రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ లోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలు తెలుగు రాష్ట్రాల యువతకు వివిధ కోర్సులలో ఉచిత భోజన వసతితో కూడిన శిక్షణ అందిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది శిక్షణ పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశం కూడా కల్పిస్తామని తెలిపింది అకౌంట్స్ అసిస్టెంట్స్ డైలీ ప్రైమ్ బేసిక్ కంప్యూటర్ హార్డ్వేర్ కంప్యూటర్ అడ్వాన్స్ వెల్డింగ్ ఆటోమొబైల్ టీవీ టూ వీలర్ సర్వీస్ టెక్నీషియన్ కోర్సుల్లో నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నది ఈనెల 27న ఒరిజినల్ సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీలు ఆధార్ కార్డు కుల దృవీకరణ పత్రం పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో సంస్థకు నేరుగా హాజరు కావాలని సూచించింది పూర్తి వివరాలకు 9133 908000 మరియు 9133 90 811 1మరియు 9133 908222 మరియు 9948 466 11 1 నెంబర్ లలో సంప్రదించాలని కోరింది
Thursday, 23 July 2026
Sunday, 28 June 2026
ఇన్ఫోసిస్ సహకారంతో ఉచిత శిక్షణ
ఇన్ఫోసిస్ సహకారంతో లెర్నెట్ స్కిల్స్ వారి ఆధ్వర్యంలో ఖమ్మం లోని వైరా రోడ్ లో గల స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్లో యువతకు ఉచితంగా శిక్షణ అందజేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు లార్నెట్ స్కిల్స్ ఖమ్మం కోఆర్డినేటర్ బి నరసింహరావు తెలిపారు. 18 సంవత్సరాల నుండి 26 సంవత్సరాల వయసు లోపు గల యువత ఇంటర్ ఆపై చదివిన వారు అర్హులని తెలిపారు. శిక్షణ రోజుకు నాలుగు గంటల పాటు 25 రోజులు ఇవ్వబడును ని శిక్షణ అనంతరం ప్రైవేట్ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబడతాయని తెలిపారు. ఈ నెల 30వ తేదీ నుండి శిక్షణ ప్రారంభమవుతుందని వివరాలకు 9652711 341 ఫోన్ నెంబర్ కు కాల్ చేయాలని సూచించారు.
Sunday, 3 May 2026
ఉచిత కంప్యూటర్ శిక్షణ @బోర్లం
కామారెడ్డి జిల్లా, బాన్సువాడ మండలం లోని బోర్లం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మన్నె అనిల్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ శిక్షణ తరగతులను శని వారం బాన్సువాడ సీఐ శ్రీధర్ ప్రారంభించారు.40 రోజుల పాటు ఉచిత శిక్షణ అందించడం అభినందనీయమన్నారు.
గ్రామంలోని గ్రంథాలయంలో సుమారు 80 నుండి 100 మంది వరకు ఉచితంగా కంప్యూటర్ ట్రైనింగ్ మన్నె అనిల్ ఆధ్వర్యంలో పొందుతున్నారు. ఉదయం సాయంత్రం బ్యాచుల వారీగా ఉచిత శిక్షణ పొందుతున్నారు. పట్టణాలలో వేలాది రూపాయలు వెచ్చించి పొందే శిక్షణను ఇచ్చట పేదలకు ,వేసవి సెలవుల నేపథ్యంలో ఉచితంగా ఇవ్వడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.
ఈ ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో మన్నే అనిల్ ట్రైనర్ గా కంప్యూటర్ బేసిక్స్ ఎమ్మెస్ ఆఫీస్ ఇంటర్నెట్ బ్రౌజింగ్ ఫోటోషాప్ టైపు రైటింగ్ తదితర కంప్యూటర్ స్కిల్స్
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మన్నె రమేశ్,నాయకులు శ్రీనివాస్ రెడ్డి,నర్సింలు,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Friday, 3 April 2026
టెక్నికల్ కోర్సుల్లో ఉచిత శిక్షణ
ఈనెల 6 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి
భూదాన్ పోచంపల్లి మండలంలోని జలాల్పురం లో గల స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మరియు మేధా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి ఆధారిత సాంకేతిక కోర్సులలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ చైర్మన్ ఎన్ కిషోర్ రెడ్డి తెలిపారు .
ఎలక్ట్రిషన్ అండ్ సోలార్ ఇన్స్టాలేషన్ కోర్సు కు ఐటిఐ..
కంప్యూటర్ హార్డ్వేర్, సీసీటవీ ,సెల్ ఫోన్ రిపేరింగ్ కోర్సులకు పదవ తరగతి ..
టైలరింగ్, ఎంబ్రాయిడరీ, జర్దోజి క్విల్ట్ మేకింగ్ కోర్సులకు ఎనిమిదవ తరగతి కలిగి ఉండాలని తెలిపారు .
అభ్యర్థులు తమ విద్యార్హతల ఒరిజినల్ మరియు జిరాక్స్ కాపీలతో పాటు ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఫోటోలతో ఈ నెల ఆరవ తేదీ లోపు సంస్థలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో భోజనం, వసతి కల్పించనున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఉద్యోగం కూడా కల్పిస్తామని అన్నారు.
పూర్తి వివరాలకు 9133 90 8,000 మరియు 9133 90 8 111 నంబర్లలో సంప్రదించాలని సూచించారు
Friday, 13 March 2026
ఉచిత శిక్షణ @ నిజామాబాద్
నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని తెలంగాణ రూరల్ డెవలప్ మెంట్ ఆధ్వర్యంలో ఎంప్లాయ్ మెంట్ జెనరేషన్,మార్కెటింగ్ మిషన్ egmm, నిపుణ్ ఎడ్యుకేషనల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత కోసం హెల్త్ కేర్ సెక్టార్,కంప్యూటర్స్ విభాగాల్లో శిక్షణ అందించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
18 నుండి 35 ఏళ్ల వయసు గల, పదవ తరగతి,ఆ పైన ఉత్తీర్ణత కలిగిన ఆసక్తి కలిగిన అభ్యర్థులు యెండల టవర్స్ ఎదురుగా గల నిపుణ్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యాలయంలో సంప్రదించాలని డైరెక్టర్ మంజుల ఆకాశ పేర్కొన్నారు.ఆసక్తి గల అభ్యర్థులు ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ ఫోటో ,కుల ధృవీకరణ పత్రంతో ఆఫీసులో సంప్రదించాలని తెలిపారు
ప్రతి ఇంటికి ఐదు మొక్కలు ఉచితం
44 నర్సరీల నుండి ఉచితంగా మొక్కలు తీసుకెళ్లవచ్చు హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ రోహిత్ వెల్లడి.. ప్రతి ఇంటిలో మొక్కలు పెంచడం, పచ్చదనాన్...
-
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో గల రాజారాం స్టేడియం లో రేపటి నుండి ఖేలో ఇండియా ఉచిత విలువిద్య శిక్షణా శిబిరం ప్రారంభం కానున్...
-
చిన్న చిన్న ఒళ్ళు నొప్పుల నుండి కీళ్ల సమస్యలు, దీర్ఘ కాలం బాధించే పక్షవాతం వంటి అనారోగ్యాలతో బాధ పడే వారికి , పెద్ద పెద్ద ఆపరేషన్ ల తర్వా...
-
కామారెడ్డి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మే 2, 3, 4 తేదీలలో శనివారం ఆదివారం సోమవారం రోజున కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో కల ...
