Tuesday, 19 May 2026

నిరాశ్రయులకు ఉచిత వసతి

 వృద్ధాప్యంలో పిల్లలు చూడకపోవడం,అనారోగ్యం,పేదరికం తదితర కారణాలతో ఎంతోమంది నిరాదరణకు గురై వీధి పలు అవుతున్నారు. అలాంటి నిస్సహాయులను ఆదుకునేందుకు ప్రారంభించిన సంస్థ శ్రీ గౌతమీ జీవ కారుణ్య సంఘం.. అనాధల సేవనే భగవంతుడు సేవ అని భావించిన కారుణ్యానంద స్వామీజీ దాదాపు 86 ఏళ్ల క్రితం రాజమండ్రిలో ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. నాటి నుంచి నిరాదైనా నాకు గురైన వారికి కుష్టి రోగులకు ఆశ్రయం కల్పిస్తూ అన్ని రకాల సదుపాయాలను అందిస్తున్నారు.



పిల్లలను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివిపిస్తూ ఆటలు పాటలు నేర్పిస్తూ మెరికల్లా తీర్చిదిద్దుతున్నారు. కొన్నాళ్ల క్రితం ఈ సంస్థను పెట్టిన స్వామీజీ మరణించడంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ సంస్థ బాధ్యతలను తీసుకున్నది.

మా సంస్థలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులు ఎవరైనా చనిపోయి ,వారి సంబంధికులు రాకపోతే మేమే అంత్యక్రియలు నిర్వహిస్తాము అని అన్నారు సంస్థ కార్య నిర్వహణ అధికారి బాధ్యతలు చూస్తున్న పితాని తారకేశ్వర రావు.

No comments:

Post a Comment

మైనారిటీలకు సివిల్స్ ఉచిత శిక్షణ

 సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెస్ అకాడమీ హైదరాబాద్ వారు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు యాకూబ్ ...