ఫ్రీ హెల్త్ క్యాంప్స్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఫ్రీ హెల్త్ క్యాంప్స్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, ఆగస్టు 2026, గురువారం

ఫ్రీ CPR ట్రైనింగ్@డాక్టర్ నారి చారిటబుల్ ట్రస్ట్

 


గుండె ఆగిపోయిన మనిషికి తిరిగి ప్రాణం పోసే ప్రక్రియ సి పి ఆర్ ..దీనిని ఎంతమందికి నేర్పిస్తే సమాజానికి అంత మేలు చేసిన వాళ్ళం అవుతాము అన్నది తమ సంకల్పమని డాక్టర్ నారి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ డాక్టర్ నర్లింగల కీర్తన యాదవ్ అన్నారు.

 అందుకే తెలంగాణ వ్యాప్తంగా కాలేజీలు, కోర్టులు, పోలీసు కార్యాలయాలు సహా వివిధ చోట్ల క్యాంపులు నిర్వహించి ఇప్పటివరకు సుమారు లక్ష మందికి" ఉచితంగా సి పి ఆర్ ట్రైనింగ్"  ఇచ్చినట్లు తెలిపారు. రెడ్ క్రాస్, హ్యాండ్స్ ఆన్ హార్ట్ ఫౌండేషన్లు తమతో కలిసి పని చేస్తున్నాయని ఆమె వివరించారు. దీనితో పాటుగా కొన్ని అత్యవసర ప్రాథమిక చికిత్సలను పౌరులకు నేర్పుతున్నట్లు చెప్పారు. కరెంటు షాక్ కొట్టినప్పుడు, పాము కరిచినప్పుడు, ఫిట్స్ వచ్చినప్పుడు ,పిల్లలకు ఏదైనా గొంతులో అడ్డుపడినప్పుడు, బీపీ డౌన్ అయితే, షుగర్ స్థాయిలు పడిపోతే.. ఇలా ప్రాణం పోయే పరిస్థితులలో ఆసుపత్రిలో చేర్చేలోగా ఎలాంటి సహాయం అందించాలి అనేది కూడా ఈ క్యాంపెయిన్ లో భాగంగా  నేర్పుతున్నామని ఆమె వివరించారు.

 ఎవరైనా తమ కార్యక్రమంలో భాగం అవ్వాలనుకుంటే drnaari అనే ఇంస్టాగ్రామ్ పేజీ లేదా drnaari.com అనే వెబ్సైట్ ద్వారా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. 



16, ఆగస్టు 2026, ఆదివారం

దో ఘంటే దేశ్ కే నామ్.. ఢిల్లీ వైద్యుల ఉచిత సేవ

 దేశం కోసం రెండు గంటలు.. 2 ఘంటే దేశ్ కే నామ్.. అనే ఆరోగ్య సంరక్షణ ఉద్యమంలో భాగస్వాములం అవుతామంటూ ఢిల్లీ వ్యాప్తంగా పలువురు వైద్య నిపుణులు ముందుకు వస్తున్నారు. 

పేద, నిరుపేద వర్గాలకు చెందిన రోగులకు ప్రతి వారం " 2 గంటల ఉచిత కన్సల్టేషన్ సేవలు " అందించనున్నట్లు శని వారం ప్రకటించారు.కార్డియాలజీ, ఎండో క్రైనాలజీ,పీడియాట్రిక్ ,గైనకాలజీ, జనరల్ మెడిసిన్ సహా ఇతర స్పెషలిస్టులు క్రమంగా దీంట్లో నమోదు చేసుకుంటున్నారు.

మారుమూల ప్రాంతాల్లోని రోగుల కోసం " వర్చువల్ కన్సల్టేషన్ స్లాట్" లను కూడా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. పిల్లల ఆరోగ్యం నుంచి మానసిక ఆరోగ్యం వరకు .. వైద్య నిపుణుల సేవలు అందిస్తామని డాక్టర్ ఇకేదా తెలిపారు.

15, ఆగస్టు 2026, శనివారం

ఉచితంగా.. దంత వైద్య సేవలు..

 ఎవరూ లేని వారికి దేవుడే దిక్కు అని అంటారు.. అయిన వారికి దూరమై, ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటున్న పిల్లలతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం మేమున్నాం అంటూ " లయన్స్ క్లబ్ ఆఫ్ హైద్రాబాద్" సంస్థ భరోసా ఇస్తోంది. 

ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ హైద్రాబాద్, ఐ కే ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోయిన్ పల్లి , బాపూజీ నగర్ లోని ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో " ఉచిత దంత వైద్య సేవలు" అందుబాటులోకి తెచ్చింది. 

ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఆఫ్ హైద్రాబాద్ సభ్యులు ఆర్. నారాయణ, ఆర్గొండ నర్సింలు, బచ్చు లక్ష్మణ్, కే. లింగయ్య లు అతిథులుగా హాజరై ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. 180 మందికి సేవలు అందించినట్లు తెలిపారు.. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని వారు తెలిపారు. 

14, ఆగస్టు 2026, శుక్రవారం

మెడి కవర్ ఆసుపత్రిలో ప్రతినెలా ఫ్రీ క్యాన్సర్ క్యాంప్

క్యాన్సర్ ను తొలి దశలోనే గుర్తిస్తే మెరుగైన చికిత్సతో వ్యాధి నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంటుందని హైదరాబాద్ మెడి కవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆంకాలజిస్టులు సూచించారు.

 కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మెడికవర్ హాస్పిటల్ లో "ప్రతి నెల రెండో గురువారం ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని"  నిర్వహించనున్నట్లు మెడికవర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ డాక్టర్లు.. డాక్టర్ అన్వేష్, డాక్టర్ నీలేష్ ,డాక్టర్ స్నేహ తెలిపారు. గురువారం హాస్పిటల్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్లతో కలిసి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ పాల్గొని మాట్లాడారు. 

కరీంనగర్ మెడి కవర్ ఆసుపత్రిలో గురువారం నిర్వహించిన మొదటి ఉచిత క్యాన్సర్ శిబిరంలో 186 మందికి పరీక్షలు చేయగా అందులో 26 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. క్యాన్సర్ కేసుల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఇకపై" ప్రతినెలా రెండో గురువారం"  కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రిలో" ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని "నిర్వహించాలని నిర్ణయించినట్లు డాక్టర్లు తెలిపారు. బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి అన్నారు. హాస్పిటల్ లో కల్పించిన ఈ సదవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని ముందస్తు ఆరోగ్యపరీక్షలు చేయించుకోవాలని సూచించారు. 

ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన సదస్సులో వైద్యులు మాట్లాడుతూ కరీంనగర్లో ముఖ్యంగా "బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు అధికంగా " నమోదు అవుతున్నాయని తెలిపారు. మహిళల్లో ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ రావడం వ్యాధి తీవ్రతను తెలియజేస్తుందన్నారు. అయితే క్యాన్సర్ లక్షణాలు స్పష్టంగా బయటపడకముందే స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధిని తొలి దశలో గుర్తించి తగిన చికిత్స అందించవచ్చు  అన్నారు.

 క్యాన్సర్ బారిన పడకుండా కొంతమంది నైనా కాపాడాలనే ఉద్దేశంతో మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యం" ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలని " నిర్వహిస్తోందని వైద్యులు తెలిపారు. ముందస్తు గుర్తింపు, సరైన సమయంలో చికిత్స, ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా క్యాన్సర్ ను సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చని పేర్కొన్నారు.

మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన సదస్సులో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సెంటర్ హెడ్ సంపత్, మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, పిఆర్ అబ్దుల్ వకీల్ తదితరులు పాల్గొన్నారు. 



3, ఆగస్టు 2026, సోమవారం

ప్రతి సోమ, గురు వారాల్లో ఉచిత ఫిజియోథెరపీ

 దివ్యాంగులు ఉచిత ఫిజియోథెరపీ ని సద్వినియోగం చేసుకోవాలని బాల్కొండ మండలం విద్యాధికారి బట్టు రాజేశ్వర్ అన్నారు. తెలంగాణలోని సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నడిచే భవిత కేంద్రాలలో ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రతి సోమ, గురు వారాల్లో ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భవిత కేంద్రాల్లో నిపుణులైన ఫిజియోథెరపీ వైద్యులచే ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామని ఆయన తెలిపారు. పిల్లలకు అవసరమైన వ్యాయామాలు నేర్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 

దివ్యాంగులకు విద్యాభ్యాసంతో పాటు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఐ ఈ ఆర్ పీ లను నియమించినట్లు ఆయన తెలిపారు. దివ్యాంగులతో పాటు వారి వెంట వచ్చే మరొకరికి ప్రభుత్వం రవాణా ఖర్చులను సైతం చెల్లిస్తున్నట్లు ఆయన తెలిపారు. అదే విధంగా ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ప్రభుత్వం అవసరమైన,ఉపయోగకరమైన పరికరాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. 

దోమకొండ గడికోట ట్రస్ట్ వారి ఉచిత సేవలు

 దోమకొండ గ్రామంలో బీడీ కార్మికులు, కూలీలు ఎక్కువగా ఉండడంతో వారి కుటుంబాలలో మెరుగైన ఆర్థిక పరిస్థితులు లేవు. అనారోగ్యంతో బాధ పడుతున్న వారిని వైద్యులకు చూపించలేని పరిస్థితిలో పలు కుటుంబాలు ఉండేవి. ఈ నేపథ్యంలో నిరుపేదలు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో దోమకొండ గడికోట ట్రస్ట్, గ్రామ అభివృద్ధి సంస్థ కలిసి ప్రతి నెలా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాయి. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎనిమిదేళ్లుగా ఈ ఉచిత వైద్య సేవలు నిరంతరాయంగా అందుతున్నాయి. 

