Saturday, 13 June 2026

మైనారిటీలకు సివిల్స్ ఉచిత శిక్షణ

 సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెస్ అకాడమీ హైదరాబాద్ వారు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు యాకూబ్ పాషా  తెలిపారు. పదేళ్లుగా అకాడమీలో ఉచిత శిక్షణ పొందిన అభ్యర్థులు వివిధ సర్వీసులలో ఉద్యోగాలు సాధించాలని ఆయన పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ వివరాలను ఈనెల 20వ తేదీలోగా www.mseducationacademy.in  వెబ్సైట్ లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు.

హైద్రాబాద్, నిజామాబాద్,నిర్మల్, మహబూబ్ నగర్, హన్మకొండ, సదా శివ పేట, ఆదిలాబాద్, బోధన్ ప్రాంతాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి స్క్రీనింగ్ చేస్తామని , టెస్ట్ లో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ సెలెక్ట్ చేస్తామని తెలిపారు.

మరిన్ని వివరాలకు 85208 60785 ,90300 45422 ఫోన్ నెంబర్ లలో సంప్రదించాలని సూచించారు.

Wednesday, 10 June 2026

ఉచిత నైపుణ్య అభివృద్ధి శిక్షణ .. మైనారిటీ వర్గాలకు

 తెలంగాణ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆదేశాల మేరకు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా స్వల్పకాలిక నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించడం కోసం ప్రభుత్వ ప్రైవేటు శిక్షణ సంస్థల ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి శశి కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ముస్లింలు, బౌద్ధులు ,పార్సలు, సిక్కులు ,జైనులు తదితర మైనార్టీ వర్గాలకు చెందిన విద్యావంతులు నిరుద్యోగ మైనారిటీ యువతకు జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ అనుబంధమైన ప్రభుత్వ, ప్రైవేటు శిక్షణ సంస్థల ద్వారా ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ ,డిజిటల్ బిజినెస్ మొదలగు వాటిల్లో" నైపుణ్యాభివృద్ధికి ఉచిత శిక్షణ "అందిస్తామని తెలిపారు. ఎంపికైన సంస్థలు శిక్షణ ఇవ్వడమే కాకుండా, శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించవలసి ఉంటుందని పేర్కొన్నారు. శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న శిక్షణ సంస్థ లు మూడేళ్ల పనితీరుకు సంబంధించిన డాక్యుమెంట్లను ప్రాజెక్టు రిపోర్ట్ తో జత చేసి హార్డ్ కాపీలను ఈనెల 15 సాయంత్రం 5 గంటలకు లోపు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయం కామారెడ్డి లోని రూమ్ నెబర్ 222, కలెక్టరేట్లోని రెండో అంతస్తులో సమర్పించాలని సూచించారు.

వందమందికి ఉచిత హెల్మెట్లు

 రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని గద్వాల సీఐ శ్రీను సూచించారు రహదారి భద్రత పై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు చేపట్టిన అలా కార్యక్రమంలో భాగంగా బుధవారం గద్వాల మండలంలోని పూడూరు గ్రామంలో 100 మంది ద్విచక్ర వాహనదారులకు ఉచిత హెల్మెట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి సిఐటి శ్రీను రూరల్ ఎస్సై శ్రీకాంత్ నాయకత్వం వహించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం అలవాటుగా మార్చుకోవాలని అది కేవలం చట్టపరమైన నిబంధన మాత్రమే కాకుండా మన రక్షణ కవచమని అన్నారు ప్రధాన సమయంలో సెల్ ఫోన్ వినియోగాన్ని పూర్తిగా నివారించే రహదారిపై పూర్తి అప్రమత్త తత్వం ఉండాలని సూచించారు అలాగే నాలుగు చక్రాల వాహనాల్లో ప్రయాణించేవారు సీటు బెల్టు ధరించడం ద్వారా ప్రమాదాల సమయంలో తీవ్ర గాయాలు ప్రారంభించడం నుంచి ఆయన నష్టం నుంచి రక్షణ పొందవచ్చు అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు పెద్దలు యువకులు, ప్రజలు పాల్గొన్నారు.

