Tuesday, 19 May 2026

ప్రతి నెలా ఉచితంగా బియ్యం..

 ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్ లో ఉన్న విద్యా హై స్కూల్ లో సోమవారం "రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ" అవ్వకు బువ్వ కార్యక్రమంలో భాగంగా పేదలకు "ఉచితంగా బియ్యం పంపిణీ"చేశారు.

ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి నెలా నిరుపేద వృద్ధులకు 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.మొత్తం 65 మంది పేద వృద్ధులకు బియ్యం అంద చేశామన్నారు. రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్ ఖాన్దేష్, ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్,ఉపాధ్యక్షులు జిందం నరహరి , S g శ్రీకాంత్, గోనె శ్రీధర్,తులసి పట్వారీ, ఖాన్దేష్ సత్యం తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

మైనారిటీలకు సివిల్స్ ఉచిత శిక్షణ

 సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెస్ అకాడమీ హైదరాబాద్ వారు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు యాకూబ్ ...