కుట్టు ,మగ్గం వర్క్, బ్యూటిషన్ కోర్సులలో ఉచిత శిక్షణ పొందేందుకు నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతులు ,మహిళలకు ఎస్బిఐ గ్రామీణ ఉపాధి శిక్షణ సంస్థ అవకాశం కల్పిస్తోంది. ఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్బిఐ గ్రామీణ ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ రవికుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు .జూన్ 1 నుంచి కోర్సులు ప్రారంభమవుతాయని అన్నారు .ఎంపికైన వారికి 30 రోజుల పాటు" ఉచితంగా వసతి కల్పించి భోజనం " అందిస్తామన్నారు .ఆసక్తి కలిగిన అభ్యర్థులు వారి పూర్తి వివరాలతో నేరుగా కార్యాలయానికి వచ్చి దరఖాస్తులను సమర్పించాలని పేర్కొన్నారు .ఆధార్ కార్డు, నాలుగు ఫోటోలు, రేషన్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ ఖాతా పుస్త పుస్తకం తో పాటు రెండు సెట్ల జిరాక్స్ ప్రతులను తీసుకొని రావాలని తెలిపారు.
Tuesday, 26 May 2026
Tuesday, 12 May 2026
ఉచిత మగ్గం వర్క్ శిక్షణ
నసురుల్లాబాద్ ఎస్టీ యువత శిక్షణ కేంద్రంలో కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం ఆధ్వర్యంలో మహిళలకు " ఉచిత మగ్గం వర్క్ శిక్షణ" కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు RSETI సంస్థ డైరెక్టర్ అమర్ సింగ్ సోమ వారం రోజున ఒక ప్రకటన లో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన 19 నుండి 50 ఏళ్ల లోపు మహిళలకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. రేషన్ కార్డు ఉండాలని తెలిపారు. మగ్గం వర్క్ శిక్షణ కోసం శిక్షణా కేంద్రం లోని వసతి గృహంలో ఉండి శిక్షణ పొందాలని ఆయన వివరించారు.
Saturday, 9 May 2026
బాల్కొండ లో ఉచిత మగ్గం వర్క్ పై శిక్షణ
బాల్కొండ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఉచిత మగ్గం వర్క్ పై మహిళలకు శిక్షణ ఇస్తున్నట్లు ఏపిఎం గగారం తెలిపారు. శుక్రవారం ప్రారంభమైన శిక్షణ కార్యక్రమంలో స్థానిక ఉపసర్పంచ్ గాండ్ల రాజేందర్ మాట్లాడుతూ ఉచిత శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకొని నేర్చుకున్న నైపుణ్యంతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నెలకొల్పి ఆర్థిక స్వావలంబన సాధించాలని పిలుపునిచ్చారు. వ్యాపారానికి అవసరమైన రుణ సదుపాయాలు అందిస్తామని ఏపీఎం గంగారం చెప్పారు. పరిశ్రమలను ప్రోత్సహించి నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉపాధి కల్పించడం ప్రభుత్వ ధ్యేయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భరత్ రెడ్డి మండల సమాఖ్య అధ్యక్షురాలు స్వరూప శిక్షకురాలు కీర్తన సంతోషి సీసీల వివోఏలు తదితరులు పాల్గొన్నారు.
మైనారిటీలకు సివిల్స్ ఉచిత శిక్షణ
సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెస్ అకాడమీ హైదరాబాద్ వారు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు యాకూబ్ ...
-
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో గల రాజారాం స్టేడియం లో రేపటి నుండి ఖేలో ఇండియా ఉచిత విలువిద్య శిక్షణా శిబిరం ప్రారంభం కానున్...
-
కామారెడ్డి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మే 2, 3, 4 తేదీలలో శనివారం ఆదివారం సోమవారం రోజున కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో కల ...
-
చిన్న చిన్న ఒళ్ళు నొప్పుల నుండి కీళ్ల సమస్యలు, దీర్ఘ కాలం బాధించే పక్షవాతం వంటి అనారోగ్యాలతో బాధ పడే వారికి , పెద్ద పెద్ద ఆపరేషన్ ల తర్వా...