వ్యవసాయ భూమి గల లేదా వ్యవసాయ నేపథ్యం ఉన్న యువతను సేంద్రియ రైతు పారిశ్రామికవేత్తలుగా లేదా రైతు విస్తరణ నిపుణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అక్షయ కల్ప రైన్ మ్యాటర్ ఫెలోషిప్ కార్యక్రమం త్వరలో ప్రారంభం కానున్నది పాడి పశువుల పెంపకం బయోగ్యాస్ ఉత్పత్తి బయోడైజేష్టర్ ద్వారా తయారు చేసుకునే సేంద్రియ ఎరువులతో లాభదాయక వ్యవసాయ పద్ధతి ప పై పై 19 నుంచి 27 మధ్యన వయసుగల యువతకు 9 నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలోని ఈదులపల్లిలోని అక్షయకల్ప సేంద్రియ వ్యవసాయ పరిశోధన శిక్షణ కేంద్రంలో ఎంపికైన 30 మందికి మొదటి మూడు నెలలు రెసిడెన్షియల్ శిక్షణ తర్వాత ఆరు నెలలు ప్రాక్టికల్ శిక్షణ ఉంటుంది ఉచిత భోజనము వసతి తో పాటు ఉపకార వేతనం కూడా ఇస్తారు ఉమ్మడి మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లాలో అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది మరిన్ని వివరాలకు 70222 77155 నంబర్లో సంప్రదించవచ్చు
Monday, 8 June 2026
Friday, 8 May 2026
రెడ్డీస్ ఫౌండేషన్ వారి ఉచిత మట్టి పరీక్షలు
వ్యవసాయంలో శాస్త్రీయ పద్ధతులను ప్రోత్సహిస్తూ రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి పరీక్షల కార్యక్రమం కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లోని భీమ్గల్ మండలంలో కారేపల్లి గ్రామంలో స్థానిక రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా నిపుణులు మాట్లాడుతూ రైతులు తమ పొలాల నుంచి మట్టి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం సమర్పించాలని సూచించారు.
ఈ పరీక్షల ద్వారా మట్టిలోని ముఖ్య పోషకాలైన నత్రజని పొటాషియం ఫాస్ఫరస్ లతోపాటు సూక్ష్మ పోషకాల స్థాయిని శాస్త్రీయంగా విశ్లేషించి, పంటలకు తగిన ఎరువుల వినియోగంపై మార్గదర్శకాలు అందిస్తారని తెలిపారు. అధిక ఎరువుల వినియోగం వల్ల మట్టి సారం తగ్గుతున్న నేపథ్యంలో సరైన మట్టి పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఖర్చులు తగ్గించుకోవడంతోపాటు దిగుబడులు పెంచుకోవచ్చని నిపుణులు వివరించారు.
అలాగే భూమికి అనుకూలమైన పంటల ఎంపిక, భూమి సంరక్షణకు అవసరమైన సూచనలు కూడా రైతులకు అందించబడతాయని చెప్పారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ పొలాల భూసారాన్ని పెంచుకోవాలని కోరారు.
మరిన్ని వివరాల కోసం కమ్యూనిటీ ఫెసిలిటేటర్ నక్క హరీష్ ను 8008768238 నంబర్ లో సంప్రదించాలని సూచించారు.
Monday, 4 May 2026
ఉచిత డిజిటల్ సహకార కోర్సులు
తెలుగు తో సహా 8 భాషలలో సహకార డిజిటల్ వీడియో కోర్సులు.160 కి పైగా కోర్సులను అందుబాటులోకి తెచ్చిన కేంద్ర సహకార శాఖ..
సహకార రంగానికి సంబంధించి 160 కి పైగా ఆన్లైన్ డిజిటల్ కోర్సులను తెలుగు సహా 8భాషలలో ఉచితంగా కేంద్ర సహకార శాఖ ఆఫర్ చేస్తోంది. రైతులు, ఎగుమతి దారులు,విద్యార్థులకు ఉపయోగపడేలా ఏ ఐ తోడ్పాటుతో ఈ కోర్సులను రూపొందించారు.ఇందుకోసం ప్రత్యేకంగా savidya.coop పేరిట ఒక వెబ్ సైట్ అందుబాటులోకి వచ్చింది.
సవిద్య అంటే సహకార విద్యాలయం .ఇది దేశంలోనే మొట్ట మొదటి డిజిటల్ సహకార విద్యా వేదిక. రైతులు,విద్యార్థులు, ఎగుమతి దారుల్లో సహకార విజ్ఞానాన్ని పెంపొందించడానికి ఉద్దేశించిన వేదిక ఇది. సహకార మంత్రిత్వ శాఖ ' సహకార్ సే సమృద్ధి ' చొరవలో భాగంగా ప్రారంభించిన ఈ వేదిక సహకార రంగంలో నిపుణుల నేతృత్వంలో ఉచిత శిక్షణ ను అందిస్తుంది.