జర్మన్ భాషా శిక్షణ ద్వారా విదేశీ ఉపాధి అవకాశాలు

 నిరుద్యోగ యువతీ యువకులకు జర్మన్ భాష లో శిక్షణ ఇప్పించడం ద్వారా విదేశీ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి జి వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం టాస్క్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలోని మందమర్రి పట్టణంలోని ఇల్లందు క్లబ్లో ఏర్పాటు చేసిన జర్మన్ భాషా శిక్షణ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి చంద్రయ్య, మండల తహసిల్దార్ సతీష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రాజలింగు, టాస్క్ జనరల్ మేనేజర్ రాధాకృష్ణ,  టామ్ కామ్ మేనేజర్ నాగభారతిలతో కలిసి ఆయన మాట్లాడారు.  అవకాశాలను పొందడంలో, ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలని పట్టుదల ఉన్న వారిని ప్రోత్సహిస్తామని అన్నారు . ప్రపంచవ్యాప్తంగా అనేక ఉపాధి అవకాశాలు ఉన్నా యని ముఖ్యంగా జర్మనీలో నైపుణ్యం కలిగిన యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్న జర్మనీలో నర్సింగ్, సాంకేతిక, పారిశ్రామిక రంగాలలో లక్షలాది ఉద్యోగాలలో ఖాళీలు ఉన్నాయని ,తెలంగాణ యువత అవకాశాలను అందిపుచ్చుకునేలా రాష్ట్ర ప్రభుత్వం టాస్క్ ద్వారా జర్మన్ భాషా శిక్షణ అందిస్తుందని తెలిపారు. ఉద్యోగం ఎక్కడ లభిస్తే అక్కడికి వెళ్లి పని చేసే దృక్పథం యువత అలవర్చుకోవాలని అన్నారు. పారిశ్రామికవేత్తగా పనిచేసిన అనుభవాన్ని ప్రస్తావిస్తూ మార్కెట్ ఉన్న ప్రాంతాలలో పరిశ్రమలు స్థాపించడం వలన వేలాది మందికి ఉపాధి కల్పించగలిగామని అన్నారు. స్థానికతకే పరిమితం కాకుండా అవకాశాలను వెతుక్కుంటూ ముందుకు వెళ్లాలని యువతకు సూచించారు. జర్మనీలో వారానికి కేవలం 32 నుంచి 35 గంటల పని సమయం మాత్రమే ఉంటుందని మిగతా సమయంలో ఇతర నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని, జర్మనీలో నెలకు రెండు లక్షల 50 వేల రూపాయలు ఆపైన ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రైవేటు ఏజెన్సీల మోసాలకు గురి కాకుండా ప్రభుత్వ సంస్థ అయిన టాస్క్ ద్వారా శిక్షణ పొంది విదేశీ ఉద్యోగాలను పొందాలని తెలిపారు .ఇప్పటికే ఈ కార్యక్రమానికి 112 మంది యువత నమోదు చేసుకున్నారని, వారందరికీ నైపుణ్యాభివృద్ధి శిక్షణ  అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించడం బాధ్యతగా తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం టామ్ కామ్ సంస్థకు 90 కోట్ల రూపాయలు అందించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు నెలకు రెండువేల రూపాయల స్టయిఫండ్ అందిస్తుందని, అదేవిధంగా జర్మన్ భాష శిక్షణ పొందుతున్న అభ్యర్థులలో 80 శాతం హాజర నమోదు చేసుకున్న వారికి కాకా వెంకటస్వామి ట్రస్ట్ తరఫున అదనంగా నెలకు ₹1000  స్టైపండ్ అందజేస్తామని తెలిపారు .యువతలో క్రమశిక్షణ, పట్టుదల , లక్ష్య సాధన పై దృష్టి ఉండాలని, జర్మన్ భాష నేర్చుకోవడానికి  ప్రతిరోజు సాధన చేయాలని సూచించారు. మందమర్రిలో ప్రారంభమైన ఈ శిక్షణ కేంద్రాన్ని రాష్ట్రానికి ఆదర్శంగా నిలిపేందుకు ప్రతివారం తాను స్వయంగా శిక్షణ కేంద్రాన్ని సందర్శించి అభ్యర్థులతో కలిసి జర్మనీ భాష నేర్చుకుంటానని తెలిపారు. యువత ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని కోరారు. అంతకుముందు క్లబ్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం జర్మన్ భాషా శిక్షణలో బి2 సర్టిఫికేషన్ పూర్తి చేసిన మరియన్ పాసల్, హుబా ఫాతిమా లకు ఆఫర్ లెటర్లు అందజేశారు.

మన దేశానికి ఏడాదికి 90 వేల వీసాలు ఇచ్చేందుకు జర్మనీ సిద్ధంగా ఉందనీ, జర్మనీ వీసా లో 50% సబ్సిడీ లభిస్తుందని తెలిపారు. శిక్షణ కేంద్రంలో 4 నెలల్లో జర్మనీ భాష నేర్పిస్తారని చెప్పారు. ఇంజనీరింగ్, టెక్నాలజీ, హెల్త్ కేర్ రంగాలలో అవకాశాలకు భాషా పరిజ్ఞానం తప్పనిసరి అని ,జర్మనీలో పనిచేయాలనుకునే వారికి ఆ భాష ఒక శక్తివంతమైన సాధనం అని తెలిపారు..



