ఫ్రీ ప్రొఫెషనల్ ట్రైనింగ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఫ్రీ ప్రొఫెషనల్ ట్రైనింగ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, ఆగస్టు 2026, బుధవారం

యువతకు ఉచిత శిక్షణ, ఉపాధి

 తెలంగాణ యువతకు ఉచిత శిక్షణ, ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నట్లు కామారెడ్డి జోన్ కార్యదర్శి శ్రీకాంత్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యువతలో ఉపాధి పొందడానికి కావలసిన వివిధ నైపుణ్యాలను పెంపొందించడానికి సంస్థ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 

ఇందుకోసం 45 రోజుల ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఇతర సమగ్ర వివరాలకు 63000 57052 నంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. 

బాలికలకు ఉచిత పైలట్ శిక్షణ

 తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్ పూర్తి చేసిన అమ్మాయిలకు ఉచితంగా పైలట్ శిక్షణ ఇచ్చేందుకు ఇండిగో సంస్థ సీ ఎస్ ఆర్ విభాగం ఇండిగో రీచ్, ఇంటర్ విద్యా శాఖ ఎంవోయూ కుదుర్చుకున్నాయి. ఇంటర్ విద్యా శాఖ డైరెక్టర్ అభిలాష అభినవ్, భారత్ కేర్స్ ట్రస్ట్ ప్రతినిధి సి. సాయి ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఇండిగో రీచ్, భారత్ కేర్స్ సంస్థ లతో కలిసి అమలు చేస్తున్న " గివింగ్ వింగ్స్ టు ఫ్లై కార్యక్రమం " ద్వారా పైలట్ శిక్షణ ఇస్తారు. 20 నెలల పాటు కొనసాగే శిక్షణా కాలంలో కమర్షియల్ పైలట్ లైసెన్స్, ట్రైనింగ్ విత్ ఏ టీ ఆర్ టైప్ రేటింగ్, బస, భోజన వసతి, వైద్య బీమా, మెంటార్ షిప్, కెరీర్ మార్గదర్శక ఖర్చులను పూర్తిగా ఆయా సంస్థలే భరిస్తాయి. 

ఈ ఒప్పందంతో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అమ్మాయిలు తమ పైలట్ కావాలన్న కలను నిజం చేసుకోవచ్చని అభిలాష అభినవ్ అన్నారు.కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు, వెబినార్లు నిర్వహిస్తారని తెలిపారు. అర్హులైన విద్యార్థినులు అధికారిక పోర్టల్ indigoreachgwf.scholarsbox.in ద్వారా దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. ఇంటర్ కళాశాలల నెట్వర్క్ ద్వారా ఈ సమాచారాన్ని విద్యార్థినులకు చేరువ చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

19, మే 2026, మంగళవారం

బధిరులకు ఉచితంగా

 బదిరులకు చదువుతోపాటు అన్ని రకాల నైపుణ్యాలను ఉచితంగా నేర్పించి తీర్చిదిద్దే సరస్వతి నిలయం నాగుబడి రంగయ్య అచ్చమ్మ బదిరుల పాఠశాల. బాపట్ల జిల్లా పర్చూరు మండలంలోని నాగులపాలెం గ్రామంలో ఉన్న ఈ పాఠశాలను ప్రవాసాంధ్రుడైన డా.నాగుబడి సుబ్బారావు గారు నిర్మించారు. రైతు కుటుంబంలో పుట్టిన ఆయన వైద్య విద్య చదివి అమెరికాలో యూరాలజిస్ట్ గా స్థిరపడ్డారు. ఆయన సోదరి బధిరురాలు . ఆమెలాంటి వారికి ఉపయోగపడేలా ఏదైనా చేయమని తండ్రి కోరడంతో 18 కోట్ల రూపాయలు హెచ్చించి ఈ పాఠశాలను స్థాపించారు.



అన్ని రకాల సౌకర్యాలతో తీర్చిదిద్దారు. వాళ్లకు విద్యతోపాటు వసతి ,పుస్తకాలు ,దుస్తులు ఇలా అన్నింటినీ అందిస్తుంది ఈ స్కూలు ట్రస్ట్.చదువుతో పాటు కుట్టుపని , సబ్బులు, చాక్ పీస్ ల తయారీని నేర్పిస్తూ ఆటలలోనూ ప్రోత్సహిస్తున్నారు..

13, ఏప్రిల్ 2026, సోమవారం

వేస్ట్ ఆప్టిమైజేషన్ ప్రొఫెషనల్ కోర్స్.. ఉచిత శిక్షణ

 పర్యావరణ హిత కార్య క్రమాల్లో నైపుణ్యం పెంపొందించడమే లక్ష్యంగా చేపట్టిన గ్రీన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో గచ్చిబౌలి లోని EPTRI సర్టిఫికెట్ కోర్సులను ప్రవేశ పెట్టింది.

