ఫ్రీ సోషల్ సర్వీస్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఫ్రీ సోషల్ సర్వీస్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, సెప్టెంబర్ 2026, శనివారం

తెలుగు రాష్ట్రాల్లో సీ ఆర్ ఫౌండేషన్ సేవలు

 కొండాపూర్ సిఆర్ ఫౌండేషన్ లో నూతన కార్యవర్గం సభ్యులతో శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షుడు కే నారాయణ మాట్లాడుతూ చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వృద్ధాశ్రమాలు విస్తరిస్తామని తెలిపారు. కడప ,గుంటూరు ప్రాంతాల్లో భవనాలు, భూములు, విరాళంగా లభించాయని అక్కడ వృద్ధాశ్రమాలు నిర్మించే ప్రణాళికలు ఉన్నాయని అన్నారు. కడపలోని వృద్ధాశ్రమం ఇప్పటికే ప్రారంభమైందని అలాగే అమరావతిలో ఏపీ ప్రభుత్వం మూడు ఎకరాల భూమిని కేటాయించడానికి అంగీకరించిందని స్థలం ఖరారు కావాల్సిందని వెల్లడించారు. 

సి ఆర్ పాలి క్లినిక్ గ్రామీణ ప్రజలకు కూడా ప్రయోజనం చేకూరేలా టెలి మెడిసిన్ ద్వారా సేవలను విస్తరించాలని, పేదలు, అవసరమైన వారి కోసం డయాలసస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని  యోచిస్తోందన్నారు. ఎన్ ఆర్ ఆర్ రీసెర్చ్ సెంటర్ ద్వారా పాఠశాల పిల్లల కోసం నెలవారీ కార్యకలాపాలు నిర్వహించడంతోపాటు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ప్రత్యేక కోచింగ్ సెంటర్లు ప్రారంభించాలని నిర్ణయించినట్లు నారాయణ వివరించారు. సిఆర్ ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో 22 ఏళ్లుగా ఉంటున్న సుబ్బలక్ష్మి తన మరణానంతరం ఫౌండేషన్కు 25 లక్షల రూపాయల విరాలం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సిఆర్ ఫౌండేషన్ నూతన అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, కే రజని ,పిడికిటి సంధ్య కుమారి, ప్రధాన కార్యదర్శిగా ముప్పాళ్ళ నాగేశ్వరరావు, కార్యదర్శులుగా కంభంపాటి అజయ్ కుమార్, మహమ్మద్ యూసఫ్, ఏ రామానాయుడు, బి చెన్నకేశవరావు ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా 25 మందిని నియమించారు. 

20, ఆగస్టు 2026, గురువారం

ఫ్రీ CPR ట్రైనింగ్@డాక్టర్ నారి చారిటబుల్ ట్రస్ట్

 


గుండె ఆగిపోయిన మనిషికి తిరిగి ప్రాణం పోసే ప్రక్రియ సి పి ఆర్ ..దీనిని ఎంతమందికి నేర్పిస్తే సమాజానికి అంత మేలు చేసిన వాళ్ళం అవుతాము అన్నది తమ సంకల్పమని డాక్టర్ నారి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ డాక్టర్ నర్లింగల కీర్తన యాదవ్ అన్నారు.

 అందుకే తెలంగాణ వ్యాప్తంగా కాలేజీలు, కోర్టులు, పోలీసు కార్యాలయాలు సహా వివిధ చోట్ల క్యాంపులు నిర్వహించి ఇప్పటివరకు సుమారు లక్ష మందికి" ఉచితంగా సి పి ఆర్ ట్రైనింగ్"  ఇచ్చినట్లు తెలిపారు. రెడ్ క్రాస్, హ్యాండ్స్ ఆన్ హార్ట్ ఫౌండేషన్లు తమతో కలిసి పని చేస్తున్నాయని ఆమె వివరించారు. దీనితో పాటుగా కొన్ని అత్యవసర ప్రాథమిక చికిత్సలను పౌరులకు నేర్పుతున్నట్లు చెప్పారు. కరెంటు షాక్ కొట్టినప్పుడు, పాము కరిచినప్పుడు, ఫిట్స్ వచ్చినప్పుడు ,పిల్లలకు ఏదైనా గొంతులో అడ్డుపడినప్పుడు, బీపీ డౌన్ అయితే, షుగర్ స్థాయిలు పడిపోతే.. ఇలా ప్రాణం పోయే పరిస్థితులలో ఆసుపత్రిలో చేర్చేలోగా ఎలాంటి సహాయం అందించాలి అనేది కూడా ఈ క్యాంపెయిన్ లో భాగంగా  నేర్పుతున్నామని ఆమె వివరించారు.

 ఎవరైనా తమ కార్యక్రమంలో భాగం అవ్వాలనుకుంటే drnaari అనే ఇంస్టాగ్రామ్ పేజీ లేదా drnaari.com అనే వెబ్సైట్ ద్వారా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. 



18, ఆగస్టు 2026, మంగళవారం

ఉచిత "అర్జంట్ కేర్ సెంటర్" @ జగిత్యాల

 గ్రామీణ ప్రాంత ప్రజలకు" ఉచితంగా అత్యవసర వైద్య సేవలు"  అందించడమే ప్రధాన లక్ష్యంగా" శ్రీ సత్య సాయి సుజల స్రవంతి ట్రస్ట్"  ఆధ్వర్యంలో జగిత్యాల గ్రామీణ టీ ఆర్ నగర్, రాజారాం గ్రామం వద్ద ఏర్పాటుచేసిన" సాయి స్వస్థ షా హ్యాపీనెస్ అర్జెంట్ కేర్ సెంటర్" ను ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, సంజయ్ కుమార్, మునిసిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి సోమవారం ప్రారంభించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగిత్యాల, మల్యాల నియోజకవర్గాల పరిధిలోని గ్రామీణ ప్రజలకు ఈ కేంద్రం ద్వారా" ఉచితంగా అత్యవసర వైద్య సేవలు"  అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో పేద మధ్యతరగతి కుటుంబాలకు సకాలంలో వైద్యం అందించడం ద్వారా అమూల్యమైన ప్రాణాలను కాపాడవచ్చు అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలకు తోడుగా ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థల భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలను విరివిగా విస్తరింప చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దినేష్, డిసిసి అధ్యక్షుడు గాజంగి నందయ్య తదితరులు పాల్గొన్నారు. 