Monday, 8 June 2026

ఉచిత కాటన్ బ్యాగుల పంపిణీ

 రోటరీ క్లబ్ జేమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఉచిత కాటన్ బ్యాగుల పంపిణీ చేయడం జరిగిందని క్లబ్ అధ్యక్షులు పాకాల నరసింహారావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేడుకలలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించమని ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం వల్ల ప్లాస్టిక్ తో నిర్మితమైన వస్తువులు వాడడం వల్ల ఆరోగ్యం పాడవాడమే కాకుండా భయంకరమైన క్యాన్సర్ వ్యాధికి గురవుతున్నామని ఆయన తెలిపారు ఏ రూపంలో కూడా ప్లాస్టిక్  నిర్మితమైన వస్తువులు వాడకూడదని అలాగే మనకు రోజు వారి కార్యక్రమంలో ఉపయోగించే బస్తాలు వాడాలని ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ వాడకుండా కాటన్ తో తయారు చేసిన బ్యాగులు వాడడం వల్ల పర్యావరణాన్ని రక్షించడమే కాదు మనతోపాటు జీవిస్తున్న పశువుల ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతామని పేర్కొన్నారు మనం ఆరోగ్యంగా జీవించాలని అనుకుంటే ఇలాంటి కాటన్ బ్యాగులను ఉపయోగించి మనకు అవసరమైన కూరగాయలు ఇతర వస్తువులను గాని తీసుకెళ్లాలని ఆయన కోరారు ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలోని గంజిలో గల కూరగాయల సంతలో రోటరీ క్లబ్ జేమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఉచితంగా కాటన్ బ్యాగులు వినియోగదారులకు అందించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు తప్పకుండా అందరూ ఈ చిన్న మార్పుతో నిత్యజీవితంలో కాటన్ బ్యాగు ల వాడి భవిష్యత్ తరానికి ఆరోగ్యకరమైన పర్యావరణం అందించాలని కోరడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ గంజి రమేష్ గిరీష్ కుమార్  గంగుల విజయ్ రమేష్ సుధాకర్ సంపత్ రాజశేఖర్  శిరీష్ కుమార్ వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు

ఉచిత జర్మనీ శిక్షణ తరగతులు

 యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు విస్తరించేదుకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఉచిత జర్మనీ భాష శిక్షణ క్యాంపును నిర్వహించనున్నట్లు మంచిర్యాల జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికా రమేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈనెల 10న ఉదయం మందమర్రిలోని సింగరేణి ఇల్లందు క్లబ్లో శిక్షణ తరగతులను రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి తిధి వెంకటస్వామి ప్రారంభించనున్నట్లు చెప్పారు మంత్రి ఆదేశాలతో జర్మనీతో పాటు యూరోపియన్ దేశాల్లో ఉపాధి అవకాశాలు పొందేందుకు అవసరమైన భాషా నైపుణ్యాలపై ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు విదేశీ ఉపాధి అవకాశాలపై ఆసక్తి కలిగిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సేంద్రీయ సేద్యంపై తొమ్మిది నెలల ఉచిత శిక్షణ

 వ్యవసాయ భూమి గల లేదా వ్యవసాయ నేపథ్యం ఉన్న యువతను సేంద్రియ రైతు పారిశ్రామికవేత్తలుగా లేదా రైతు విస్తరణ నిపుణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అక్షయ కల్ప రైన్ మ్యాటర్ ఫెలోషిప్ కార్యక్రమం త్వరలో ప్రారంభం కానున్నది పాడి పశువుల పెంపకం బయోగ్యాస్ ఉత్పత్తి బయోడైజేష్టర్ ద్వారా తయారు చేసుకునే సేంద్రియ ఎరువులతో లాభదాయక వ్యవసాయ పద్ధతి ప పై పై 19 నుంచి 27 మధ్యన వయసుగల యువతకు 9 నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలోని ఈదులపల్లిలోని అక్షయకల్ప సేంద్రియ వ్యవసాయ పరిశోధన శిక్షణ కేంద్రంలో ఎంపికైన 30 మందికి మొదటి మూడు నెలలు రెసిడెన్షియల్ శిక్షణ తర్వాత ఆరు నెలలు ప్రాక్టికల్ శిక్షణ ఉంటుంది ఉచిత భోజనము వసతి తో పాటు ఉపకార వేతనం కూడా ఇస్తారు ఉమ్మడి మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లాలో అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది మరిన్ని వివరాలకు 70222 77155 నంబర్లో సంప్రదించవచ్చు

మైనారిటీలకు సివిల్స్ ఉచిత శిక్షణ

 సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెస్ అకాడమీ హైదరాబాద్ వారు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు యాకూబ్ ...