ఇందులో ఒకటి 90 రోజుల ఉచిత శిక్షణ.. వేస్ట్ ఆప్టిమైజేషన్ ప్రొఫెషనల్ కోర్స్ అని నిర్వహిస్తున్నారు.

అర్హులైన వారికి ఉచిత బస, క్షేత్ర స్థాయి పర్యటనల అనంతరం సర్టిఫికెట్ ఇస్తున్నారు.దీంతో రీసైక్లింగ్ కేంద్రాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు తెలిపారు.

స్కిల్ ఇండియా మిషన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ స్కిల్ ఇండియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. పర్యావరణ హిత కార్య క్రమాల్లో శ్రామిక శక్తిని పెంపొందించడమే ఈ ప్రోగ్రామ్ లక్ష్యం.ఇందులో భాగంగా పలు ఉచిత కోర్సులు నిర్వహిస్తున్నారు.

ఇందులొ భాగంగా థియరీ,ప్రాక్టికల్ తరగతులతో ప్రాథమిక భావనలపై పరిజ్ఞానం అందించడం తో పాటు క్షేత్ర స్థాయి పర్యటనల కు భాగస్వామ్యం కల్పిస్తున్నారు.

ఇందులో పొందిన నైపుణ్యాలతో పరిశ్రమలు , రీసైక్లింగ్ కేంద్రాలు,మున్సిపల్ కార్పొరేషన్ లలో ఉద్యోగాలు పొందవచ్చునని ప్రతినిధులు తెలిపారు.

ఇంటర్, డిగ్రీ,బీటెక్ లతోపాటు సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారు అర్హులు.



3, ఏప్రిల్ 2026, శుక్రవారం

స్వామి రామానంద తీర్థ సంస్థలో ఉచిత శిక్షణ


భూదాన్ పోచంపల్లి మండలంలోని జలాల్పురం లో గల స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మరియు మేధా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి ఆధారిత సాంకేతిక కోర్సులలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ చైర్మన్ ఎన్ కిషోర్ రెడ్డి తెలిపారు .

ఎలక్ట్రిషన్ అండ్ సోలార్ ఇన్స్టాలేషన్ కోర్సు కు ఐటిఐ..

 కంప్యూటర్ హార్డ్వేర్, సీసీటవీ ,సెల్ ఫోన్ రిపేరింగ్ కోర్సులకు పదవ తరగతి ..

టైలరింగ్, ఎంబ్రాయిడరీ, జర్దోజి క్విల్ట్ మేకింగ్ కోర్సులకు ఎనిమిదవ తరగతి కలిగి ఉండాలని తెలిపారు .

అభ్యర్థులు తమ విద్యార్హతల ఒరిజినల్ మరియు జిరాక్స్ కాపీలతో పాటు ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఫోటోలతో ఈ నెల ఆరవ తేదీ లోపు సంస్థలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

 ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో భోజనం, వసతి కల్పించనున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఉద్యోగం కూడా కల్పిస్తామని అన్నారు.

 పూర్తి వివరాలకు 9133 90 8,000 మరియు 9133 90 8 111 నంబర్లలో సంప్రదించాలని సూచించారు

30, మార్చి 2026, సోమవారం

ఉచిత శిక్షణ @ నసురుల్లాబాద్

 కెనరా బ్యాంక్ వారి సహకారంతో నసురుల్లాబాద్, కామారెడ్డి జిల్లా లో ఉచిత గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం ప్రారంభం అయింది.కేంద్రాన్ని ప్రారంభించిన బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా కు చెందిన 19 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు గల యువతీ యువకులు ఉచిత శిక్షణ పొందడానికి అర్హులని అన్నారు.

తగిన ధృవ పత్రాలతో కార్యాలయంలో సంప్రదించి శిక్షణ పొంది స్వయం ఉపాధి పొందాలని సూచించారు..

కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ లోని కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఏప్రిల్ ఒకటి నుంచి 2026 27 ఆర్థిక సంవత్సరానికి గాని పలు కోర్సులలో ఉచిత శిక్షణకు దరఖాస్తులు స్వీకరిస్తారు .

ఏకకాలంలో నిరుద్యోగ యువతకు ,మహిళలకు తొమ్మిది రకాల కోర్సులలో శిక్షణ ఇస్తున్నారు .హాస్టల్ వసతి కల్పిస్తారు .కోర్సు పూర్తయిన తర్వాత ధ్రువపత్రము, మరియు టూల్ కిట్స్ అందిస్తారు. అభ్యర్థులు సొంతంగా వ్యాపారం చేసుకోవడానికి బ్యాంకుల ద్వారా రుణాల మంజూరుకు సిఫారసు చేస్తారు .ఈ అవకాశాన్ని 19 నుంచి 50 ఏళ్లలోపు వారు సద్వినియోగం చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ అమర్ సింగ్ తెలిపారు.

పురుషులకు ..