16, ఆగస్టు 2026, ఆదివారం

కామరాజు అన్నపూర్ణమ్మ ట్రస్ట్ ఉచిత సేవలు

 నిరుపేద విద్యార్థుల ముఖాలలో చిరునవ్వులు పూయిస్తూ వారి ఉన్నత చదువులకు ఆర్థికంగా అండగా నిలుస్తూ ప్రణీత్ గ్రూప్ అధినేత నరేంద్ర కుమార్ కామరాజు ఆదర్శంగా నిలుస్తున్నారు. జీవితంలో రాణించాలంటే చదివే కీలకమని నమ్మిన వ్యక్తి ఆయన .ఆర్థిక సమస్యతో ఆ చదువు నిరుపేద విద్యార్థుల నుంచి దూరం కావద్దని తపన పడే మనిషి. అందుకే తన చిన్నప్పుడు మనకు ఉన్నంతలో ఇతరులకు సాయం చేయాలని నాయనమ్మ చెప్పిన మాటలు ఇప్పుడు అతని సేవా కార్యక్రమానికి ప్రేరణ నిస్తున్నాయి .ఇప్పటివరకు నగరంలో ఐదు ప్రభుత్వ పాఠశాలల్లో వేలాది మంది విద్యార్థులకు స్పోర్ట్స్ షూస్, స్కూల్ బ్యాగులు ,వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. పదో తరగతిలో 500 మార్కులు దాటిన ఆయా  స్కూళ్లకు చెందిన 43 మంది విద్యార్థులకు తన నాయనమ్మ పేరు మీద ఏర్పాటు చేసిన" కామరాజు అన్నపూర్ణమ్మ ట్రస్ట్"  ద్వారా ఒక్కొక్కరికి 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తూ మొత్తంగా 21 లక్షల రూపాయలు ప్రకటించారు. అయితే ఈ స్కాలర్షిప్ సహాయం ప్రతి ఏడాది కొనసాగనున్నది. ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని భుజానికి ఎత్తుకున్న ప్రణీత గ్రూప్ అధినేత నరేంద్ర కుమార్ కామరాజు ట్రస్ట్ కార్యక్రమాల గురించి ఈ విధంగా వివరించారు. 



2007లో ప్రణీత్ గ్రూప్ కంపెనీ ఏర్పాటు చేసిన నరేంద్ర కుమార్ గారు అంచలంచలుగా సాగిన తన ప్రస్థానంలో వారి నాయనమ్మ గారు తరచూ చెప్పిన మాటలు తనను చాలా ప్రభావితం చేశాయన్నారు. తన తొలి జీతం మూడు వేల రూపాయలు వచ్చినప్పుడు కూడా అందులో 300 రూపాయలు సహాయం చేసే వాడిని .అన్నపూర్ణమ్మ ట్రస్ట్ తో స్కాలర్షిప్లు ఇవ్వడమే కాకుండా ఇప్పటివరకు 250 మంది విద్యార్థులను ఇంజనీరింగ్ ,ఎంబీఏ, ఎంసీఏ చదివించానని, ఇలా సహాయం అందుకున్న విద్యార్థులు చాలా గొప్ప స్థానాలలో ఉన్నారని.. ఒక విద్యార్థి అమెరికాలో స్థిరపడి తన ట్రస్ట్ మరిన్ని కార్యక్రమాలు చేయాలని తనవంతు సహాయం అందించాడని తెలిపారు. 

ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడా టీచర్లు ఉండకుండా ఉన్న సమస్యతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితులలో సాధ్యమైనంత వరకు సంబంధిత పాఠశాలలో మంచి టీచర్లను నియమించే బాధ్యత ట్రస్ట్ తరఫున తీసుకుంటున్నామని ఆయన తెలిపారు .వారికి ట్రస్ట్ జీతాలు చెల్లిస్తుందని ,చాలామంది హెచ్ఎంలు తమ పాఠశాలలో టీచర్లను నియమించే బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారని తెలిపారు .అందుకే మేము సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారులతో సమన్వయం చేసుకొని వారి సూచనల మేరకు టీచర్ల నియామకానికి ప్రణాళికలు వేశామన్నారు. ఒక వ్యక్తి చదువుకొని బాగుపడితే ఆ కుటుంబం బాగుపడుతుంది .చదువు లేకున్న సాధించే వారు చాలామంది ఉన్నారు, కానీ చదువు ఆయుధం లాంటిదని నేను బలంగా నమ్ముతున్నాను. మహా అయితే 15 ఏళ్లు చదువుతాము, ఆ తర్వాత అంతా జీవిత పోరాటమే. అందుకే ఆ చదువు ఫౌండేషన్ బలంగా ఉంటే విద్యార్థులు గొప్పగా  రాణిస్తారు .

నాయనమ్మ ఆదర్శం..

 సాయం, సేవ చేయాలని ఆలోచన నేను మా నాయనమ్మ నుంచే నేర్చుకున్నాను. నాయనమ్మ పేరు అన్నపూర్ణమ్మ. ఆమెది తన వద్ద ఉన్నదాంట్లో కొంత సహాయం చేసే మనస్తత్వం. సహాయం చేయాలనే మనస్తత్వం ఉంటే డబ్బే కాదు ,ఏ రూపంలోనైనా సహాయం అందించగలను అని చెబుతుండేది. పది మందికి సహాయం చేసే ఆలోచనలు నాటుకు పోయేలా చిన్నప్పటి నుంచి నూరి పోసింది .ఏడో తరగతి వరకు నన్ను ఎత్తుకొని ముద్దాడేది. నీ గురించే కాదు నీ చుట్టూ ఉన్నవారి గురించి ఆలోచించమని చెబుతూ ఉండేది. ఆమె ఇచ్చిన స్ఫూర్తితోనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. మా ట్రస్ట్ కార్య కలాపాలకు ప్రేరణ మా నాయనమ్మ .ఈ సేవలు మరింత విస్తృతంగా చేయాలని ఆలోచనతో ఉన్నాము.ఇందుకు తగ్గ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. ప్రతిభ కలిగిన నిరుపేద విద్యార్థులకు కామరాజు అన్నపూర్ణమ్మ ట్రస్ట్ ఎప్పుడూ అండగా ఉంటుంది ఆయన తెలిపారు.  

