Showing posts with label ఫ్రీ అగ్రికల్చర్ సర్వీస్. Show all posts
Showing posts with label ఫ్రీ అగ్రికల్చర్ సర్వీస్. Show all posts

Monday, 8 June 2026

సేంద్రీయ సేద్యంపై తొమ్మిది నెలల ఉచిత శిక్షణ

 వ్యవసాయ భూమి గల లేదా వ్యవసాయ నేపథ్యం ఉన్న యువతను సేంద్రియ రైతు పారిశ్రామికవేత్తలుగా లేదా రైతు విస్తరణ నిపుణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అక్షయ కల్ప రైన్ మ్యాటర్ ఫెలోషిప్ కార్యక్రమం త్వరలో ప్రారంభం కానున్నది పాడి పశువుల పెంపకం బయోగ్యాస్ ఉత్పత్తి బయోడైజేష్టర్ ద్వారా తయారు చేసుకునే సేంద్రియ ఎరువులతో లాభదాయక వ్యవసాయ పద్ధతి ప పై పై 19 నుంచి 27 మధ్యన వయసుగల యువతకు 9 నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలోని ఈదులపల్లిలోని అక్షయకల్ప సేంద్రియ వ్యవసాయ పరిశోధన శిక్షణ కేంద్రంలో ఎంపికైన 30 మందికి మొదటి మూడు నెలలు రెసిడెన్షియల్ శిక్షణ తర్వాత ఆరు నెలలు ప్రాక్టికల్ శిక్షణ ఉంటుంది ఉచిత భోజనము వసతి తో పాటు ఉపకార వేతనం కూడా ఇస్తారు ఉమ్మడి మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లాలో అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది మరిన్ని వివరాలకు 70222 77155 నంబర్లో సంప్రదించవచ్చు

Tuesday, 19 May 2026

ఉచితంగా మామిడి మొక్కల పంపిణీ

 వేసవి అనగానే మనకు టక్కున గుర్తు వచ్చేవి మామిడి పండ్లు. అందరూ పండ్లను తిన్న తర్వాత టెంకలను బయటపడేస్తుంటారు. అయితే బయటపడవేసే ఈ టెంకలను సేకరిస్తూ రైతులకు ఆదాయ మార్గాన్ని చూపుతున్నాడు కోల్ కతా కు చెందిన జస్మిత్ సింగ్. వైద్య శాస్త్రం చదివిన ఆయన , ఆంత్ర ప్రేన్యూర్ గా కూడా పని చేసిన ఆయనను నీరు లేక వరి పొలాలు ఎండిపోయి రైతులు కన్నీరు మున్నీరు అవుతున్న కొన్ని సంఘటనలు కలచి వేసాయి. అప్పుడే నీటి అవసరం ఎక్కువగా లేని ఎక్కువ కాలం ఆదాయం పొందే దిశగా రైతులను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు. అలా వచ్చింది మామిడి టెంక లను సేకరించాలనే ఒక ఆలోచన.



దాంతో ప్రతి ఏటా వేసవి ప్రారంభంలో  "మామిడి టెంకలను పారేయకండి, వాటిని శుభ్రంగా కడిగి ఎండబెట్టాక నాకు  పంపించండి "అని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఎక్కడెక్కడ నుండో పార్శిల్ల ద్వారా వచ్చిన టెంకలను దీని కోసమే సొంతంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నర్సరీలో మొక్కలుగా పెంచుతున్నాడు .ఆ తర్వాత వాటిని " రైతులకు ఉచితంగా "పంచుతున్నాడు. అవి పెరిగి పెద్దయ్యాక రైతులకు ఆదాయ వనరుగా మారడంతో పాటు పచ్చదనం పెంపొంది పర్యావరణానికి మేలు జరుగుతుందని అంటారు డాక్టర్ జస్మిత్ సింగ్.


మైనారిటీలకు సివిల్స్ ఉచిత శిక్షణ

 సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెస్ అకాడమీ హైదరాబాద్ వారు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు యాకూబ్ ...