యూపీఎస్సీ పరీక్షలు 2027 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణ అందించనున్నది. ఈ కార్యక్రమం ద్వారా ఎంపికైన 150 మందికి నిపుణులతో కోచింగ్, స్టడీ మెటీరియల్, మాక్ టెస్ట్ లతో పాటు నెలకు 5000 రూపాయల స్టయిఫండ్ ,5 వేల రూపాయలు పుస్తక భృతిని ప్రభుత్వం అందించనుంది.
డిగ్రీ ఉత్తీర్ణులై నిర్దేశిత ఆదాయ పరిమితిలో ఉన్న తెలంగాణ అభ్యర్థులు జూలై నెల 17వ తేదీ నుంచి ఆగస్టు నెల ఏడవ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్ట్ 16వ తేదీన జరిగే స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసి అదే నెల 24 నుండి తరగతులు ప్రారంభించనున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు.
No comments:
Post a Comment