ఒక స్కూల్లో, ఒక కాలేజీలో చదువు పూర్తి చేసుకొని బయటకు వచ్చాక, మళ్లీ ఆ స్కూల్ ,కాలేజీలో అడుగుపెట్టిన వారు ఎంతమంది ఉంటారు? మనం ప్రతిదీ ప్రభుత్వం నుంచి పొందాము. మరి మనం ప్రభుత్వం అందించిన ప్రయోజనాలను వినియోగించుకొని ఎదిగాము కదా.. మరి మనం ప్రభుత్వ పాఠశాలకు ఏం చేయగలుగుతున్నాము అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి అంటారు నరేంద్ర కుమార్ కామరాజు .

తమ ట్రస్ట్ ను సంప్రదించాలి అనుకుంటే 7337252627 నెంబర్ కు కాల్ చేయవచ్చని పేర్కొన్నారు. 



దో ఘంటే దేశ్ కే నామ్.. ఢిల్లీ వైద్యుల ఉచిత సేవ

 దేశం కోసం రెండు గంటలు.. 2 ఘంటే దేశ్ కే నామ్.. అనే ఆరోగ్య సంరక్షణ ఉద్యమంలో భాగస్వాములం అవుతామంటూ ఢిల్లీ వ్యాప్తంగా పలువురు వైద్య నిపుణులు ముందుకు వస్తున్నారు. 

పేద, నిరుపేద వర్గాలకు చెందిన రోగులకు ప్రతి వారం " 2 గంటల ఉచిత కన్సల్టేషన్ సేవలు " అందించనున్నట్లు శని వారం ప్రకటించారు.కార్డియాలజీ, ఎండో క్రైనాలజీ,పీడియాట్రిక్ ,గైనకాలజీ, జనరల్ మెడిసిన్ సహా ఇతర స్పెషలిస్టులు క్రమంగా దీంట్లో నమోదు చేసుకుంటున్నారు.

మారుమూల ప్రాంతాల్లోని రోగుల కోసం " వర్చువల్ కన్సల్టేషన్ స్లాట్" లను కూడా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. పిల్లల ఆరోగ్యం నుంచి మానసిక ఆరోగ్యం వరకు .. వైద్య నిపుణుల సేవలు అందిస్తామని డాక్టర్ ఇకేదా తెలిపారు.

14, ఆగస్టు 2026, శుక్రవారం

ఉచిత చేనేత శిక్షణ @ దోమకొండ

 దోమకొండలో చేనేత పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకు రావడానికి దోమకొండ గడికోట ట్రస్ట్ వారి సహకారంతో "ఉచిత చేనేత శిక్షణ తరగతులు"నిర్వహిస్తున్నట్లు హైద్రాబాద్ చేనేత సేవా సంస్థ ప్రతినిధులు పవన్, సంతోష్ లు తెలిపారు. 

గురువారం దోమకొండ మండల కేంద్రంలోని ఉమా బాగ్ లో చేనేత శిక్షణ తరగతులు ప్రారంభించి ,మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఐరేని నర్సయ్య, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు బత్తిని సిద్ధరాములు, ఉప సర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్, గడికోట ట్రస్ట్ సీనియర్ మేనేజర్ బాబ్జీ, ప్రతినిధులు పాల్గొన్నారు. 

6, ఆగస్టు 2026, గురువారం

పేద పిల్లలకు ఉచిత విమాన యానం

 ఆకాశ యానం అందరికీ అందదు. ఆ అందని ఆకాశ ప్రయాణాన్ని పేద పిల్లలకు ఉచితంగా అందించేందుకు ఉత్తరాఖండ్ లో ఉన్న హల్ద్వానీ నగరంలోని పంత్ నగర్ ఎయిర్ పోర్ట్ లోని విమానం బయలుదేరి నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దిగింది. ఆదివారం జరిగిన ఈ విమాన ప్రయాణం లో 30 మందికి పైగా నిరుపేద కుటుంబాల పిల్లలు ప్రయాణించారు. ఆ పిల్లల కోసం విమాన టికెట్లను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లు వ్లాగర్ సౌరభ్ జోషి, ఆయన సతీమణి అవంతికా భట్ లు బుక్ చేశారు. ఆ పిల్లల తో పాటు వారూ ప్రయాణించారు. నోయిడా లోని గేమింగ్ జోన్ లో పిల్లలను ఆడిస్తూ రోజంతా సరదాగా గడిపారు. 

రెస్టారెంట్ లో పిల్లలకు ఇష్టమైన పిజ్జాలు, బర్గర్ లు ఆర్డర్ చేశారు. ఆ పిల్లల సందడి, అల్లరి, సంతోషాలను వీడియో తీసి సౌరభ్ తన యూట్యూబ్ ఛానల్ లో పోస్టు చేశాడు. అవంతిక తన ఇన్స్టా గ్రామ్ హ్యాండిల్ లో పోస్టు చేసింది. 

పేద పిల్లల సంతోషం కోసం ఒక రోజు చేసిన ఖర్చు కన్నా వారి సంతోషం కోసం శ్రద్ధ చూపినందుకు సోషల్ మీడియాలో ఎంతో మంది అవంతిక జోడీ ని ప్రశంసించారు. కొన్ని నెలల క్రితం అవంతిక, సౌరభ్ లు విడిపోతున్నారని, అందుకే వారిద్దరూ వీడియోల్లో కనిపించడం లేదని పుకార్లు వచ్చాయి. ఆ పుకార్లకు తాజాగా వారి వీడియోలు సమాధానం ఇస్తున్నాయి. పురాతన కాలంలో పావురాలతో సందేశం పంపినట్లు, ఈ జోడీ వీడియో తో నెటిజన్ లకు సందేశం పంపింది .