ట్రస్ట్ ఆధ్వర్యంలో 2017 లో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. అధిక సంఖ్యలో బాధితులు శిబిరానికి వచ్చారు. చాలా మంది దీర్ఘకాలిక వ్యాధులతో పాటు బీపీ, షుగర్ వంటి వాటితో బాధ పడుతూ వైద్య పరీక్షలకు వెళ్లలేని దుస్థితిని ట్రస్ట్ ప్రతినిధులు గ్రహించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో రోగులను సర్వే నిర్వహించి గుర్తించారు. నిరుపేదలైన రోగులకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు, మందులు అందించాలని ట్రస్ట్ వారు సేవలందించడానికి  పూనుకున్నారు. 

జూలై 18,2018 నుంచి ప్రతి నెలా రోగులకు వైద్యులచే పరీక్షలు చేయిస్తూ, మందులను అందిస్తున్నారు. ఎనిమిదేళ్లుగా ఈ సేవలను నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. డయాబెటిస్ తో బాధ పడుతున్న ముగ్గురు విద్యార్థులకు సైతం ప్రతి నెలా సరిపోవు ఇంజక్షన్లు, మందులను అందిస్తూ వారి చదువులకు ఊతమిస్తున్నారు. 

అపోలో ఆసుపత్రి వారి సహకారంతో ఈ ఉచిత వైద్య సేవలు అందించడం , నిరుపేద కుటుంబాల్లో ఆత్మీయత,సంతోషం నెలకొనడం ఎంతో తృప్తిని ఇస్తుందని దోమకొండ గడికోట ట్రస్ట్ సీనియర్ మేనేజర్ బాబ్జీ గారు పేర్కొన్నారు.

25, మే 2026, సోమవారం

RIDO NGO ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం

 నిజామాబాద్ నగరంలోని గౌతమ్ నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఆర్ ఐ డి వో ఎన్ జి ఓ ఆధ్వర్యంలో శనివారం ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది .దంత సమస్యలతో బాధపడుతున్న పలువురికి  " ఉచితంగా వైద్య పరీక్షలు " నిర్వహించి అవసరమైన సూచనలు, సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు గడుగు గంగాధర్ ముఖ్య అతిథి గా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ ఫణీంద్ర ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించారు. గౌతమ్ నగర్ కార్పొరేటర్ శివ చరణ్, నరేందర్ ,సీనియర్ న్యాయవాది మురళీధర్ రావు తదితరులు పాల్గొని నిర్వహకులను అభినందించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఆర్ఐడిఓ ఎన్జీవో నిర్వహిస్తున్న ఆరోగ్య శిబిరాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి అని అన్నారు. ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి ప్రజలకు" ఉచిత వైద్య సేవలు " అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. 

ప్రతినిధులు మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా ప్రజలకు ఆరోగ్య అవగాహన కల్పించే కార్యక్రమాలు" ఉచిత వైద్య శిబిరాలు " మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమం విజయానికి సహకరిస్తున్న వైద్యులు, అతిథులు మరియు స్థానిక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

28, ఏప్రిల్ 2026, మంగళవారం

సహారా హెల్త్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

 మారుమూల తండాలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ముకుంద తాండా సర్పంచ్ ప్రకాష్ అన్నారు. 

సోమవారం ఆ తండాలో సహారా హెల్త్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం ప్రారంభించి మాట్లాడారు వైద్యం పట్టణ ప్రజలకు కాకుండా మారుమూల ప్రాంతంలోని తండాలలో నివసించే గిరిజనుల ఇంటింటికి వచ్చి వైద్యం అందించడం అభినందనీయం అన్నారు. 

గిరిజన ప్రాంతాలలో సిఎస్ఆర్ బాధ్యతతో ఆరోగ్యం పై అవగాహన కలిగించడం గొప్ప విషయం అన్నారు ఈ ప్రాజెక్టు ద్వారా 100 గిరిజన తండాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో సహారా హెల్త్ డెవలప్మెంట్ సొసైటీ ప్రతినిధులు సర్పంచ్ ప్రకాష్ లక్ష్మణ్ నాయక్ మహిపతి సర్దార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

వదిరాజా భట్ @ ఓ శాట్..

 వదిరాజా భట్ కర్ణాటక కు చెందిన ఐటీ నిపుణుడు . పాతికేళ్ల కిందటే అక్కడో కంపెనీ స్థాపించాడు. అమెరికాలో స్థిరపడిన వాళ్లందరిలాగే సొంతూరికీ అయిన వ...