వ్యవసాయ పద్ధతులు ,ఎగుమతి వ్యూహాలు వంటి ముఖ్యమైన అంశాలను కవర్ చేసే 160 కి పైగా ఉచిత వీడియో కోర్సులు . తెలుగు సహా ఎనిమిది భారతీయ భాషలలో గ్రామీణులకు కూడా అందుబాటులో ఉండేలా ఈ కోర్సులను రూపొందించారు. కృత్రిమ మేధ ఆధారిత ఫీచర్లను ఉపయోగించి కంటెంట్ ను వ్యక్తిగతికరిస్తుంది. లక్షలాది వినియోగదారులకు మరింత సమర్థవంతంగా ఙ్ఞానాన్ని అందించేందుకు ఏ ఐ వాడినట్లు కేంద్ర సహకార శాఖ తెలిపింది. వినియోగదారులు తమ మొబైల్ పరికరాల ద్వారా ఎప్పుడైనా ఎక్కడైనా ఈ వీడియో కోర్సులు చదువుకోవడానికి వీలుంది. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను నేర్చుకోవడానికి ,పంట దిగుబడిని మెరుగుపరచు కోవడానికి ఇందులో కోర్సులు ఉన్నాయి. విద్యార్థులు సహకార రంగంలో వృత్తి, పరిశోధనా అవకాశాలను అన్వేషించడానికి ఉపయోగపడే కోర్సులు ఉన్నాయి. అంతేకాదు ఎగుమతి దారులు ప్రపంచ మార్కెట్ అవసరాలు , అంతర్జాతీయ వాణిజంపై అవగాహన పొందడానికి అవసరమైన కోర్సులను సైతం ఇందులో పొందుపరచడం విశేషం.
నేషనల్ కో-ఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ , క్రిబ్కో వంటి సహకార సంస్థలు సహకార విద్య ప్లాట్ ఫామ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా దాదాపు 17 వేల సహకార సంఘాలను రెండు కోట్ల మందికి పైగా రైతులకు అనుసంధానం చేయడమే దీని లక్ష్యం.
మీరు savidya.coop లో నేరుగా కోర్సులను ఎంపిక చేసుకుని , సులువుగా, ఉచితంగా నేర్చుకోవడం ప్రారంభించవచ్చు.
Tuesday, 14 April 2026
ప్రకృతి సేద్యం పై 3 రోజుల ఉచిత శిక్షణ
సేంద్రీయ/ ప్రకృతి సేద్యం పై ఎన్టీర్ జిల్లా లోని నూజివీడు వద్ద గల కొండపర్వలోని కృష్ణ సుధ అకాడమీ ఆఫ్ ఆగ్రో ఎకాలజి సంస్థ లో ఈ నెల 28 నుండి 30 తేదీ వరకు 3 రోజులపాటు రెసిడెన్షియల్ ఫౌండేషన్ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
రైతులతో కలిసి పని చేసే క్షేత్రస్థాయి విస్తరణ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు ,రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ప్రభుత్వ శాఖల సిబ్బంది, రైతు సంక్షేమ సంఘాలు, సహకార సంఘాలు ,బ్యాంకులు, ఉద్యాన, వ్యవసాయ, పశు విశ్వవిద్యాలయాల సిబ్బంది ఈ శిక్షణకు అర్హులని తెలిపారు .
పూర్తి వివరాలకు 8500283300 నంబర్ లో సంప్రదించాలని సూచించారు.
పుట్టగొడుగుల పెంపకం పై ఉచిత శిక్షణ
నసురుల్లాబాద్ కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ లో ఏప్రిల్ 27 నుంచి మే 7 వరకు పుట్ట గొడుగుల పెంపకం పై ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
పుట్టగొడుగుల పెంపకం పై ఆసక్తి ఉన్న 18 నుండి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న వ్యక్తులు జిల్లా కలెక్టరేట్ లోని DRDO ఆఫీస్ లో లేదా నసురుల్లాబాద్ లోని సంస్థ కార్యాలయంలో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ అమర్ సింగ్ తెలిపారు.
శిక్షణ సమయంలో ఉచిత వసతి, ఉచిత భోజనం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.
పూర్తి వివరాలకు..
92475 40478 నంబర్ లో సంప్రదించాలని సూచించారు.
మైనారిటీలకు సివిల్స్ ఉచిత శిక్షణ
సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెస్ అకాడమీ హైదరాబాద్ వారు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు యాకూబ్ ...
-
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో గల రాజారాం స్టేడియం లో రేపటి నుండి ఖేలో ఇండియా ఉచిత విలువిద్య శిక్షణా శిబిరం ప్రారంభం కానున్...
-
కామారెడ్డి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మే 2, 3, 4 తేదీలలో శనివారం ఆదివారం సోమవారం రోజున కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో కల ...
-
చిన్న చిన్న ఒళ్ళు నొప్పుల నుండి కీళ్ల సమస్యలు, దీర్ఘ కాలం బాధించే పక్షవాతం వంటి అనారోగ్యాలతో బాధ పడే వారికి , పెద్ద పెద్ద ఆపరేషన్ ల తర్వా...