5, ఆగస్టు 2026, బుధవారం

ఉచిత భోజనం@శ్రీ బాలాజీ ఫ్యామిలీ రెస్టారెంట్, సీలేరు

 ఇప్పుడిప్పుడే పట్టణంగా ఎదుగుతున్న ఏజెన్సీ ప్రాంతం.. సీలేరు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న ఈ ఊరిలో హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పుడు తూర్పు గోదావరి జిల్లా నుండి వచ్చింది నక్కా జ్ఞానేశ్వర రావు గారి కుటుంబం. మొదట్లో వ్యవసాయం చేసిన ఆయన, తర్వాత శ్రీ బాలాజీ ఫ్యామిలీ రెసిడెన్సీ అండ్ రెస్టారెంట్ ను పెట్టాడు. అప్పుడే అక్కడికి గర్భిణులు ఎక్కువగా రావడం గమనించాడు. వారందరూ మారుమూలన ఉన్న పర్వత ప్రాంతాల నుంచి సీలేరు లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు వచ్చే గిరిజనులు. ఐతే వారి దగ్గర భోజనానికి సరిపడా డబ్బు ఉండేది కాదు. తమ దగ్గర ఉన్నదేదో చేతిలో పెట్టి వెళ్ళి పోయే వారు. ఆయన కూడా ఇంతే ఇవ్వాలి అని పట్టు పట్టేవారు కాదు. పోనుపోను వారిని డబ్బులు అడగడమే మానేశాడు జ్ఞానేశ్వర రావు. అలా 2018 నుండి వారికి ఉచితంగానే భోజనం పెడుతున్నాడు ఆయన. 

కేవలం తన హోటల్ ను వెతుక్కుంటూ వచ్చే వారికి మాత్రమే కాకుండా , సీలేరు పీ హెచ్ సీ లో పని చేసే నర్సులకు రోజూ తన హోటల్ మీల్స్ టోకెన్లు ఇస్తున్నాడు. వారు దవాఖానకు వచ్చే గర్భిణులకు , వారి సహాయకులకు ఈ టోకెన్లు ఇచ్చి హోటల్ కు పంపిస్తున్నారు. అలా రోజూ కనీసం 20 మందికి ఉచితంగా భోజనం పెడుతున్నాడు శ్రీ జ్ఞానేశ్వర రావు. 

ఇక్కడ ప్రతి నెలా 9 వ తేదీన గర్భిణులకు అన్ని రకాల టెస్టులు చేస్తుంటారు. ఆ సమయంలో వంద మంది కి పైగా వస్తుంటారు. ఆ రోజున తన భార్య నాగమణితో కలిసి హోటల్ నుండి తానే స్వయంగా భోజనం తీసుకెళ్లి ఇస్తుంటాడు ఆయన. 

ఉచిత విద్య@విద్యాఛాయ పాఠశాల@ సిలిగురి

 పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి పట్టణానికి చెందిన శక్తిపాల్ ది నిరుపేద కుటుంబం. అన్నం దొరకడమే కష్టమైన పరిస్థితుల్లో బాల కార్మికుడిగా మారాడు ఆయన. తర్వాత ఎంతో శ్రమించి సైన్యంలో చేరాడు. ప్రస్తుతం అస్సాం రైఫిల్స్ లో హవల్దార్ గా పని చేస్తున్నారు శ్రీ శక్తిపాల్. తన చిన్నప్పటి ఆకలి బాధలను మరచిపోలేదు శక్తిపాల్. తనకొచ్చే జీతంలో సగాన్ని వెచ్చించి రూ. 1 జనతా హోటల్ అనే పేరుతో సిలిగురిలో ఒక హోటల్ స్థాపించారు. 

ఇక్కడున్న ప్రభుత్వ ఆఫీసులకు,ఆసుపత్రులకు,ప్రయాణికులకు కడుపునిండా భోజనం పెడుతున్నాడు. మరి ఆ ఒక్క రూపాయి ఎందుకు అంటే..నేను నడిపే బడిలో వారిని ఏదో రకంగా భాగస్వాములను చేయాలి కదా అంటాడు.

విద్యా ఛాయ పేరుతో సిలిగురిలో ఒక పాఠశాలను నడుపుతున్నారు శక్తి పాల్ గారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చే పేద వలస కార్మికుల పిల్లల సంక్షేమమే లక్ష్యంగా నడిచే ఈ బడిలో " ఉచితంగా చదువు " చెప్పడమే కాదు, రెండు పూటలా భోజనం పెడుతున్నాడు,ఉచితంగా బట్టలు,పుస్తకాలు అందిస్తున్నాడు శక్తి పాల్.ఇందుకోసం తన సంపాదనలో సగానికి పైగా వెచ్చిస్తున్నారు శక్తి పాల్..


4, ఆగస్టు 2026, మంగళవారం

ఉచిత అన్న ప్రసాదం@ కడప కలెక్టరేట్

 అన్ని జిల్లాల కలెక్టర్ ఆఫీసులలో జరిగినట్లుగానే కడప కలెక్టరేట్ లో కూడా ప్రతి సోమ వారం గ్రీవెన్స్ డే జరుగుతుంది. చుట్టు పక్కల ఊర్ల నుండి వందలాది మంది ప్రజలు వినతి పత్రాలు తీసుకుని వస్తుంటారు. పెన్షన్ దరఖాస్తుల కోసం, ఇతర సహాయాల కోసం, అర్జీలు పెట్టుకుని అధికారుల వంక ఆశగా చూస్తుంటారు. అందుకే దానిని అధికారికంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక అని పిలుస్తుంటారు. అక్కడ సమస్యలు పరిష్కారం అవుతాయో లేదో తెలియదు కానీ వచ్చిన వారి ఆకలి మాత్రం తీరుతుంది. అలా అర్జీలు పట్టుకుని అక్కడికి వచ్చే వారందరికీ కడుపు నిండా భోజనం పెడుతున్నారు శ్రీ సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు. గత 12 సంవత్సరాల నుంచి ఒక యజ్ఞం లా దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు ఈ ఉచిత అన్నదానాన్ని శ్రీ సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు. రాయల సీమ లో తొలి ప్రైవేటు న్యాయ కళాశాలను స్థాపించిన వ్యక్తి ఆయన. 

