కామారెడ్డి జిల్లా, బాన్సువాడ మండలం లోని బోర్లం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మన్నె అనిల్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ శిక్షణ తరగతులను శని వారం బాన్సువాడ సీఐ శ్రీధర్ ప్రారంభించారు.40 రోజుల పాటు ఉచిత శిక్షణ అందించడం అభినందనీయమన్నారు.
గ్రామంలోని గ్రంథాలయంలో సుమారు 80 నుండి 100 మంది వరకు ఉచితంగా కంప్యూటర్ ట్రైనింగ్ మన్నె అనిల్ ఆధ్వర్యంలో పొందుతున్నారు. ఉదయం సాయంత్రం బ్యాచుల వారీగా ఉచిత శిక్షణ పొందుతున్నారు. పట్టణాలలో వేలాది రూపాయలు వెచ్చించి పొందే శిక్షణను ఇచ్చట పేదలకు ,వేసవి సెలవుల నేపథ్యంలో ఉచితంగా ఇవ్వడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.
ఈ ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో మన్నే అనిల్ ట్రైనర్ గా కంప్యూటర్ బేసిక్స్ ఎమ్మెస్ ఆఫీస్ ఇంటర్నెట్ బ్రౌజింగ్ ఫోటోషాప్ టైపు రైటింగ్ తదితర కంప్యూటర్ స్కిల్స్
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మన్నె రమేశ్,నాయకులు శ్రీనివాస్ రెడ్డి,నర్సింలు,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
