బదిరులకు చదువుతోపాటు అన్ని రకాల నైపుణ్యాలను ఉచితంగా నేర్పించి తీర్చిదిద్దే సరస్వతి నిలయం నాగుబడి రంగయ్య అచ్చమ్మ బదిరుల పాఠశాల. బాపట్ల జిల్లా పర్చూరు మండలంలోని నాగులపాలెం గ్రామంలో ఉన్న ఈ పాఠశాలను ప్రవాసాంధ్రుడైన డా.నాగుబడి సుబ్బారావు గారు నిర్మించారు. రైతు కుటుంబంలో పుట్టిన ఆయన వైద్య విద్య చదివి అమెరికాలో యూరాలజిస్ట్ గా స్థిరపడ్డారు. ఆయన సోదరి బధిరురాలు . ఆమెలాంటి వారికి ఉపయోగపడేలా ఏదైనా చేయమని తండ్రి కోరడంతో 18 కోట్ల రూపాయలు హెచ్చించి ఈ పాఠశాలను స్థాపించారు.
అన్ని రకాల సౌకర్యాలతో తీర్చిదిద్దారు. వాళ్లకు విద్యతోపాటు వసతి ,పుస్తకాలు ,దుస్తులు ఇలా అన్నింటినీ అందిస్తుంది ఈ స్కూలు ట్రస్ట్.చదువుతో పాటు కుట్టుపని , సబ్బులు, చాక్ పీస్ ల తయారీని నేర్పిస్తూ ఆటలలోనూ ప్రోత్సహిస్తున్నారు..

No comments:
Post a Comment