Saturday, 6 June 2026

ఉచిత కేన్సర్ పరీక్షలు@ కదిలే బస్ లో

 కేన్సర్ స్క్రీనింగ్ టెస్టింగ్ కోసం ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు, మహిళల కోసం ఉచితంగా 20వేల రూపాయల విలువ చేసే వైద్య పరీక్షలు, కేన్సర్ ఉన్నట్టు తెలిస్తే 50% ఖర్చు తగ్గించే వైద్యము, రేపటి నుంచి సిద్దిపేట జిల్లా దుబ్బాక నుంచి ప్రారంభం. 



మనకు తెలియకుండానే చెప్పకుండా నీరులా వ్యాపిస్తున్న వ్యాధులలో క్యాన్సర్ ప్రధానమైనది శరీరంలో కణ వ్యవస్థ పనితీరు అదుపు తప్పడం వల్ల ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది అయితే కేన్సర్ వస్తే ఇక అంతేనా అని దీనికి మందు లేదని చాలామంది భయపడుతుంటారు. కానీ క్యాన్సర్ ను ప్రారంభంలోనే గుర్తిస్తే నియంత్రించొచ్చు, ప్రారంభ దశలోనే గుర్తించేందుకు వైద్య పరికరాలతో ప్రత్యేక బస్సును అందుబాటులోకి మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు గారు తీసుకొచ్చారు ఈ బస్సు ద్వారా పల్లెలలో పట్టణాల్లో మహిళలకు స్క్రీనింగ్ టెస్టులు చేయనున్నారు కేన్సర్ ఉన్నట్టు తెలిస్తే ప్రముఖ కేన్సర్ ఆసుపత్రుల్లో 50% మేరా ఖర్చు రాయితీతో వైద్యం చేయించాను అన్నారు అందులో భాగంగా ఆదివారం నుంచి సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలు ఉన్నారు 

ఉచితంగా వైద్య పరీక్షలు.. బీడీఎల్ వారి సౌజన్యంతో బస్సు శిశిర ఆస్పత్రి వారి సహకారంతో వైద్య పరీక్షల సామాగ్రిని సమకూర్చారు ఆ తర్వాత ఉచిత కాన్సర్  స్క్రీనింగ్ టెస్టింగ్ సెంటర్ బస్సును అందుబాటులోకి తీసుకొచ్చారు ఇటీవల ఈ బస్సును లోక్భవన్లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా గారు ప్రారంభించారు హైదరాబాద్ కు చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ సింధు, ఆంకో సర్జన్ డాక్టర్ స్రవం తేజ నేతృత్వంలో పరీక్షలు నిర్వహించనున్నారు ఒక్కొక్కరికి 15 వేల రూపాయలు నుంచి 20వేల రూపాయల విలువ చేసే వైద్య పరీక్షలు ఉచితంగా అందించనున్నారు మెదక్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో 45 మండలాలు 13 మున్సిపాలిటీలు జిహెచ్ఎంసి లోని 9 డివిజ డివిజన్ లలో క్యాన్సర్ టెస్టింగ్ బస్ సంచరించనున్నది. ఎక్కడికి వెళ్లినా ముందుగా అక్కడ ప్రజలకు సమాచారం అందిస్తారు మహిళలకు బ్రెస్ట్ సర్వైకల్ క్యాన్సర్ టెస్టులు ఉచితంగా చేస్తారు ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కేన్సర్ ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే త్వరగా కోలుకుంటారని మహిళలు ఎక్కువగా బ్రష్టు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్నారని ఈ బస్సు లోక్ లోక్భ సభ నియోజకవర్గంలో అంతటా సంచరిస్తుందని అక్కడే టెస్టు నిర్వహించే రిపోర్టులు అందజేస్తారని మహిళలందరూ సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని ఎంపీ మాధవిని రఘునందన్ రావు గారు కోరారు.

No comments:

Post a Comment

మైనారిటీలకు సివిల్స్ ఉచిత శిక్షణ

 సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెస్ అకాడమీ హైదరాబాద్ వారు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు యాకూబ్ ...