1986 లో నాటి ముఖ్య మంత్రి శ్రీ ఎన్టీరామారావు గారి మీద అభిమానంతో బసవరామ తారకం న్యాయ కళాశాల అని పేరు పెట్టారు ఆయన. 2015 లో గోవర్ధన్ రెడ్డి గారు కడప కలెక్టరేట్ కు పని మీద వచ్చినప్పుడు , అర్జీలు పట్టుకుని మధ్యాహ్నం వరకు అధికారుల కోసం పడిగాపులు కాస్తూ ఆకలితో అలమటిస్తున్న ప్రజలను చూసారట ఆయన. ఈ దుస్థితిని తొలగించాలని నాటి నుంచి ఈ అన్న యజ్ఞాన్ని ప్రారంభించారు. దీని కోసం నెలకు దాదాపు 50 వేల రూపాయలు వరకు ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 

పోలీసు అధికారిగా పనిచేసిన తన తండ్రి ,తల్లితో కలిసి ప్రతి రోజూ కొంత మంది పేదవారికి   ఇంటి వద్ద అన్నం పెట్టేవారని , నేను దానిని కొనసాగిస్తున్నాను, అంతే అంటారు వినమ్రంగా శ్రీ సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు. 

విద్యార్థినులకు ఉచిత ఆటో ప్రయాణం

 ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులకు ఉచిత ప్రయాణం అని రాసి ఉన్న గులాబీ రంగు ఆటో చెన్నై లో అందరినీ ఆకర్షిస్తుంటుంది. చెన్నై లోని టీ నగర్, కోడంబాక్కం, అన్నా నగర్, పెరంబూర్ ప్రాంతాలలో గత కొన్ని సంవత్సరాలుగా తన ఆటోలో ఉచితంగా అమ్మాయిలను తీసుకు వెళుతోంది " రాజీ అశోక్" 




54 ఏళ్ల రాజీ అశోక్ ఆర్థిక సమస్యల కారణంగా కాలేజీ చదువును అర్ధాంతరంగా మానివేసింది. తన చదువు కొనసాగి ఉంటే జీవితం బాగుండేదని అనుకుంటూ ఉంటుంది. తనలాగే ఇతరులు చదువు మధ్యలో మానేయకుండా ఉండాలని తన వంతు సహాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది రాజీ అశోక్. 

ప్రతి రోజూ విద్యార్థినులను బడిలో దింపి సాయంత్రం తిరిగి తీసుకు వస్తుంది రాజీ. రోజూ 10 నుంచి 15 మంది బాలికలకు సహాయం చేస్తుంది. ఇలా చేయడం అంటే తన సంపాదనలో ఎంతో కొంత వదులుకోవడమే. ఐతే అదేమీ తనకు ఇబ్బందిగా లేదు. స్కూల్, బస్ స్టాప్, ఆటో స్టాండ్ దగ్గర పిల్లల కోసం వేచి చూస్తాను. గులాబీ రంగు ఆటో ను గుర్తు పట్టి వెంటనే ఎక్కేసారు. నన్ను చూడగానే వారికి సంతోషంగా ఉంటుంది. సౌకర్యంగా కూర్చుంటారు. ఆకలి వేస్తే తినడానికి ఆటోలో బిస్కట్ ప్యాకెట్లు ఎప్పుడూ ఉంటాయి అంటుంది రాజీ అశోక్. 


ఎప్పుడో ఎక్కిన పిల్లలు సంతోషంగా పలకరించడం,వారి  తల్లిదండ్రులు ఆప్యాయంగా పలకరిస్తుంటే వెయ్యి ఏనుగుల బలం వస్తుంది, అంతులేని ఉత్సాహం వస్తుంది, ఇంకా ఏదైనా చేయాలని అనిపిస్తుంది అంటుంది రాజీ.

నేను రాజీ అక్క ఆటోలో ప్రయాణించాను అని ఎంతో మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు, వాటికి ప్రశంసలూ వస్తుంటాయి.. అవి నాకెంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంటాయి అన్నారు రాజీ.. 

వయసు 54 ఏళ్ళు కావడంతో స్వస్థలానికి తిరిగి వెళ్ళాలనిపించి ఇంటికి వెళ్ళిపోయారు రాజీ.మనసు మాత్రం చెన్నై ని వదలలేదు.. మళ్ళీ చెన్నై వచ్చేశారు. రాజీ భర్త ఒక సంస్థ ఇచ్చిన అంబులెన్స్ తో కేరళలో ఉచితంగా సేవ చేస్తుండడం, రాజీ కూడా చెన్నైలో తన వంతు సేవ చేస్తుండడం మనసుకేంతో ఆనందంగా ఉందంటారు రాజీ. చిన్న పాటి ఆటోను అద్దెకు తీసుకుని నడుపుతుంటారు రాజీ. ఒక పెద్ద ఆటో ఉంటే మరింత మంది కి సేవ చేయగలుగుతాను అంటారు రాజీ. 


25, జులై 2026, శనివారం

ప్రతి ఇంటికి ఐదు మొక్కలు ఉచితం

 44 నర్సరీల నుండి ఉచితంగా మొక్కలు తీసుకెళ్లవచ్చు హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ రోహిత్ వెల్లడి..


