలే బస్ లో

 కేన్సర్ స్క్రీనింగ్ టెస్టింగ్ కోసం ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు, మహిళల కోసం ఉచితంగా 20వేల రూపాయల విలువ చేసే వైద్య పరీక్షలు, కేన్సర్ ఉన్నట్టు తెలిస్తే 50% ఖర్చు తగ్గించే వైద్యము, రేపటి నుంచి సిద్దిపేట జిల్లా దుబ్బాక నుంచి ప్రారంభం. 



మనకు తెలియకుండానే చెప్పకుండా నీరులా వ్యాపిస్తున్న వ్యాధులలో క్యాన్సర్ ప్రధానమైనది శరీరంలో కణ వ్యవస్థ పనితీరు అదుపు తప్పడం వల్ల ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది అయితే కేన్సర్ వస్తే ఇక అంతేనా అని దీనికి మందు లేదని చాలామంది భయపడుతుంటారు. కానీ క్యాన్సర్ ను ప్రారంభంలోనే గుర్తిస్తే నియంత్రించొచ్చు, ప్రారంభ దశలోనే గుర్తించేందుకు వైద్య పరికరాలతో ప్రత్యేక బస్సును అందుబాటులోకి మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు గారు తీసుకొచ్చారు ఈ బస్సు ద్వారా పల్లెలలో పట్టణాల్లో మహిళలకు స్క్రీనింగ్ టెస్టులు చేయనున్నారు కేన్సర్ ఉన్నట్టు తెలిస్తే ప్రముఖ కేన్సర్ ఆసుపత్రుల్లో 50% మేరా ఖర్చు రాయితీతో వైద్యం చేయించాను అన్నారు అందులో భాగంగా ఆదివారం నుంచి సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలు ఉన్నారు 

ఉచితంగా వైద్య పరీక్షలు.. బీడీఎల్ వారి సౌజన్యంతో బస్సు శిశిర ఆస్పత్రి వారి సహకారంతో వైద్య పరీక్షల సామాగ్రిని సమకూర్చారు ఆ తర్వాత ఉచిత కాన్సర్  స్క్రీనింగ్ టెస్టింగ్ సెంటర్ బస్సును అందుబాటులోకి తీసుకొచ్చారు ఇటీవల ఈ బస్సును లోక్భవన్లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా గారు ప్రారంభించారు హైదరాబాద్ కు చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ సింధు, ఆంకో సర్జన్ డాక్టర్ స్రవం తేజ నేతృత్వంలో పరీక్షలు నిర్వహించనున్నారు ఒక్కొక్కరికి 15 వేల రూపాయలు నుంచి 20వేల రూపాయల విలువ చేసే వైద్య పరీక్షలు ఉచితంగా అందించనున్నారు మెదక్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో 45 మండలాలు 13 మున్సిపాలిటీలు జిహెచ్ఎంసి లోని 9 డివిజ డివిజన్ లలో క్యాన్సర్ టెస్టింగ్ బస్ సంచరించనున్నది. ఎక్కడికి వెళ్లినా ముందుగా అక్కడ ప్రజలకు సమాచారం అందిస్తారు మహిళలకు బ్రెస్ట్ సర్వైకల్ క్యాన్సర్ టెస్టులు ఉచితంగా చేస్తారు ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కేన్సర్ ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే త్వరగా కోలుకుంటారని మహిళలు ఎక్కువగా బ్రష్టు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్నారని ఈ బస్సు లోక్ లోక్భ సభ నియోజకవర్గంలో అంతటా సంచరిస్తుందని అక్కడే టెస్టు నిర్వహించే రిపోర్టులు అందజేస్తారని మహిళలందరూ సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని ఎంపీ మాధవిని రఘునందన్ రావు గారు కోరారు.