ద్విచక్ర వాహన, సెల్ ఫోన్ ,సీసీ కెమెరాలు ఇన్స్టలేషన్, సర్వీసింగ్, మరమ్మత్తులు,  ఫోటోగ్రఫీ ,ఎలక్ట్రికల్ హోమ్ వైరింగ్ , ప్లంబింగ్ వంటి వాటిలో శిక్షణ ఇస్తారు. 

స్త్రీలకు ..

టైలరింగ్, బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్, వస్త్ర బ్యాగుల తయారీ ,కొవ్వొత్తుల తయారీ ,పుట్టగొడుగుల పెంపకం తదితర అంశాలలో శిక్షణ ఇవ్వనున్నారు.

 సమర్పించాల్సిన జిరాక్స్ పత్రాలు..

 అభ్యర్థులు కామారెడ్డి జిల్లా గ్రామీణ ప్రాంతానికి చెందిన వారై ఉండాలి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పదవ తరగతి మార్కుల జాబితా( పాసర్ /ఫెయిల్), అయిదు ఫోటోలు, బ్యాంకు ఖాతా, పాన్ కార్డు జిరాక్స్ పత్రాలతో దరఖాస్తు సమర్పించాలి. ఇతర వివరాలకు కార్యాలయ సమయాలలో నేరుగా సంప్రదించవచ్చు.

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ @ డిచ్ పల్లి

 డిచ్పల్లి SBI ఉచిత గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం ..  08461-295428


డిచ్ పల్లి లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలో 2026-27 ఆర్థిక సంవత్సరం లో ఏప్రిల్ 1 నుంచి వివిధ రకాల ఉచిత స్వయం ఉపాధి శిక్షణ  ప్రారంభమైంది..

ఏక కాలంలో 10 రకాల కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు.. శిక్షణా సమయంలో హాస్టల్ వసతి కల్పిస్తారు.. కోర్సు పూర్తి అయిన తర్వాత ధ్రువపత్రం,టూల్ కిట్స్ అందిస్తారు..

అభ్యర్థులు సొంతంగా వ్యాపారం పెట్టుకునేందుకు బ్యాంకుల నుంచి రుణాలకు సిఫార్సు చేస్తారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కు చెందిన 19 నుండి 45 ఏళ్ల మధ్య వయసు గల యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ రవికుమార్ కోరారు..

ఈ కింది 10 అంశాల్లో శిక్షణ ఇస్తారు..

టైలరింగ్, మగ్గం వర్క్,బ్యూటీషియన్, CC కెమెరా ఇన్స్టలేషన్ మరియు రిపేరింగ్, ఏసీ ఇన్స్టలేషన్ అండ్ రిపేరింగ్, ఫోటోగ్రఫీ, తేనెటీగల పెంపకం, కూరగాయల నర్సరీ, పచ్చళ్ళ తయారీ, పుట్ట గొడుగుల పెంపకం

కావలసిన జిరాక్స్ పత్రాలు..

 ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పదవ తరగతి మార్కుల జాబితా ( పాస్ /ఫెయిల్ ),5 ఫొటోలు, బ్యాంక్ ఖాతా, పాన్ కార్డు 

సందేహాల నివృత్తికి..

కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా ల్లోని ఆసక్తి కల యువతీ యువకులు తమ సందేహాల నివృత్తికి ఆఫీసు వేళల్లో 08461-295428 ఫోన్ నంబర్ లో సంప్రదించాలని సూచించారు.పూర్తి వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు డైరెక్టర్ రవికుమార్..

29, మార్చి 2026, ఆదివారం

ఫర్నిచర్ తయారీలో ఉచిత శిక్షణ

 ఫర్నిచర్ తయారీలో ఉచిత శిక్షణ మరియు ఉపాధి కల్పన

జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో ఫర్నిచర్ తయారీలో ఉచిత శిక్షణ మరియు ఉపాధి కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.

టాలెంట్ మేనేజర్ అనవిలాసిని,శిక్షకుడు విశ్వనాథ మోహన్ లతో కలిసి కరపత్రం ఆవిష్కరించారు. స్కిల్ ఇండియా కార్యక్రమం కింద పదవ తరగతి ఉత్తీర్ణత కలిగిన ,16 నుండి 50 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారికి 3 నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.శిక్షణ అనంతరం మల్టీ నేషనల్ కంపెనీలో 6 నెలలు అప్రెంటిస్ షిప్ చేయాలని సూచించారు. సందేహాల నివృత్తికి 76739 76699 మొబైల్ నెంబర్ లో సంప్రదించాలని సూచించారు.

వదిరాజా భట్ @ ఓ శాట్..

 వదిరాజా భట్ కర్ణాటక కు చెందిన ఐటీ నిపుణుడు . పాతికేళ్ల కిందటే అక్కడో కంపెనీ స్థాపించాడు. అమెరికాలో స్థిరపడిన వాళ్లందరిలాగే సొంతూరికీ అయిన వ...