Saturday, 2 May 2026

ఉచిత ఫౌండేషన్ కోర్సును సద్వినియోగం చేసుకోండి

 తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచితంగా అందిస్తున్న ఫౌండేషన్ కోర్సును సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాందేడ్ వాడలో గల షెడ్యూల్డ్ కులాల వసతి గృహంలో ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత ఫౌండేషన్ కోర్సును కలెక్టర్ ఇలా త్రిపాటి శుక్రవారం ప్రారంభించారు ఇప్పటివరకు పది బ్యాచ్లలో 800 మందికి శిక్షణ అందించగా వారిలో 199 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని , ఎస్సీ స్టడీ సర్కిల్ నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఎస్సీ ఎస్టీలు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని గుర్తు చేశారు వారి విద్యాభివృద్ధికి కూడా ఎనలేని ప్రాధాన్యతనస్తూ పోటీ పరీక్షలలో ప్రతిభను కనబరిచి ఉద్యోగ అవకాశాలు పొందేలా స్టడీ సర్కిల్స్ ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు సమకూరుస్తూ ఉచితంగా శిక్షణ అందిస్తుందని తెలిపారు. అంతకుముందు కలెక్టర్ వసతి గృహంలోని గదులు కిచెన్ తదితర వాటిని సందర్శించి భోజన వసతి సదుపాయాలు పరిశీలించారు ఏవైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తేవాలని సూచించారు శిక్షణ పొందుతున్న అభ్యర్థుల కోసం పోటీ పరీక్షలకు ఉపయోగపడే అన్ని రకాల బుక్స్ అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రజిత సహాయ అధికారి రాజా గంగారాం స్టడీ సర్కిల్ డైరెక్టర్ దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు. 



No comments:

Post a Comment

ఉచిత కంప్యూటర్ శిక్షణ

 కామారెడ్డి జిల్లా, బాన్సువాడ మండలం లోని బోర్లం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మన్నె అనిల్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ శిక...