ఉచిత స్టీల్ ప్లేట్ల పంపిణీ

 బాన్స్వాడ మండలంలోని దేశాయిపేట గ్రామానికి చెందిన తపస్సు జిల్లా అధ్యక్షుడు బోనీకర్ సంతోష్ కుమార్ తన పుట్టినరోజు సందర్భంగా గ్రామానికి ఉపయోగపడేలా 100 స్టీల్ ప్లేట్లను గ్రామ సర్పంచ్ భూమిక జ్యోతి కి శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో జరిగే శుభకార్యాలు సామాజిక కార్యక్రమాలకు ఈ ఉచిత స్టీల్ ప్లేట్లను వినియోగించాలన్నారు అనంతరం గ్రామ పెద్దలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణ దోహదపడే విధంగా ఇలాంటి కార్యక్రమాలను సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమాలు ఆదర్శనీయమన్నారు సేవా కార్యక్రమాలు మరిన్ని మున్ముందు చేపట్టాలని కోరారు కార్యక్రమంలో గ్రామ పెద్దలు రామస్వామి జయ వీరప్ప డాక్టర్ రవి కమార్ సంతోష్ పటేల్ గాండ్ల శ్రీనివాస్ యువకులు తదితరులు పాల్గొన్నారు.

5, జూన్ 2026, శుక్రవారం

కీళ్ల ఆరోగ్యంపై ఉచిత పుస్తకం

 


మారిన జీవనశైలి శారీరక శ్రమ లేకపోవడం వల్ల యువతలో కూడా కీళ్ల సమస్యలు పెరుగుతున్నాయి వీటి పట్ల ఒక మంచి అవగాహన అందించే ఉద్దేశంతో స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒక కీలకమైన ప్రజారోగ్య పుస్తకాన్ని ఆవిష్కరించారు.

"ది హ్యూమన్ బోన్ జాయింట్స్ ఎక్స్ ప్లెయిన్డ్ "అనే పేరుతో రూపొందించిన ఈ ఉచిత పుస్తకాన్ని బంజారాహిల్స్ లోని స్టార్ హాస్పిటల్స్ లో గురు వారం విడుదల చేశారు. స్టార్ హాస్పిటల్స్ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డా. నీలం వి రమణారెడ్డి 25 సంవత్సరాల సుదీర్ఘ క్లినికల్ , రోబోటిక్ అనుభవంతో ఈ పుస్తకం రూపుదిద్దుకుంది. ఆయన చికిత్స ద్వారా నొప్పుల నుండి విముక్తి పొంది తిరిగి సాధారణ జీవితం గడుపుతున్న ముగ్గురు లబ్ధిదారులు అయిన రోగులే ముఖ్య అతిథులుగా విచ్చేసి ఉచిత పుస్తకాన్ని ఆవిష్కరించడం విశేషం..

కీళ్ల కండరాల పని తీరును , కీళ్లు ఎందుకు శబ్దాలు చేస్తాయనే విషయాలను సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా ఈ పుస్తకంలో వివరించడం జరిగింది.

బరువు నియంత్రణ,ఒమేగా 3 , ఆహార నియమాలు, కూర్చునే పద్ధతులు, మరియు ఈత,సైక్లింగ్ వంటి వ్యాయామాల గురించి నిపుణులు సలహాలు అందించారు. వేళ్ళు తిరగడం వల్ల ఆర్థరైటిస్ రాదనే నిజాలను స్పష్టం చేస్తూ మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సల మన్నిక పై ఉన్న భయాలను తొలగించారు..

రోబోటిక్ శస్త్ర చికిత్సలు, వేగంగా కోలుకోవడంలో కృత్రిమ మేధ పాత్రను వివరించారు.జీవించడం అంటే కదలడం..మీరు ఎప్పటికీ చేయించుకోవాల్సిన అవసరం రాని శస్త్ర చికిత్స యే ఎల్లప్పుడూ అత్యుత్తమమైనది అని డా రమణా రెడ్డి పేర్కొన్నారు.

వదిరాజా భట్ @ ఓ శాట్..

 వదిరాజా భట్ కర్ణాటక కు చెందిన ఐటీ నిపుణుడు . పాతికేళ్ల కిందటే అక్కడో కంపెనీ స్థాపించాడు. అమెరికాలో స్థిరపడిన వాళ్లందరిలాగే సొంతూరికీ అయిన వ...