ప్రతి ఇంటిలో మొక్కలు పెంచడం, పచ్చదనాన్ని కాపాడడం, పర్యావరణాన్ని రక్షించడం కోసం హైదరాబాద్ హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం నడుం బిగించింది. అందులో భాగంగా ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేయాలని నిర్ణయించింది. ప్రతి ఇంటికి ఐదు మొక్కలు ఇందులో మూడు పండ్ల మొక్కలు, రెండు ఔషధ మొక్కలు లేదా అలంకరణ మొక్కలు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మొక్కలను పొందడం కోసం ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ మరియు మొబైల్ నెంబర్ సమర్పించి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, అర్బన్ ఫారెస్ట్రీ ఆధ్వర్యంలోని 44 నర్సరీల నుండి ఉచితంగా మొక్కలు తీసుకువెళ్లాలని ప్రజలకు సూచించింది.

ఈ సంవత్సరం లక్ష కుటుంబాలకు ఉచితంగా మొక్కలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పనిచేస్తున్నట్లు అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ గోపిడి రోహిత్ తెలిపారు.

8, జూన్ 2026, సోమవారం

ఉచిత కాటన్ బ్యాగుల పంపిణీ

 రోటరీ క్లబ్ జేమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఉచిత కాటన్ బ్యాగుల పంపిణీ చేయడం జరిగిందని క్లబ్ అధ్యక్షులు పాకాల నరసింహారావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేడుకలలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించమని ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం వల్ల ప్లాస్టిక్ తో నిర్మితమైన వస్తువులు వాడడం వల్ల ఆరోగ్యం పాడవాడమే కాకుండా భయంకరమైన క్యాన్సర్ వ్యాధికి గురవుతున్నామని ఆయన తెలిపారు ఏ రూపంలో కూడా ప్లాస్టిక్  నిర్మితమైన వస్తువులు వాడకూడదని అలాగే మనకు రోజు వారి కార్యక్రమంలో ఉపయోగించే బస్తాలు వాడాలని ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ వాడకుండా కాటన్ తో తయారు చేసిన బ్యాగులు వాడడం వల్ల పర్యావరణాన్ని రక్షించడమే కాదు మనతోపాటు జీవిస్తున్న పశువుల ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతామని పేర్కొన్నారు మనం ఆరోగ్యంగా జీవించాలని అనుకుంటే ఇలాంటి కాటన్ బ్యాగులను ఉపయోగించి మనకు అవసరమైన కూరగాయలు ఇతర వస్తువులను గాని తీసుకెళ్లాలని ఆయన కోరారు ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలోని గంజిలో గల కూరగాయల సంతలో రోటరీ క్లబ్ జేమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఉచితంగా కాటన్ బ్యాగులు వినియోగదారులకు అందించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు తప్పకుండా అందరూ ఈ చిన్న మార్పుతో నిత్యజీవితంలో కాటన్ బ్యాగు ల వాడి భవిష్యత్ తరానికి ఆరోగ్యకరమైన పర్యావరణం అందించాలని కోరడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ గంజి రమేష్ గిరీష్ కుమార్  గంగుల విజయ్ రమేష్ సుధాకర్ సంపత్ రాజశేఖర్  శిరీష్ కుమార్ వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు

31, మే 2026, ఆదివారం

ఉచిత కుట్టు మిషన్లు పంపిణి

 


నిజామాబాద్ నగరంలోని రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో వెనుకబడిన మహిళల సాధికారత కొరకు స్థానిక అభ్యాస పాఠశాలలో రోటరీ ఆసరా కార్యక్రమం ద్వారా ఉచితంగా 60 కుట్టుమిషన్లను అలాగే వీటితో పాటు 50 గ్యాస్ ఇస్త్రీ పెట్టెలు అందజేశారు. వికలాంగుల కోసం ఐదుగురికి ట్రై సైకిల్స్ పంపిణీ చేయడం జరిగిందని రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ అధ్యక్షుడు పాకాల నరసింహ రావు తెలిపారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనమందరం ఒక మహత్తర సేవ కార్యక్రమానికి సాక్షులుగా నిలుస్తున్నామని ,ఆసరా పేరుతో నిర్వహిస్తున్న ఈ మెగా సర్వీస్ ఈవెంట్ ద్వారా సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు 60 కుట్టు యంత్రాలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు .ఇది ఒక సహాయం మాత్రమే కాదు అనేక కుటుంబాలకు ఆత్మవిశ్వాసాన్ని ఉపాధిని మంచి భవిష్యత్తును అందించే ఒక గొప్ప ప్రయత్నం తెలిపారు. మహిళా సాధికారత అనేది సమాజాభివృద్ధికి మూల స్తంభం అని పేర్కొన్నారు. మహిళ ఆర్థికంగా బలపడితే వారి కుటుంబం బలపడుతుందని దానితో పాటు సమాజం అభివృద్ధి చెందు తుందని ,ఈ ఆలోచనలతో ముందుకు సాగుతున్న రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ సభ్యులందరూ అభినందనీయులు తెలిపారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎస్ వి రాంప్రసాద్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆర్ ఐ డి 3150, గౌరవ అతిథులుగా ఆర్టీవో కే రాజేంద్ర కుమార్ నిజామాబాద్ పి డి జి రమేష్ వంగాల ,రొటేరియన్ హరిప్రసాద్, రొటేరియన్ కె ఎస్ ఆర్  ప్రసాద్ ,రొటేరియన్ జైపాల్ రెడ్డి పాల్గొనగా ,ప్రాజెక్టు చైర్మన్గా రొటేరియన్ డాక్టర్ పి విష్ణు బాబు, ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ రొటేరియన్ రంజిత్ సింగ్ ఠాకూర్  పాల్గొన్నారు అని రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ అధ్యక్షుడు పాకాల నరసింహారావు మరియు రోటరీ క్లబ్ జూబ్లీహిల్స్ అధ్యక్షులు కళ్యాణ్ చక్రవర్తి సంగులూరు లు తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ సెక్రెటరీ లక్ష్మీ విసిరెడ్డి ,రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ సెక్రటరీ గంజి రమేష్, కోశాధికారి పాల్తి రచిత్ కుమార్ ,రొటరీ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

27, మే 2026, బుధవారం

1.5 లక్షల ఉచిత చికిత్స..రోడ్డు ప్రమాద బాధితులకు

 ఆపదలో బాధితులకు భరోసా.. రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రహత్ పథకం కింద ఒకటిన్నర లక్షల రూపాయల ఉచిత చికిత్స.. కానీ సరైన ప్రచారం లేక బాధితులకు చేరువ కాని పథకం..

దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలలో గాయపడిన బాధితులకు ఎలాంటి డబ్బులు డిపాజిట్ చేయకుండా తక్షణ వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం రహత్ అంటే ప్రైమ్ మినిస్టర్ రోడ్ యాక్సిడెంట్ హాస్పిటలైజేషన్ అండ్ అశ్యురుడు ట్రీట్మెంట్ స్కీం.. పథకాన్ని అమలు చేస్తోంది. రోడ్డు ప్రమాద బాధితులను ఆసుపత్రులలో చేర్పిస్తే చికిత్స ఖర్చులకు  ఎవరు డిపాజిట్ డబ్బులు కట్టాలని చాలామంది క్షతగాత్రులకు సహాయం చేయడానికి వెనుకంజ వేస్తుంటారు. బాధితులను ప్రభుత్వాసుపత్రులకు తరలిస్తే బాధ లేదు ,కానీ ప్రైవేట్ ఆస్పత్రులలో చేర్చాల్సి వస్తే వారి చికిత్స కోసం డబ్బులు కట్టి సహాయం చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. ఈ విషయాన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాద బాధితులకు అండగా ఈ పథకాన్ని ప్రారంభించింది. 

ఈ పథకం కింద ప్రమాద బాధితులకు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒకటిన్నర లక్షల రూపాయల వరకు నగదు రహిత చికిత్స లభిస్తుంది. ప్రమాదం జరిగిన రోజు నుంచి ఏడు రోజులపాటు చికిత్సకు ఈ పథకం ద్వారా సహాయం లభిస్తుంది. ప్రమాద బాధితులకు ప్రభుత్వ ఎం ప్యానెల్డ్/ ఆరోగ్యశ్రీ పథకం అమలులో ఉన్న ఆసుపత్రులలో బాధితులు ముందుగా డబ్బులు చెల్లించకుండా చికిత్స పొందవచ్చు. ఈ ఆసుపత్రులలో బాధితుల చికిత్స కోసం అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ ద్వారా ప్రభుత్వం చెల్లిస్తుంది. జాతీయ రహదారుల పైనే కాకుండా పట్టణ గ్రామీణ రహదారులపై జరిగిన ప్రమాదాలకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. బాధితులకు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా లేకున్నా ఎంతటి కోటీశ్వరులైన ఈ పథకం ద్వారా ఒకటిన్నర లక్షల వరకు నగదు రహిత చికిత్సను పొందవచ్చు..

ఇలా దరఖాస్తు చేసుకోవాలి.. ప్రమాదం జరిగినప్పుడు ఎవరైనా 112 హెల్ప్ లైన్ కు కాల్ చేసి సమీప ఆస్పత్రి వివరాలు ,అంబులెన్స్ సహాయం పొందవచ్చు.

ప్రమాదం వివరాలు తెలియగానే వాటిని ఈ-దార్ హోటల్ ద్వారా నమోదు చేస్తారు.

ఈ - దార్ పోర్టల్ అంటే..

ఈ - దార్ ( ఎలక్ట్రానిక్ డీటెయిల్డ్ ఆక్సిడెంట్ రిపోర్ట్ ) పోర్టల్ ద్వారా పోలీస్ ,వైద్య,రోడ్డు రవాణా శాఖ , బీమా సంస్థ లు అనుసంధానమై ఉండి ప్రమాద వివరాలను పంచుకుంటాయి.రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే..

పోలీసులు ప్రమాద వివరాలు,డ్రైవర్,వాహనం వివరాలు నమోదు చేస్తారు.ప్రమాదం ఫోటోలు ,వీడియోలు పోర్టల్ లో అప్ లోడ్ చేస్తారు.

వైద్యులు దగ్గరిలోని ఆసుపత్రుల వివరాలు అందించి, ఆసుపత్రిలో బాధితులను చేర్పించాక , గాయాల సమాచారం నమోదు చేస్తారు.

రవాణా శాఖ ప్రమాదం వివరాలు తెలుపుతూ బీమా కంపెనీలకు సమాచారం ఇస్తారు. ఆసుపత్రులకు చికిత్స ఖర్చులు చెల్లించేలా చర్యలు చేపడతరు.

బీమా కంపెనీలు పరిహారం చెల్లించే ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తారు. 

సత్వర వైద్యం అందుబాటులోకి..

కేంద్ర ప్రభుత్వ పియం రహత్ పథకం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులు ప్రభుత్వ మరియు ఎంపానల్డ్ అంటే ఆరోగ్యశ్రీలో నమోదైన ప్రైవేట్ ఆసుపత్రులలో నగదు కట్టకుండా 1.5 లక్షల వరకు చికిత్స పొందవచ్చు. ప్రమాదం జరగగానే వివరాలను ఈదార్ పోర్టల్ లో నమోదు చేస్తారు

ఈ పోర్టల్ లో వైద్య రవాణా పోలీసు శాఖలు అనుసంధానంగా ఉండడంతో సత్వర వైద్యము చికిత్స ఖర్చుల చెల్లింపు ఆసుపత్రులకు త్వరితగతిన జరుగుతాయి. ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి..

శ్రీనివాస్, జిల్లా రవాణా శాఖ అధికారి, కామారెడ్డి జిల్లా.

ఈ పథకానికి సరైన ప్రచారం జరగడం లేదు..

ఈ పథకాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 13 న కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్ గా వైద్యుల పరిభాషలో పిలువబడే ప్రమాదం జరిగిన మొదటి గంట సమయం లోపు ఎలాంటి ఖర్చు లేని వైద్య సహాయం అందించడం. రోడ్డు ప్రమాద బాధితులకు ప్రాణాపాయం లేని స్థితిలో ఉంటే 24 గంటల వరకు, ప్రాణాపాయ స్థితిలో ఉంటే 48 గంటల వరకు ఈ పథకం ద్వారా " ఉచిత అత్యవసర వైద్యం " అందుతుంది.





ఉచితంగా స్టీల్ బాక్స్ ల పంపి

 లింగంపేట మండలంలోని శెట్టిపల్లి గ్రామంలో సర్పంచ్ అట్టెం శ్రీనివాస్ ప్లాస్టిక్ నిషేధానికి గ్రామస్తుల సహకారంతో ప్లాస్టిక్ బాక్సులు గ్లాసులకు బదులుగా స్టీల్ గ్లాసులు ,స్టీల్ బాక్సులు వాడాలని గ్రామస్తులకు స్టీల్ బాక్సులు, స్టీల్ గ్లాసులు, జ్యూట్ బ్యాగులు పంపిణీ చేశారు. హోటల్స్ నిర్వాహకులకు గాజు గ్లాసులు వాడాలని వారికి గ్లాసులను పంపిణీ చేశారు ప్లాస్టిక్ నిషేధిత గ్రామంగా ప్రకటించేందుకు గ్రామస్తులు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నరేష్, ఉప సర్పంచ్ బాలయ్య, పంచాయతీ కార్యదర్శి రవి తదితరులు ఉన్నారు.

19, మే 2026, మంగళవారం

నిరాశ్రయులకు ఉచిత వసతి

 వృద్ధాప్యంలో పిల్లలు చూడకపోవడం,అనారోగ్యం,పేదరికం తదితర కారణాలతో ఎంతోమంది నిరాదరణకు గురై వీధి పలు అవుతున్నారు. అలాంటి నిస్సహాయులను ఆదుకునేందుకు ప్రారంభించిన సంస్థ శ్రీ గౌతమీ జీవ కారుణ్య సంఘం.. అనాధల సేవనే భగవంతుడు సేవ అని భావించిన కారుణ్యానంద స్వామీజీ దాదాపు 86 ఏళ్ల క్రితం రాజమండ్రిలో ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. నాటి నుంచి నిరాదైనా నాకు గురైన వారికి కుష్టి రోగులకు ఆశ్రయం కల్పిస్తూ అన్ని రకాల సదుపాయాలను అందిస్తున్నారు.



పిల్లలను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివిపిస్తూ ఆటలు పాటలు నేర్పిస్తూ మెరికల్లా తీర్చిదిద్దుతున్నారు. కొన్నాళ్ల క్రితం ఈ సంస్థను పెట్టిన స్వామీజీ మరణించడంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ సంస్థ బాధ్యతలను తీసుకున్నది.

మా సంస్థలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులు ఎవరైనా చనిపోయి ,వారి సంబంధికులు రాకపోతే మేమే అంత్యక్రియలు నిర్వహిస్తాము అని అన్నారు సంస్థ కార్య నిర్వహణ అధికారి బాధ్యతలు చూస్తున్న పితాని తారకేశ్వర రావు.

ప్రతి నెలా ఉచితంగా బియ్యం..

 ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్ లో ఉన్న విద్యా హై స్కూల్ లో సోమవారం "రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ" అవ్వకు బువ్వ కార్యక్రమంలో భాగంగా పేదలకు "ఉచితంగా బియ్యం పంపిణీ"చేశారు.

ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి నెలా నిరుపేద వృద్ధులకు 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.మొత్తం 65 మంది పేద వృద్ధులకు బియ్యం అంద చేశామన్నారు. రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్ ఖాన్దేష్, ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్,ఉపాధ్యక్షులు జిందం నరహరి , S g శ్రీకాంత్, గోనె శ్రీధర్,తులసి పట్వారీ, ఖాన్దేష్ సత్యం తదితరులు పాల్గొన్నారు.

28, ఏప్రిల్ 2026, మంగళవారం

కడుపారా పులిహోర ఉపశమనం ఇచ్చే అంబలి

 నిజామాబాద్ కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే వారికి దాతలు ఉచితంగా పులిహోర తాగునీరు అందజేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు అధికారులకు సమస్యలను చెప్పుకోవాలని వచ్చే వారికి సీనియర్ సిటిజన్స్ ఫోరం సభ్యులు గత పది సంవత్సరాలుగా పులిహోర అందిస్తూ ఆకలి తీర్చుతు న్నారు .తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ సభ్యులు 15 ఏళ్లుగా చల్లని నీరు అంబలి పంపిణీ చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. 

ప్రజావాణి కార్యక్రమానికి అర్జీలు సమర్పించేందుకు వచ్చే ప్రజల కోసం సీనియర్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ప్రారంభించి స్వయంగా ఉచిత పులిహోర పంపిణీ చేశారు. వేసవి ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రతి సోమవారం సుదూర ప్రాంతాల నుంచి ప్రజావాణికి వచ్చేవారికి సహాయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఇకపై నిరంతరంగా కొనసాగిస్తామని ఫోరం ప్రతినిధులు తెలిపారు. 

ఇక రాజస్థానీ వాకర్స్ గ్రూప్ సౌజన్యంతో చల్లటి తాగునీటిని కూడా అందజేశారు ఈ సేవా కార్యక్రమాన్ని అభినందించిన అదనపు కలెక్టర్ ఫోరం ప్రతినిధులు మరియు వాకర్స్ గ్రూపు సభ్యులను ప్రశంసించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ రెడ్డి ఏవో ప్రశాంత్ సీనియర్ సిటిజన్స్ ఫోరం వాకర్స్ గ్రూప్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



వదిరాజా భట్ @ ఓ శాట్..

 వదిరాజా భట్ కర్ణాటక కు చెందిన ఐటీ నిపుణుడు . పాతికేళ్ల కిందటే అక్కడో కంపెనీ స్థాపించాడు. అమెరికాలో స్థిరపడిన వాళ్లందరిలాగే సొంతూరికీ అయిన వ...